28, సెప్టెంబర్ 2024, శనివారం
సామాన్యకాలపు ఇరవై ఆరోవ ఆదివారం
సామాన్యకాలపు ఇరవై ఆరోవ ఆదివారం
26వ సామాన్య ఆదివారం
21, సెప్టెంబర్ 2024, శనివారం
25 వ సామాన్య ఆదివారము
25 వ సామాన్య ఆదివారము
సొలొమోను జ్ఞాన గ్రంధము 2 : 12 , 17 - 20
యాకోబు 3 : 16 - 4 : 3
మార్కు 9 : 30 - 37
క్రిస్తునాధుని యందు ప్రియ సహోదరి సహోదరులారా !
ఈనాడు తల్లి తిరుసభ 25 వ సామాన్య కాలపు ఆదివారములోనికి ప్రవేశిస్తుంది. ఈనాటి మూడు దివ్యగ్రంధ పట్టణాలు కూడా మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి అని ఆత్మపరిశీలన చేసుకోమని మనలను అందరిని కూడా ఆహ్వానిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే మన యొక్క బుద్ధి ప్రవర్తనలు ఏ విధంగా ఉంటున్నాయి అని మనలను మనము ప్రశ్నించుకోవలసిన సమయము. ఎందుకంటే ఈనాటి సువిశేష పఠనంలో మనము రెండు అంశాలను చూస్తున్నాము. యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు తాను పొందబోయెటువంటి సిలువ మరణమును అటుపిమ్మట జరగబోయే పునరుత్తాన్ని గురించి ప్రభు తన యొక్క శిష్యులకు వివరిస్తూ ఉంటున్నారు. కానీ శిష్యులు మాత్రం మనలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. అంటే ఎవరు ప్రథముడు అని తమలో తాము వాదించుకుంటున్నారు. యేసు పలికిన మాటలను వారు గ్రహించలేక పోతున్నారు.
ఆ సమయములో యేసు వారికి ఒక గొప్ప ఉదాహరణను చెప్పడానికి ఈ విధంగా వారితో పలుకుతున్నారు. (మార్కు 9 : 37 ) "ఇట్టి చిన్నబిడ్డలలో ఒకనిని స్వీకరించువాడు నన్నును స్వీకరించు వాడు అగును. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు"అని ప్రభువు పలుకుతున్నాడు. తమలో తం,యూ ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నవారికి ఒక గుణపాఠాన్ని ఒక చిన్న బిడ్డ ద్వారా వారికీ విశిదీకరిస్తున్నారు. అంటే చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే ఒకరి పై ఆధారపడి జీవిస్తారో, నిర్మల మనసు కలిగి ఉంటారో, చెప్పిన మాటకు విధేయులై ఉంటారో, అలాగా మీరును మరీనా తప్ప మీలో ఎవడును గొప్పవాడు కాదు అని ప్రభు వారికి తెలియచేస్తున్నారు. ఆ చిన్న బిడ్డలవలె మనము జీవించాలి అంటే మనము ఎం చేయాలి అంటే మన యొక్క జీవిత విధానాన్ని మనము మార్చుకోవాలి. ఎపుడు కూడా దుస్తుల వాలే కాకుండా నీతిమంతులుగా మనయొక్క జీవితాన్ని మనము గడపాలి. యేసు ప్రభువు తన యొక్క జీవితము ద్వారా మనకు మనము ఏ విధంగా జీవించాలి అని మనకు నేర్పిస్తూ ఉన్నారు.
ఈనాటి మొదటి పఠనంలో మనము చూస్తున్నాము.యేసు ప్రభు తన యొక్క సిలువ మరణాన్ని గురించి సంబందించిన విషయములను మనము చూస్తున్నాము. సో. జ్ఞాన 2 : 18 -20 వచనాలలో మనము చూస్తున్నాము. క్రూరముగా అవమానింతుము, హింసింతుము, పరీక్షకు గురిచేయుదము, ఇతని సహన భావమెంత గొప్పదో పర్రెక్షించి చూతము అని యేసును గూర్చిన పలుకులను మనము చూస్తున్నాము. యేసు ప్రభు తనయొక్క సిలువ మరణము పొందెబోయే ముందు ఈ విధముగా అనేకమైన అవమానాలు, హింసలు, నిందలు పొందియున్నారు. కానీ చివరిగా యేసు పలికినటువంటి పలుకులు (లూకా 23 : 34 ) "తండ్రి వీరు ఏమిచేయుచున్నారో వీరికి తెలియడంలేదు, వీరిని క్షమించుము" అని వారిని క్షమించి వారికై ప్రార్ధన చేస్తున్నారు. మనము కుడి మన యొక్క జీవితంలో ఎపుడు కూడా ఒకరి పట్ల కఠినంగా కాకుండా ప్రేమ కలిగి జీవించాలి అని ప్రభు తన యొక్క జీవితం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు.
ఒక మానవునిగా మన జీవితంలో అనేకమైన అవసరాలను మనము ఎదుర్కొంటు ఉంటాము. వాటిని మనము చేరుకోవాలి అంటే అనేకమైనటువంటి మార్గాలగుండా ప్రయాణిస్తాము. అది మంచిమార్గమే కానీ చెడు మార్గమే కానీ. ఈనాటి రెండొవ పఠనంలో మనము చూస్తున్నాము మానవుల మధ్య కలహాలు అనేవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి? వాటికి గల కారణము ఎవరు? అసలు మనము చేయవలసిన పని ఏంటీ అని చూస్తున్నాము. యాకోబు 4:1 వచనంలో చూస్తున్నాము. మానవుల మధ్య అనేకమైనటువంటి భేదములు ఎలా పుడుతున్నాయి అంటే అది కేవలము మనలో ఉన్నటువంటి వ్యామోహములనుండి. అనేకమైనటువంటి కోరికలు, ఆశలు, ఆశయాలు ఉండడం ద్వారా వాటిని పరిపూర్తి చేసుకోవడానికి మన పొరుగువానికి హాని తలపెట్టడానికి కూడా మనము వెనుదిరగడంలేదు. అనేకమైన యుద్ధములు చేస్తున్నాం కానీ మనము చేయవలసిన పని మాత్రం చేయడంలేదు. ఏంటి అంటే మనకు కావలసిన వాటికోడం దేవునికి ప్రార్ధించడం లేదు. యాకోబు 4 : 2 -3 వచనాలలో మనము వింటున్నాం, మీరు కావలసినవి మీరు పొందలేక పోతున్నారు అంటే మీరు దేవునితో ఐక్యమై జీవించటంలేదు అని. మనయొక్క జీవితంలో మనకు కావలసిన వాటిని కానీ కావలసిన వారిని గని మనము సంపాదించుకోవాలి అంటే అది కేవలము దేవునితో ఐక్యమై జీవించడం ద్వారా మాత్రమే అని నంటే నీతిమంతమైన మార్గమున ఒక నీతిమంతునిగా మెలగడం ద్వారా జరుగుతున్నది.
నీతిమంతుని యొక్క లక్షణాలను మనము చూస్తున్నాం. స్నాతి ప్రథముడిగా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి, మృదుమనసు కలిగి ఉండాలి. అంటే ఒక మాటలో చేపల అంటే క్రీస్తు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా మనము కుడి ఉండాలి. కానీ మనము ఏ విధంగా ఉంటున్నాం? విభుంనమైనటువంటి స్వభావము కలిగి ఉంటున్నాం.సువిశేష పఠనంలో మనము చూస్తున్నాం. క్రీస్తు తరువాత తాను స్థాపించబోయే రాజ్యాన్ని తన శిష్యులు కొనసాగించాలి అన్న ఉదేశ్యముతో వారికి తనను గురించి తాను చెప్పుకుంటూ ఉంటే శిష్యులు మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. యేసును అర్ధంచేసుకోలేక ఉంటున్నారు.
మరి మనము మన యొక్క జీవితంలో యేసును అర్ధం చేసుకొని జీవిస్తున్నామా ? తండ్రి దేవుని యొక్క ఆలోచనలను మనం అర్ధం చేసుకోవాలి అంటే ముందుగా మనము ఎం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని తొలగించుకొని అందరితో కలిసి ఏకత్వంగ జీవించాలి. అందరికి భిన్నంగా ఉన్నట్లయితే మన జీవితంలో మనమే కలహాలు సృష్టించుకున్నవాళ్ళం అవుతాం. అలా కాకుండా అందరితో కలిసి ఉన్నట్లయితే మనము దేవుని చేరగలుగుతాం. తనయొక్క శిష్యులు ఆయనతో కలిసి ఉన్నప్పటికీ ఆయనను అర్ధం చేసుకొనలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానం యేసుయొక్క ఆలోచనలకూ అతీతంగా ఉంటూ ఉన్నాయి. మనము కూడా కొన్నిసార్లు ఈ విధంగా దేవుని యొక్క ఆలోచనలకూ విభిన్నంగా ప్రవర్థిస్తూఉంటాం. కారణము విధేయత లేకపోవడం. కాబట్టి మనము దేవునితో కలిసి జీవించాలి అంటే విధేయత కలిగి జీవించాలి. చిన్న బిడ్డల వాలే మారు మనసు కలిగి ఉండాలి.
ఎడిత్ స్టెయిన్ కార్మెల్ భవన్
జానంపేట
బ్రదర్. పవన్ కుమార్ ఓ. సి.25వ సామాన్య ఆదివారం
20, సెప్టెంబర్ 2024, శుక్రవారం
25 వ సామాన్య ఆదివారము
25 వ సామాన్య ఆదివారము
14, సెప్టెంబర్ 2024, శనివారం
24 సామాన్య ఆదివారం
24 వ సామాన్య ఆదివారము
24 వ సామాన్య ఆదివారము
7, సెప్టెంబర్ 2024, శనివారం
23వ సామాన్య ఆదివారం
2, సెప్టెంబర్ 2024, సోమవారం
1 కొరింతి 2:1-5, లూకా 4:16-30
1 కొరింతి 2:1-5, లూకా 4:16-30
తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్ధనామందిరమునకు వెళ్లెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా, యెషయా ప్రవక్త గ్రంధమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. "ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను." దీనిని చదివి యేసు గ్రంధమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరు, ఆయనవంక తేరిచూచుచుండగా, ఆయన వారితో "నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది"అని పలికెను. అది వినిన ప్రజలందరు దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి "యితడు యోసేపు కుమారుడు కాడా ?" అని చెప్పుకొనసాగిరి. అంతట యేసు వారితో 'ఓ వైద్యుడా! నీకు నీవే చికిత్స చేసికొనుము అను సామెతను చెప్పి, "నీవు కఫర్నాములో ఏ యే కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములనెల్ల ఇచట నీ స్వదేశంలో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలీయా కాలమున మూడు సంవత్సరములు ఆరు మాసములు అనావృష్టివలన దేశమంతట గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు యిస్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలీయా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో యిస్రాయేలీయులలో చాలామంది కుష్ఠ రోగులు ఉన్నను, సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు" అని పలికెను. అపుడు ప్రార్ధనామందిరములోని ప్రజలు అందరు యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకునెట్టుకొని పోయి, తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొనివెళ్ళి, అచట నుండి తలక్రిందుగా పడత్రోయతలచిరి. కాని యేసు వారి మధ్య నుండి తొలగి తనదారిన తాను వెళ్లిపోయెను.
మొదటి పఠనములో మానవ జ్ఞానము నిష్ఫలమైనదని పౌలుగారు తెలియజేస్తున్నారు. పౌలుగారుప్రసంగాలు కేవలం దేవుని వాక్యమే. మనం కూడా పౌలులాగా వాక్యంలో క్రీస్తును చూపించాలి. లోక జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం పౌలు ఎన్నడు చేయలేదు.
మన విశ్వాసము, మనుషుల జ్ఞానమును ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని యుండవలెను. ఈ రోజుల్లో ఆకర్షణీయమైన మాటలు చెప్పే బోధకులున్నారు. కానీ పవిత్రాత్మ చే నడపబడి దేవుని శక్తి వ్యక్తమయ్యే బోధకులు తక్కువగా ఉన్నారు.. మానవ జ్ఞానానికి దారి తియ్యని మాటలకు ఆకర్షితులై ఎంతో మంది విశ్వాసంలో తప్పు దోవ పడుతున్నారు.
ఓ తండ్రి, పది సంవత్సరాల కొడుకు బస్సు ప్రయాణం చేస్తున్నారు. మాములుగా చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలు ఎక్కడ? ఎప్పుడు?ఎందుకు? ఏమిటి? ఇలా ఆ అబ్బాయి తండ్రిని ఎన్నో ప్రశ్నలు అడిగాడు. చివరికి డాడీ రోడ్డుకు వేసే తారును దేనితో తయారు చేస్తారు? అని అడిగాడు. తండ్రి కొద్దిగా కొపంతో బాబు నీవు ఈ రోజు నన్నడిగిన ప్రశ్నల్లో ఇది 999 వ ప్రశ్న. దయచేసి కొంత సేపు నన్ను వదిలెయ్యి అంటూ. నేను గనుక మా నాన్నను యిన్ని ప్రశ్నలను అడిగి ఉంటె నాకేమయ్యేది? అని అనుకున్నాడు. కొడుకు కొద్దిసేపు ఆలోచించి నా ప్రశ్నలకు చాలావరకు నాకు సమాధానాలు నాకు తెలిసేవి అన్నాడు. ఈ లోక జ్ఞానం చూసి, విని తెలుసుకునేలా ఉంటుంది. కానీ పరలోక సంబంధమైన జ్ఞానము పవిత్రాత్మ మాత్రమే ఒసగుతుంది.
ఇవి అద్భుతం ద్వారా నిరూపిస్తున్నారు. అపవిత్రాత్మలు సైతం క్రీస్తు వాక్కుకు లోబడి ఉన్నవి . అధికారపూర్వమైన హెచ్చరిక రాగానే అపవిత్రాత్మ వెళ్ళిపోతుంది. సువార్తలో ఈ అద్భుతాన్ని చూసి ప్రజలు క్రీస్తు అధికారాన్ని అంగీకరించారు. ఇలా గుర్తుల ద్వారా వచ్చిన విశ్వాసం గొప్పది చూసి విశ్వసించిన వారికంటే చూడక విశ్వసించిన వారు ధ్యనులు. ఆ ధన్యతను మనకు ప్రసాదించమని విశ్వాసంలో బలపడేలా దీవించమని ఈనాడు ప్రత్యేకంగా ప్రార్ధించుదాం. ఆమెన్
ఫా. రాజు సాలి OCD
మార్కు 6 : 14 – 29
February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...