31, జనవరి 2025, శుక్రవారం

మార్కు 4 : 35 -41

 ఫిబ్రవరి 01

హెబ్రీ 11 : 1 - 2 , 8 - 19

మార్కు 4 : 35 -41

ఆ దినము సాయంసమయమున,  "మనము సరస్సు  దాటి  ఆవలి తీరమునకు  పోవుదము రండు"  అని యేసు శిష్యులతో చెప్పెను. అంతట శిష్యులు ఆ జనసమూహమునువీడి  యేసును పడవలో తీసుకొనిపోయిరి, మరికొన్ని పడవలు ఆయన వెంటవెళ్లెను. అపుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి, పడవను చిందరవందర చేయుచు, దానిని ముంచి వేయునట్లుండెను. అపుడు యేసు పడవ వెనుకభాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అపుడు ఆయనను నిద్రలేపి "గురువా! తమకు ఏ మాత్రము విచారములేనట్లున్నది. మేము చనిపోవుచున్నాము" అనిరి. అపుడు యేసు లేచి, గాలిని గద్దించి, "శాంతింపుము" అని సముద్రముతో చెప్పగా, గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. "మీరింత భయపడితిరేల?మీకు విశ్వాసము లేదా? " అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ "గాలియు, సముద్రము సయితము ఈయనకు లోబడుచున్నవి. ఈయన ఎవరో!" అని తమలో తామనుకొనిరి. 

ఈనాటి సువిశేషం పఠనంలో ప్రభువు గాలిని తుఫానను గద్దించి శాంతిపజెయడాన్ని మనం చూస్తున్నాం. ప్రభుని యొక్క శిష్యులు తమ యొక్క అవిశ్వాసం వలన భయపడి పడవలో వారితో ఉన్న ప్రభుని నిద్రనుండి మేల్కొలుపుతూ ఉన్నారు. సర్వభౌమాధికారములు కలిగిన ప్రభువు వారి మధ్య ఉన్నప్పటికీ, గాలి తుఫానులు వారిని భయకంపితులను చేశాయి. వారి భయానికి గల కారణం వారి యొక్క అవిశ్వాసం. మనము కూడా మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క చిన్న విషయానికై భయపడుతూ ఉంటాము. ఒక విషయాన్ని మరచి వేరొక ఆలోచనలను ఆలోచిస్తూ ఉంటాము. మన జీవితంలో మనము ఎదుర్కొనే సమస్యలను చూసి భయపడిపోతుంటాము. కాని  ప్రభువు మన యొక్క జీవితం అనే నావలో మనతో ఉంటూ ఉన్నారు. 

మార్కు  చెప్పినట్లుగా, పడవ విరిగిపోతుందని మరియు అందరూ చనిపోతారని శిష్యులు భయపడ్డారు. కానీ యేసు నిద్రపోతున్నాడు.  వారికి  రాబోయే వినాశనాన్ని విస్మరించినట్లు  వారు ఆయనను నిద్రలేపి, “బోధకుడా, మేము మునిగిపోయినా మీకు పట్టింపు లేదా?” అని ప్రశ్నిస్తున్నారు.  (వచనం 38). అయితే, యేసు తుఫానును ఒక మాటతో శాంతింపజేస్తాడు, కానీ ఆయన శిష్యులను ఇలా గద్దించాడు: “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఇంకా విశ్వాసం లేదా?” (వచనం 40). జీవిత తుఫానులపై యేసుకు అధికారం ఉంది, వాటిని మనతో పాటు అనుభవిస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది, వాటి నుండి మనల్ని రక్షిస్తుంది మరియు మనకంటే ఎక్కువగా తనను నమ్మాలని కోరుకుంటున్నారు. శిష్యుల మాదిరిగానే, అతను మన జీవితాల్లో  ఉన్నాడని మనము  నమ్ముతున్నాము.

బహుశా అందుకే మార్కు ఈ కథను చేర్చాడు. అంతగా స్పష్టంగా తెలియని విషయం  ఏమిటంటే, యేసు నిద్రపోతున్నప్పుడు కూడా అంతే నియంత్రణలో ఉన్నాడు, శిష్యులు కూడా ఆయన చేతుల్లో సురక్షితంగా ఉన్నారు, ఆయన నిద్రపోతున్నప్పుడు కూడా అంతే సురక్షితంగా ఉన్నారు. చాలా సార్లు, జీవితం తుఫాను నుండి తుఫానుకు నిరంతర ప్రయాణంలా ​​అనిపిస్తుంది. కనీసం నాకు కూడా అలాగే ఉంటుంది, మరియు మీకూ అలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కానీ యేసు భయపడడు, నిరాశ చెందడు అని తెలుసుకోవడంలో నేను ధైర్యంగా ఉండగలనని కూడా నేను నేర్చుకుంటున్నాను. అతను నిద్రపోవచ్చు, లేదా నిద్రపోకపోవచ్చు, కానీ ఏ విధంగానైనా, పాటలో చెప్పినట్లుగా, “ఆయన ప్రపంచమంతా తన చేతుల్లో ఉంది.” అతను మేల్కొని తుఫానును నిశ్శబ్దం చేయకపోయినా, నేను అతనితో సురక్షితంగా ఉన్నాను. మరియు అతను మేల్కొని తుఫానును నిశ్శబ్దం చేస్తే, అతను బహుశా ఇలా అంటాడు: “నీకు ఎందుకు భయం? నీకు ఇంకా విశ్వాసం లేదా?”.

ప్రార్ధన: ప్రభువా! సృష్టిని, వాతావరణాన్ని మీరు నియంత్రించగలరు. అన్నిటిని క్రమపద్ధతిలో ఉండేలా చేసేమీరు, అవి వాటి క్రమమును తప్పినప్పుడు మీరు చెప్పగానే నియంత్రంలోనికి, క్రమపద్దతి లోనికి వస్తున్నాయి. నా జీవితములో కొన్నీ సార్లు క్రమము తప్పినపుడు నన్ను క్షమించి, మీరు ఇష్టమైన వానిగా జీవించేలా చేయండి. ఎటువంటి పరిస్థితులలో కూడా మీరు నా జీవితం ఉన్నారు అని తెలుసుకొని, భయపడకుండ జీవించేల చేయండి. ఆమెన్. 

బ్ర. గుడిపూడి పవన్  

4, జనవరి 2025, శనివారం

The Feast of Epiphany

The Feast of Epiphany 
క్రీస్తు సాక్షాత్కార పండుగ
యెషయా 60:1-6,ఎఫేసీ3:2-3, మత్తయి 2:1-12

ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు జ్ఞానులపండుగను కొనియాడుచున్నది. ఈ పండుగను క్రీస్తు సాక్షాత్కార పండుగను కూడా పిలుస్తారు. సాక్షాత్కారం అనగ ఎరుకపరచుకొనుట. దేవుడు మొట్టమొదటిగా సారిగా తన్ను తాను అన్యులకు ఎరుకపరచుకొనుట. క్రీస్తు సాక్షాత్కార పండుగ ద్వారా మానవ లోకంలో దైవ సాక్షాత్కారం జరిగింది. 
 దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి తెరచాటు తొలగిపోయి ఇద్దరు ఒకే దగ్గర ఉంటున్నారు. ఈ యొక్క పండుగను మూడు విధాలుగా పిలుస్తుంటారు; 
1. ముగ్గురు రాజుల పండుగని 
2. విశ్వాసుల పండుగని 
3. అన్యుల క్రిస్మస్ పండుగని పిలుస్తారు
ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశము నుండి బయలుదేరి బెత్లహేమునకు చేరి దివ్య బాల యేసును దర్శించుకున్నారు. అందుకు వారు దూర ప్రాంతం నుండి ప్రయాణం చేశారు. వారు అన్యులైనప్పటికిని ప్రభువుని ఆరాధించుటకు సుదీర్ఘ ప్రయాణం చేసి బెత్లహేము చేరుకున్నారు. ఎవరు ఈ ముగ్గురు జ్ఞానులు పేర్లు ఈ విధంగా ఉన్నాయి 
1. కాస్పర్ (అరేబియా)-సాంబ్రాణిని సమర్పించారు.
2.మెల్కియోర్(ఇరాక్)-బంగారమును సమర్పించారు.
3. బల్తజార్(పర్షియా)- పరిమళ ద్రవ్యమును సమర్పించారు.
ఈ ముగ్గురు రాజులు సమర్పించినటువంటి కానుకలు ఏసుప్రభు యొక్క దైవత్వమునకు సూచనగా ఉన్నవి. 
బంగారము ఏసుప్రభు యొక్క రాజత్వమునకు గురుతుగా ఉన్నది. సాధారణంగా మనము ఎవరినైనా చూడటానికి వెళ్లేటప్పుడు వారికోసం ఏదో వస్తువులను కానీ, ఫలాలు కానీ తీసుకుని వెళుతుంటాం జ్ఞానులు కూడా ప్రభువు యొక్క జీవితమునకు సంబంధించిన  కొన్ని విలువైనటువంటి కానుకలు తీసుకొచ్చారు 
- మొదటి కానుక బంగారం. ఈ బంగారము ఏసుప్రభు యొక్క పరిశుద్ధతకు సూచనగా కూడా ఉంది. ఏసుప్రభు పరిశుద్ధుడని ఒక జ్ఞాని గ్రహించి ఆయనకు సమర్పించుటకు ఈ యొక్క బంగారము తీసుకుని వచ్చారు. ప్రభువు యొక్క దర్శనం కలగాలంటే మనకు కూడా పరిశుద్ధ మనస్సుతో ఆయన చెంతకు రావాలి.
- సాంబ్రాణి సువాసనకు గుర్తు ఈ యొక్క సాంబ్రాణిని ధూపం వేయుటకు వినియోగిస్తారు. ఏసుప్రభువు నిత్య యాజకుడు. యాజకుడు దేవాలయంలో ధూపం వేసి దేవునికి బలులు ప్రార్థనలు సమర్పిస్తారు కావున క్రీస్తు ప్రభువు సమర్పించే బలిని సూచించుట కొరకై ఈ యొక్క సాంబ్రాణిని సమర్పించారు.
- మూడవ కానుక పరిమళ ద్రవ్యం ఇది ఏసుప్రభువు యొక్క మరణమును సూచిస్తూ ఉంది. పూర్వకాలం యూదులు మరణించినప్పుడు వారి యొక్క దేహమును పరిమళ ద్రవ్యము పోసి భద్రపరిచేవారు ఏసుప్రభువు యొక్క మరణము ఏ విధంగా ఉండబోతుందో ముందుగానే గ్రహించి ఆయన యొక్క మరణమును సూచించుట కొరకై దైవ ప్రణాళిక ప్రకారము ఈ యొక్క పరిమళ ద్రవ్యమును సమర్పించారు. యొక్క పరిమళ ద్రవ్యమును చాలా విధాలుగా వినియోగిస్తారు; వస్త్రాలకు, శరీరంకు అలాగే మృతదేహాలకు. పరిమళ ద్రవ్యమును ముక్కు రంధ్రంలో ఉంచిన ఆ యొక్క మృతదేహం కొద్ది కాలం వరకు నశించకుండా అలాగే భద్రంగా ఉంటుంది.
ఈయొక్క ముగ్గురు జ్ఞానులలో మనం గ్రహించవలసిన కొన్ని అంశాలు 
1. జ్ఞానులలో గాఢమైన కోరిక ఉంది- లోకాలనేలే రాజును చూడాలనేటటువంటి గాఢమైనటువంటి కోరిక వారిలో ఉంది, ఆయన చూడాలని, తాకాలని, కానుకలు సమర్పించాలనే కోరిక వారిలో ఉంది
2. చీకటి నుండి వెలుగుకు ప్రయాణం. జ్ఞానులు యొక్క ప్రయాణం చీకటిలో సాగింది ఎందుకనగా కేవలం ఒక నక్షత్రమును ఆధారంగా చేసుకుని వారు బాల యేసు ఉన్న చోటును వెదికారు. మన జీవితాలు కూడా చీకటి నుండి వెలుగుకు సాగాలి. చీకటిలో ఉన్నప్పటికీ అవి వెలుగు వైపు వెళ్లాలి. కేవలము విశ్వాసము ద్వారానే నక్షత్రంను విశ్వసించి దేవుని యొక్క నక్షత్రమని తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు.
3. కానుకలు సమర్పించారు. ఏసుప్రభు యొక్క గొప్పతనమును గ్రహించి  ప్రభువునకు విలువైన కానుకలు సమర్పించారు. 
4. పాత మార్గమును విడిచిపెట్టి కొత్త మార్గము అనుసరించారు. 
5. దేవుని యొక్క మాటలకు విధేయత చూపారు 
6. దివ్య బాల యేసు నందు సాష్టాంగ పడి ప్రభువుని ఆరాధించి తమ యొక్క వినయమును వ్యక్తపరిచారు. 
ఈ విధంగా మనందరం కూడా ఈ యొక్క ముగ్గురు జ్ఞానుల నుండి నేర్చుకోవలసినటువంటి అంశాలు ఇంకెన్నో ఉన్నాయి కావున వారిని ఆదర్శంగా తీసుకుని ప్రభువుని దర్శించుకుని ఆయన యొక్క అనుభూతిని పొందుతూ జీవించటానికి ముగ్గురు జ్ఞానులు వలే ప్రతిరోజు ప్రయత్నిస్తూ చీకటి నుండి వెలుగు అయిన దేవుని చెంతకు చేరాలి. 
Fr. Bala Yesu OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...