16, జూన్ 2023, శుక్రవారం

11 వ సామాన్య ఆదివారం

 11 వ సామాన్య ఆదివారం

నిర్గమ 19:2-6

రోమి 5:6-11

మత్తయి 9:36-10:8


క్రీస్తు కారుణ్యం - శిష్యులను పిలుచుట - దైవ రాజ్య వ్యాప్తి


ఈనాడు తల్లి శ్రీ సభ 11వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి మూడు పఠనాలు  దేవుని కారుణ్యం, ప్రేమ వ్యాప్తి అంశాలపై ప్రస్తావిస్తున్నాయి.

మొదటి పఠనం: దేవుడు మోషేతో ఇశ్రాయేలు నా నిబంధనలు శ్రద్ధగా పాటించినచో వారు నా వారగుదురు అని నుడువుచున్నారు.

భక్తి కీర్తన:  మనము దేవుని ప్రజలము

రెండవ పఠనం:  మనం పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం మరణించి మనలను దేవునితో సఖ్యపరిచెను.

సువార్త పఠనం: క్రీస్తు ప్రభువు పన్నిద్దరిని  దైవ రాజ్య వ్యాప్తికి పంపుట.

వీటిని మూడు అంశాల రూపేనా ధ్యానిస్తూ అర్థం చేసుకొని మన జీవితాలలో అవలంబింపటానికి ప్రయత్నిద్దాం.

1. క్రీస్తు కారుణ్యం:

గ్రీకు భాషలో కారుణ్యం అనే పదం ఎంతో లోతైన భావం కలిగిన పదం, దీనిని మనం మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో చూస్తున్నాము. ఏసు రద్దుచేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచును (మత్తయి 14: 14), యేసు కనికరించి వారి నేత్రములను తాకేను వెంటనే వారు దృష్టిని పొంది ప్రభువును వెంబడించిరి (20:34), ఏసు జాలిపడి చేయిచాచి వానిని తాకి నాకు ఇష్టమే శుద్ధి పొందుము అనెను (మార్కు 1:41), నాయిను లో వితంతువు కుమారుని చూచి యేసు కనికరించి ఏడవ వద్దమ్మా అని చెప్పి ఆ కుమారునికి జీవాన్ని ప్రసాదించెను (లూకా 7: 13,14). ఇవి యేసు జాలిపడిన, కనికరం చూపిన కొన్ని సన్నివేశాలు.

ఈనాటి సువార్త పఠనం లో కూడా నిస్సహాయులైన బాధలతో కాపరిలేని గొర్రెల వలె చెదిరియున్న జన సమూహమును చూచి జాలితో ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను (మత్తయి 9:36) ఈ సందర్భంలోనే ప్రభువు తన శిష్యులతో పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ కావున పంటను సేకరించడానికి కావలసిన  కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను మత్తయి (9:37,38) పంట దానికై అది కోసుకోలేదు కానీ కొయ్యడానికి దానిని సంరక్షించడానికి ఎవరైనా కోతగాండ్రు కావాలి అదేవిధంగా గొర్రెలు చెదిరి ఉన్నప్పుడు వాటిని తిరిగి క్రమశిక్షణగా మందలోకి చేర్చడానికి కాపరి అవసరం. ఈనాటి ప్రస్తుత సమాజంలో కాపరులేని సంఘాలు ఎన్నో మరెన్నో. కాపరియున్నసరి అయిన కాపరి కాదు అందుకే ప్రభువు పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రులను పంపమని మనవి చెయ్యా మనందరిని ఆహ్వానిస్తున్నాడు దానిని మాత్రమే శిష్యులను పిలిచి అపోస్తులగా సువార్త వ్యాప్తి కోసం పంపుతున్నాడు.

2. శిష్యులను పిలుచుట:

దేవుడు ఎవరిని, ఎక్కడ, ఎలా, ఎప్పుడు పిలుస్తారో తెలియదు, కొంతమందిని పౌలు గారిని పిలిచినట్లు, ఇంకా కొంతమందిని అగస్తీయును గారిని పిలిచినట్లు, మరి కొంతమందిని అస్సిపుర ఫ్రాన్సిస్ గారిని పిలిచినట్లు తన సేవకు పిలవచ్చు, పిలుపు దేవుని నుండి పిలవబడేది. 

మార్కు సువార్త లో ప్రాతఃకాలమన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తుల అని పేరు పెట్టెను. (లూకా 6:13).

అని ఈనాటి సువిశేషంలో యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచాడని శిష్యుల పిలుపు గురించి ఈ మూడు సువార్తల్లో ధ్యానిస్తున్నాము. పిలవబడిన వారు ఎవరి చేత పిలవబడ్డారు, ఎందుకు పిలవబడ్డారు, పిలుపు ఉద్దేశం ఏమిటో గ్రహించాలి. మార్కు సువార్తలో చాలా చక్కగా రాయబడి ఉంది. పిలవబడినది :

1. తనతో ఉండటానికి

2. సువార్త ప్రకటనకు పంపడానికి (మార్కు 3:14)

తనతో ఉండుట అనేది పిలవబడిన వారు మొట్టమొదటిగా ప్రధమముగా చేయవలసిన పని తనతో ఉంటూ తన ఆజ్ఞలను నియమాలను పాటించాలి. ఈనాటి మొదటి పఠనం లో కూడా దేవుడు మోషేతో ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరచమని కోరేది కూడా అదే తన నియమములను పాటిస్తే దేవుని సొంత ప్రజలు రక్షించబడతారు.

తనతో ఉండుట ద్వారా తన ఆజ్ఞలు విధేయించి పాటించుట చాలా సులభం అవుతుంది, తనతో ఉండుట ద్వారా అపర క్రీస్తులా మారగలము, సువార్తను ప్రభావంతంగా శక్తితో అనుగ్రహంతో ప్రకటించగలము అందరిని క్రీస్తు వశం చేయగలం.

3. దైవ రాజ్య వ్యాప్తి:

క్రీస్తు ప్రభువు శిష్యులను పిలుచుటకు  కారణం తనతో ఉండుటకు, అటుపిమ్మట దైవ రాజ్య వ్యాప్తికి, దైవరాజ్య వ్యాప్తి అంటే క్రీస్తు ప్రారంభించిన రక్షణ కార్యాన్ని కొనసాగించడమే పునీత  పౌలు గారు దైవ రాజ్యాన్ని ఈ విధంగా నిర్వహిస్తారు. దేవుని రాజ్యం అనగా తినుట, త్రాగుట కాదు పవిత్రాత్మ ఒసగు నీతి, శాంతి సమాధానములే (రోమి 14:17).

సువార్త పరిచర్య ద్వారా అపోస్తులలు పవిత్రాత్మ ఒసగు శాంతి, సంతోషములు, నీతి ఇవ్వగలగాలి ఈ లోకంలోనే పరలోక రాజ్యాన్ని స్థాపించగలగాలి, ప్రకటించగలగాలి (మత్తయి 10:8), క్రీస్తు ప్రభువు చాలా చక్కగా ఏ విధంగా నీతి శాంతి సమాధానములు వ్యాపింప చేయగలరు తన శిష్యులకు చెబుతున్నారు.

i. వ్యాధిగ్రస్తులు ను స్వస్థపరచుట ద్వారా

ii. మరణించిన వారిని జీవముతో లేపుట ద్వారా

iii. కుష్ఠ రోగులను శుద్దులను గావించుట ద్వారా

iv. దయ్యం లను వెడల గొట్టుట ద్వారా (మత్తయి 10:8)

ఇవన్నీ చేయటానికి ప్రభువు వారికి అధికారాన్ని ఇస్తున్నారు (మత్తయి 10:1)

దీని ద్వారా కేవలం భౌతిక శుద్ధినే కాదు, అంతరంగిక శుద్ధిని కూడా పొందగలరు, ఈ ప్రేషిత  కార్యం బలహీనులకు బలాన్ని, శక్తిహీనులకు శక్తిని బాధలలో అనారోగ్యాలతో, కష్టాలతో, నష్టాలతో ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్లకు సమాజంలో చిన్నచూపు చూడబడే వారికి దేవుడు ఒక ప్రత్యేక స్థానాన్ని వసగుతారు, తన శిలువ మరణం పునరుద్ధానం ద్వారా. (రోమి 5:6-11) ఇదే మనం ఈనాటి రెండో పఠనం లో చూస్తున్నాము దైవరాజ్య వ్యాప్తి కేవలం గురువులకు, కన్య స్త్రీలకు, దైవాంకితులకు, ఉపదేషులకు మాత్రమే పరిమితం కాదు. వారి బాధ్యత మాత్రమే కాదు. మన అందరి బాధ్యత. మన ఆలోచనల ద్వారా  మన కార్యాల ద్వారా మన పరిధిలో మనము సువార్త ప్రకటన చేయగలగాలి సువార్త ప్రకటన అంటే విధులలో బోధించడం, ప్రసంగించడం మాత్రమే కాదు, కుటుంబ జీవితంలో ఒక మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి తండ్రిగా మంచి పిల్లలుగా జీవించి మీ జీవిత విధానం ద్వారా ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండి మీరే ఒక సువార్తికుడిగా మారడం కూడా సువార్త ప్రకటన అవుతుంది, క్రీస్తు ప్రభువు వలే ఇతరుల కష్టాలను, బాధలను, ఇబ్బందులను చూచి చలించగలగాలి, జాలి పడాలి, జాలిపడటం మాత్రమే కాదు మనతో మనకు తోచినంత సహాయం చేయగలగాలి, ఈరోజు నీవు నేను ఈ ప్రేషిత కార్యానికే పిలవబడ్డాం. మన పిలుపునకు తగ్గట్టు జీవించడం సువార్త ప్రకటనకు మన వంతు సహకరిద్దాం. ఈ లోకంలోనేదైవారాజ్య  నిర్మాణానికి మన జీవిత విధానం ద్వారా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ కృషి చేద్దాం. ఆమెన్.

DN. SUNIL INTURI OCD

3, జూన్ 2023, శనివారం

దైవ వాక్కు ధ్యానము : త్రిత్వయిక సర్వేశ్వరుని మహోత్సవం

దైవ వాక్కు ధ్యానము : త్రిత్వయిక సర్వేశ్వరుని మహోత్సవం:  త్రిత్వయిక  సర్వేశ్వరుని మహోత్సవం  సువిశేషము : యేసు అజ్ఞానుసారము పదునొకండుగురు శిష్యులు గలీలియాలోని  పర్వతమునకు వెళ్లిరి. అపుడు వారు ఆయనను ...

27, మే 2023, శనివారం

పెంతుకోస్తు మహోత్సవం

 పెంతుకోస్తు మహోత్సవం

అ. కా. 2 ;1-11
1 కొరింతి 2;3-7,12-13,
యోహాను 20;19-23

ఈరోజు తల్లి శ్రీసభ పెంతుకోస్తు పండుగను కొనియాడుతుంది. ఈరోజును వివిధ రకాలుగా పిలువవచ్చు .  శ్రీసభ ప్రారంభమైన రోజు అని,  పవిత్రాత్మ  శిష్యుల పై వేంచేసి వచ్చిన రోజు అని క్రీస్తునందునికి సాక్షులుగా జీవించమని కోరిన పండుగ. 

Pentecost అనే మాట గ్రీకు నుంచి వచ్చింది. గ్రీకు భాషలో దీనిని Pentekoste  అంటారు.  అనగా 50 వ రోజు అని అర్ధం.

పాస్కా  పండుగ అయిన 50   రోజుల తరువాత జరుపుకునే ఒక విలువైన  పండుగ.  క్రీస్తు ప్రభు యొక్క  పునరుత్తానం అయిన 50 రోజులకు  క్రైస్తవులు భక్తి విశ్వాసంతో జరుపుకునే పండుగ ఇది.
ఈ పండుగను యూదులు కృతజ్ఞత పండుగగా  జరుపుకునే  వారు.    దేవుడు ఇచ్చిన పంటలకు గాను కృతజ్ఞత తెలుపుతూ దేవుని యొక్క గొప్ప కార్యాలు  తలుచుకొని చేసే పండుగ ఇది .

ఈరోజు తల్లి శ్రీసభ పుట్టిన రోజు ఎందుకంటే పవిత్రాత్మ  శక్తిని  పొందుకున్న  తరువాతనే శిష్యులు భహిరంగ సువార్త ప్రకటన చేశారు. దేవుని యొక్క  ఆత్మను స్వీకరించిన అపోస్తులు  భయం విడనాడి దేవుని యొక్క  రక్షణ  ప్రణాళికను కొనసాగించారు. యేసు ప్రభు శిష్యులకు వాగ్దానం చేసిన విధంగా ఆదరణ కర్తను వారి చెంతకు పంపించారు.    మనందరికీ పవిత్రాత్మ రాకడ ఎంతగానో  ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది.

ఈనాటి  మొదటి పఠనములో  పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తుల మీదకి  వేంచేసిన  విధానాన్ని చదువుకుంటున్నం మరియతల్లి  శిష్యులందరు  ఒక గదిలో వుండగా ప్రార్ధించే సమయంలో  పవిత్రాత్మ  దేవుడు వారి మీదకి  దిగి వచ్చారు. 

అప్పటివరకు వరకు భయంతో వున్నారు ప్రాణాలు అరచేతులో పెట్టుకొని జీవించారు  కానీ ఎప్పుడైతే  పవిత్రాత్మను స్వీకరించారో  వారి జీవితములే మారిపోతున్నాయి . బలహీనులు బలవంతులు అవుతున్నారు భయంతో వున్నవారు  ధైర్యవంతులు అగుచున్నారు . 

పవిత్రాత్మ అగ్నిజ్వాలలు రూపంలో శిష్యుల మీదకి  దిగివచ్చారు. యెరుషలేములో సువార్త ప్రారంభించిన సమయంలో అక్కడ దాదాపు   16 భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వారందరు కూడాప్రవచనాలు  వారి యొక్క  సొంత భాషలోనే వింటున్నారు  ఇది కేవలం పవిత్రాత్మ యొక్క పనియే  .(అపో 2 ;9 -10 ). 

బాబెలు గోపురం వల్ల పలు భాషల అడ్డు గోడలు కూలి  పోయాయి .దీని ద్వారా యేసు ప్రభు సందేశం  అందరికి చెందింది దానిని అందరు అర్ధం చేసుకుంటారు అని తెలుస్తుంది  అన్నీ భాషలో దేనువుని సందేశం వింటున్నారు అంటే  ఎన్నుకొన్న  జాతి  , ప్రజా ,అంటూ ప్రత్యకంగా  లేరు అందరూ  కూడా దేవుందని ప్రజలే  దేవుని రాజ్యంలోకి నడరు పిలువా పడినవారు   ఎవరు కూడా ప్రత్యకంగా నియమింప పడిన వారు కాదు అందరు కూడా దేవుని యొక్క సొంత  ప్రజలే .

పవిత్రాత్మను స్వేకరించి తరువాతనే  శిష్యులు  సాక్షులుగా మరి తమ యొక్క  ప్రాణాలు సైతం  దేవునికి ఇవ్వాలి అనుకున్నారు .పెంతుకోస్తు  పండుగ పాత నిబంధన  గ్రంధంలో కూడా చూస్తుంటం  పాత  పెంతుకోస్తు  పండుగకు   క్రొత్త పెంతుకోస్తు  పండుగకు  దెగ్గర సంభందం ఉంది . 

పాత పెంతుకోస్తు పండుగ  సీనాయి పర్వతము దగ్గర  దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను సూచిస్తుంది .ప్రభు  సినాయ్  పర్వతం పైకి వేంచేసి వచ్చినపుడు ఆ పర్వతం మీద ఉరుములు  మెరుపులు  మేఘాలలో  యెహువె  దేవుడు శిష్యులమీదకి  దిగి వచ్చారు . (నిర్గమ 19 ;16 -18 )

నూతన నిబంధన  గ్రధంలో కూడా  శిష్యులమీదకి పవిత్రాత్మ  వేంచేసినపుడు బలమైన గాలులు వచ్చాయి .పవిత్రాత్మను  పవిత్ర  గ్రంధంలో వివిధ చిహ్నాలతో పోల్చుతారు.  

-అగ్నితో 
- పావురంతో 
- గాలితో 
- నీటితో

గ్రీకు భాషలో ఉపిరికి  ఆత్మకు  ఒకే పదాన్ని   ఉపయోగించారు  ఊపిరి దేవుని ఆత్మకు గుర్తు దేవుని జీవానికి  గుర్తు. దేవుడు మట్టితో  చేసిన  మానవ రూపంలోకి  తన జీవం ఊది తొలి మానవ వ్యక్తిని సృష్టించి  క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడు పవిత్రాత్మ  అనే  శ్వాసనుది క్రొత్త జీవితం  ప్రసాదించారు.

పవిత్రాత్మను  అగ్నితో  పోలుస్తారు అగ్ని దేవుని స సాన్నిదికి  గుర్తు  అగ్ని అని తనలాగా  మార్చుకుంటుంది  అలాగే  పవిత్రాత్మ అందర్నీ తనలాగా  మార్చుకుంటుంది  అగ్ని దహించును  అలాగే  పవిత్రాత్మ   మన  పాపాలను  దహించి  మనకు  పవిత్రాత్మను  దయచేస్తుంది. 
  
అగ్ని క్రొత్త జీవాన్ని పుట్టిస్తుంది, రగిలించుకుంటుంది. పవిత్రాత్మ కూడా శిష్యులలో  క్రొత్త జీవాన్ని పుట్టించారు. అప్పటివరకు భయంతో మరణించిన వారిలో క్రొత్తజీవం నింపారు. 

అగ్ని  వెలుగును  ఇస్తుంది  దరి చూపుతుంది  అదే విధంగా  పవిత్రాత్మ  దేవుడు   శిష్యుల యొక్క  అంధకారం  అనే  అజ్ఞానం  తొలగించి దేవా జ్ఞానం  అనే వెలుగును  నింపారు .
 
పవిత్రాత్మ శిష్యులకు దారి  చూపించారు     ఎటుయైపు   వెళ్ళి సువార్తను  ప్రకటన చేయాలో తెలిపారు  .

రెండొవ పఠనంలో  పౌలు గారు  ఆత్మ  స్వభావం గురుంచి తెలిపారు  
         
1 .ఆత్మ అందర్నీ  ఒకే  సమాజంగా  ఐక్యపరుస్తుంది
ఆత్మ ప్రత్యేక అనుగ్రహాలను దయచేస్తారు. వాటిని అందరూ పొందుకుంటారు. 
౩ ఆత్మ పరిచర్యకు  ఎన్నుకొంటుంది  సేవకు వారిని పంపిస్తారు

జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరు సువార్త సేవకు అర్హులే. 
పవిత్రాత్మ దేవుడు మనందరినీ క్రీస్తు శరీరంలో ఐక్యపరచి మనలను ముందుకు నడిపిస్తారు.  
సువార్త పఠనంలో కూడా యేసు ప్రభువు శిష్యులకు పవిత్రాత్మను ఒసగి వారిలో ధైర్యం నింపుచున్నారు. వారిలో క్రొత్త జీవం దయ చేశారు. ప్రపంచమంతటా తిరిగి సువార్త సేవచేయుటకు వారిని పంపిస్తున్నారు. 

ఈరోజు పవిత్రాత్మ దేవుని పండుగ కాబట్టి పవిత్రాత్మ చేసే వివిధ పనుల గురించి ధ్యానిద్దాం. 
1 . పవిత్రాత్మ  మనకు సహాయం చేస్తారు - రోమా 8 : 26 
2 . పవిత్రాత్మ  మనల్ని నడిపిస్తారు - యోహాను 16 : 13 
3 . పవిత్రాత్మ  మనకు బోధిస్తారు - యోహాను 14 : 26  
4 . పవిత్రాత్మ  మనతో మాట్లాడతారు - దర్శన 2 : 7 
5 . పవిత్రాత్మ  మనకు బయలు పరుస్తారు - 1  కొరింతి 2 : 10 
6 . పవిత్రాత్మ  మనకు సూచనలిస్తారు - అ. కా. 8 : 29 
7 . పవిత్రాత్మ  క్రీస్తుకు సాక్షమిస్తారు - యోహాను 15 : 26 
8 . పవిత్రాత్మ  మనల్ని శాంతి పరుస్తారు - అ. కా. 9 : 31 
9 . పవిత్రాత్మ  మనల్ని పిలుస్తారు - అ. కా. 13 : 2 
10 . పవిత్రాత్మ  మనలను దైవంతో నింపుతారు - అ. కా. 4 : 31 
11 . పవిత్రాత్మ  మనల్ని బలపరుస్తారు - ఎఫెసీ ౩: 16 
12 . పవిత్రాత్మ  మనకోసం ప్రార్ధిస్తారు - రోమా 8 : 26 
13 . పవిత్రాత్మ  మన ద్వారా సువార్త పరిచర్య చేస్తారు - 2  పేతురు 1 : 21 
14 . పవిత్రాత్మ  సత్యంకు సాక్ష్యమిస్తారు - రోమా 9 : 1 
15 . పవిత్రాత్మ  మనకు ఆనందం దయచేస్తారు - 1 తెస్స  1 : 6 
16 . పవిత్రాత్మ  మనకు స్వేచ్ఛనిస్తారు - 2 కొరింతి 3 : 17 
17 . పవిత్రాత్మ  విధేయించుటకు సహకరిస్తారు - 1  పేతురు 1  : 22 
18 . పవిత్రాత్మ  మనల్ని క్రీస్తు చెంతకు నడిపిస్తారు - దర్శన 22 : 17 
19 . పవిత్రాత్మ  మన జీవితాలను మార్చుతారు - 2  కొరింతి 3 : 18 
20 . పవిత్రాత్మ  మనలో జీవిస్తారు - 1 కొరింతి 3 : 16 

పవిత్రాత్మ మనకు స్వేచ్ఛ నిస్తారు - రోమా 8: 32
పవిత్రాత్మ  మనలను నుతనికరిస్తారు - తీతు 3: 5
పవిత్రాత్మ  మనలో ఆత్మీయ ఫలములను దయచేస్తారు - గలతి5:22-23
పవిత్రాత్మ  మనకు వరాలు దయచేస్తారు - 1 కొరింతి 12:8-10
పవిత్రాత్మ  మనల్ని  ముందుకు తీసుకొనివెళ్తారు - రోమా 8:14 
పవిత్రాత్మ  మనల్ని  నిరపరాధులు చేస్తారు - యోహాను  16:8
పవిత్రాత్మ  మనల్ని  పవిత్ర పరుస్తారు - 2 తెస్స  2:13
పవిత్రాత్మ  మనల్ని  ధృడంగా ఉండేలా చేస్తారు - అ. కా. 1:8
పవిత్రాత్మ  మనల్ని   ఐక్య పరుస్తారు - ఎఫెసీ 4:3- 4
పవిత్రాత్మ  మన మీద దేవుని ముద్ర వేస్తారు - ఎఫేసి 1:13
పవిత్రాత్మ  మనల్ని  తండ్రి చెంతకు నడిపిస్తారు - ఎఫేసి 2:18
పవిత్రాత్మ  మనకు సహనం  దయచేస్తారు - గలతి 5:5
పవిత్రాత్మ  సైతాను శక్తులను పారద్రోలుతారు 

పవిత్రాత్మ దేవుడు మనకు అనేక విధాలుగా దీవెనలు ఒసగుతుంటారు. మనం కూడా పవిత్రాత్మను పొందినవారం కాబట్టి సువార్త సేవ చేస్తూ దేవుని ప్రేమను పంచుదాం.
 
పవిత్రాత్మ   దేవుని యొక్క పాత్ర:
పవిత్రాత్మ దేవుడు మనందరినీ దేవుని నివాస స్ధలం చేశారు. మన హృదయంలో ఉండేలాగా చేస్తారు. కొరింతి మనందరికీ శక్తిని ఇస్తారు. ఈలోక శక్తులను ఎదుర్కొని ముందుకు సాగుటకు, సైతాను  శక్తులను అధిగమించుటకు అదే విధంగా దేవునికి సాక్షులై ఉండుటకు దేవుడు వారికి శక్తిని దయచేస్తారు. 

పవిత్రాత్మ దేవుడు మనల్ని పవిత్ర పరుస్తారు. దివ్య సంస్కారాలు స్వీకరించుట ద్వారా మనల్ని పవిత్రపరుస్తారు.  

- జ్ఞానస్నానం ద్వారా మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తారు. 
- భద్రమైన అభ్యంగనం ద్వారా దేవునితో మరియు పొరుగువారితో సఖ్యపడేలా చేస్తారు.
- దివ్య సత్ప్రసాదం ద్వారా ఆధ్యాత్మిక భోజనం దయచేస్తారు. 
-గురుపట్టాభిషేకం మరియు వివాహం ద్వారా మనల్ని పవిత్రపరుస్తారు. 
దేవుని విషయాలు బోధించి మనల్ని పరలోకానికి చేర్చుతారు. 
మన యొక్క బాధలను వింటారు. మనకు ఊరటను దయచేస్తారు. మన యొక్క ప్రార్ధనలు వింటారు, మనల్ని ప్రార్ధించేలా చేస్తారు. 
మనకి వరాలిచ్చి, ఫలాలను ఇచ్చి మనందరికీ కర్తవ్యం గురించి తెలుపుతారు. 

Rev. Fr. Bala Yesu OCD

26, మే 2023, శుక్రవారం

6, మే 2023, శనివారం

పాస్కా 5 వ ఆదివారం

 పాస్కా 5 వ ఆదివారం

అపో 6:1-7

1 పేతురు 2:4-9

యోహాను 14:1-12

    ఈనాటి దివ్య పఠనాలు క్రైస్తవ జీవితం యొక్క ఔన్నత్యమును, గొప్పతనం గురించి వ్యాప్తి గురించి తెలియజేస్తూ ఉన్నాయి. 

ఈనాటి మొదటి పఠనంలో అపోస్తులలు సువార్త పరిచర్యకు సహాయంగా ఉండుటకు ఏడుగురు సోదరులను ఎన్నుకుంటున్నారు. పెంతుకోస్తు పండుగ తర్వాత అపోస్తులలు తమ యొక్క విలువైన సమయమును మొత్తము కూడా సువార్త ప్రకటన చేయుటకు స్వస్థత నిచ్చుటకు కేటాయించిరి. అయితే శ్రీ సభ ప్రారంభమైన సమయంలో గ్రీకులకు యూదులకు మధ్య కొన్ని సాంప్రదాయ ప్రకారంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గ్రీకుల యొక్క వితంతువులు నిరాకరించబడ్డారని నిర్లక్ష్యం చేయబడ్డారని వారి మధ్య వారు సనుగు కొనసాగరి, అయితే దానికి పరిష్కారం ఇచ్చుటకు అపోస్తులలు ఇంకా కొంతమంది సేవకులను ఎన్నుకుంటున్నారు.

 ఏసుప్రభు ఎలాగైతే తన యొక్క సువార్త సేవకు మొదట్లో శిష్యులను సహకరించుటకు పిలిచి ఉన్నారో అదే విధముగా ఈ పనిని ఇద్దరు అపొస్తలులు కూడా ఏడుగురు వ్యక్తులను స్వార్థ సేవ నిమిత్తమై అదేవిధంగా సమాజంలో ఉన్న వితంతువులకు సహాయం చేయుట నిమిత్తమై వారిని ఎన్నుకుంటున్నారు. ఈ పనిని పన్నిద్దరూ శిష్యులు తాము ఎందుకు దైవ పిలుపును పొందాము అనే ఉద్దేశమును అక్కడి విశ్వాసులకు తెలియచేస్తున్నారు అదేమిటంటే "వారి సమయం అంతా ప్రార్ధించుటకు అదే విధముగా వాక్య పరిచర్య చేయుటకు" వినియోగిస్తారు అని పలికారు. ఏసుప్రభు కూడా ఈ ఉద్దేశ్యం కొరకే తన శిష్యులను తన సేవకై పిలిచారు. (మార్కు 3:13-14).

ఇక్కడ మనము గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ ఏడుగురు విశ్వాసుల కూడా గ్రీకు దేశస్తులే. వారే తమ ప్రజల గురించి అడిగారు కాబట్టి వారు అయితేనే సక్రమంగా న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో క్రైస్తవులుగా మారిన గ్రీకు వారిని ఎన్నుకుంటున్నారు. ఈ ఏడుగురు విశ్వాసులు అపోస్తుల యొక్క పరిచర్యకు సహకరిస్తున్నారు. మనందరం కూడా తీరు సభ యొక్క కట్టడిలో నేర్చుకుంటున్నాం, ఆరవ శ్రీ సభ కట్టడ మనకు తెలియచేసే అంశం ఏమిటంటే విచారణ గురువులకు సహాయం చేయుదువుగాక. ఈ విశ్వాసులు ఏడుగురు అపోస్తులకు సహకరిస్తున్నారు, వారి యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నారు. దేవుని సేవకై ఉండేవారికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అపోస్తులులు తెలియచేస్తున్నారు. అపోస్తులు మూడు ప్రధానమైన అంశాల గురించి తెలియజేస్తున్నారు.

1. వారు పవిత్రాత్మతో నిండిన వ్యక్తులై ఉండాలి.

2. జ్ఞానము కలిగిన వారై ఉండాలి.

3. సమాజంలో మంచి పేరు మరియు గౌరవం కలిగిన వారై ఉండాలి.

ఒక్క దైవ సంఘమును నడిపించుటకు మరియు దేవుని యొక్క స్వార్థ సేవ చేయుటకు సంఘ కాపరులకు ఈ మూడు లక్షణాలు ఉండాలి.

- పవిత్రాత్మతో నింపబడిన వారు అనగా దేవుని యొక్క సేవకు తమను తాము ఎల్లప్పుడూ కూడా  సిద్ధం చేసుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞల పాటిస్తూ జీవించేవారు,  ప్రార్థించేటటువంటి వ్యక్తులు, దేవునికి విధేయత చూపించేటటువంటి వ్యక్తులు, పాపము చేయకుండా ఆదర్శంగా జీవించేవారు అలాగే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించేటటువంటి వ్యక్తులు.

-  జ్ఞానము కలిగిన వారిని ఎందుకు ఎన్నుకుంటున్నారంటే వారు తమ యొక్క జ్ఞానం వలన మంచినీ -  చెడును, పాపమును,  పుణ్యమును విశ్వాసులకు తెలియచేసి వారి యొక్క దైవ జ్ఞానముతో ప్రజలను దేవుని వైపుకు నడిపిస్తారు. వారి యొక్క జ్ఞానము అవిశ్వాసము అనే అజ్ఞానమును ప్రజల నుండి తొలగించేలాగా చేస్తుంది. ఈ ఎన్నుకొనబడిన వారికి దైవ జ్ఞానము ఉన్నది కాబట్టి వారు అనేకమందిని పరలోకం వైపు నడిపిస్తున్నారు.

- సమాజంలో పేరు ఉన్న వారిని ఎందుకు ఎన్ను కొవాలి అంటే వారు చెప్పేటటువంటి ఒక మాటకు అంత పలుకుబడి అదే విధముగా గౌరవం ఉంటుంది. మన జీవితంలో సమాజంలో సుమాతృకుగా లేనటువంటి వారి మాట మనం వినుము ఎవరైతే మంచినీ బోధిస్తారు మంచి పేరు కలిగి ఉంటారు మంచిగా జీవిస్తారో వారి యొక్క మాటలే మనం ఎక్కువగా పాటిస్తూ ఉంటాం అందుకని అపోస్తులలు దేవుని యొక్క సేవ నిమిత్తమై పవిత్రాత్మ కలిగిన వ్యక్తులను జ్ఞానము కలిగిన వ్యక్తులను సమాజంలో పేరు ఉన్నటువంటి ఏడుగురును ఎన్నుకుంటున్నారు. ఈ ఏడుగురు మీద చేతులుంచి ప్రార్థిస్తూ వారు దేవుని యొక్క ఆత్మను కృపను పొందే లాగా ఈ అపోస్తులు వారికి తోడుగా ఉంటున్నారు.

మోషే ప్రవక్త దేవుని యొక్క సేవ నిమిత్తమై ఏ విధంగానైతే 70 మందిని ఎన్నుకుంటున్నారో అదే విధముగా క్రైస్తవత్వం విస్తరిల్ల చేయుటకు అలాగే క్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనమును చాటిచెప్పుటకు శిష్యులు ఇంకా కొంతమందిని దైవ సేవ నిమిత్తమై ఎన్నుకుంటున్నారు.

ఈనాటి రెండవ పఠనంలో ఏసు క్రీస్తు ప్రభువు ఆయనయే సజీవ శిల అనుయు అలాగే ఇల్లు కట్టడానికి త్రోసి వేయబడిన రాయి మూలరాయిను అని తెలిపారు. దేవుడు యేసు క్రీస్తు ప్రభువును క్రైస్తవ సంఘానికి ఒక మూలరాయిగా ఎన్నుకున్నారు. ఈ క్రైస్తవ సంఘ నిర్మాణం ప్రభు ద్వారానే జరిగింది. తండ్రి దేవుడు పూర్వభేదంలో ఒక మూలరాయిని తన రక్షణ నిమిత్తమై వేసి ఉన్నారు. 

పూర్వ వేదంలో  తండ్రి దేవుడు ఎన్నుకున్న అమూల్యమగు శిల ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ప్రసాదించే రక్షణ. దైవ రక్షణ అనేది ఒక విలువైన రాయి. ఆ రాతిని తండ్రి దేవుడు సీయోనులో మూలరాయిగా స్థాపించారు అనగా ఎరుషలేము నగరంలో స్థాపించబడ్డ దావీదు రాజ్యానికి మరియు అతని వంశానికి తండ్రి దేవుడు తన రక్షణ వాగ్దానం చేస్తున్నారు. ఆయన ఇచ్చే రక్షణయే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన వేసే మూలరాయి. ఎవరైతే ఆయనను విశ్వసిస్తున్నారు వారందరూ రక్షణ పొందుతారు. 

ఈ వాగ్దానం ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు జీవితం ద్వారా నెరవేరింది. ఏసుప్రభు నూతన ఇస్రాయేలు ప్రజలకు రక్షణ తీసుకుని వచ్చారు. ఏసుక్రీస్తు ప్రభువు మొదటిలో నిరాకరించబడిన , తన సొంత ఊరిలోనే, తన సొంత ప్రజలే తనను అర్థం చేసుకోలేదు. ఆయనను నిరాకరించారు, త్రోసివేశారు,  అవమానములకు గురి చేశారు అయినప్పటికీ ఆయన మన అందరి రక్షణ నిమిత్తమై మృతి చెందారు. ఆ నిరాకరించబడిన రాయే ఈనాడు మనందరి రక్షణకు కారణమయ్యారు. ప్రభువు యొక్క మరణం పునరుత్థానము తర్వాత ఆయన యొక్క విలువను గొప్పతనమును తెలుసుకున్నారు అందుకని ఆయనను రక్షకునిగా దేవునిగా అంగీకరించారు. 

ఈ విధముగా క్రైస్తవత్వం రోజురోజుకీ గొప్పగా విస్తరిల్లినది. పేతురు గారు ఈ రెండవ పఠనం లో ఇంకొక గొప్ప సత్యమును తెలియజేస్తున్నారు మనందరం కూడా దేవుని చేత  ఎన్నుకొనబడిన ప్రజలము, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని యొక్క సొంత ప్రజలు. ఈ మాటలన్నీ పూర్వ వేదంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి పలికారు నిర్గమకాండం 19: 5-6. ఇప్పుడు ఈ మాటలన్నీ నూతన క్రైస్తవులందరికీ చెందుతాయి ఎందుకంటే క్రైస్తవులు కూడా ఎన్నుకొనబడిన జాతి. 

ప్రపంచంలోని ప్రజలందరిలో దేవుడు కొందరిని ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో ఎన్నుకొని వారితో ఒడంబడిక చేసి వారికి దేవుడు తోడుగా ఉండి వారి ద్వారా అన్యులకు రక్షణను అందచేయదలిచారు. క్రైస్తవులు రాచరికపు గురుకులము అనగా గురువు దేవుని సమీపంలో ఉండి అన్యులను దేవుని దరికి చేర్చగలుగుతారు దేవునికి బలులు సమర్పిస్తూ, అర్పణలను సమర్పిస్తూ, వారి ఉద్దేశములను దేవుని చెంతకు తీసుకొని వెళతారు. 

క్రైస్తవులందరూ కూడా పవిత్రమైన జనం, ఎందుకంటే జ్ఞాన స్నానము ద్వారా వారు శుద్ధి చేయబడుతున్నారు, దేవుని బిడ్డలుగా మారుతున్నారు, పవిత్రులుగా చేయబడుతున్నారు కాబట్టి వారు ఇక దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ తమ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని ఆయన కొరకై ఈ లోకంలో తమ జీవితాన్ని వినియోగించాలి. క్రైస్తవులు దేవుని సొంత ప్రజలు దేవుడు వారిని ప్రేమతో ఎన్నుకున్నారు కాబట్టి వారు దేవుడి యొక్క చిత్తానుసారంగా నడుచుకోవాలి.

మన విశ్వాస జీవితంలో నిరాకరించబడినప్పుడు మనము బాధపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే క్రీస్తు ప్రభువు కూడా నిరాకరించబడ్డారు తరువాత ఆయన గొప్పతనమును అందరూ తెలుసుకున్నారు కాబట్టి మనం కూడా బాధపడకుండా, భయపడకుండా క్రైస్తవ జీవితమును జీవించుదాం. ఎందుకంటే దేవుడు మనలను ప్రత్యేకంగా పిలిచారు ఎన్నుకున్నారు తన బిడ్డలుగా చేశారు. ఈ విధంగా క్రైస్తవత్వం యొక్క ఔన్నత్యం గురించి పేతురు గారు చక్కగా బోధించారు.

ఈనాటి సువిశేషం లో ఏసుప్రభు తోమాసు గారితో అంటున్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని.

పోయిన ఆదివారం శిష్యులతో  ఏసుప్రభు అంటున్నారు నేనే ద్వారమును అని,  I AM THE GATE. ఈవారం సువిశేషంలో ఏసుప్రభు మార్గము, సత్యము, జీవము అని అంటున్నారు.

ఏసుప్రభు అనేక సందర్భాలలో తాను ఏమిటి అని శిష్యులకు తెలుపుచున్నారు.

కొన్ని సందర్భాలలో ప్రభువు అంటున్నారు: 

1. నేను నిజమైన ద్రాక్షావల్లిని

2. నేనే జీవాహారమును

3. నేనే లోకమునకు వెలుగు

4. నేనే పునరుద్దానమును, జీవమును

5. నేను మంచి కాపరిని అని

ఈ విధంగా ఈనాటి శిష్యులతో ప్రభువు మూడు అంశాలు గురించి తెలియజేస్తున్నారు:

1. నేనే మార్గం

2. నేనే సత్యం

3. నేనే జీవం

అంతయు ఏసుక్రీస్తు ద్వారానే మనకు సాధ్యమవుతుంది. తోమస్ ఎ కెంపిస్ గారు 15 వ శతాబ్దంలో ఆయన రాసిన IMITAION OF CHRIST పుస్తకంలో ఈ విధంగా అంటున్నారు: 

- దారి తెలియకుండా మన ప్రయాణం సాగదు, చేయలేము - without way there is no going.

- సత్యం లేకుండా మనం ఏమీ తెలుసుకోలేము - without truth there is no knowing.

- జీవం లేకుండా మానవ మనుగడ లేదు అని తెలుపుచున్నారు - without life there is no living.

- ఏసుప్రభు నేనే మార్గం అని అంటున్నారు, యేసు ప్రభు మన అందరికీ కూడా పరలోకం చేరుటకు ఒక మార్గంగా ఉంటున్నారు, ఆయన ఏది అయితే బోధించారో  అది పాటిస్తూ శిష్యులకు ఒక సుమాతృకగా ఉంటున్నారు.

ఏసుప్రభు మనం పరలోకం ఏ విధంగా చేరాలో ఒక మార్గంగా ఉంటున్నారు, ఇది మాత్రమే కాదు అన్ని విషయాలలో ఆయన మనకు మార్గం చూపిస్తున్నారు.

- శ్రమలు ఏ విధంగా అనుభవించాలి అని

- ఎలాగా సేవ చేయాలని

- ఎలాగ వినయంతో విధేయత తో జీవించాలని

- ఎలాగా తండ్రి ప్రణాళిక నెరవేర్చాలని

- సహనంతో, ప్రేమతో ఎలాగా జీవించాలి అని, అనేక విషయాలలో క్రీస్తు ప్రభువు ఒక మార్గంగా ఉంటున్నారు ఆయన మనకంటే ముందుగా వెళ్లి మనకు సుమాతృకగా నిలిచారు.

ఈరోజు మనం మన తోటి వారికి ఒక మార్గంగా ఉంటున్నామా?

2. ఏసుప్రభువే సత్యము:

ఆయన భూలోకానికి వచ్చినది తండ్రికి సాక్ష్యము ఇచ్చుటకు, ఆయన దేవుని కుమారుడు అనుట సత్యము, తన యొక్క పరిచర్య ద్వారా బోధించిన విషయాలు అన్నియు సత్యము.

ఫిలాతు కూడా ఏసుప్రభు జీవితం చూసి ఆయనలో ఎట్టి అసత్యం లేదు అని పలికారు.

3. ఏసుప్రభువే జీవము: 

సృష్టి ప్రారంభంలో ఏసుప్రభువు వాక్కు రూపంలో ఉండి సృష్టికి జీవం పోశారు, అలాగే ఆయన మానవ రూపంలో ఈ లోకంలో జన్మించినప్పుడు తన పరిచర్య ద్వారా అనేక మందికి జీవమును ప్రసాదించారు.

మరణించిన వారికి సైతం జీవమును ఇచ్చినా గొప్ప దేవుడు యేసు ప్రభువు దివ్య సంస్కారాలు ద్వారా కూడా ప్రభువు మనకు జీవం ప్రసాదిస్తారు.

మనం కూడా ఇతరులకు జీవమును ఇవ్వాలి అనగా నిరాశలో బాధలో ఉన్నవారికి ప్రోత్సాహం ధైర్యమును ఇచ్చుట ఒక విధంగా వారికి జీవము ఇచ్చుటయే.

అదేవిధంగా ఈనాటి సువిశేష పఠనం  లో యేసు ప్రభువు మరియు తండ్రి అన్నిటిలోనూ కలిసి ఉన్నారు అని ప్రభువు తెలుపుచున్నారు, ఇక్కడ తండ్రీ కుమారులకు ఉన్న ఆ ప్రేమ బంధం గురించి మనం ధ్యానించుకోవాలి. వారిది విడదీయరాని బంధం కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ కలిసిమెలిసి జీవించాలి.

క్రైస్తవ జీవితం చాలా గొప్పది ఎందుకంటే ఏసుప్రభువు అన్నింటిలో సుమాతృకగా జీవిస్తూ విశ్వాసులను ముందుకు నడిపించారు ఎందరో క్రైస్తవత్వమును ఆపాలని ప్రయత్నం చేశారు కానీ అది ఈ సాధ్యపడలేదు అందుకు నిదర్శనమే ఈనాటి క్రైస్తవ సంఘం.


FR. BALAYESU OCD

29, ఏప్రిల్ 2023, శనివారం

పాస్కా 4 వ ఆదివారం

 పాస్కా 4 వ ఆదివారం

అపో 2:14,36-41

1 పేతురు 2:20-25

యోహాను 10:1-10

పాస్కా నాల్గవ ఆదివారంను మంచి కాపరి ఆదివారం అని పిలుస్తారు. ఈనాటి దివ్య పఠనాలు కూడా కాపరి యొక్క బాధ్యతలను గురించి తెలుపుచున్నాయి.

తల్లి శ్రీ సభ మనందరినీ మంచి కాపరులుగా ఉండుటకు పిలుస్తుంది, కాపరి తన మందతో ఏ విధంగానైతే సన్నిహిత సంబంధం కలిగి జీవిస్తుంటాడో అదే విధంగా మనం కూడా కాపరి అయిన దేవునితో ఒక మంచి మందగా కలిసి జీవించాలి.

ప్రజల యొక్క నాయకుడు గొర్రెల కాపరి వంటి వాడు, అతడు/ఆమె తన మందను సన్మార్గంలో నడిపించాలి.

ఈనాటి మొదటి పఠనం లో  పెంతుకోస్తు పండుగ రోజున అపోస్తులు చేసిన బోధనల గురించి వింటున్నాం, యూదయ ప్రజలను ఉద్దేశించి శిష్యులు యేసు ప్రభువును గురించి తెలిపారు, పేతురు గారు మరియు మిగతా శిష్యులు ప్రజల సమూహంలో నిలబడి ధైర్యంగా యేసు ప్రభువును గురించి ప్రకటిస్తున్నారు.

మొదటి పఠనం లో మనం రెండు ప్రధానమైన అంశాలు గ్రహించాలి:

1. హృదయ పరివర్తనం

2. బప్తీస్మమును స్వీకరించుట

ఏసుప్రభును అన్యాయంగా సిలువ మరణంకు గురిచేసారని కానీ యేసుని దేవుడు క్రీస్తుగా రక్షకునిగా నియమించారు అని బోధించారు.

అపోస్తుల యొక్క బోధన వినగానే అందరూ చేసిన తప్పిదమునకు పశ్చాత్తాప పడ్డారు, వారు యేసు ప్రభువు విషయంలో ఎంత తప్పిదనం చేశారో గుర్తించారు, అందుకని శిష్యులను ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుచున్నారు. అందుకే పేతురు గారు హృదయ పరివర్తనం చెంది పాప పరిహారం కై యేసు క్రీస్తు నామమున జ్ఞాన స్నానం పొందమని తెలిపారు.

- నాతాను దావీదు తప్పు చేసిన తీరును చెప్పిన విధంగా యూదులు చేసిన తప్పు పేతురు తెలిపారు.

- పేతురు గారు యూదులును జ్ఞాన స్నానం పొంది దేవుని మందలో చేరమని తెలుపుచున్నారు. యూదులు దేవుని యొక్క స్వరం ఆలకించి అనుసరించారు కాబట్టి వెంటనే హృదయ పరివర్తనం చెందుటకు ఇష్టపడ్డారు.

బాప్తిస్మము  విశ్వాసులకు ఒక క్రొత్త గుర్తింపును ప్రసాదిస్తుంది. బాప్తీస్మం కొత్త జీవితంను ప్రసాదిస్తుంది, మనలో ఉన్న పాపమును తొలగించి మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తుంది.

పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం పొందినప్పుడు మనం పాపము నుండి శుద్ధి చేయబడుతున్నాం.

పెంతుకోస్తు తరువాత శిష్యుల యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే యేసు ప్రభువు యొక్క మరణం పునరుత్థానం గురించి ప్రకటించుటయే.

దేవుని యొక్క ఆత్మను పొందిన తర్వాత వారు ధైర్యంతో నింపబడిన కాపరులుగా తయారవుతున్నారు అందుకనే మరణంకు హింసలకు భయపడటం లేదు.

శిష్యులకు అప్పచెప్పిన బాధ్యతలను వారు సక్రమంగా నెరవేరుస్తున్నారు. దేవుడు మనల్ని కూడా కాపరులుగా ఎన్నుకున్నారు మరి మనం ఏ విధంగా మన బాధ్యతలను నెరవేర్చుతున్నాము.

ఈనాటి రెండవ పఠనం లో  ఒక క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉండాలో తెలుపుచున్నారు, హింసలను ఏ విధంగా భరించాలో తెలుపుచున్నారు.

చాలా సందర్భాలలో మనం తప్పు చేయకపోతే శిక్షను అనుభవించుటకు సిద్ధంగా ఉండము, కానీ దేవుని మందమైన  మనం తప్పు చేయకపోయినా శిక్షను అనుభవించినట్లయితే దానిని ఓర్పుతో సహించమని పేతురు గారు తెలుపుచున్నారు.

వాస్తవానికి ఇది చాలా కష్టం కానీ మన కాపరి అయిన యేసు ప్రభువు ఆయన ఎటువంటి తప్పిదము చేయలేదు ఎల్లప్పుడూ ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే జీవించారు, ప్రజలకు బోధించారు, మేలు చేశారు, అద్భుతాలు చేశారు, మరణించిన వారికి జీవం ఇచ్చారు, అనారోగ్యాలతో స్వస్థత ఇచ్చారు, ఎంత మేలు చేసినప్పటికీని ఆయనను అన్యాయంగా సిలువ వేశారు.

ఆయన ఎట్టి పాపమూ చేయలేదు. ఎన్నడును అసత్యపు మాటలు పలకలేదు. ఆయనను శపించిన వారిని శపించలేదు అయినా కానీ ప్రభువును ఘోరమైన సిలువ మరణంకు గురి చేశారు, కాబట్టి అన్యాయంగా శిక్షణ పొందితే దానిని ఓర్పుతో భరించమని ప్రభువు తన యొక్క జీవితం ద్వారా తెలిపారని పేతురు గారు బోధించారు.

పేతురు గారు పలుకుచున్నారు అన్యాయంగా శిక్షను పొందిన వారు ఓర్పుతో భరిస్తే వారు ఆశీర్వదించబడతారు అని తెలిపారు.

- యోసేపు అన్యాయంగా శిక్షించబడ్డాడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు - ఆది 37,39

- దానియేలును అన్యాయంగా సింహపు బోనులో వేశారు దేవుని చేత రక్షించబడ్డారు.

- మోషే ప్రవక్తను కూడా అన్యాయంగా నిందించారు కానీ దేవుడు గొప్పవానిగా దీవించారు - నిర్గమ 5-21,14:11

- సమూయేలు ప్రవక్తను కూడా వద్దన్నారు - 1 సము 8:5

అయినా దేవుడు తన్ను దావీదును అభిషేకించే ప్రవక్తగా ఎన్నుకున్నారు.

కొన్ని కొన్ని సందర్భాలలో మనం పని చేసే చోట జీవించే చోట ప్రయాణం చేసే చోట అన్యాయంగా మనల్ని మాటలు అంటుంటారు అయినా మనం వాటిని ప్రేమతో సహించాలి.

- ఏసుప్రభు అన్నారు నిన్ను ఒక్క చెంప మీద కొట్టిన వానికి  రెండవ చంపను కూడా చూపించమని ఇది క్రైస్తవ జీవితం.

క్రీస్తు ప్రభువు ఈ లోకానికి మంచి నాయకుడిగా, ఒక మంచి సామృత్తికను  ఇచ్చారు, కాబట్టి మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలి ఆయన వలే తప్పు చేయకపోయినా శిక్షను అనుభవించుటకు సిద్ధంగా ఉండాలి.

మనల్ని మనం సమర్థించుకొనకుండా దేవుని కొరకు అన్నియును సహనంతో భరించాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. తొలి క్రైస్తవ సంఘం అన్యాయంగా అనేక హింసలకు గురి అయినది వాటిని అన్నింటి వారు ఎంతో సహనంతో భరించారు. కావున దేవుని యొక్క శ్రమలలో భాగస్తులైనంతవరకు సంతోషిస్తూ ప్రభువు కొరకు అన్యాయంగా శిక్షించబడినప్పటికీ ధైర్యంతో ముందుకు సాగిపోదాం.

ఈనాటి సువిశేష పఠనం లో  యేసు ప్రభువు గొర్రెల కాపరి అని అదేవిధంగా గొర్రెలు పోవు ద్వారము కూడా యేసు ప్రభువు అని తెలుపుచున్నారు.

పవిత్ర గ్రంథంలో దేవుడిని వివిధ రకాల రూపాల్లో పోలికలతో చెప్పబడ్డారు.

- ప్రభువును కరుణామయుడని

- ప్రేమాస్వరూపియని

- సత్య స్వరూపి అని

-మంచి కాపరి అని వివిధ రకాల పోలికలతో నామాలతో వ్యక్తిగత అనుభవమును బట్టి పోల్చి చెప్పబడ్డారు.

మంచి కాపరి అనేటువంటి మాటను పాత నిబంధన గ్రంథ రచయితలు అలాగే నూతన నిబంధన గ్రంథ రచయితలు ఇద్దరును ప్రభువు యొక్క జీవితంలో ఉద్దేశించి వినియోగించారు.

- సృష్టి ప్రారంభం నుండి దేవుడు కాపరిగా ఉంటూ తన ప్రజలను నడిపించారు అందుకే దావీదు రాజు అన్నారు ప్రభువే నాకు కాపరి ఇక నాకు ఏ కుదువ ఇవ్వు లేదు - కీర్తన 23:1.

పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు యావే  దేవుడు గొర్రెల కాపరి అనే ప్రవక్తలు బోధించారు.

ఏఎస్కేలు ప్రవక్త 34వ అధ్యాయంలో యావే దేవుడు ఎలాంటి కాపరియో తెలుపుచున్నారు - యేహెస్కెలు 34:15-16.

దావీదు రాజు కీర్తనల గ్రంథంలో యావే  దేవుడు మంచి కాపరి అని తెలుపుచున్నారు - కీర్తన 77:20,79:13,97:7,95:7

యావే దేవుడు తన ప్రజలను ముందుకు నడిపించిన మంచి కాపరి ఆమోసు  ప్రవక్త జకరయ్య ప్రవక్త మరియు యెషయా  ప్రవక్తలు కూడా యావే  దేవుని మంచి కాపరి అని సంభోదించారు - యెషయా 40:11,49:9-10

యావే  దేవుడు తన మందను మేపే బాధ్యతలను తన యొక్క సేవకులకు అప్పచెప్పారు.

మోషే అహరోను ద్వారా యావే దేవుడు తన మందను నడిపించారు - కీర్తన 72:21

యెహోషువా ప్రవక్త ద్వారా తన మందను ముందుకు నడిపించాడు. తరువాత న్యాయాధిపతులను, నాయకులను, రాజులను ఎన్నుకొని వారిని ఇస్రాయేలు ప్రజలకు కాపరులుగా చేశారు. అయితే అందరూ కాపరులు సత్యంతో, నీతిగా పనిచేయలేదు, కొందరు కాపరులు తమ స్వార్థం కోసం జీవించారు. అందుకే యావే దేవుని తన కుమారుడైన క్రీస్తు ప్రభువు మనకు మంచి కాపరిగా ఈ లోకానికి అందజేశారు.

- ఏసుప్రభు మంచి కాపరి - 10:12.

పాలస్తీన దేశంలో కాపరి అంటే నిస్వార్థ సేవకు ప్రేమకు త్యాగం కు నిజాయితీకి ఒక మంచి ఉదాహరణ.

ఏసుప్రభు తన యొక్క సువార్త పరిచర్యలో అనేకసార్లు గొర్రెల మందలను గురించి గొర్రెల కాపరుల గురించి తెలిపారు.

ఆయన కాపరిలేని గొర్రెల మందలా ఉన్న వారిని చూసి జాలితో చలించిపోయారు -  మార్కు  6:35.

తప్పిపోయిన గొర్రెలను వెతికారు - లూకా 15:3-7.

సువార్త సేవకు శిష్యులను పంపించేముందు యేసు ప్రభువు శిష్యులతో నేను మిమ్ము తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలే పంపిస్తున్నాను అని పలికారు - మత్తయి 7:15

- ఏసుప్రభును మంచి కాపరి  అని పిలుస్తున్నాము ఎందుకంటే : 

1. ఆయన తన మందను పచ్చిక బయళ్ల వద్దకు నడిపించారు, వారిని పరలోకము వైపుకు నడిపించారు ప్రజలను సంతృప్తి పరిచారు.

2. గొర్రెల కొరకు తన యొక్క ప్రాణం నువ్వు త్యాగం చేశారు.

3. దెబ్బ తగిలిన ప్రతి గొర్రెను మంచిగా చూసుకొని, వాటికి అందజేయవలసిన ప్రేమను అందజేశారు.

4. ఏసుప్రభువు గొర్రెలకు ముందుగా నడిచారు అన్నింటిలో వారికి ముందుగా వెళ్లారు.

5. తప్పిపోయిన గొర్రెల కొరకు వెతికారు.

6. తన మందను క్రమశిక్షణలో నడిపించారు.

7. ఆయన సానుభూతి కలిగిన కాపరి.

8. ఆయన ప్రేమించే కాపరి తన మందను ఎప్పుడూ ప్రేమించారు.

9. తన మంద యొక్క శ్రేయస్సు కొరకు పనిచేసే కాపరి.

10. తన యొక్క మందను క్షుణ్ణంగా తెలుసుకున్న మంచి కాపరి తనకు తన మందకు చాలా దగ్గర బంధం ఉంది.

- ఏసుప్రభు తనను తాను గొర్రెలు పోవు ద్వారము అని పిలుస్తున్నారు.

- ద్వారము మనం లోపలికి ప్రవేశించుటకు సహాయపడుతుంది, మనం కూడా పరలోకం రాజ్యం లోపలికి ప్రవేశించాలంటే అది కేవలం ఏసుక్రీస్తు ద్వారానే సాధ్యం.

- దేవుని దరి చేరాలంటే ఆయన ద్వారా మనం ప్రవేశం పొందాలి ఆయన దేవునికి మనకు మధ్యవర్తి - ఎఫెసి 2:18

- మనం ఆయన మందలోని బాగాస్తులైన వారితో ఆయన యొక్క స్వరమును ఆలకించి ఆయన్ను వెంబడిస్తాం.

మొదటి పఠనం లో  యూదులు అపోస్తుల యొక్క స్వరమును ఆలకించి మంచి మార్గంలో నడుచుకున్నారు, మనం కూడా దేవుని యొక్క స్వరమును ఆలకించి జీవిస్తే తప్పనిసరిగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం.

ఈరోజు మనం కాపురుల కొరకు ప్రార్థించాలి, అభిషేకించబడ్డవారు కాపరులే, దేశ నాయకులు కాపరులే, తల్లిదండ్రులు కాపరులే, ఉపాధ్యాయులు కాపరులే, ప్రతి ఒక్కరూ కాపరులే, కాబట్టి మనకు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి.


FR. BALAYESU OCD

22, ఏప్రిల్ 2023, శనివారం

3వ పాస్కా ఆదివారం

 

3 పాస్కా ఆదివారం

. పో.  2: 14, 22-28

1 పేతురు 1: 17-21

లూకా 24: 13-35

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుడు తనను విశ్వసించే ప్రజలకు ఎప్పుడు చేరువలోనే ఉంటారు అని తెలుపుచున్నాయి. మన జీవితంలో మనం ఎట్టి పరిస్థితులకు లోనైనాకానీ పునరుత్తాన దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. దేవుడి గురించి ఎవ్వరైతే తాపత్రయ పడుతుంటారో, వెదకుతుంటారో, ఆయన సాన్నిధ్యంతో జీవించాలని భావిస్తారో వారికి ప్రభువు అతి సమీపంలోనే ఉంటారు అనే విషయం గురించి మనకు ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి.

ఈనాటి మొదటి పఠనంలో పేతురు గారు చేసిన మొదటి పునరుత్తాన భోధన గురించి వింటున్నాం. అపొస్తలులు యేసు ప్రభువు యొక్క పునరుత్తానం తరువాత అదే విధంగా దేవుని యొక్క పవిత్రాత్మను పొందిన తరువాత సువార్త ప్రకటన చేయుట మనం వింటున్నాం.  పవిత్రాత్మను పొందిన తరువాత వారిలో భయం పోయినది అందుకనే వారు బహిరంగంగా సువార్తను అధికారుల మధ్య సమూహాల మధ్య బోధించారు.

వారు బోధించిన అంశం ఏమిటంటే యేసు ప్రభువును అన్యాయంగా సిలువ మరణంకు గురిచేశారు అయినా కానీ దేవుడు మాత్రం తన కుమారున్నివిడిచి పెట్టలేదు ఆయన్ను మరణమును గెలిచేలా చేశారు.  యేసు ప్రభువు తన యొక్క అద్భుతాలు ద్వారా, మహాత్కారాల ద్వారా తన యొక్క బోధనల ద్వారా తానే యేసయ్య అని తెలిపారు. అయినప్పటికిని అది గ్రహించక ఆయన్ను మీరు సిలువ శిక్షకు గురి చేశారు, ఆయన మరణంకు కారణం అయ్యారు అని తెలిపారు.

యేసు ప్రభువును తన తండ్రి ఎన్నడును విడిచిపెట్టలేదు అని పేతురు గట్టిగా  ప్రకటించారు. తండ్రి తన కుమారున్ని ఎన్నడూ విడిచిపెట్టరు. ఎందుకంటే ప్రభువు అంటున్నారు "తల్లి మరచినా నేను నిన్ను మరువను అని" యెషయా 49 : 15 . మనల్ని మరచిపోని దేవుడు మరి తన కుమారున్నిఏ విధంగా మరువగలడు, మరవడు. సత్యమును గ్రహించిన అపోస్తులు ప్రభువు యొక్క పునరుత్తానం గురించి గట్టిగా ప్రకటించారు.

నాటి మొదటి పఠనంలో పేతురు గారు దేవుడు అందరిని తన ప్రజలుగా స్వీకరిస్తున్నారు అని తెలుపుచున్నారు. మొదటిగా యూదులను మార్చి, తరువాత అన్యులకు సువార్త ప్రకటన చేసి వారిని  తన బిడ్డలుగా స్వీకరిస్తారు అని ప్రభువు పలుకుచున్నారు.  యూదులు యొక్క విశ్వాసాన్ని బలపరచుటకు, వారిని యేసు ప్రభువు వైపు తిప్పుటకు పేతుటకు పేతురు గారు వారిని తన యొక్క పరిచర్య ద్వారా బోధించిన విధానం తెలుసుకుంటున్నాం.

ఈనాటి రెండవ పఠనంలో పేతురు గారు మనందరినీ దేవుడి యందు భయభక్తులు  కలిగి జీవించమని కోరుచున్నారు. పేతురు గారు ఆనాటి యూదులను అదే విధంగా హృదయ పరివర్తనం చెందిన అన్యులను దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి  భయభక్తులతో జీవించమని కోరుచున్నారు.

ప్రభువు యొక్క మరణం అనేది దైవ ప్రణాళిక అని పేతురుగారు పలికారు.  ప్రభువు యొక్క రక్తం చేత మనం పాప విముక్తులముగా చేయబడ్డాం. నిష్కళంక గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మనం పవిత్ర పరచబడ్డాం, స్వతంత్రులముగా చేయబడ్డాం. కావున ఆయన యందు ఎల్లప్పుడూ, విశ్వాసం ఉంచి మంచిగా  జీవించమని పేతురు గారు  పలుకుచున్నారు.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు ఎమ్మావు మార్గంలో శిష్యులకు ఇచ్చిన దర్శనం గురించి వింటున్నాం. ఇద్దరు శిష్యులు యేసు ప్రభువు యొక్క మరణం తరువాత యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామంకు వెళ్లే సమయంలో దేవుడు వారితో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గ్రహించాలి.

1. దేవుడు నీ బాధలో  నీకు తోడుగా వుంటారు. ఇద్దరి శిష్యులు ప్రభువు యొక్క మరణమును తట్టుకోలేకపోయారు, నిరాశలో వున్నారు, రాజును  కోల్పోయాము అనే బాధలో వున్నారు. ఆయన్ను గొప్ప నాయకుడిగా, రాజుగా భావించారు. రోమా చక్రవర్తుల నుండి స్వేచ్ఛను దయచేసి వ్యక్తిగా భావించారు అయితే వారి యొక్క ఆలోచనలకు బిన్నంగా ఆయన మరణించారు. అలాంటి తట్టుకోలేనటువంటి స్థితిలో వున్న వారికి ప్రభువు దర్శనం ఇస్తున్నారు.

-   శిష్యులు యేసు ప్రభువు యిస్రాయేలు ప్రజలను ఉద్ధరిస్తాడని, తన రాజ్యాన్ని స్థాపించి ప్రజలకు శాంతి సమాధానాలు సిరిసంపదలు దయ చేస్తాడని వారు ఎంతగానో ఎదురుచూశారు. అయితే అదేమి జరగలేదు. యేసు మరణంతో శిష్యుల యొక్క ఆశలు వమ్ము అయ్యాయి.

-  అంతా కోల్పోయాము, అంతా అయిపోయింది అని జీవచ్ఛవాలుగా ఎమ్మావు గ్రామానికి వెళ్లుచున్న శిష్యులను ప్రభువు కలుసుకుంటున్నారు.

-   దేవుడు తనను వెంబడించే వారిని విడిచిపెట్టరు. శిష్యులు ఎమ్మావు గ్రామముకు వెళ్లే దారిలో వారి యొక్క సంభాషణ యేసు ప్రభువు గురించియే అందుకే ప్రభువు అంటారు "ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడివుంటారో అక్కడ నేనుంటానని" - మత్తయి 18 : 20 .

- మార్గమధ్యన వారి సంభాషణ అంత దేవుని గురించియే అందుకే వారి మధ్యకు దేవుడు వస్తున్నారు.

- వారు అంతగా  దేవుడి గురించి సంభాషిస్తున్నారంటే ఎంతగా ఆయన్ను miss  అయ్యామని వారు భావిస్తున్నారో మనం అర్ధం చేసుకోవాలి.

- మన జీవితాలలో మన భాదల్లో వున్నప్పుడు దేవుడు మనకు కూడా తోడుగా వుంటారు అది మన యొక్క తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు లేదా ఇతరుల ద్వారా కావచ్చు దేవుడు మనల్ని ఎన్నడు విడిచిపెట్టారు.

2. మన దేవుడు ప్రయాణించే దేవుడు: పూర్వ నిబంధన గ్రంధంలో యావే దేవుడు యిస్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విముక్తులను చేసి, వారితో పాటు ఎడారి గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసే సందర్భంలో ఆయన మహిమను, స్వభావమును వెల్లడిచేశారు. ఆయన యొక్క సాన్నిధ్యమును అనుభవించేలా చేశారు.

- అదే విధంగా ఈనాటి సువిశేషంలో యేసు ప్రభవు కూడా శిష్యులతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో వారికి అనేక విషయాలు తెలుపుచున్నారు.

- ప్రభువు తన ప్రజలతో నడుస్తూ తన యొక్క  గొప్పతనమును వెల్లడించుకుంటున్నారు.

-  సృష్టి  ప్రారంభంలో దేవుడు ఆదాము, అవ్వతో నడిచారు. దేవుడు నోవాతో నడిచారు, ఏనోకుతో నడిచారు. ప్రభువు వారితో నడిచే సందర్భంలో అది సామాన్యమైన నడకకాదు అది. యొక్క నడక వారిని బలపరిచే నడక, నేర్పించే నడక, ధైర్యం నింపే నడక కావున మన కూడా గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుడు కూడా మనతో పాటు నడుస్తుంటారు. ఆయన సర్వమును గుర్తించి ఆయన మాట ప్రకారం మనం జీవించాలి.

3. మన దేవుడు మన యొక్క అవసరతలను పట్టించుకునే దేవుడు.

-   ఆయనకు ప్రతి ఒక్కరి అవసరతలు తెలుసు అందుకే వారిని ఆదుకుంటారు.

-  గ్రుడ్డివారిని అవసరతలు తెలుసు

-  పక్షవాత రోగి అవసరం తెలుసు

-  అనారోగ్యుల అవసరాలు తెలుసు

-  విశ్వాసులు అవసరాలు తెలుసు

అందుకే వారిని ఆదుకుంటారు. అదే విధంగా ఇద్దరి శిష్యుల అవసరం కూడా తెలుసు అందుకే వారిని ఆదుకుంటారు.

4. మన దేవుడు ఐక్య పరిచే దేవుడు: ఇద్దరి శిష్యులను మిగతా శిష్యులతో దేవుడు ఐక్యపరుస్తున్నారు.

- ప్రభువును రొట్టె విరుచుట యందు గుర్తించిన శిష్యులు వెంటనే మిగతా శిష్యుల వద్దకు పరుగెత్తుకొని వెళ్లారు.

- యేసు ప్రభువు మరణంతో మనల్ని తండ్రితో ఐక్య పరిచారు.

- ప్రభువు తొలి సంఘస్థులను ఐక్య పరుస్తున్నారు. అలాగే దేవుడు వివాహం ద్వారా స్త్రీ పురుషులను ఐక్యం చేస్తున్నారు.

5. మన దేవుడు కనువిప్పు కలుగచేసే దేవుడు.

- ఇద్దరి శిష్యులు మొదట్లో యేసు ప్రభువును గుర్తించలేదు కానీ ఆయన స్థాపించిన దివ్య సత్ప్రసాదస్థాపన రోజున చేసిన కార్యమును శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. వారి కనువిప్పుకు కారణం అయ్యారు.

- తప్పిపోయిన కుమారుడి కనువిప్పు అయ్యేలా చేశారు.  యొక్క రోజున దేవుడు అన్ని సమయాలలో మనకు తోడుగా ఉంటారని గుర్తించి ఆయన్ను విశ్వసించాలి.

 Fr. Balayesu OCD

15, ఏప్రిల్ 2023, శనివారం

పాస్కా 2వ ఆదివారం

పాస్కా 2వ ఆదివారం

అ. కా. 5: 12-16

దర్శ 1: 9-11, 12-13, 17-19

యోహాను 20 : 19 - 31

ఈరోజు తల్లి శ్రీసభ దివ్యకారుణ్య పండుగను కొనియాడుచున్నది. ఈరోజు దివ్య పఠనాలు కూడా దేవుని యొక్క దయా, కరుణ గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క కరుణ చల్లని చూపు అందరికి అవసరం దాని ద్వారానే మనం ప్రభువు యొక్క అనుగ్రహాలు పొందుచున్నాము, బ్రతుకుచున్నాం.

దివ్య కారుణ్య పండుగ భక్తి పునీత పౌస్టీనా ద్వారా ప్రారంభమైంది. ప్రభువు ఆమెకు ఏప్రిల్ 30 , 2000 లో ఇచ్చిన దర్శనంలో ప్రభువు ఆమెతో ఈ విధంగా అన్నారు "మానవజాతి, నమ్మకంతో తన కరుణను ఆశ్రయిస్తే వారికి శాంతి లభిస్తుందని" తెలిపారు. పరిశుద్ధ రెండవ జాన్ పాల్ పాపుగారు ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రకటించారు. పరిశుద్ధ ప్రాన్సిస్ పాపుగారు దీనిని అధికారికంగా జరుపుకోవాలని తెలిపారు.

పౌస్టీనా గారికి దేవుడు మూడు ముఖ్యమైన బాధ్యతలను అప్పజెప్పారు.

1 . ఆత్మల కోసం ప్రార్ధించుట : దేవుని యొక్క అనంతమైన కరుణకు ఈ ఆత్మలను సమర్పించి వారి కొరకు ప్రార్ధించుట

2 . ఈ ప్రపంచముకు దేవుని యొక్క గొప్ప మనస్సు, కారుణ్య మనస్సు తెలియజేయుట.

3 . దేవుని యొక్క కరుణ చాటుట, విశ్వాసమును ప్రకటించుట దేవుని ప్రేమను విశ్వసించుట అంటే ఆయన యొక్క కరుణను విశ్వసించుటయే కాబట్టి ఈ రోజు దేవుడు మనకు చూపిస్తున్న కరుణ మనం ధ్యానించుకోవాలి.

యేసు ప్రభువు యొక్క దివ్య కారుణ్య picture మనం చూస్తే రెండు రకాలైన కిరణాలు కనబడతాయి. ఎర్రని కిరణాలు - దేవుని యొక్క రక్తంకు గుర్తు. ఆయన రక్తం చిందించటం ద్వారా మనం రక్షించబడ్డాం అని అర్ధం. తెల్లని కిరణాలు మన యొక్క జ్ఞానస్నానంకు గుర్తు. జ్ఞానస్నానం ద్వారా దేవుని బిడ్డలుగా చేయబడుతున్నాం. పవిత్రులుగా చేయబడుతున్నాం.

ఈనాటి మొదటి పఠనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యుల ద్వారా చూపిన కరుణ గురించి తెలియజేస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారికి ప్రభువు తన యొక్క అనంత కరుణను చూపిస్తున్నారు. 15 వ వచనంలో పేతురుగారి నీడపడినా చాలు మేము స్వస్థత పొందుతాం అనే అంత గొప్ప విశ్వాసం ప్రజలలో చూస్తున్నాం. ఇలాంటి ఒక విశ్వాసం గెన్నేసరెతు ప్రజలలో కూడా చూస్తున్నాం. కేవలం యేసు ప్రభువు యొక్క అంగీని తాకితే చాలు మేము స్వస్థత పొందుతాం అని అనుకున్నారు. మత్తయి 14 : 34 - 36 .

దేవుని యొక్క దీవెనలు, కరుణ పొందటానికి ప్రజలు తమ జీవితాలను తాము సంసిద్ధం చేసుకొని వున్నారు. విశ్వాసమును కలిగి వున్నారు. యెరూషలేములో సొలొమోను మంటపం దగ్గర వున్నా విశ్వాసులు పేతురు గారిలో పవిత్రాత్మ శక్తి ఉందని గ్రహించారు. ఆయన దేవుని శిష్యుడని తెలుసుకున్నారు, ఆయనకు స్వస్థత నిచ్చే శక్తి వుందని గ్రహించారు.

పేతురు గారు బలహీనుడు, యేసు ప్రభువును మోసం చేశారు అయినా సరే ఆయనలో అంత శక్తి ఎలా దాగివుంది ఆయన తన జీవితమును మార్చుకున్నాడు. హృదయ పరివర్తనం చెందాడు, పవిత్రాత్మ శక్తిని పొందాడు, దేవుని చిత్తం ప్రకారం జీవించారు అందుకే దేవుని యొక్క స్వస్థత పరిచే శక్తి ఆయనకు వచ్చింది ఇది దేవుని యొక్క అనుగ్రహం. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే మనంలో విశ్వాసం ఉండాలి.

ఈనాటి రెండవ పఠనంలో పునీత యోహాను గారు తనకు వచ్చిన దర్శనం గురించి తెలుపుచున్నారు. పునరుత్తానుడైన క్రీస్తు ప్రభువు యొక్క దర్శనం గురించి పలుకుచున్నారు. పునరుత్తానుడైన క్రీస్తు ప్రభువు తాను సజీవుడని, మృత్యు లోకమునకు అధికారి అని తెలుపుచున్నారు. ఈ పఠనం ద్వారా ప్రభువు తానే విశ్వాధిపతి అని తెలుపుచున్నారు. ఈ లోకంలో ఎదురయ్యే కష్టాలకు ఇబ్బందులకు కృంగిపోక దైవశక్తి మీద ఆధారపడి జీవించమని కోరుచున్నారు.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు చూపిన కరుణ గురించి తెలుపుచున్నారు. శిష్యులకు కరుణ చూపించి యేసు ప్రభువు తన యొక్క సువార్త బాధ్యతలను అప్పజెప్పుచున్నారు. దేవుని యొక్క అనంత ప్రేమ, కరుణ, క్షమ గురించి తెలియజేయుటయే ప్రభువు శిష్యులకు అప్పజెప్పిన బాధ్యత .

యేసు ప్రభువు తన శిష్యులకు దేవుని యొక్క కరుణ కొనసాగించుటకు క్షమించే వరం చేస్తున్నారు. ఈ సువిశేషంలో ప్రభువు చాలా విషయాల గురించి బోధిస్తున్నారు. యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు దర్శనం ఇచ్చి వారిని బలపరుస్తున్నారు. ఎందుకు ప్రభువు వారిని బలపరుస్తున్నారంటే ఒక్కసారి మనం చూసిన దానిని, గ్రహించిన దానిని, విన్న దానిని గట్టిగా ప్రకటించగలం. పేతురు గారు అంటారు మా కనులారా చూసిన దానిని చెవులారా వినిన దాని గురించి ప్రకటించకుండా ఉండలేదు అని అ.పో. 4 : 20

శిష్యులు దేవున్ని గురించి తెలుసుకున్నారు కాబట్టియే తరువాత అంత గొప్పగా ప్రభువు గురించి ప్రకటించగలిగారు. యేసు ప్రభువు ఉత్తానమైన తరువాత ఇది ఎనిమిదవ రోజు అయితే శిష్య్లఅందరు కూడా భయంతో వున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు క్రీస్తే నాయకుడు అని అనుకున్నారు. ఆయన వారి వెన్నెముక అని, రాజు వారు భావించారు. వారందరి యొక్క ఆలోచనలకు బిన్నంగా క్రీస్తు ప్రభువు మరణించారు.

యుద్ధంలో రాజు చనిపోతే సాధారణంగా సైనికులకు భయ వేస్తుంది అదే విధంగా అప్పటివరకు ధైర్యంగా వున్నశిష్యులు క్రీస్తు మరణంగా ధైర్యంగా కోల్పోయారు. క్రీస్తే వారి ధైర్యం, క్రీస్తే వారి శక్తి, క్రీస్తే వారి నమ్మకం అన్నీ కోల్పోయిన సందర్బంలో ప్రభువు వారికి ధైర్యంనిస్తున్నారు. భయపడే వారికి దేవుడు ఎప్పుడూ ధైర్యంనిస్తున్నారు. అదేవిధంగా వారికి తోడుగా నిలబడుచున్నారు.

- మోషే ఫరో వద్దకు వెళ్ళుటకు భయపడ్డాడు

- యెషయా భయపడ్డాడు - 41 : 10

- యిర్మీయా భయపడ్డారు

- శిష్యులు భయపడ్డారు

వారందరికీ దేవుడు ధైర్యంనిస్తున్నారు, వారిని బలపరుస్తున్నారు.

యూదులు ఎప్పుడు ప్రాణహాని కలుగచేస్తారా అని భయాందోళనతో వున్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి వారందరు ఒకే చోట బిక్కి బిక్కి మంటు లోపల దాగుకొని ఉంటున్నారు. గురువును కోల్పోయిన భాధ, ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రభువు వారి యొక్క అవసరత గుర్తించి వారి యొక్క అలజడి మనస్సులను, జీవితాలను ప్రశాంతంగా ఉంచుటకై మొదటిగా వారికి కావలసిన శాంతిని ఒసగుతున్నారు.

మన జీవితంలో మొదటిగా దేవుని వరం ఏం కావాలో అది దేవుడు ఇస్తారు.

చేతులను ప్రభువు ప్రక్కకు చూపుచున్నారు. దీని ద్వారా దేవుడు తనను తాను శిష్యులకు ఎరుక పరచుకుంటున్నారు. గాయపడిన చేతులను అదే విధంగా మేకులుదించిన చేతులు చూసినప్పుడు వారి నమ్మకం ఇంకా ఎక్కువైంది. వారికి సంతోషంగా తిరిగివచ్చింది. కోల్పోయినది తిరిగి పొందారు. చేతులు పక్కకు చూపటం అనేది ఆహ్వానంకు కూడా గుర్తు శిష్యులను దేవుడు తన చెంతకు ఆహ్వానిస్తున్నారు అని ఆదం. భారముచే అలసిసొలసిన సమస్త జనులారా........ మత్తయి 11 : 28. తన చెంతకు శిష్యులను ఆహ్వానిస్తున్నారు.

యేసు ప్రభువు శిష్యులను వేద ప్రచారంకై పంపిస్తున్నారు. తండ్రి కుమారుని పంపినవిధంగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని అంటున్నారు 21 వ వచనంలో.

తండ్రి కుమారున్ని - రక్షించుటకు పంపారు

- ప్రేమించుటకు

- క్షమించుటకు

- సేవ చేయుటకు

- తండ్రి చిత్తమును తెలియజేయుటకు

- విధేయత చూపుటకు

- త్యాగ జీవితం జీవించుటకు

- నిస్వార్ధ సేవ చేయుటకు

తండ్రి, పవిత్రాత్మల జీవితమును తెలియజేయుటకు పంపిన విధంగా మిమ్మల్ని కూడా పంపిస్తున్నాను అని అంటున్నారు. ఆయన యొక్క శిష్యులుగా మనందరం కూడా క్రీస్తు ప్రభువు జీవించిన విధంగా జీవించాలి. వారిని పంపించేటప్పుడు యేసు ప్రభువు శ్వాసను ఊది పవిత్రాత్మను ఒసగుచున్నారు.

- దేవుడు ఆదాముకు శ్వాసను ఊది జీవమిచ్చారు (ఆది 2: 7)

- ఏలియా ప్రవక్త వితంతువు కుమారునికి దేవుని ప్రవచన శ్వాసను ఊది జీవం ఇచ్చారు (1 రాజు 17: 21 - 23)

- ఎండిన ఎముకలకు దైవవాక్కును ప్రకటించి జీవాన్ని ఇచ్చినట్లుగా (యెహెఙ్కేలు 37: 9 - 10) శిష్యులకు దేవుడు శ్వాసను ఊది జీవమిచ్చారు.

- శ్వాసనూదటం ద్వారా దేవుడు మరలా శిష్యులలో నూతన జీవం నింపుచున్నారు.

మొదటి తల్లిదండ్రులు పాపం చేయటం ద్వారా శాంతి సమాధానాలు నశించాయి. దేవునికి మానవునికి మధ్య బంధం తెగిపోయింది. దేవునికి దూరమయిన మానవున్ని క్రీస్తు ప్రభువు తండ్రి చెంతకు చేర్చుతున్నారు. మానవునిపై తన శ్వాసను ఊది నూతన సృష్టిని, నూతన మానవున్ని రూపొందిస్తున్నారు. ఆదిలో మానవుడు కోల్పోయిన శాంతిని ఇప్పుడు క్రీస్తు తన శిష్యులకు కలుగజేస్తున్నారు. ఈ శాంతి ఆ శిష్యులు ప్రజలందరికి అందజేయాలి.

శాంతిని ప్రతి ఒక్కరు కలిగివుండాలి కోరుకుంటాం. ప్రశాంతగా ఉండాలి, కోరుకుంటారు చాలామంది దేశాల మధ్య శాంతి కావాలనుకుంటాం రాష్ట్రాల మధ్య కుటుంబాల మధ్య మతాల మధ్య శాంతి కావాలనుకుంటాం. కాబట్టి మొట్ట మొదటిగా వ్యక్తి గతంగా మన శాంతియుతంగా ఉండాలి అప్పుడే అది ఇతరులకు అందజేయవచ్చు.

దేవుని యొక్క శాంతి, కరుణ తెలియజేయుట కోసమే శిష్యులకు ప్రభువు క్షమించే అధికారమును ఇస్తున్నారు. పాపం చేసిన వారి శాంతిగా జీవించలేదు అందుకే వారిని ఆ పాపబంధం నుండి విముక్తులను చేసి శాంతిగా జీవింపచేయుటకు వారికి దేవుడు పాపమన్నింపును దయచేస్తున్నారు. క్షమాపణ లేకుండా శాంతికి మనుగడలేదు.

యేసు ప్రభువు శిష్యులకు దర్శనం ఇచ్చిన సందర్భంలో తోమాసు గారు లేరు. ఆయన ప్రభువును చూస్తేగాని నమ్మను అనే అవిశ్వాసంలో వున్నాడు. తోమాసు గారు మొదటిలో అవిశ్వాసిగా ఉంటున్నారు. ఆయన జీవితం గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఒక ధైర్యవంతుడు అని తెలుస్తుంది ఎందుకంటే శిష్యులందరు భయపడి లోపల ఉంటే తోమాసు గారు మాత్రం బయట ధైర్యంగా వున్నాడు - యోహాను 11 : 16 .

మన గురువు భాధను తట్టుకోలేక ఒంటరిగా ధ్యానిస్తున్నారు. దేవుడిని వ్యక్తి గతంగా చూడాలనుకున్నాడు. వక్తిగత అనుభవం కావాలనుకున్నారు. తోమాసు గారు యేసు ప్రభువు చేతిలో వ్రేళ్ళు పెడితేనే నమ్మను అని అన్నారు కానీ అది చేయలేదు, ప్రభువుని విశ్వసించారు.

విశ్వసం వివిధరకాలుగా వస్తుంది:

- వినుట వలన విశ్వాసం కలుగుతుంది ( రోమా 10 : 17 )

- శిష్యులు ఖాళీ సమాధి చూసి విశ్వసించారు ( యెహాను 20 : 8 )

- యేసు ప్రభువు పిలిచినప్పుడు మరియ మగ్దలేనమ్మ విశ్వసించింది ( యోహాను 20 : 16 )

- శిష్యుల దర్శనం వల్ల విశ్వసించారు ( 20 వ వచనం)

- క్రీస్తును చూడటం వల్ల తోమాసు గారికి విశ్వాసం పెరిగింది (25 వ వచనం)

ఆయన సందేహాలను అధిగమించగలిగాడు క్రీస్తును తన దేవునిగా గుర్తించాడు. యేసు ప్రభువు సజీవునిగా లేచారని గుర్తించారు. యేసు ప్రభువే రక్షకుడని తెలుసుకున్నాడు. తోమాసు గారికి దేవుడు తన కరుణ తెలియజేశారు. తోమాసు గారు క్రీస్తు యొక్క అనుభూతి ద్వారా తాను సువార్త సేవకై వివిధ ప్రాంతాలకు వెళ్లుచున్నారు. ప్రభువు మనందరితో కూడా చూడక నమ్మేవారు ధన్యులని పిలుస్తున్నారు. కొన్ని సందర్భాలలో మనం ఆధారాలు వుంటేనే నమ్ముతాం. ఎంతమంది చెప్పిన తోమాగారు వినలేదు, చేతిలో వ్రేళ్లు పెడితేగాని ఆధారాలు వుంటేగాని నమ్మను అని అన్నారు. అయినా ప్రభువు వారికి దర్శనం ఇస్తున్నారు, ఆయన్ను కరుణిస్తున్నారు.

దేవుని కరుణ మన మీద వున్నట్లే మనం కూడా కరుణ, జాలి, దయ, ప్రేమ కలిగి జీవించాలి. దేవున్ని తెలుసుకొని జీవించాలి.

Fr. Balayesu OCD

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం   యెషయా 6:1-6  1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...