అనుదిన దైవ ధ్యానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనుదిన దైవ ధ్యానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, మే 2025, ఆదివారం

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29 

మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్లలేదనియు, శిష్యులు మాత్రమే వెళ్ళుటకు చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలముచెంతకు తిబెరియానుండి కొన్ని పడవలువచ్చెను. అక్కడ యేసుగాని, శిష్యులుగాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు" అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను వేరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు, దేవుడు పంపినవానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది"  అని చెప్పెను. 

ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువును అన్వేషించడం మరియు ఎటువంటి పరిస్థితులలో మనం యేసు ప్రభువును అన్వేషిస్తున్నాము , ఎప్పుడు ఆయనను అన్వేశించాలి , శాశ్వతమైనది ఏమిటి అని తెలుసుకొని దాని కోసమై అన్వేషించాలి అని సువిశేషం వివరిస్తుంది. 

దేవుని కోసం వెదకుట 

ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువును వెదకుచు అనేక మంది వస్తున్నారు. వారు ఎందుకు యేసు ప్రభువును అన్వేషిస్తున్నారు ఆంటే అంతకు ముందు రోజు ప్రభువు వారి ఆకలిని తీర్చారు. కేవలం ఐదు రొట్టెలతో 5000 మందికి ఆహారమును ఇచ్చాడు. ఇతనిని అనుసరిస్తే మాకు కావలసిన ఆహరం దొరుకుతుంది అని వారు ఆయన కోసం వెతుకుచున్నారు. అంతకు ముందు వారిలో కొంతమంది వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులను చేసాడు. ఇతనిని అనుసరిస్తే మాకు ఎటువంటి అనారోగ్యం ఉండదు అని ఆయన కోసం వెదకుచుండవచ్చు. యేసు ప్రభువు చెప్పే మాటలు ఎలా సాధ్యం అని తెలుసుకొనుటకు, ఆయనను అడుగుటకు వారిలో ఉన్న కొన్ని సందేహాలు తీర్చుకొనుటకు ప్రభువును వెదుకుచుండవచ్చు.  ప్రభువు దేవాలయములో ఉన్న వ్యాపారులను పంపిచివేస్తున్నారు  కనుక అనేక మంది దేవుని ఆలయంలోవెళ్ళుటకు ఆవకాశం ఇచ్చాడు కనుక ఇంకా వారి అవసరాలను చెప్పుకొనుటకు ప్రభువును వెదకుచు ఉండవచ్చు. ఇతను రాజు అయితే మాకు అన్ని సమకూరుతాయి అని ప్రభువును వెదకుచు ఉండవచ్చు.  అందుకే ప్రభువు వారితో అంటున్నారు  "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు" అని అంటే మనం ప్రభువును వెదకవలసినది, అద్భుతాలు చూడాలనో, ఆహారం కోసమో కాదు. ఆయన అంతకంటే చాలా గొప్పవి ఇచ్చేటువంటి ప్రభువు. ప్రభువు తానె జీవ జలము అనే చెబుతున్నాడు. నేను ఇచ్చే జలమును త్రాగితే మరల దప్పిక కలుగదు అని చెబుతున్నాడు. నేను జీవాహారము అని చెబుతున్నాడు. నన్ను భుజించువాడు ఎన్నటిని మరణింపడు అని చెబుతున్నాడు. ప్రభువు మనకు శాశ్వతమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, వాటిని ఎలా పొందాలో అన్వేషించమంటున్నాడు, వాని కోసము పనిచేయమంటున్నాడు. దేవున్ని వెదకడం అంటే నిత్య జీవమును వెదకటం. అందుకే ప్రభువు చెబుతున్నాడు నేనే జీవమును అని. 

శాశ్వతమైనది- అశాశ్వతమైనది

ఇక్కడ యేసు ప్రభువు తనకోసం వచ్చిన వారితో "అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు." అని చెబుతున్నాడు.  యేసు ప్రభువు తన అనుచరులకు ఈలోక విషయములు అశాశ్వతమైనవి అని, శారీరక విషయాలు, అవసరాలు, సంపదలు  అశాశ్వతమైనవి అని చెబుతున్నాడు. అందుకే ఈలోక సంపదలు కాక పరలోక సంపదలు కూడపెట్టుకోమని చెబుతారు. "ఈలోక సంపదలు కూడపెట్టుకొనవలదు. చెదపురుగులు, త్రుప్పు వానిని తినివేయును." "నీ సంపదలు పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వానిని చెదపురుగులు, త్రుప్పు తినివేయవు." ఈనాటి సువిశేషంలో మాత్రం ప్రభువు మనలను శాశ్వత భోజనముకై శ్రమించమని చెబుతున్నారు. నిజానికి చాలా మంది పేరు ప్రఖ్యాతలు కోసం శ్రమిస్తుంటారు. అవికూడా శాశ్వతం కాదు. అప్పుడు ఏమిటి శాశ్వతమైనవి ఏమిటి అంటే  పరలోక రాజ్యము, నిత్య జీవము ఇవి మనకు శాశ్వతమైనవి. 

శాశ్వతమైనవి అయితే అవి మనకు ఎవరు ఇస్తారు 

యేసు ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారితో ఆయన "మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును." అని చెబుతున్నాడు. ప్రభువు మాత్రమే దానిని ప్రసాదించగలరు. ఎందుకంటే ఆయనకు మాత్రమే అది ప్రసాదించే అధికారం ఉన్నది. శాశ్వతమైనవి దైవికమైనవని వారికి అర్ధం అయ్యింది. కనుక వారు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయాలని అడుగుతున్నారు. అందుకు యేసు ప్రభువు దేవుడు పంపిన వానిని విశ్వసించండి అదే దేవుడు మీ నుండి కోరుకుంటున్నారు అని చెబుతున్నాడు. నిత్య జీవం కావాలంటే లేక శాశ్వతమైన ఆహారం కావాలంటే చేయవలసినది యేసు ప్రభువును విశ్వసించడం. యేసు ప్రభువును విశ్వసించడం అంటే ఆయన చెప్పినట్లు మారుమనస్సు పొంది,  ఆయన ఆజ్ఞలను పాటించడం. అప్పుడు మనం ఆ నిత్య జీవానికి అర్హులము అవుతాము. 

ప్రార్ధన: ప్రభువా!  మా జీవితాలలో అనేక విషయాలలో మీ సహకారం కోసం మిమ్ములను ఆశ్రయిస్తున్నాము. అనేక సార్లు మేము మిమ్ములను మా భౌతిక అవసరములనే కోరుకుంటున్నాము. మేము ఏమి కోరుకోవాలో నేర్పించండి. మీరు చెప్పినట్లుగా శాశ్వతమైన వాటిని వెదకుచు, వాని కొరకు పాటుపడేలా మమ్ము మార్చండి. నిత్య జీవితం మీద ఆశ కలిగి, మిమ్ములను విశ్వసించి, మీ ఆజ్ఞలకు అనుకూలంగా జీవించేలా మమ్ము మార్చండి. ఆమెన్ 


30, ఏప్రిల్ 2025, బుధవారం

దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు?

 దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు? 

యోహాను 3: 16-21 

దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు  ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై  అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన, దేవుని ఏకైక  కుమారుని నామమున అతడు విశ్వాసమునుంచలేదు. ఆ తీర్పు ఏమన, లోకమున వెలుగు అవతరించినది. కాని మనుష్యులు దుష్క్రియలు చేయుచు, వెలుగు కంటె చీకటినే ఎక్కువగ ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు. కాని, సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగ చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును" అని సమాధానమిచ్చెను. 

ఈ వాక్యాలు దేవుడు ఎంతగా ఈ లోకమును ప్రేమించినది, అదేవిధంగా మానవుడు నాశనము చెందకుండా తన కుమారుణ్ణి పంపిన విషయం, ఆ కుమారుణ్ణి విస్వసించుట ద్వారా వారు నిత్యజీవము పొందుతారని, ప్రభువు లోకమునకు వెలుగుగా వచ్చారని దుష్క్రియలు చేసేవారు, ఆ వెలుగు దగ్గరకు వచ్చుటకు ఇష్టపడక అవి బయట పడతాయి చీకటిలోనే ఉన్నాడు. సత్యవర్తనుడు వెలుగును సమీపిస్తున్నాడు. జీవితాన్ని మార్చుకుంటున్నాడు అని తెలియజేస్తున్నాయి.  

దైవ ప్రేమ 

దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని  రక్షించడానికి తన కుమారుడిని ఈలోకానికి పంపాడు. కుమారుడు తన తండ్రి సంకల్పమైన లోక రక్షణము నెరవేర్చడానికి మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు.  దేవుని కుమారుడు తన తండ్రి చిత్తాన్ని పూర్తి చేసి అంత సమాప్తం అయినది అని చెప్పాడు. ఆయనను కలుసుకున్న, వినిన , చూసిన ప్రతివాడు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణను సిమియోను  ప్రవక్త వలే చూసారు. ఆయనను విశ్వసించిన వారు రక్షణ పొందుతున్నారు. 

దేవుడు లోకాన్ని ఖండించడానికి  తన కుమారున్ని పంపలేదు 

దేవుడ సృష్టి ఆరంభం నుండి మానవున్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నడు విడనాడలేదు. దేవుడు ఎప్పుడు పాపి మరణించాలని, లేక నాశనం కావాలని కోరుకొనలేదు. ఆయన మానవుణ్ణి సన్మార్గంలో పెట్టదలచి క్రమ పద్దతిలో పెట్టగ దేవుడు శిక్షించినట్లుగా అనుకున్నాడు. దేవున్ని ఒక కఠిన యజమానిగా చూసాడు కాని దేవుని ప్రేమను,  తండ్రి వాత్స్యాల్యాన్ని అర్ధం చేసుకోలేదు.  అనేక సార్లు దేవుడు తన రాయబారులను పంపాడు. కాని మానవుడు దేవుడు పంపిన వారిని లెక్క చేయలేదు. తరువాత తన కుమారుణ్ణి పంపుతున్నారు. ఈ లోకాన్ని నాశనం చేయక తన కుమారుని జీవితం ద్వారా, మనకు ఎలా జీవించాలో తెలియజేస్తున్నాడు, తన మరణం ద్వారా మనకు పాపములను క్షమిస్తున్నారు. తన మీద విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం పొందే అనుగ్రహం ఇస్తున్నాడు. 

విశ్వాసం యొక్క ప్రాముఖ్యత 

రక్షణ యేసు ప్రభువును విశ్వసించడం వలన వస్తుంది. యోహాను ఈ విషయాన్ని తన సువిశేషంలో చాలా సార్లు లిఖించడం జరిగింది. ప్రతి అధ్యాయంలో విశ్వాసం గురించి చెబుతూ, సువిశేష  ఆరంభంలో, మధ్యలో మరియు చివరిలో యేసు ప్రభువును విశ్వసించడం వలన నిత్య జీవం వస్తుంది అని ప్రకటిస్తున్నారు. క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. ప్రభువు కొన్ని సందర్భాలలో ఇది నీవు విశ్వసిస్తున్నావా? అని అడుగుతున్నారు. వారు స్వస్తత పొందిన తరువాత మీ విశ్వాసమే మిమ్ములను స్వస్థపరిచింది అని అంటున్నారు.  ప్రభువుని యందు మనకు విశ్వాసము ఉండటం వలన నిత్యజీవమే కాక ఈ లోకములో అనేక విషయాల్లో విజయాన్ని పొందుతాము.  

వెలుగు- చీకటి  

యేసు ప్రభువు నేనే లోకమునకు వెలుగును అని ప్రకటించాడు. యోహాను సువిశేషంలో మొదటి అధ్యాయంలో ఆయన ఈ లోకమునకు వెలుగాయను అని వింటాము. ప్రభువు దగ్గరకు నీకొదేము చీకటి వేళలో వస్తున్నాడు. అతను చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు.  కాని చీకట్లో ఉన్నవారు వెలుగు దగ్గరకు రావడానికి ఇష్టపడటలేదు. వెలుగు దగ్గరకు వస్తే వారి ఎటువంటి వారు అనేది, లేక వారి జీవితం అందరికి తెలిసిపోతుంది అని భయపడేవారు. కాని ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే వారు చేసిన తప్పులు ఏమి అందరికి తెలుస్తాయి అని భయపడనవసరం లేదు. ప్రభువు దగ్గరకు వచ్చే  సమయంలో ఆ వెలుగులో మనలో వున్న చేడు, మలినం లేక తొలగిపోతుంది. ప్రభువు నీకొదేము వచ్చినపుడు తాను చీకటిలో వచ్చిన, ప్రభువు దగ్గర ఉండటం వలన తనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడు. కాని ఎవరు అయితే చెడు పనులు చేస్తున్నారో, ప్రభువు దగ్గరకు రావడానికి ఇష్టపడటం లేదో వారు చెడునే ప్రేమిస్తున్నారు. వారు మారటానికి ఇష్టపడటం లేదు. వారి పనులు ఎవరికీ తెలియకూడదు అని  వారు వెలుగును సమీపించడం లేదు. ప్రభువు దగ్గరకు రాకపోతే, మనలో ఉన్న ఆ చెడు ఎప్పటికి వెళ్లిపోదు. దాని ద్వారా ప్రభువు మనకు ఇచ్చే ఆ రక్షణ పొందలేము. సత్య వర్తనము కలిగి జీవించడము అనేది చాలా ముఖ్యము. అప్పుడు మనం చేసే పనులు దేవునికి ఇష్టమవుతాయి. 

ప్రార్ధన: ప్రభువా ! మీరు లోకమును ఎంతగానో ప్రేమించి మీ ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకమునకు దానిని రక్షించుటకు పంపారు. ఆయనను విశ్వసించిన వారంతా నిత్యజీవం పొందుటకు మీరు అటుల చేశారు. ప్రభువా మిమ్ములను మీ కుమారుణ్ణి మేము విశ్వసిస్తున్నాము. కొన్ని సార్లు వెలుగైన మీ కుమారుని దగ్గరకు రావడానికి మేము భయబడ్డాము. ఆ వెలుగులో నా పాపము ఎక్కడ బయటపడుతుందో అని సందేహించాము. కాని ప్రభువా! ఆ వెలుగు మా లోని పాపమును దహించివేసి మమ్ములను పరిశుద్దులనుగా చేస్తుంది అని మరిచిపోయాము. అటువంటి సందర్భంలో మమ్ములను క్షమించండి. మేము మీ  దగ్గరకు వచ్చి ఎల్లప్పుడు వద్ద ఉంటూ, మిమ్ము విశ్వసించి మీరు ఏర్పాటు చేసిన రక్షణ పొందేలా మమ్ము దీవించండి .ఆమెన్ 

28, ఏప్రిల్ 2025, సోమవారం

నూతనంగా జన్మించుట

 యోహాను 3: 7-15

నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పిన్నందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను. "ఇది ఎటుల సాధ్యమగును?" అని నికోదేము అడిగెను. అందులకు యేసు: "నీవు యిస్రాయేలు బోధకుడవైయుండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన మీరు నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల ఎట్లు నమ్మెదరు. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. "మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడును ఎత్తబడవలెను. 

నూతన జీవితం - క్రీస్తు ఎత్తబడటం 

ఈ సువిశేష భాగంలో నూతన జీవితం ఎలా మొదలవుతుంది, దానికి ఏమి చేయాలి అని మరియు ఏవిధంగా క్రీస్తు మోషే కంచు సర్పమును ఎత్తినట్లు ఎత్తబడతాడు అనే విషయాలను మనము చూస్తాము. యేసు ప్రభువు నికోదేముకు ఎలా ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలి అని చెబుతున్నాడు. అటులనే ఈ నూతన జీవితం పొందేవాడు నిత్యజీవానికి అర్హుడు అవుతాడు, ప్రభువు అందుకుగాను వారి కొరకై సిలువ మీదకు ఎత్తబడతాడు, ప్రభువుని సిలువ మరణం మానవునికి ఈ నిత్య జీవమును ఇచ్చుటకే అనే విషయం స్పష్టము అవుతుంది. 

ఎందుకు మరల జన్మించాలి ? 

యేసు ప్రభువు  ఈ లోకంలో ఉండగా దేవుని రాజ్యం యొక్క గొప్ప తనాన్ని అందరికి ప్రకటించారు. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఒక వ్యక్తి దేనినైన కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాడు కాని ఆ రాజ్యం కావాలనికోరుకుంటాడు. దేవుని రాజ్యం అంటే అంతటి గొప్పది కనుక యేసు ప్రభువు చెప్పిన అనేక ఉపమానాలలో దాని విలువ తెలిసిన  వ్యక్తులు,  ఏమి కోల్పోయిన దానిని పొందుటకు ప్రయత్నిస్తారు. దేవుని  రాజ్యంలో ప్రవేశించడానికి ప్రధానమైన అర్హత నూతన జన్మను పొందాలి అని ప్రభువు చెబుతున్నారు. అందుకే ఈ నూతన జన్మ ముఖ్యమైనది. మానవుడు తన సొంత బలం ద్వారా ఈ నూతన జన్మను పొందలేడు, జీవించలేడు. దేవుని తోడ్పాటు ఎంతగానో అవసరం ఉంటుంది. ఇది పూర్తిగా హృదయ పరివర్తనతోనే మొదలవుతుంది, అందుకే ప్రభువు తన పరిచర్యలు మొదట హృదయ పరివర్తన పొందాలి అని చెబుతున్నారు. 

ఆత్మతో జన్మించువారు 

ఆత్మతో జన్మించువారిని ప్రభువు గాలితో పోల్చుతున్నారు. గాలి  ఎక్కడ నుండి వస్తుందో, ఎక్కడకు వెళుతుందో మనకు తెలియదు, అటులనే ఆత్మతో జన్మించువారు, లేక నూతన జన్మ పొందిన వారు, మారు మనసు పొందినవారు ఎలా ఉంటారో మనము చూస్తాము. వారి జీవితాల్లో ఉన్న మార్పు, వారి పరివర్తన మనకు కనపడుతునే ఉంటుంది, అంటే మనం ఆత్మను చూడము కానీ వారి జీవితంలో వచ్చే మార్పును బట్టి వారు నూతన జీవితం జీవిస్తున్నారు అని తెలుసుకొనవచ్చు. మగ్దలా మరియ, పౌలు వారి జీవితాలలో వచ్చిన మార్పును, జక్కయ్య జీవితంలో వచ్చిన మార్పును మనం చూసినప్పుడు వారు, హృదయ పరివర్తన చెందారు అని , నూతన జీవితం వారు జీవిస్తున్నారు అని మనము తెలుసుకుంటాము. ఆత్మ ద్వారా జన్మించిన వారి జీవితాలలో కూడా ఈ మార్పును మనం చూడవచ్చు. ఆత్మ ఫలాలు వారి జీవితాల్లో సుష్పష్టంగా కనిపిస్తాయి.  వారు పాపమునకు బానిసలుగా కాక స్వతంత్రంగా జీవిస్తారు. 

యేసు ప్రభువు ఎదుట నికోదేము సందేహంను వేలిబుచ్చుట 

యేసు ప్రభువు ఆత్మ వలన జన్మించుటకు గురించి చెప్పిన తరువాత నీకొదేము ఇది ఎలా సాధ్యము అని అడుగుతున్నాడు. ప్రభువు అతనికి అది క్రొత్త విషయము ఏమి కాదు అని తెలియజేస్తూనే, నీవు బోధకుడివి కదా! ఈ విషయం తెలియదా అని అడుగుచున్నాడు. పాత నిబంధనలలో కూడా మనం మారు మనస్సు గురించి వింటాము. మరి ఎందుకు వీరు అవి ఏమి తెలియక ఉన్నారు అంటే వారు ఎప్పుడు ఈ లోక విషయాలు, మరియు స్వార్ధ పూరిత ఆలోచనలతో ఉన్నారు. కానుక అనేక దైవ విషయాలు, దైవ జ్ఞానం గురించి అజ్ఞానములో ఉన్నారు. దైవ జ్ఞానము కోసం మనము ఎంతగానో శ్రమించాలి.  ఆయనను వేదకాలి అటువంటి  వారికి ప్రభువు ఆ జ్ఞానమును ఇస్తారు. 

పరలోక విషయాల గురించి యేసు ప్రభువు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఆయన మాత్రమే పరలోకం నుండి వచ్చినవారు. ఆయనే చెప్పేవి మాత్రమే ప్రామాణికం, అటువంటి వాటి గురించి జ్ఞానము కావాలి అంటే ప్రభువుని మాటలను వినాలి. ప్రభువును విశ్వసించాలి, ప్రభువు చెప్పినట్లు చేయాలి. కాని అనేక సార్లు ప్రభువుని మాటలను మనం పెడచెవిన పెట్టి పరలోక జ్ఞానమును పోగొట్టుకుంటున్నాము. నికోదేముతో ప్రభువు అంటున్నారు మేము చూచిన విషయాలను చెప్పిన మీరు నమ్ముటలేదు అని. అంటే మనం కొన్ని సార్లు ఎంతో కరుడుగట్టిన హృదయాలు కలిగిన వారిగా ఉంటున్నాము. ప్రభువు మాత్రమే పరలోకము నుండి వచ్చినవాడు మరియు తిరిగి పరలోకమునకు వెళ్లినవాడు. ఆయనకు పోయిన చోటుకు వెళ్ళుటకు ఆయనను మాత్రమే అనుసరించాలి. 

యేసు ప్రభువు ఎత్తుబడుట 

పాత నిబంధనలో దేవునికి మాటకు ఎదురుతిరిగిన వారు పాము కాటుకు గురయ్యి మరణిస్తుంటే, మోషే దేవునికి మొరపెట్టగా, వారిని  రక్షించుటకు మోషేతో దేవుడు ఒక కంచు సర్పము తయారు చేసి దానిని చూచిన వారు రక్షించబడ్డారు. అటులనే పాపం చేసిన మానవుని రక్షించడానికి ప్రభువు సిలువ మీద మరణించారు. ఇది ప్రభువును విశ్వసించువారు అందరు నిత్య జీవం పొందుటకు ఆయన సిలువ మీద మరణించారు. మనందరికీ  ఆయన నిత్య జీవాన్ని సాధ్యం చేశారు. 

ప్రార్ధన: ప్రభువా! మీరు నికోదేముతో మరల జన్మించుట యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ప్రభువా మీ మాటలు విని అనేక మంది పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుటకు దేనిని కోల్పోవడానికి అయినా సిద్ధపడ్డారు. నేను కూడా నా జీవితాన్ని మార్చుకొని, నూతన హృదయం కలిగి జీవించి, మిమ్ములను అనుసరించి మీరు నా కోసం మరణించి, నాకు సాధ్యం చేసిన ఆ నిత్యజీవాన్ని పొందే అనుగ్రహం చేయండి. ఆమెన్ 

27, ఏప్రిల్ 2025, ఆదివారం

నీటివలన ఆత్మ వలన నూతన జీవం


యోహాను 3:1-8


పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒకరాత్రి యేసు వద్దకు వచ్చి "బోధకుడా! నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏలయన, దేవునితోడు లేనియెడల నీవు చేయుచున్న అద్భుత సూచకక్రియలను ఎవడును చేయలేడు" అని పలికెను. యేసు అందుకు అతనితో, "మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అని పలికెను అందుకు నికోదేము, "వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింపగలడు? అతడు తల్లిగర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా?" అని అడిగెను. అపుడు యేసు,"ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననేతప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరములముగ జన్మించినది శరీరమును, ఆత్మమూలముగ జన్మించినది ఆత్మయునైయున్నది. నీవు మరల జన్మింపవలయునని  నేను  చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను. 

వెలుగు దగ్గరకు వచ్చుట 

  
యేసు ప్రభువు వద్దకు నికోదేము రాత్రి వేళ వస్తున్నాడు. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే నికోదేము ఒక పరిసయ్యుడు, మరియు బోధకుడు. ఒక బోధకుడు మరియు పరిసయ్యుడు అయిన వ్యక్తి యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నారు అంటే బోధకులు మరియు పరిసయ్యులు అతనిని తక్కువ చేసి చూడవచ్చు, లేక ప్రభువుతో మాటలాడి ఆయనను అంగీకరిస్తే ఖచ్చితముగా నికోదేము ఇతర వారితో అవమానింప బడవచ్చు. అందుకే కాబోలు నికోదేము ఎవరి కంట పడకుండ రాత్రి వేళ వచ్చి ఆతనికి ప్రభువు చెప్పేదేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలని వచ్చి ఉండవచ్చు. ఇక్కడ రాత్రి వేళ ప్రభువు దగ్గరకు రావడం అంటే చీకటి నుండి వెలుగు దగ్గరకు రావడం. ప్రభువు అనేక సార్లు నేనే వెలుగు అని చెబుతారు. ఇప్పుడు నికోదేము చీకటిని వదలి వెలుగు దగ్గరకు వచ్చి తనలో ఉన్న అంధకారాన్ని మొత్తంను వెలుగుతో నింపుకొనుటకు అవకాశము వచ్చి నందున దానిని పూర్తిగా వినియోగించుకొంటున్నాడు. తనలో ఉన్న ప్రతి అనుమానాన్ని ప్రభువు ముందు వెల్లడిచేస్తున్నాడు. 

ప్రభువు గొప్పతనాన్ని  ఒప్పుకొనుట 


నికోదేము స్వయంగా బోధకుడు కనుక అతనికి దేవుని గురించి దైవ జ్ఞానము గురించి అవగాహన ఉంది. యేసు ప్రభువు మాటలు విన్నప్పుడు అతనిలో ఉన్న దైవ అన్వేషణ, ప్రభువు వద్ద నుండి ఇంకా  దేవుడిని గురించి తెలుసుకోవాలనే కోరిక ఎక్కువ అయ్యింది. ప్రభువు ఎక్కువగా దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నారు. మానవుడు ఏమి హెచ్చించి అయ్యిన ఆ దైవ రాజ్యం పొందాలనే కోరిక ఎక్కువైంది, మరియు తనలో ఉన్న కొన్ని అనుమానాలు కూడా తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చి బోధకుడా నీకు దేవుని నుండి వచ్చిన వాడివని మాకు తెలుసు, లేనిదే ఈ అద్భుత కార్యములు ఎవరు చేయలేరు అని చెబుతున్నారు. ఎందుకంటే ప్రభువు చేచేసిన అద్భుతాలు సాధారణమయినవి కావు.  ఆయన పకృతి మీద, లోకం మీద జీవరాశుల మీద తన ఆధిపత్యాన్నే కాక ఎలా ఒక దానిని సహజ సిద్ద స్వభావాలు కూడా మార్చ గలిగాడో తెలుసుకున్నాడు. కనుకనే ఎవరు దేవుని నుండి రాకపోతే మీలా చేయజాలరు అని ప్రకటిస్తున్నాడు. 


నీటివలన ఆత్మవలన పుట్టుట 


యేసు ప్రభువును నికోదేము నీవు దేవుని నుండి వచ్చావు అని ప్రకటించిన తరువాత ప్రభువు నీకొదేముతో ఏ విధంగా  దేవుణ్ణి చేరవచ్చు, అతనితో ఉండవచ్చు, అతనిని పొందవచ్చు అనే విషయాన్ని ప్రకటిస్తున్నాడు. అది ఎలా అంటే "మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అని ప్రభువు పలుకుతున్నాడు. దానికి నీకొదేము మరల జన్మించడము అంటే తల్లి గర్భంలోనికి ప్రవేశించి పుట్టడం ఎలా అని అనుకుంటున్నాడు. దానికి ప్రభువు మనిషి మరల జన్మించడం అంటే నీటి వలన ఆత్మ వలన అని చెబుతున్నాడు. నీరు పరిశుద్దతను సూచిస్తుంది. మనిషి తన మలినాన్ని కడుగుకొనవలెను అని చెబుతుంది. ఇది జ్ఞానస్నానమును సూచిస్తుంది. అందుకే ప్రభువు తన శిష్యులతో మీరు వెళ్లి పిత, పుత్ర, పవిత్రాత్మ పేరిట జ్ఞానస్నానము ఇవ్వమని చెబుతున్నారు. ఆత్మ జీవాన్ని ఇస్తుంది, జీవాన్ని నిలుపుతుంది. దేవుని ఆత్మ మాత్రమే మనకు  నూతన జీవితాన్ని ఎప్పుడు పడిపోకుండా ఉంచుతుంది.  

ఆత్మను గుర్తించగలుగుట 


ఆత్మను ప్రభువు గాలితో  పోల్చుతున్నాడు. గాలిని మనం అనుభవించగలము కాని అది ఎక్కడ నుండి వస్తున్నదో, ఎక్కడకు వెళ్తుందో మనకు తెలియదు అటులనే ఆత్మ నుండి పుట్టినవాని జీవితంలో వచ్చిన మార్పును మనము గుర్తించగలం, ఎందుకంటే వారి జీవితం అంతలా మారిపోతుంది. మనము కూడా ప్రభువు చెబుతున్న ఆ దేవుని రాజ్యంలో చేరుటకు, మరల జన్మించుటకు బాప్తిస్మము పొందియున్నాము. నూతన జీవితము జీవించుటకు ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. 

ప్రార్ధన: ప్రభువా ! మీ వద్దకు రావడం అంటే వెలుగు దగ్గరకు రావడమే, జీవం వద్దకు రావడమే, మీజీవితంలో అనేక అంధకార శక్తులు ఉన్నవి వాటి అన్నింటిని వదలి మీ దగ్గరకు రావడానికి, మరియు మీరు చెబుతున్న ఆ దైవ రాజ్యంలో స్థానము పొందుటకు సహాయం చేయండి. నిజమైన సంపదను తెలుసుకొని, దాని కోసం పాటుపడేలా చేయండి. జ్ఞానస్నానం పొందిన మీ అనుచరులుగా జీవించ శక్తిని దయచేయండి. ఆమెన్ 





26, ఏప్రిల్ 2025, శనివారం

యేసు ప్రభువు దర్శనములు

మార్కు 16: 9-15

ఆదివారము ప్రాతఃకాలమున పునరుత్తానుడైన యేసు, తాను ఏడూ దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్లి ఆయనతో  ఉండినవారును, దుఃఖసాగరంలో మునిగియున్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందచేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు, ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్లుచున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు ఇద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై, సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ  నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యముకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: "మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు.   

ఈ వచనాలు యేసు ప్రభువు పునరుత్థానము నిద్ధారణము మరియు శిష్యులకు ఓదార్పును తెలియజేస్తూ, వారు చేయవలనసిన కర్తవ్యము గురించి తెలియజేస్తున్నాయి. ఈ దర్శనములు వారిలో ఉన్న అపనమ్మకమును తీసివేయుటకు ఆయన సువార్తను బోధించుటకు వారిని మరల ప్రభువు ప్రోత్సహిస్తున్నాడు. 

మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను

యేసు ప్రభువు మొదటగా ఒక స్త్రీకి దర్శనము ఇస్తున్నాడు. యూదయ సమాజంలో, మరియు యేసు ప్రభువు కాలములో ఒక స్త్రీకి సమాజంలో అంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు. మరియు ఈ మరియమ్మ నుండి ప్రభువు దయ్యములను వదలకొట్టాడు. ప్రభువు మనకు దర్శనము ఇవ్వడడానికి మన గత జీవితం ఏమిటి? మనకు సమాజం ఇచ్చే ప్రాముఖ్యత ఏమిటి? అనేవి ఏమి ప్రభువు పరిశీలించరు. మనకు ప్రభువు మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగిఉంటే చాలు. ఆయన మనము మరచిపోలేని మేలులను మనకు చేస్తారు. అంతేకాక మనలను ప్రత్యేక వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. అనేక మందికి ఆదర్శవంతులుగా తయారుచేస్తారు. ఈ మరియమ్మ అనేక బంధనాలనుండి విముక్తి పొందింది. ప్రభువు మాటలకు అణువుగా మనం ఉంటే మన జీవితం కూడా ఎటువంటి లోక శక్తులకు బానిసలు కాకుండా ఎల్లప్పుడు స్వతంత్రులుగా జీవించగలుగుతాం. 

ప్రభువు దర్శనం గురించి నమ్మక పోవుట 

దుఃఖంలో ఉన్న శిష్యులకు ప్రభువు ఓదార్పు ఇవ్వడానికి ఎంతగానో వారికి అనేక పర్యాయాలు కనబడుతున్నప్పటికీ శిష్యులు నమ్మలేదు. వారికి నమ్మకము కలుగక పోవడానికి కారణం పకృతి విరుద్ధంగా ఉన్న మరణం నుండి లేవడం అనేది నమ్మదగినదిగ లేకపోవడం. అంతేకాక ప్రభువే ఇటువంటివి చేశారు. ఆయనే మరణించిన తరువాత ఎవరు అలా చేయగలరు? అనేక ప్రశ్నలు వారిలో ఉన్నవి. వీరిలో ఉన్న ఈ భయాలు మరియు యేసు ప్రభువు చెప్పిన మాటలు నేను మూడవ రోజున తిరిగి లేస్తాను అని చెప్పిన మాటలు ఆసరాగా తీసుకొని ఎవరైన పుకార్లు పుట్టిస్తున్నారు అనే అనుమానాలు ఇవాన్నీ శిష్యులలో ఉండవచ్చు అందుకే వారు అన్నింటిని నమ్మలేని పరిస్థితుల్లో లేరు. 

 ఇద్దరు శిష్యులకు దర్శనం 

యేసు ప్రభువు గ్రామమునకు వెళుతున్న ఇద్దరు శిష్యులకు దర్శనం ఇస్తున్నారు. లూకా సువిశేషంలో ఎమ్మావు వెళుతున్న ఇద్దరు శిష్యులు అని మనం చదువుతాం. ప్రభువు వారితో మాట్లాడుతున్న సమయంలో వారు ప్రభువును గుర్తించలేకపోయారు. తరువాత రొట్టెను విరిచి ఇస్తున్నప్పుడు వారు ప్రభువును గుర్తించారు. అనేక సార్లు ప్రభువు మనతో ఉన్నప్పుడు మనము ప్రభువును గుర్తించలేపోతున్నాము కారణము కేవలం ప్రభువుకు సంబంధించిన విషయాలలో మనం ప్రేక్షకులుగా మాత్రమే ఉంటున్నాము. ప్రభువుతో వ్యక్తిగతంగా సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఇద్దరు శిష్యులు కూడా ప్రభువు వారికి దర్శనము ఇచ్చిన విషయం గురించి ఇతర శిష్యులకు చెప్పినప్పుడు వారు నమ్మలేదు.  శిష్యులు ఏక్కువ నమ్మనది వారికి స్వయంగా  ప్రభువు ఇచ్చిన దర్శనమును. వారు స్వయనుభవంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రభువు మాత్రము మనకు ఇతరుల సాక్ష్యంను కూడా నమ్మమని చెబుతున్నారు. 

ప్రభువుని సందేశం 

యేసు ప్రభువు పదకొండు మంది శిష్యులకు దర్శనము ఇచ్చి వారి అవిశ్వాసమును ఖండించారు. యేసు ప్రభువు వారి హృదయ కాఠిన్యము, అవిశ్వాసమును  గద్దించారు. హృదయ కాఠిన్యము చాల మందిలో పెరుగుతున్నది. హృదయ కాఠిన్యము పెరిగినప్పుడు మనము దేనికి స్పందించము. ఇతరుల అవసరములలో ఉన్న , కష్టాలలో ఉన్నా నాకు ఎందుకులే? అనే ధోరణిలో ఉంటాము.  క్రీస్తు అనుచరులలో ఉండకూడనిది ఈ హృదయ కాఠిన్యము.  అందుకే దేవుడు యిస్రాయేలుకు వారి రాతి గుండెను తీసి మాంసంతో కూడిన హృదయము వారికి ఇస్తాను అని చెప్పినది. క్రైస్తవుల హృదయం ఎప్పుడు ప్రభువు వలె ఇతరుల జీవితాలు చూసినప్పుడు వారి సమస్యలు , లేక సౌఖ్యాల అనుకూలంగా స్పందించ కలగాలి. ప్రభువు వారితో సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి అని చెబుతున్నాడు. శిష్యులకు ఉన్న ప్రధాన లక్ష్యం సువార్తను ప్రకటించడం. ఎందుకు ఇది ప్రధానమైన లక్ష్యం అంటే ప్రభువు ఇచ్చే రక్షణ అందరికి, కేవలం ఒక జాతి, ప్రాంతం, వర్గమునకు మాత్రమే చెందినది కాదు. ఆ విషయం ఈ శిష్యుల ప్రపంచమంతట తిరిగి అందరికి తెలియజేస్తూ, వారు సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యం ఇతరుల అనుభవాలు మాత్రమే కాక వారు కూడా స్వయంగా ప్రభువును పునరుత్థానం అయిన తరువాత చూసారు, విన్నారు మరియు ఆయన నుండి వారి కర్తవ్యము ఏమిటో తెలుసుకున్నారు. వీరు మాత్రమే కాక ప్రభువును తెలుసుకున్న వారు అందరు ఈ కర్తవ్యము కలిగివున్నారు. వారు అందరు ఆయనను ప్రకటించవలసి బాధ్యత ఉంది. 

ప్రార్థన : ప్రభువా! మీరు ఈ లోకమున ఉండగా అనేకమందిని   పాపము నుండి సాతాను బంధనముల నుండి  విముక్తిని కలిగించారు. అదేవిధంగా వారిని స్వతంత్రులనుచేశారు. మీరు చూపించిన కరుణకు స్పందిస్తూ,  మంచి జీవితం జీవించిన వారిని మీరు అనాధారం చేయలేదు. మగ్ధలా మరియమ్మకు దర్శనము ఇవ్వడం, శిష్యులకు దర్శనం ఇవ్వడం, ఇవాన్నీ మీరు మమ్ములను  విడిచిపెట్టడం లేదు అని తెలుపుతున్న, మిమ్ములను నమ్మడంలో, విశ్వసించడంలో  అనేకసార్లు విఫలం చెందుతున్నాం. దానికి మాకు ఉన్న అనేక భయాలు కారణం అయ్యివుండవచ్చు. ప్రభువా! మీరు మాతో ఎప్పుడు ఉంటారు అనే విషయాన్ని తెలుసుకొని,  మీరు ప్రసాధించిన రక్షణ అందరికి అని, మీ సువార్తను ప్రకటించే భాద్యత, మాకు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు, మీ సువార్తను ఇతరులకు ప్రకటించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ఆమెన్. 

19, ఫిబ్రవరి 2025, బుధవారం

మార్కు 9:41-50

 February 27

సిరా 5:1-8

మార్కు 9:41-50

మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవ్వడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగచెప్పుచున్నాను" అనెను. "నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైన పాపి అగుటకు కారకుడగుటకంటె, అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక్క చేతితో నిత్యజీవము పొందుట మేలు. నీ కాలు నీకు పాపకారణమైనచో, దానిని నరికి పారవేయుము. రెండుకాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కనులు నీకుపాప కారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండుకన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కాని అది తన ఉప్పదనమును కోల్పోయిన, తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున, మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు  సమాధానముతో ఉండుడు" అనెను.  

క్రీస్తు సంబంధీకులు : ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు మిమ్ములను క్రీస్తు సంబంధీకులుగా గుర్తించి మీకు ఎవరు చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును పొందును అని అంటున్నారు. ఎవరు ఈ  క్రీస్తు సంబంధికులు అంటే సువిశేష భాగంలో యేసు ప్రభువుని అనుచరులు అని లేక శిష్యులు అని తెలుస్తుంది. ఇది కేవలం అప్పటి శిష్యులు లేక అనుచరులేనా  అంటే కాదు ఎందుకంటే యేసు ప్రభువుకు చెందిన వారు ఎవరో మనము ఈ అధ్యాయములోనే చూస్తాము. అంతకు ముందు ప్రభువు పేరిట ఒకడు దయ్యములను వదలకొడుతున్నప్పుడు శిష్యులు వాడిని వారించిన పిదప ఆయనకు ఆ విషయం చెప్పగా ప్రభువు అతనిని తనకి చెందిన వానిగానే చెబుతున్నాడు. తరువాత కూడా మీరు వెళ్లి లోకమున ఉన్న వారిని నా అనుచరులుగా చేయమని ప్రభువు చెబుతున్నాడు. ఎవరు అయితె ప్రభువు మాట ప్రకారం జీవిస్తారో వారు క్రీస్తు అనుచరులు, వారే క్రీస్తు సంబంధీకులు. అందుకే ప్రభువు నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడె నా సోదరుడు సోదరి, తల్లి అని ప్రకటించారు. ఈరోజు మనం ఆయన సంబంధీకులము కావాలంటే ఆయన మాటలను అనుసరించాలి. ఈ విధంగా జీవించిన క్రీస్తు సంబంధీకులను గౌరవించిన వారికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే వారి ద్వారా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఇది వారి మాటల ద్వారా వారి ప్రేమ పూర్వక జీవితం ద్వారా జరుగుతుంది. 

పాపము చేసిన వారు నరకానికి వెళుతారు, నరకములో ఒక వ్యక్తి  చాలా ఘోరమైన బాధలకు గురవుతాడు.  అది నిత్యము బాధలతో ఉండే స్థితి.  నరకము అనేది దేవున్ని  తిరస్కరించి, ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తు  పశ్చాత్తాప పడకుండా పాపములోనే  మరణించేవారు పొందే స్థితి.  నరకంలోఎల్లప్పుడు బాధ అనే స్థితి మాత్రమే ఉంటుంది. ఊరట కోసం ఎంత ప్రయత్నించిన అది అది వారికి అందదు. అందుకే ప్రభువు ఈ స్థితి మనకు రాకూడదు అని కోరుకుంటున్నారు. అందుకే మనిషిని నరకానికి పాత్రులుగా చేసే ఎటువంటి దానిని కూడా మన దగ్గర ఉండకూడదు అని కోరుకుంటున్నారు. 

ప్రభువు మనలను ఇతరులు పాపము చేయుటకు కారణం కాకూడదు అని చెబుతున్నారు. అటుల అగుటకంటె మనము మరణించుటయే మంచిది అని పలుకుతున్నారు. మనము పాపము చేయుటకంటే  మనము పాపము చేయుటకు మనలో  ఏదైన కారణమైతే  దానిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండమని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు ఎందుకు ఇలా చెబుతున్నాడు?  ఎందుకంటే నిత్యం జీవం అనేది అత్యంత విలువైనది, ఏమి ఇచ్చిన కాని దానిని కొనలేము.  మంచి జీవితం జీవించే వారికి దేవుడు ఇచ్చే బహుమతి ఇది.  ఏ వ్యక్తి కూడా తన సొంత ప్రతిభ వలన సాధించదగినది కాదు. పాపము చేసిన వారు కూడా పశ్చాత్తాప పడి ప్రభువు ముందు క్షమాపణ అడిగితే వారికి కూడా ప్రభువు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. అది ప్రభువును ముఖాముఖిగా దర్శించు భాగ్యం. ఎల్లప్పుడూ ఆనందముగా ఉండేటువంటి స్థితి.    అందుకే మనలో పాపకారణమైన భాగం ఉంటె దానిని  కోల్పోవడానికి అయిన సిద్దపడి నిత్యజీవం పొందుటకు సాధన చేయమని ప్రభువు చెబుతున్నాడు. 

ప్రార్ధన: ప్రభువా! మీ అనుచరులు ఎల్లప్పుడు మీమ్ములను ఆదర్శంగా తీసుకోవాలని, మీ వలె జీవించాలని కోరుకుంటున్నారు. మీ అనుచరులను గౌరవించిన వారికి తగిన ప్రతిఫలమును పొందుతారు అని చెబుతున్నారు.  మీ అనుచరులుగా మీకు సంబంధికులుగా ఉండుటవలన  మిమ్ము ఇతరులకు మా జీవితాల ద్వారా   చూపించు,వినిపించు అనుగ్రహం ప్రసాదిస్తున్నారు. దీనిని సద్వినియోగ పరచుకొని    చెడుమార్గంలో ప్రయాణించకుండ, మీ మార్గములో ప్రయాణిస్తూ, మాలో ఏదైనా పాపకారణమైనది ఉన్నచో దానిని తీసివేసి, మీ వలె జీవిస్తూ, నిత్యజీవానికి వారసులము అయ్యేలా అనుగ్రహించండి. ఆమెన్. 


16, ఫిబ్రవరి 2025, ఆదివారం

మార్కు 9:38-40

 February 26

సిరా 4:11-19

మార్కు 9:38-40

అంతట యోహాను యేసుతో "బోధకుడా! మనలను అనుసరింపని ఒకడు నీపేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి" అని పలికెను. అందుకు యేసు "మీరు అతనిని నిషేధింపవలదు, ఏలయన, నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధికానివాడు మన పక్షమున ఉండువాడు. 

యోహాను  యేసుతో, “బోధకుడా, దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తిని మేము చూశాము. అతను మనల్ని అనుసరించడు కాబట్టి మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాము” అని చెప్పడంతో ప్రారంభమవుతుంది ఈనాటి సువిశేషం. ఆ  వ్యక్తి దయ్యాలను వెళ్ళగొట్టే సామర్థ్యం పట్ల శిష్యులు  అసూయపడుతున్నారా? వారు ఈ రకమైన శక్తిని కలిగి ఉండాలనుకుంటున్నారా?  అనే ప్రశ్నలను అడిగితే ఆ వ్యక్తి వలే వీరుకూడా చేయాలి అని అనుకోని ఉండవచ్చు. యేసు యోహానుతో, “అతన్ని నిరోధించవద్దు. ఎవరైనా నా నామంలో మంచి పని చేస్తే, నా గురించి వారు ఎలా  చెడుగా మాట్లాడరు” అని అంటాడు. తరువాత యేసు ఇలా అంటాడు: “మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడు.”

ఈ రోజు యేసు ప్రభువు  మనకు ఒక ముఖ్యమైన సూచన ఇస్తున్నాడు. మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడని ఆయన మనకు చెబుతున్నాడు. సాధారణంగా చాలా మంది మానవులకు ఏ వ్యక్తులు తమను ఆదరిస్తారో తెలుసు. అయితే, ఏ వ్యక్తులు మనతో పోరాడవచ్చు, మనల్ని ఇష్టపడకపోవచ్చు లేదా మనల్ని విస్మరించవచ్చు అని కూడా మనకు తెలుసు.  కాని ఈ రోజులలో మనతో మంచిగా మాటలాడి మనము లేని సమయంలో వ్యతిరేకంగా మాటలాడువారే ఎక్కువ మంది ఉండవచ్చు. 

యేసు ప్రభువును అనుసరించకుండా,  ఆయన నామమున ఒక వ్యక్తి దయ్యములను వెడలగొడుతున్నాడు అంటే ఆ వ్యక్తి యేసు ప్రభువును దేవునిగా , రక్షకునిగా అంగీకరించాడు. మరియు యేసు ప్రభువు మాటలను పాటించి జీవిస్తూ ఉండవచ్చు. ఎదో ఒక సమయంలో ప్రభువు మాటలను విని, ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. ప్రభువు చెప్పినట్లు ఆ వ్యక్తి ప్రార్థన, మరియు ఉపవాసములతో జీవించేవాడు అయివుండవచ్చు ఎందుకంటే ప్రభువే చెబుతున్నాడు ఇటువంటివి కేవలం ప్రార్ధన మరియు ఉపవాసంతోనే సాధ్యమని కనుక ఆ వ్యక్తి ప్రభువుతో ఉండకపోయినా  ప్రభువుని అనుచరుడే. 

 మానవులుగా, మనలో చాలామంది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో దాని గురించి ఎక్కువగా శ్రద్ధ వహించవచ్చు. అయితే, యేసు తన శిష్యులు నిజంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాడు. వారు ఇతరుల పట్ల అసూయపడటం లేదా మరొకరి సామర్థ్యాలు మరియు బహుమతులను కోరుకోవడం ఆయనకు ఇష్టం లేదు. తన శిష్యులు తమ సొంత బహుమతులను మరియు ఇతరుల బహుమతులను కూడా అభినందించాలని యేసు స్పష్టంగా కోరుకుంటున్నాడు.

Br. Pavan OCD

మార్కు 9:30-37

 February 25

సిరా 2:1-11

మార్కు 9:30-37

వారు ఆ స్థలమును వీడి గలిలీయ ప్రాంతమునకు వెళ్లిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికిని తెలియకూడదని ఆయన కోరిక. ఏలయన, "మనుష్యకుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు కాని మరణించిన మూడవదినమున ఆయన పునరుత్తానుడగును" అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కఫర్నామునాకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను "మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి?" అని అడిగెను. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించు కొనియుండుటచే వారు ప్రత్యుత్తరమీయలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి, "ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై, అందరకు సేవకుడుగా ఉండవలయును"అని పలికెను. మరియు ఆయన ఒక చిన్నబిడ్డను చేరదీసి వారి మధ్యనుంచి, వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, "ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడగును. నన్ను  స్వీకరించినవాడు నన్నుకాదు , నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు" అనెను. 

యేసు ప్రభువు , పన్నెండు మందిని పిలిచి, మీలో ఎవరైనా మొదటివారిగా  ఉండాలనుకుంటే, అతను చివరివాడిగా మరియు అందరికీ సేవకుడిగా ఉండాలని చెబుతున్నాడు.  అంతకు ముందు  యేసు ప్రభువు   తనకి  అత్యంత  సన్నిహిత శిష్యులను, తీసుకొని ఒక రహస్య ప్రదేశానికి ప్రార్ధించుటకు వెళ్ళాడు, తరువాత  వారు కఫర్నముకు వచ్చారు, యేసు ప్రభువు  వారిని దారిలో దేని గురించి వాదిస్తున్నారని అడిగాడు. ఎవరు గొప్పవారో వారు వాదించుకుంటున్నారని వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు.  అది ప్రభువుకు వారు చెప్పలేక పోయారు. 

 మొదటివారిగా  ఉండాలనుకునే ఎవరైనా చివరివారై ఉండాలి, అందరికీ సేవకుడుగా  కావాలని ప్రభువు  చెప్పాడు. కేవలం అది చెప్పడంతో ఆగిపోకుండా  ఒక చిన్న బిడ్డను తీసుకొని , వారి మధ్య ఉంచి తన పేరు మీద ఒక బిడ్డను స్వాగతించేవాడు తనను స్వాగతిస్తాడని చెబుతున్నాడు. చిన్నవాడిని లేక ఇతరుల మీద ఆధారపడేవారిని ఆహ్వానించడం మనలను దైవ స్వభావం కలిగేలా చేస్తుంది. ప్రపంచం తరచుగా నాయకత్వాన్ని, అధికారంతో, శక్తితో సమానం చేస్తుంది. 

దేవుని రాజ్యంలో, అధికార సమీకరణం తారుమారు అవుతుంది. మనం సేవ చేయడం ద్వారా నాయకత్వం వహిస్తాము, దిగువకు మారడం ద్వారా ఉన్నతంగా వెళ్తాము, అత్యల్పంగా ఉండటం ద్వారా అధికారాన్ని ఉపయోగిస్తాము. స్వార్థపూరిత నాయకత్వానికి అలవాటుపడిన ప్రపంచంలో ఇది అర్ధవంతం కాదు. దేవుడిని ప్రేమించడం మరియు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనే రెండు గొప్ప ఆజ్ఞలు ఉన్న సమాజ మాత్రమే లో, లోక  నియమాలను తిప్పికొట్టకలుగుతుంది. .

మనం ఇతరులకు సేవ చేసినప్పుడు నాయకత్వం వస్తుంది. ప్రజలకు సహాయం చేయడంలో ప్రభావం వస్తుంది.  అది మనం కోరుకునేది కాదు, ఎందుకంటే మనం కోరుకునేది సేవ చేయడమే. సేవ చేయడంలో అవకాశం నాయకత్వం వహించడానికి రావచ్చు.

Br. Pavan OCD

మార్కు 9:14-29

 February 24

సిరా 1:1-10

మార్కు 9:14-29

వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మ శాస్త్ర బోధకులు క్కో శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగనే ప్రజలు ముగ్గుల ఆశ్చర్యపడి, పరుగునవచ్చి ఆయనకు నమస్కరించిరి. "వారితో ఏ విషయమునుగూర్చి తర్కించుచున్నారు?" అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జనసమూహములో ఒకడు "బోధకుడా!మూగ దయ్యము పట్టిన నా కుమారుని తమయొద్దకు తీసుకొనివచ్చితిని. భూతము వీనిని ఆవేశించినపుడెల్ల నేలపై  పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కోరుకుచు, కొయ్యబారిపోవును.  ఈ దయ్యమును పారద్రోలమీ శిష్యులను కోరితిని. అది వారికి సాధ్యపడలేదు" అని విన్నవించెను. యేసు వారితో "మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంత కాలము మీ మధ్యనుందును? ఎంతవరకు  మిమ్ము సహింతును? ఆ బాలుని ఇటకు తీసుకొని రండు" అనగా, వారు అట్లే వానిని తీసికొని వచ్చిరి. యేసును చూచినవెంటనే ఆ దయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి, అటుఇటు దొర్లించి, నురుగులు క్రక్కించెను. "ఈ  దుర్బరావస్థ ఎంత కాలము నుండి?" అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. "పసితననము నుండి" అని అతడు బదులు   చెప్పి, "అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలెనని నీళ్లలోను, నిప్పులలోను పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సాయముచేయుడు" అని ప్రార్ధించెను. అందుకు యేసు "సాధ్యమగునేని' అనుచున్నావా! విస్వసించు వానికి అంతయు సాధ్యమే" అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి "నేను  నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము  లేకుండునట్లు తోడ్పడుము" అని ఎలుగెత్తి పలికెను.  అంతట జనులు గుమికూడి తనయొద్దకు పరుగెత్తుకొనివచ్చుట  చూచి యేసు "మూగ చెవిటి దయ్యమా! ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడును వీనిని ఆవహింపకుము" అని శాసించెను. అప్పడు ఆ  భూతము ఆర్భటించుచు, బాలుని విలవిలలాడించి వెళ్లిపోయెను. బాలుడు పీనుగువలె  పడిపోయెను. అనేకులు వాడు చనిపోయెననిరి. కాని, యేసు వాని చేతినిపట్టి లేవనెత్తగా వాడులేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్లిన పిదప శిష్యులు  ఏకాంతముగ ఆయనతో "ఈ దయ్యమును పారద్రోల మాకు ఏల సాధ్యపడలేదు?" అని ప్రశ్నించిరి. అందుకు ఆయన   వారితో, "ప్రార్ధనవలనతప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు" అని చెప్పెను. 

శిష్యులు  మూర్ఛరోగిని ‘ స్వస్థపరచలేక’ దుష్టాత్మను వెళ్లగొట్టలేకపోవుటను  చూసినప్పుడు, వారు తమ వైఫల్యానికి కారణాన్ని గురువును అడిగారు. ఆయన వారికి ‘సాతానుపై  శక్తి మరియు అధికారం, మరియు అన్ని వ్యాధులను నయం చేయడానికి శక్తిని ’ ఇచ్చాడు. వారు తరచుగా ఆ శక్తిని ఉపయోగించారు మరియు  వారికి సాతాను ఎలా లోబడి ఉన్నాడో సంతోషంగా చెప్పారు. అయినప్పటికీ, ఆయన కొండపై ఉన్నప్పుడు, వారు పూర్తిగా విఫలమయ్యారు. 

దేవుని చిత్తం లేకుండా విముక్తి ప్రసాదించడం, అయన అనుగ్రహం లేకుండా ఏదైనా సాధించడం సాధ్యం కాదు. క్రీస్తు ఆజ్ఞ మేరకు దుష్టాత్మ వెళ్ళిపోయింది.  మేమెందుకు చేయలేకపోయాము?’ అనే వారిప్రశ్న,  వారు కూడా ఆ దుష్టాత్మను వెళ్ళగకొట్టాలని   ప్రయత్నించారని స్పష్టంగా తెలుస్తుంది; వారి ప్రయత్నాలు ఫలించలేదు , ప్రజల ముందు వారి అశక్తి నిరూపితమైంది. దానికి వారు సిగ్గుపడ్డారు. 

విశ్వాసం ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత వ్యాయామం, ఇక్కడ మన ఆత్మ దేవుని ఆత్మకు పరిపూర్ణంగా స్వీకరించడంలో తనను తాను సమర్పించుకుంటుంది మరియు  అత్యున్నత కార్యాచరణకు బలపడుతుంది. ఈ విశ్వాసం పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిపై ఆధారపడి ఉంటుంది; ఇది బలంగా మరియు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మన జీవితంలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించినప్పుడు మాత్రమే, దాని శక్తివంతమైన పనులను చేయడానికి విశ్వాసమునకు  శక్తి ఉంటుంది. 

అందుకే యేసుప్రభువు సాతాను ఉపవాసం మరియు ప్రార్థన ద్వారా మాత్రమే పారద్రోలబడుతుంది.  ఈ దుష్టాత్మలో ఉన్న మొండి పట్టుదలను , ప్రతిఘటనను అధిగమించగల విశ్వాసం, దేవునితో  సన్నిహిత సహవాసంలో ఉండి మరియు లోకం దాని క్రియల నుండి సాధించవచ్చు.  విశ్వాసం పెరగడానికి మరియు బలంగా ఉండటానికి ప్రార్థన జీవితం అవసరం.  ప్రార్థన ఉపవాసం విశ్వాసాన్ని పెంచుతాయి. 

విశ్వాసం పెరుగుదల కోసం ప్రార్థన జీవితం అవసరం. ఆధ్యాత్మిక జీవితంలోని అన్ని విభిన్న భాగాలలో, దేవునితో ఎంత దగ్గర సంబంధం కలిగి ఉంటామో అంత పవిత్రత కలిగి ఉంటాము. భగవంతుడిని ఆరాధించడంలో, ఆయన కోసం వేచి ఉండటంలో, దేవుడు తనను తాను మనకు వెల్లడించడానికి సిద్ధపడేది మన విశ్వాసం ప్రకారముగానే తెలుసుకుంటాము. దాని దేవుడిని తెలుసుకునే మరియు విశ్వసించే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.

Br. Pavan OCD

మార్కు 10:1-12

 February 28

సిరాకు 6:5-17

మార్కు 10:1-12

యేసు ఆ స్థలమును వీడి యొర్దాను నదికి ఆవాలనున్న యూదయా ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను  చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్ధము పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, "భార్యను పరిత్యజించుట భర్తకు తగునా?" అని ప్రశ్నించిరి. అందుకు యేసు "మోషే మీకేమి ఆదేశించెను?" అని తిరిగి ప్రశ్నించెను. "విడాకుల పత్రమును వ్రాసియిచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను?" అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు "మీ హృదయకాఠిన్యమునుబట్టి  మోషే ఇట్లు ఆదేశించెను. కాని, సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు. ఈ హేతువువలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏకశరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులుకాక, ఏక శరీరులైయున్నారు. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరుపరాదు" అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి  శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అపుడు ఆయన వారితో "తన భార్యను పరిత్యజించి, వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి, వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది" అని పలికెను.   

అన్ని వివాహాలు స్వర్గంలో జరగవు. కొన్ని బలవంతపు వివాహాలు మరియు మరికొన్ని ప్రేమలేని వివాహాలు. ఒక వివాహిత జంట రాత్రింబవళ్ళు ఒకరితో ఒకరు గొడవపడటం లేదా మూడవ వ్యక్తి లేదా నాల్గవ వ్యక్తితో, ఒకరి దాంపత్య జీవిత  సంబంధంలో నిరంతరం ముల్లుగా మారడం ఊహించుకోండి. కొన్ని కుటుంబాలు   ఎంత దురదృష్టకర జీవితాన్ని గడుపుతాయి! కాబట్టి క్రైస్తవ సమాజంలో  కూడా విడాకుల ప్రశ్న ప్రతిసారీ తలెత్తుతుంది. విరిగిన కుటుంబం యొక్క తక్షణ పరిణామం దాని సభ్యుల విచ్ఛిన్నమైన సంబంధం.విడాకుల తర్వాత కూడా మనం సంతోషకరమైన ముఖాలను చూడగలిగినప్పటికీ, విభజన యొక్క గాయం  ముఖ్యంగా విరిగిన కుటుంబం యొక్క మొదటి బాధితులైన పిల్లలలో కొనసాగుతుంది. 

కుటుంబంలో విచ్ఛిన్నం దేవునితో మన విచ్ఛిన్నమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజల హృదయ కాఠిన్యం కారణంగా మోషే విడాకులను అనుమతించాడని యేసు ప్రభువు  వివరించాడు. చాలా మంది ప్రవక్తల మాట మరియు యేసుప్రభువు  మాట వినకుండా  అదే హృదయ కాఠిన్యం కలిగి జీవిస్తుంటారు. ఈ రోజుల్లో ప్రజలు, ప్రేమ మరియు పశ్చాత్తాపం యొక్క సువార్త సందేశాన్ని వినకపోవడానికి ఇది కారణం ఈ హృదయ కాఠిన్యమే కావచ్చు. బహుశా భార్యాభర్తలు  ఒకరినొకరు వినడం నేర్చుకుంటే, ముఖ్యంగా దేవుని మాట వినడం నేర్చుకుంటే, విడాకుల సమస్యకూడా చర్చించబడకపోవచ్చు. వారు ఒకే శరీరంగా ఉండటం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుని, వారి ఏకత్వాన్ని కొనసాగిస్తే, మానవాళి మొత్తం దేవుడు అందరికీ ఒకే తండ్రిగా ఉన్న నిజమైన కుటుంబంగా ఉంటుంది. ప్రతి కుటుంబం మనుగడ మరియు ఆనందం కోసం మనం ప్రార్థిస్తూ ఉండటం క్రైస్తవుల కర్తవ్యం. 

Br. Pavan OCD

14, ఫిబ్రవరి 2025, శుక్రవారం

మత్తయి 16: 13-19

 February 22

మొదటి పేతురు 5: 1-4

మత్తయి 16: 13-19

వారు ఇద్దరు తిరిగివచ్చి తక్కినవారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై,  సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యమునకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: "మీరు ప్రపంచమందంతట తిరిగి, సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును. విశ్వసింపనివానికి దండన విధింపబడును. విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు. నా నామమున దయ్యములను వెళ్లగొట్టెదరు. అన్యభాషలను మాట్లాడెదరు. పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములనుంచిన  వారు ఆరోగ్యవంతులు అగుదురు." ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని  కుడిప్రక్కన కూర్చుండెను. 

తన మొదటి లేఖలో, పునీత  పేతురు విశ్వాసులను చూసుకోవడానికి బాధ్యత వహించే వారికి ఒక మతసంబంధమైన లేఖ ద్వారా తన అధికారాన్ని ఎలా ఉపయోగించాడో మనకు చెబుతాడు. ఈ భాగంలో పేతురు తాను క్రీస్తు బాధలకు సాక్షిగా ఉన్నానని మాట్లాడుతుంటాడు - తాను ప్రభువుతో ఉన్నానని మరియు మానవ క్రీస్తును తెలుసుకున్నానని తన పాఠకులకు గుర్తు చేస్తున్నాడు.

ప్రభువు తమకు అప్పగించిన వారికి నిజమైన కాపరులుగా ఉండాలని మరియు సువార్తకు సజీవ సాక్షులుగా పరిపూర్ణ ఉదాహరణలుగా ఉండాలని పెద్దలందరినీ ఆయన ఎలా వేడుకుంటున్నాడో కూడా ఈ లేఖ మనకు చెబుతుంది. క్రీస్తు తర్వాత పేతురు మందకు ప్రధాన కాపరిగా ఉన్నందున, నేటి కీర్తన ప్రభువు నిజమైన కాపరి అని మనకు గుర్తు చేస్తుంది.

 పునీత  మత్తయి సువార్త భాగం పేతురుకు  క్రీస్తుపై గొప్ప విశ్వాస ప్రకటన తర్వాత క్రీస్తు  సంఘానికి  నాయకుడిగా నియమించబడ్డాడని చూపిస్తుంది. అతను కొత్తగా వచ్చిన సమూహానికి నాయకుడిగా ఉన్నప్పటికీ, అతను సంఘ  ఐక్యతకు శక్తివంతమైన చిహ్నంగా కూడా ఉన్నాడు, ఇది నేటి వరకు కొనసాగుతోంది.

పునీత పేతురు  అపోస్తులిక పరంపరను  మరియు పునీత పేతురు రోము మొదటి పీఠాధిపతిగా   క్రైస్తవ సంఘ నాయకునిగా తెలుపుతుంది ఈనాటి దైవార్చన. . పునీత పేతురు  అసలు పేరు సైమన్. అతనిని  శిష్యులలో  మరియు యేసు పన్నెండు మంది అపొస్తలులలో ఒకరిగా ఉండమని పిలిచినప్పుడు కఫర్నములో జాలరిగా నివసిస్తున్నాడు . యేసు ప్రభువు  పేతురుకు అపొస్తలులలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. క్రీస్తు రూపాంతరం మరియు గెత్సేమనే తోటలో వేదన వంటి ప్రత్యేక సందర్భాలలో క్రీస్తుతో ఉన్న ముగ్గురిలో అతను ఒకడు. పునరుత్థానం తర్వాత మొదటి రోజున క్రీస్తు కనిపించిన ఏకైక అపొస్తలుడు ఆయన.

పేతురు తరచుగా అపొస్తలుల తరపున మాట్లాడేవాడు.మనం  తిరుసభలో , సంఘంలో “పేతురు స్థానాన్ని ”  ప్రత్యేకమైనదిగా జరుపుకుంటున్నప్పుడు, దేవుని రాజ్య పనిని కొనసాగించడంలో యేసు మనలో ప్రతి ఒక్కరికీ ఒక కుర్చీని - ఒక స్థలాన్ని, ఒక పాత్రను - సిద్ధం చేశాడని మర్చిపోకూడదు. . పేతురులాగే, నేడు మన స్థానాన్ని తీసుకునే ధైర్యం మనకు ఉందా? అని ఆలోచిస్తూ , దేవుడు మనకు ఏర్పరచే స్థానాన్ని ఎల్లపుడు కాపాడుకొనుటకు ప్రయత్నించుదాం. 

Br. Pavan OCD

మార్కు 8: 34 – 9:1

 February 21

ఆదికాండము 11: 1-9

మార్కు 8: 34 – 9:1

అంతట యేసు జనసమూహములను, శిష్యులను చేరబిలిచి, "నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని, తన సిలువను మోసికొని, నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొనచూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము, తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి, తన ఆత్మను కోల్పోయిన, వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఈయగలడు? నన్ను గూర్చి నా సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యభిచారతరములో సిగ్గుపడువానిని గూర్చి, మనుష్య కుమారుడు కూడ దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును" అని పలికెను. మరియు ఆయన వారితో, "దేవునిరాజ్యము శక్తి సహితముగ సిద్దించుట చూచువరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరని నేను నిశ్చయముగాఆ  చెప్పుచున్నాను" అని పలికెను. 

ఆదికాండము పుస్తకాన్ని చదివినప్పుడు, ప్రజలు ఒడంబడిక నుండి ఎలా దూరమయ్యారో మరియు వారి గర్వంతో స్వర్గం వరకు చేరుకునే గోపురాన్ని నిర్మించడం ద్వారా దేవుని వలె శక్తివంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని మనం చూస్తాము. వారి అహంకారంతో, దేవుడు ఆ గోపురాన్ని నాశనం చేస్తాడు మరియు ప్రజలు ఒకరి భాష ఒకరు   అర్థం చేసుకోలేని విధంగా వారికి వివిధ భాషలను ఇవ్వడం ద్వారా వారిని గందరగోళానికి గురిచేస్తాడు. 

వాస్తవానికి మనం పరలోకంలో మన స్థానాన్ని పొందేందుకు కృషి చేస్తున్నప్పుడు ఈ ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించడం వ్యర్థమని యేసు సువార్తలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. యేసును నిజాయితీగా మరియు నిశ్చయమైన హృదయంతో అనుసరించేవారు మాత్రమే రాజ్యంలోకి మరియు వారి నిజమైన వారసత్వంలోకి ప్రవేశిస్తారు.

భవనాన్ని నిర్మించడం ఒక విషయం, కానీ దానిని నిర్వహించడం మరొక విషయం. వివేకవంతమైన నిర్మాణకులు/యజమానులు తాము నిర్మించే దాని  నిర్మాణం కోసం వనరులను కేటాయించడమే కాకుండా, భవనం యొక్క నిరంతర నిర్వహణ కోసం వనరులను కూడా కేటాయించారు. ప్రధాన నిర్మాణకర్త అయిన దేవుడు - మనలో ప్రతి ఒక్కరినీ తన స్వరూపంలో మరియు పోలికలో నిర్మించాడు. మనం వస్తువులను నిర్మించడం ద్వారా - ముఖ్యంగా సంబంధాలను - నిర్మించడం ద్వారా దేవుని నిర్మాణాన్ని జరుపుకుందాం, దీని ముఖ్య లక్షణాలు వినయం మరియు దాతృత్వం. అలా చేయడం ద్వారా, మనం మనకే కాదు, దేవునికే మహిమ తెచ్చుకుందాం! . 

Br. Pavan OCD

మార్కు 8: 27-33

 February 20

ఆదికాండము 9: 1-13

మార్కు 8: 27-33

యేసు శిష్యులతో కైసరయా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్లుచు, మార్గ మధ్యమున "ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు?" అని వారిని అడిగెను. అందుకువారు, "కొందరు స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరు ఏలీయా అనియు, లేదా మరియొక ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు" అనిరి. అప్పుడు యేసు "మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు? అని వారిని ప్రశ్నింపగా, పేతురు, "నీవు క్రీస్తువు" అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు "మనుష్యకుమారుడు అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, చంపబడి, మూడవదినమున ఉత్తానమగుట అగత్యము" అని ఉపదేశించి, వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసికొనిపోయి, "అటుల పలుకరాదు" అని వారింపసాగెను. యేసు శిష్యులవైపు తిరిగి పేతురును చూచి, "సైతానూ!నీవు నా వెనుకకు పొమ్ము   నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవికావు" అనెను

ఆదికాండము మొదటి పఠనంలో దేవుడు నోవతో ఒక నిబంధన చేస్తాడు మరియు ఆదాము హవ్వలతో  నిబంధనను రూపొందించడంలో ఆయన ఉపయోగించిన పదాలను ఇక్కడ ఉపయోగిస్తాడు. ఆ నిబంధనను గుర్తుచేసేందుకు ఆకాశంలో ఇంద్రధనస్సును ఉంచుతాడు, అయినప్పటికీ కొద్దిమంది మాత్రమే ప్రభువుతూ సఖ్యత కలిగి ఉంటారు. పునీత  మార్కు సువార్తలో, క్రీస్తు శిష్యులతో  తాను తీవ్రంగా హింసించబడతానని  చెబుతున్నాడు, అపుడు ప్రభువును  యెరూషలేముకు వెళ్లకుండా నిరోధించడానికి పేతురు ప్రయత్నిస్తున్నాడు,  అది ప్రభువును బాధపెడుతుంది. అందుకు కొన్ని క్షణాల ముందు నీవు క్రీస్తువు; అనే మాటలతో పేతురు తన విశ్వాసాన్ని గొప్పగా ప్రకటించినప్పటికీ, క్రీస్తు సాధించిపెట్టె రక్షణ అయన పొందే శ్రమల మరణ పునరుత్తనాల ద్వారా వస్తుందనే విషయాన్ని మాత్రము జీర్ణించుకోలేకపోతున్నాడు పేతురు.    ప్రభువు వాటిని అధిగమించి  జయిస్తాడు అని అర్ధం చేసుకోలేకపోయాడు పేతురు.  క్రీస్తుతో చేసుకొనే రక్షణ నిబంధన శాశ్వత నిబంధన. 

పునీత  పేతురు చేసినట్లుగా మనం ఆయనపై విశ్వాసం ఉంచాలని మరియు ప్రతిరోజూ ఆయన “నీవు క్రీస్తు” అని గుర్తుంచుకొని జీవించుటకు  పిలువబడ్డాము. యేసు పేతురును “రాయి” అని పిలిచి ఉండవచ్చు, కానీ రక్షకుడికి పేతురు అనే రాయికి  పగుళ్లు ఉన్నాయని తెలుసు. పేతురును అప్పుడప్పుడు  ప్రభువు మార్గమునుకు భిన్నముగా ప్రవర్తిస్తున్నాడు అని తెలుసు. అయితే, పేతురు ఎంత అసంపూర్ణుడైనా, దేవుడు రాజ్యం యొక్క తాళాలను అతనికి అప్పగించాడు, ఎందుకంటే ఆయనను ప్రభువు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చుతాడు.  మనం ఎంత అసంపూర్ణులమైన, మనకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తున్నాడు మనలను సంపూర్ణులను చేయుటకు ప్రభువు ఇలా చేస్తుంటాడు. వాటిని అవకాశముగా మార్చుకొని ప్రభువు వలే పరిపూర్ణమైన వ్యక్తులుగా మారుటకు ప్రయతించుదాం. 

Br. Pavan OCD

8, ఫిబ్రవరి 2025, శనివారం

మార్కు 8: 14-21

 February 18

ఆదికాండము 6: 5-8; 7: 1-5, 10

మార్కు 8: 14-21

శిష్యులు తమవెంట రొట్టెలను తెచ్చుకొనుటకు మరచిపోయిరి. పడవలో వారియొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. "పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు, హేరోదు పులిసినపిండిని గూర్చియు, హేరోదు పులిసినపిండిని గూర్చియు, జాగరూకులై ఉండుడు" అని యేసు శిష్యులను హెచ్చరించెను. "మనయొద్ద రొట్టెలులేనందున ఆయన ఇట్లు పలికెనేమో" అని వారు తమలోతాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, "రొట్టెలులేవని మీరు ఏల విచారించుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయకాఠిన్యము గలవారైయున్నారా? మీరు కనులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞప్తికి తెచుకోలేరా? ఐదు రొట్టెలను ఐదువేలమందికి పంచి పెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్నిగంపలు  నింపితిరి?" అని ప్రశ్నింపగా, "పండ్రెండు గంపలనింపితిమి" అని వారు సమాధానమిచ్చిరి. "అట్లే ఏడు రొట్టెలను నాలుగువేలమందికి పంచిపెట్టినపుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్నిగంపలకు ఎత్తితిరి?" అని అడుగగా "ఏడు గంపలకు" అని సమాధానమిచ్చిరి. "ఎంతమాత్రము అర్ధము కాలేదా?"  అని యేసు శిష్యులను మందలించెను.  

ఆదికాండములోని మొదటి పఠనం దేవుడు తన నుండి మరింత దూరం వెళ్ళిన స్త్రీ పురుషుల పట్ల నిరాశ చెందాడని చెబుతుంది, మరియు అందువల్ల అతను వారిని గొప్ప జలప్రళయం ద్వారా భూమి నుండి తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. నోవ మరియు అతని కుటుంబం మాత్రమే భూమిని తిరిగి నింపడానికి మిగిలి ఉంటారు. సువార్తలో యేసు తన శిష్యులను హేరోదు మరియు పరిసయ్యుల మధురమైన మాటలకు మోసపోవద్దని హెచ్చరించాడు, వారు  దేవుణ్ణి నమ్మకంగా ఆరాధించరు, కానీ ప్రజలను వారి సొంత  ప్రయోజనాల కోసం ఆదేశిస్తారు. రెండు పఠనాలు మన విశ్వాసం స్వచ్ఛంగా ఉండాలని మరియు దేవుని వాక్యంపై ఆధారపడి ఉండాలని మనకు గుర్తు చేస్తాయి. మనం ఆయన మాట ప్రకారం జీవిస్తే, సరైన చర్య తీసుకోవడానికి ఏమి చేయాలో మనకు తెలుస్తుంది మరియు మనం నమ్మితే తదనుగుణంగా వ్యవహరిస్తాము.

 మన జీవితాల్లో మనం నిర్మించాలని ప్లాన్ చేసుకునే అనేక ఓడలు ఉన్నాయి, అవి ఎప్పటికీ పూర్తి కావు. మనకు అవసరమని మనం నమ్మే ఇతర ఓడలు మన జీవితాల్లో ఉన్నాయి, అవి ఎప్పటికీ ఉపయోగించబడవు. వాస్తవం తర్వాత వరకు మనం అవసరాన్ని గుర్తించలేదు కాబట్టి మనం స్పష్టంగా నిర్మించాల్సిన - కానీ ఎప్పుడూ చేయని - ఇతర ఓడలు ఇంకా ఉన్నాయి. అయితే, భవిష్యత్తు కోసం సిద్ధం కావడంలో ఎటువంటి హాని లేదు - అది స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా అయినా - రేపటి కోసం మనం ప్రణాళిక వేసుకోగల ఏకైక స్థలంలో నివసించే మన సామర్థ్యాన్ని అది దెబ్బతీయదు. జలప్రళయం వచ్చిన రోజు వరకు నోవ సమకాలీనులలో చాలామంది అతన్ని ఎగతాళి చేశారు.

Br. Pavan OCD

మార్కు 8: 22-26

 February 19

ఆదికాండము 8: 6-13, 20-22

మార్కు 8: 22-26

అంతట వారు బేత్సయిదా గ్రామము చేరిరి. అచట కొందరు ప్రజలు ఒక గ్రుడ్డివానిని యేసు వద్దకు తీసికొనివచ్చి, వానిని తాకవలయునని ఆయనను ప్రార్ధించిరి. యేసు వానిని చేయిపట్టుకొని, ఉరి వెలుపలకు తీసికొనిపోయి, వాని కన్నులను ఉమ్మి నీటితో తాకి, తన చేతులను వానిపై ఉంచి, "నీవు చూడగలుగుచున్నావా?" అని ప్రశ్నించెను. వాడు కనులెత్తి "నాకు మనుష్యులు కనిపించుచున్నారు. కాని, నా దృష్టికి వారు చెట్లవలెయుండి నడచుచున్నట్లు కనిపించుచున్నారు" అని సమాధానమిచ్చెను. యేసు మరల వాని కన్నులను తాకి సూటిగా వానివైపు చూడగా, వాడు స్వస్థుడై అంతయు స్పష్టముగా చూడగలిగెను. "తిరిగి ఆ ఊరు  వెళ్ళవద్దు" అని యేసు వానిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేసెను. 

మొదటి పఠనంలో మనం జలప్రళయం ముగింపు మరియు నోవ దేవునికి చేసిన కృతజ్ఞత బలి  గురించి చదువుతాము. కీర్తన కృతజ్ఞతా స్తుతి  ఈ ఇతివృత్తాన్ని కొనసాగిస్తుంది. సువార్తలో యేసు ప్రభువు  ఒక అంధుడిని స్వస్థపరుస్తున్నట్లు చూస్తాము మరియు ఇది కాలక్రమేణా విశ్వాసం పెరుగుతుందని మరియు కాలక్రమేణా మనం ప్రభువును మరింత ఎక్కువగా అంగీకరిస్తామని మనకు గుర్తు చేస్తుంది. 

జీవితంలో మనం పొందిన ప్రతిదానికీ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలని మనకు గుర్తు చేయబడుతుంది, అది ఎంత అల్పమైనదిగా అనిపించినా, జీవిత బహుమతికి దేవునికి  కృతజ్ఞతలు చెప్పాలని కూడా గుర్తుంచుకోవాలి. కాలక్రమేణా విశ్వాసం పెరుగుతుంది కానీ మనం దాని కోసం ఎల్లప్పుడూ పని చేయాలి. మనుష్యకుమారుడు నీతిమంతులను దేవుని రాజ్యంలోకి స్వాగతిస్తాడని యేసు జనసమూహానికి చెబుతూ, “నేను ఆకలిగా ఉన్నాను మరియు మీరు నాకు ఆహారం ఇచ్చారు, నేను దాహంగా ఉన్నాను   మీరు నాకు త్రాగడానికి నీరు  ఇచ్చారు, నేను అపరిచితుడిగా  ఉన్నాను  నన్ను స్వీకరించారు, నగ్నంగా ఉన్నారు మరియు మీరు నాకు బట్టలు ఇచ్చారు, అనారోగ్యంతో ఉన్నారు మరియు మీరు నన్ను ఆదరించారు, జైలులో ఉన్నారు మరియు మీరు నన్ను సందర్శించారు.” అని, నీతిమంతులు ఎప్పుడు ఇలా చేసారో అడుగుతారు, అపుడు ప్రభువు   ఇలా సమాధానం ఇస్తాడు, “నా ఈ చిన్న సోదరులలో ఒకరికి మీరు ఏమి చేశారో, మీరు నా కోసం చేసారు.”

దేవుడు  పొరుగువారి పట్ల మన ప్రేమ యొక్క పరస్పర సంబంధం గురించి యేసు బోధన యొక్క శక్తివంతమైన ఉద్ఘాటన ఇది. దేవుని పట్ల సంపూర్ణ ప్రేమ మన తోటి మానవులను ప్రేమించాలని చెబుతుంది.  ఎందుకంటే దేవుడు అనేక మందిలో ఒకడు కాదు, కానీ మన ఉనికికి ఆధారం. మన ఆధ్యాత్మిక మార్గం అనిశ్చితితో నిండి ఉండవచ్చు. మన కోసం దేవుని ప్రణాళిక ఆశ్చర్యాలతో నిండి ఉండవచ్చు: కొంత ఓదార్పునిస్తుంది మరియు కొంత మనకు అర్ధం కాకపోవచ్చు. మన మనస్సులు, మన హృదయాలు - మన జీవితాలు - మనం కోరుకున్నంత ప్రశాంతంగా లేదా ఊహించదగినవిగా ఉండకపోవచ్చు.  కాని ప్రభువు సహాయంతో అన్నింటిని ఎదుర్కోవచ్చు మరియు మనము ఎదగవచ్చు. 

Br. Pavan OCD

మార్కు 8: 11-13

 February 17

ఆదికాండము 4: 1-15, 25

మార్కు 8: 11-13

కొందరు పరిసయ్యులు యేసువద్దకు వచ్చి ఆయనను శోధించుచు "పరలోకమునుండి ఒక గురుతును చూపుము" అని ఆయనతో వాదింపసాగిరి. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, "ఈ తరము వారు ఏల ఒక గురుతును కోరుచున్నారు? వారికి ఎట్టి గురుతును ఈయబడదని నిశ్చయముగ చెప్పుచున్నాను" అనెను ఆయన అచటనుండి  పడవనెక్కి సరస్సు ఆవలితీరమునకు సాగిపోయెను. 

ఆదికాండము పుస్తకం నుండి నేటి పఠనంలో, ఆదాము హవ్వలు  ఏదెను తోట నుండి బహిష్కరించబడ్డారని మనం చూస్తాము. వారు ఒక కుటుంబాన్ని ప్రారంభిస్తారు మరియు హవ్వ కయీను మరియు హేబెలుకు జన్మనిస్తుంది - మొదటివాడు భూమిని సాగు చేయగా, రెండవవాడు గొర్రెల కాపరి అయ్యాడు. హేబెలు కయీను కంటే ఎక్కువగా అభివృద్ధి చెందాడని మరియు ఇది చివరికి కయీను తన తమ్ముడిని చంపడానికి దారితీసిందని మనకు చెప్పబడింది. దేవుడు కయీనును అతని పాపానికి శిక్షిస్తాడు కానీ కయీను ప్రాణం తీసే వారిని ఇంకా ఎక్కువగా శిక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. 

పఠనం ముగింపులో, హవ్వ తన మూడవ కొడుకు సేతుకు జన్మనిస్తుంది. సువార్తలో, యేసు మళ్ళీ పరిసయ్యులతో విభేదిస్తున్నాడు ఎందుకంటే వారు   ప్రభువు  చేసినదంత చూచిన  తర్వాత కూడా, ప్రభువును నమ్మాలంటే క్రీస్తు నుండి ఒక సంకేతాన్ని కోరారు. మనం నమ్మే ముందు ఒక సంకేతాన్ని కోసం వేచి ఉంటే మనకు ఎప్పటికీ విశ్వాసం ఉండదు. దేవుడు అన్నీ చూస్తాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని మరియు అసూయ లేదా ఆగ్రహం మన చర్యలను పాలించనివ్వకూడదని మనకు గుర్తు చేయబడింది.

యేసు శుభవార్తను ప్రకటించడానికి మరియు ఆచరించడానికి చేసిన ప్రయత్నంలో చెడును మంచితో పాటు తీసుకున్నాడు. యేసు ఇబ్బంది కోసం వెతకకపోయినా, అది కూడా ఇబ్బంది కలిగించదు, ముఖ్యంగా దేవుని రాజ్యం యొక్క న్యాయం మరియు శాంతిని ప్రోత్సహించే విషయానికి వస్తే. కొన్ని వర్గాల నుండి ఆయనకు ఎదురైన ప్రతిఘటనను బట్టి చూస్తే, యేసు “తన ఆత్మ లోతుల్లో నుండి నిట్టూర్పు విడిచాడు” అనేదానికి సువార్తలు మరిన్ని ఉదాహరణలు అందించకపోవడం ఆశ్చర్యకరం! భక్తితో జీవించడానికి మన రోజువారీ ప్రయత్నాలలో మనం యేసుతో  నిరాశ సంబంధం కలిగి ఉండవచ్చు. మన ఆత్మల లోతుల్లో నుండి నిట్టూర్చే విధంగా మనమందరం ప్రతిఘటనను ఎదుర్కొన్నాము. కష్టం మనల్ని కనుగొన్నప్పుడు మనం అంతగా ఆశ్చర్యపోకూడదు. యేసులాగే, కష్టం మన దారికి వచ్చినప్పుడు, అది ఇతరుల జీవితాల్లో మంచి చేయకుండా - మరియు మంచిగా ఉండకుండా - మనల్ని నిరోధించకుండా ఉండటానికి మన వంతు కృషి చేద్దాం.

Br. Pavan OCD

లూకా 6: 17, 20-26

 February 16

యిర్మీయా 17: 5-8

మొదటి కొరింథీయులు 15: 12, 16-20

లూకా 6: 17, 20-26

 అటు పిమ్మట యేసు వారితో గూడ కొండ దిగివచ్చి, పెక్కు మంది అనుచరులతో మైదనమున నిలుచుండెను. యూదయా దేశమంతట నుండియు, యెరూషలేమునుండియు, తూరు సీదోను అను సముద్రతీరపు పట్టణములనుండి ప్రజలు అనేకులు అచట చేరియుండిరి. యేసు కనులెత్తి శిష్యులవైపు చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను: "పేదలగు మీరు ధన్యులు. దేవరాజ్యము మీది. ఇపుడు ఆకలిగొనియున్న మీరు ధన్యులు. మీరు సంతృప్తి పరపబడుదురు. ఇపుడు శోకించు మీరు ధన్యులు మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము, మనుష్యులు మిమ్ము ద్వేషించి , వెలివేసి, నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆరోజున మీరు ఆనందపడుడు. మహానందపడుడు. ఏలయన, పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తలపట్ల  ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో! ధనికులారా! మీకనర్ధము. మీరు మీ సుఖములను అనుభవించియున్నారు. అయ్యో! ఇపుడు కడుపునిండినవారలారా! మీరు అనర్ధము. మీరు  ఆకలితో అలమటింతురు. అయ్యో! ఇపుడు నవ్వుచున్నవారలారా! మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరు మిమ్ము ప్రశంసించినపుడు మీకు అనర్ధము. వీరి పితరులు కపట ప్రవక్తల   పట్ల ఇట్లే ప్రవర్తించిరి. 

ఈరోజు మనం ప్రవక్త యిర్మీయా పుస్తకం నుండి చదివిన మొదటి పఠనం, మనం ఎల్లప్పుడూ దేవునిపై నమ్మకం ఉంచాలని గుర్తు చేస్తున్నది. జీవితంలో  మన తోటి వారిపట్ల   నమ్మకం ఉంచాలి.  మనం మొదటగా దేవునిపై నమ్మకం ఉంచాలి,  ఎందుకంటే దేవుడు మనకు శాశ్వత జీవితాన్ని ఇవ్వగలిగినప్పుడు,  మన తోటి పురుషులు మరియు స్త్రీలు మన కోసం చేయగలిగేది చాలా ఎక్కువ. ఈ ఇతివృత్తం కీర్తనలో కొనసాగుతుంది. సువార్తలో, మనకు సెయింట్ లూకా యొక్క శుభవార్తల వృత్తాంతం ఉంది - లూకా వివరించినట్లుగా జీవించడానికి క్రీస్తు  గొప్ప బ్లూప్రింట్. యేసు ప్రభువు చేసిన ప్రతి క్రియకు   లేదా బాధపడ్డ ప్రతిదానిలో, దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు, మనిషి కాదు. క్రీస్తు మృతులలో నుండి లేచాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది.

కొరింథులోని క్రైస్తవులకు రాసిన మొదటి లేఖలోని రెండవ పఠనంలో, క్రీస్తు పునరుత్థానం ఈ జీవితంలోనే కాదు, నిత్య జీవితంలోనూ ప్రభావం చూపుతుందని మనకు గుర్తు చేయబడింది. అలాగే, మనిషిపై నమ్మకం ఉంచడం ఈ జీవితానికి మాత్రమే కావచ్చు, దేవుణ్ణి నమ్మి సువిశేష ప్రకారం  జీవించడం మరియు సువార్త సూత్రాలు అందరికీ శాశ్వత జీవితాన్ని తెస్తాయి. మన అంతిమ నమ్మకం ఎల్లప్పుడూ నమ్మదగిన దేవునిపై ఉండాలి. మన అంతిమ నమ్మకం ;ఎప్పుడూ మోసం చేయని లేదా ద్రోహం చేయని నమ్మకమైన స్నేహితుడు అయిన దేవునిపై ఉండాలి. మన ప్రాథమిక నమ్మకం ఈ జీవితాన్ని జీవించడానికి మాత్రమే కాకుండా, దానిలో వృద్ధి చెందడానికి అనుమతిస్తుంది, ముఖ్యంగా మన స్వంత అపరిపూర్ణతలు మరియు ఇతరుల అసంపూర్ణతలుఎదురైనప్పుడు.  ఇతరులు మన లోతైన కోరికలు, మన లోతైన అవసరాలు, మన లోతైన కోరికలు మరియు మన లోతైన కలలను తప్పకుండా తీర్చాలని మనం ఆశిస్తే మనం శాపగ్రస్తులు. అలాంటి అంచనాలు చేదు, ఆగ్రహం మరియు నిరాశకు దారితీస్తాయి.

మానవులు ఎవరు  అలా లేనప్పుడు కూడా, ఎల్లప్పుడూ నమ్మదగిన దేవునిపై మనం నమ్మకం ఉంచి ఆ ప్రభువు దగ్గర  ఓదార్పు తీసుకుంటే మనం ధన్యులం. దేవునిపై మనకున్న నమ్మకం జీవితంలోని అనివార్య నిరాశల నుండి (- మనం పొందేవి, మనం కలిగించేవి - )మనల్ని తప్పించకపోయిన,  అది వాటిని అధిగమిస్తూ  పని చేయడానికి మరియు చివరికి వాటిని దాటి ముందుకు సాగడానికి వీలు కల్పిస్తుంది. దేవునిపై మనకున్న నమ్మకం మనం నమ్మదగిన  మార్గాలను   కనుగొనుటకు, వాటిలో ప్రయాణించుటకు  వీలు కల్పిస్తుంది. అదేవిధంగా, దేవునిపై మనకున్న నమ్మకం ఒకరినొకరు క్షమించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

Br. Pavan OCD 

7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

మార్కు 8: 1-10

 February 15

ఆదికాండము 3: 9-24

మార్కు 8: 1-10

మరియొకమారు  మహాజనసమూహము ఆయన యొద్దకు వచ్చెను. కాని, వారు భుజించుటకు ఏమియు  లేనందున, ఆయన తన శిష్యులను పిలిచి, వారితో, "నేటికీ మూడుదినములనుండి వీరు నాయొద్దఉన్నారు. వీరికి భుజించుటకు ఏమియులేదు. అందు వలన నాకు జాలి కలుగుచున్నది. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లి పోవుదురు. ఏలయన, వీరిలో కొందరు చాలదూరము నుండి వచ్చిరి" అని పలికెను. అందులకు ఆయన శిష్యులు, "ఈ ఎడారిలో మనము ఎక్కడనుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తిపరచగలము?" అని ప్రత్యుత్తరమిచ్చిరి. "మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి?"అని ఆయన ప్రశ్నింపగా, "ఏడు రొట్టెలున్నవి" అని వారు సమాధానమిచ్చిరి. అంతట యేసు ఆ జనసమూహమును అచట కూర్చుండ ఆజ్ఞాపించి, ఆ ఏడు రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి, వానిని త్రుంచి, వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. వారియొద్దనున్న  కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి, వానినికూడ వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరు సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగుచేసి, రమారమి నాలుగు వేలమంది. పిమ్మట ఆయన వారిని   పంపివేసి, వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో 'దల్మనూతా' ప్రాంతమునకు వెళ్లెను. 

యేసు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయనను అనుసరిస్తూనే ఉన్నారు. పైన చదివిన సువార్త ప్రకారం, వారు మూడు రోజులుగా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు వారికి ఆహారం అయిపోయింది. ఆకలితో ఉన్న ఈ వేలాది మందిని ఎలా పోషించాలో శిష్యులకు ఒక పెద్ద ప్రశ్న, కానీ ప్రభువు వారికి తన శక్తిని మరియు కరుణను  చూపించడానికి ఇది ఒక అవకాశం. ఎవరో ఒకరు ఏడు రొట్టెలు మరియు మరొకరు కొన్ని చేపలను అందిస్తారు. యేసు వారిని ఆశీర్వదించిన తర్వాత, ఈ చిన్న పని పెద్ద  అద్భుతంగా గుణించబడింది, తద్వారా ప్రతి ఒక్కరూ సంతృప్తిగా భుజించారు.  మరియు ఏడు బుట్టలు నిండా మిగిలిన వాటిని నింపారు.  

మన దేవుడు దయగలవాడు. ప్రజలు ఆకలితో ఉండటం ఆయనకు ఇష్టం లేదు. ఈనాటి సువిశేష భాగంలో , యేసు జాలిపడ్డాడు. నిర్గమకాండ సమయంలో ఎడారిలో ఉన్న ఇశ్రాయేలీయుల మాదిరిగా ప్రజలు ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ ప్రభువు వారి సమస్యను తెలుసుకొని  మరియు వారి అవసరాన్ని తీర్చడానికి ఆయన వేగంగా కదిలాడు. వారి ఆకలిని తీర్చుతున్నారు.

ఎటువంటి సందేహం లేకుండా, మన దేవుడు ఉదారవంతుడు.   యేసు ప్రభువు గుణకారానికి దేవుడు. రొట్టెలు మరియు చేపల గుణకారం యొక్క ఈ కథ మన ఆశ మరియు బలానికి మూలం. యేసు కొరతను మిగులుగా మార్చడాన్ని మనం చూశాము. మన దగ్గర ఉన్నదాన్ని అర్పిద్దాం మరియు వాటిని ఆశీర్వదించి గుణించమని ప్రభువును వేడుకుందాం. ఆయన శక్తి మరియు దాతృత్వాన్ని మనం విశ్వసిస్తే మనం ఆకలితో అలమటించము. యేసు మన పట్ల దయగలవాడు మరియు ఉదారంగా ఉన్నట్లే, మనం ఇతరుల పట్ల ఉదారంగా మరియు దయగలవాడుగా ఉండటం నేర్చుకుందాం. మన పొరుగువారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ మార్గాలను కనుగొనుటకు ప్రయత్నిద్దాం. 

Br. Pavan OCD

మార్కు 7: 31-37

 February 14

ఆదికాండము 3: 1-8

మార్కు 7: 31-37

పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి, సీదోను, దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలీయ సరస్సు తీరమును చేరెను. అపుడు అచటి జనులు మూగ, చెవిటివానిని ఆయనయొద్దకు తీసికొని వచ్చి, వాని మీద ఆయన హస్తమునుంచుమని ప్రార్ధించిరి. యేసు వానిని జనసమూహమునుండి ప్రక్కకు తీసికొనిపోయి, వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి, ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి, ఆకాశమువైపు కన్నులెత్తి, నిట్టూర్చి"ఎప్ఫతా" అనెను. అనగా "తెరువబడుము" అని అర్ధము. వెంటనే వాని చెవులు తెరువబడెను. నాలుక పట్లుసడలి వాడు తేలికగా మాటాడసాగెను. "ఇది ఎవరితో చెప్పరాదు" అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్నకొలది మరింత ఎక్కవగా దానిని వారు ప్రచారముచేసిరి. "చెవిటివారు వినునట్లుగా, మూగవారు మాటాడునట్లుగా సమస్తమును ఈయన చక్కపరచియున్నాడు" అని అందరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. 

మార్కు సువార్తలోని ఈరోజు  సువిశేష భాగం కొన్ని   విషయాలను మన దృష్టిలో ఉంచుతుంది. యేసు తన చేతి స్పర్శతో ఒక వ్యక్తి చెవిటితనాన్ని మరియు వాక్కు  లోపాన్ని నయం చేసి అతనికి పూర్తిగా కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఈ కథ క్రీస్తు మన జీవితాలపై ఎంత ప్రభావం చూపగలదో  మనకు గుర్తు చేస్తుంది. ఆయన ప్రతిరోజూ మనకు పంపే  ఆశీర్వాదాలను లేదా ఆయన మన జీవితాల్లో చేసే చిన్న అద్భుతాలను మనం గ్రహించకపోవచ్చు. బహుశా అది స్నేహితుడి నుండి వచ్చిన తీపి గమనిక, పనిలో ఊహించని పదోన్నతి లేదా బహుమతి కష్టాలను అధిగమించడం లాంటిది కావచ్చు. దేవుణ్ణి నమ్మి  మరియు విశ్వాసం కలిగి ఉండి జీవిస్తున్నపుడు  ఆయన మన ప్రార్థనలన్నింటికీ సమాధానం ఇస్తాడు. విశ్వాస స్ఫూర్తి జీవితాన్ని, సంఘటనలను, చరిత్రను దేవుడు ప్రత్యక్షమయ్యే ప్రదేశాలుగా చూడమని మనల్ని ఆహ్వానిస్తుంది. ఇక్కడ మనము  విశ్వాసం యొక్క వెలుగులో, దేవుని వెలుగులో ప్రతిదానిని చూడటం గురించి, ఆయన వాక్యంలో, స్త్రీ పురుషులలో, పేదవారిలో, ప్రకృతిలో, చరిత్రలో మరియు మనలో ఆయన ఉనికిని కనుగొనడం గురించి మాట్లాడుతున్నాము. మన సమాజానికి మనం వెలుగు మరియు నిప్పురవ్వలం.

“ప్రభువైన యేసు, నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపుము మరియు నా హృదయాన్ని ప్రేమ మరియు కరుణతో నింపుము. ఇతరుల అవసరాల పట్ల నన్ను శ్రద్ధ వహించువిధంగా దీవించండి. అపుడు  ఇతరుల పట్ల   దయ మరియు శ్రద్ధ చూపించగలను. ఇతరులు నీలో స్వస్థత మరియు సంపూర్ణతను కనుగొనడంలో నేను సహాయపడేలా నన్ను నీ దయ మరియు శాంతి యొక్క సాధనంగా చేయుము.” ఆమెన్.

Br. Pavan OCD

మార్కు 7 : 24 - 30

 February 13

ఆది 2 : 18 -25

మార్కు 7 : 24 - 30

అపుడు ఆయన ఆ స్థలమును వీడి, తూరు, సీదోను ప్రాంతములకు వెళ్లెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి,  అచట ఎవ్వరికి  తెలియకుండా ఉండగోరెను. కాని అది సాధ్యపడలేదు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెగల ఓకే స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి, ఆయన పాదములపై బడెను. దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరుప ప్రార్ధించెను. ఆమె గ్రీసు దేశీయురాలు సిరోపేనిష్యాలో పుట్టినది. అందుకు యేసు "పిల్లలు మొదట తృప్తిచెందవలెను. పిల్లలరొట్టెను తీసి కుక్కపిల్లలకు వేయుటతగదు" అని పలికెను. అప్పుడు ఆమె " అది నిజమే స్వామీ! కాని, పిల్లలుపడవేయు రొట్టెముక్కలను భోజనపు బల్లక్రింద ఉన్న కుక్కపిల్లలును తినునుగదా!" అని బదులు పలికెను. అందుకు ఆయన, "నీ సమాధానము మెచ్చదగినది. నీ కుమార్తె స్వస్థత పొందినది. ఇక నీవు పోయిరమ్ము" అని చెప్పెను. అంతట ఆమె ఇంటికి వెళ్లి దయ్యము వదలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండియుండుటను చూచెను. 

ఓ స్త్రీ, నీ విశ్వాసం గొప్పది. నీ ఇష్టప్రకారమే నీకు జరగాలి” (మత్తయి 15:28).  ఆమెకు తగినంత విశ్వాసం ఉంది, ఎందుకంటే ఆమెకు పురాతన అద్భుతాలు, ఆజ్ఞలు మరియు ప్రవక్తల వాగ్దానాలు లేదా ప్రభువు ఇటీవల చేసిన వాగ్దానాలు తెలియవు. అదనంగా, ఆమె ప్రభువుచేత విస్మరించబడినప్పుడల్లా, ఆమె తన ప్రార్థనలలో పట్టుదలతో ఉండేది మరియు ఆయన రక్షకుడని ప్రజాదరణ పొందిన అభిప్రాయం ద్వారా మాత్రమే ఆమెకు తెలుసు అయినప్పటికీ, ఆమె ఆయనను అడగడం,  తట్టడం మానలేదు. దీని కారణంగా, ఆమె తాను వేడుకున్న గొప్ప లక్ష్యాన్ని సంపాదించుకుంది. 

మనలో ఎవరికైనా దురాశ, గర్వం, వ్యర్థ మహిమ, కోపం,  లేదా అసూయ మరియు ఇతర దుర్గుణాల మరకతో కలుషితమైన మనస్సాక్షి ఉంటే, అతనికి కనానీయ స్త్రీలాగా “దయ్యం వల్ల తీవ్రంగా బాధపడే కుమార్తె” ఉన్నట్లు. అతను ప్రభువు వద్దకు త్వరపడి వెళ్లి, ఆమె స్వస్థత కోసం ప్రార్థన చేయాలి. తగిన వినయంతో విధేయత చూపిస్తూ, అటువంటి వ్యక్తి తనను తాను ఇశ్రాయేలు గొర్రెల సహవాసానికి (అంటే స్వచ్ఛమైన ఆత్మలకు) అర్హుడని నిర్ధారించుకోకూడదు, బదులుగా, అతను స్వర్గపు అనుగ్రహాలకు అనర్హుడని అభిప్రాయపడాలి. అయినప్పటికీ, అతను తన ప్రార్థన యొక్క శ్రద్ధ నుండి నిరాశ చెందకుండా, సందేహం లేకుండా తన మనస్సుతో, సర్వోన్నత దేవుని మంచితనాన్ని విశ్వసించాలి, ఎందుకంటే దొంగ నుండి ఒప్పుకోలుదారునిగా చేయగలవాడు (లూకా 23:39f.), హింసకుడి నుండి అపొస్తలుడుగా చేయగలవాడు (అపొస్తలుల కార్యములు 9:1-30, సుంకరి నుండి సువార్తికుడుగా (మత్తయి 9:9-13) మరియు అబ్రహం కోసం రాళ్ళతో కుమారులను చేయగలవాడు, అత్యంత అల్పమైన దానిని  కూడా ఇశ్రాయేలు(పవిత్రం) గొర్రెగా మార్చగలడు.

ఓ దయగల దేవా, మా బలహీనతలో మాకు రక్షణ కల్పించుము, నిర్మలమైన దేవుని తల్లి జ్ఞాపకార్థం జరుపుకునే మేము, ఆమె మధ్యవర్తిత్వం సహాయంతో, మా దోషాల నుండి బయటకు వచ్చి, అనేక   బాధలతో ఉన్న వారికి  మా జీవితాలు బహుమతులుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. ఆమెన్.

Br. Pavan OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...