4, జనవరి 2025, శనివారం
The Feast of Epiphany
28, డిసెంబర్ 2024, శనివారం
తిరు కుటుంబ పండుగ ఆదివారం
తిరు కుటుంబ పండుగ ఆదివారం
1 సమూయేలు 1:20-22, 24-28, 1 యోహాను 3:1-2, 21-24, లూకా 2:41-52
ఈనాడు తల్లి శ్రీ సభ తిరు కుటుంబ పండుగను కొనియాడుచున్నది. ఏసు మరియమ్మ మరియు ఏసేపు కుటుంబము ఆదర్శవంతమైన కుటుంబము మరియు పవిత్రమైనటువంటి కుటుంబము అని తెలుపుతూ ఆ యొక్క కుటుంబమును మన అందరి యొక్క కుటుంబములకు ఆదర్శంగా చేసుకొనమని తల్లి శ్రీ సభ ఈనాడు మన నుండి కోరుచున్నది. ఈయొక్క కుటుంబము ఆదర్శము ఎందుకనగా, ముగ్గురు కూడా తండ్రి చిత్తమును ప్రేమిస్తూ దానిని వారి యొక్క జీవితంలో నెరవేర్చారు. పరస్పరము ఒకరిని ఒకరు సహకరించుకుంటూ జీవించారు.
తండ్రికి తమ్ము తాము సమర్పించుకుంటు జీవించారు.
ఏసుక్రీస్తు ప్రభువు దేవుడైనప్పటికీ మానవునిగా ఒక కుటుంబంలో జన్మించారు ఆ కుటుంబంలో బిడ్డలు ఎలా జీవించాలో తెలిపారు. కాబట్టి ఆయన తన తల్లిదండ్రులతో జీవించిన విధానము అందరికీ కూడా ఒక సుమాత్రుకగా ఉండాలి. మరియమ్మ గారు ఏసేపు గారు ఏ విధముగా నైతే పుణ్య దంపతులుగా జీవించారో అదే విధముగా భార్యాభర్తలు జీవించాలి. ఏసేపు మరియమ్మ గారు వారి యొక్క దాంపత్య జీవితంలో అర్థం చేసుకుంటూ, ప్రేమను పంచుకుంటూ జీవింప సాగారు. మరీ ముఖ్యంగా బాల యేసు ప్రభువును ఈ లోకంలోనికి తీసుకొని రావడానికి వారు పొందినటువంటి అనేక శ్రమలు మనకు ఆదర్శం అవ్వాలి. దేవుని యొక్క కుటుంబంలో కూడా కష్టాలు వచ్చాయి కాబట్టి మన కుటుంబాలలో కష్టాలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు మనము పడిపోకుండా ధైర్యముగా నిలబడాలి.
ఈనాటి మొదటి పఠణంలో ఎల్కాన, హన్నా తమ బిడ్డ అయినటువంటి సమూయేలును దేవాలయంలో సమర్పించిన విధానమును చదువుకుంటున్నాము. ఈ భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవింప సాగారు ఎందుకనగా వారి యొక్క జీవితంలో హన్నాకు సంతానం లేని సమయంలో భర్త భార్యతో నీవు బాధపడవద్దు పది బిడ్డలకు సమానమైన భర్తను నేనున్నాను కదా అని తన భార్యను ఓదార్చి తనకు అండగా నిలబడ్డాడు. ఈ యొక్క కుటుంబము నిజముగా దేవుని మీద ఆధారపడుతూ జీవించిన కుటుంబం వారి యొక్క బిడ్డను కూడా దేవుని సేవ నిమిత్తము సమర్పించారు. ఈనాటి రెండవ పఠణంలో కూడా మనందరం కూడా దేవుని బిడ్డలం దేవుని యొక్క కుటుంబమునకు చెందిన వారసులమని తెలియజేస్తూ ఉన్నది.
ఈనాటి సువిశేష భాగములో మరియమ్మ గారు ఏసేబుగారు బాల యేసును దేవాలయములో సమర్పించిన విధానము అదేవిధంగా ఆయనను యెరుషలేము దేవాలయంలో కోల్పోయిన విధానము మరలా తిరిగి పొందుటన గురించి వింటున్నాం. ఈ యొక్క సువిశేష భాగములో వీరిద్దరూ కూడా తమ యొక్క విధులను నెరవేర్చారు. బిడ్డ మీద ఉన్న ప్రేమతో మరల తిరిగి బిడ్డను వెదకుచు ఆయన కోసం తపించి ఉన్నారు ఇది కేవలం ఆయన మీద ఉన్న ప్రేమ వలనే. ఈ యొక్క తిరు కుటుంబము నుండి మనము కూడా గమనించవలసినటువంటి కొన్ని అంశములు ఏమిటనగా
1. దేవుడిని కలిగి ఉన్న కుటుంబం
2. దేవునికి విధేయించిన కుటుంబం
3. నిస్వార్ధమైన కుటుంబం
4. ప్రేమ కలిగిన కుటుంబం
5. ఒకరినొకరు అర్థం చేసుకున్న కుటుంబం
6. వినయము కలిగిన కుటుంబం
7. బాధ్యతలు నెరవేర్చిన కుటుంబం.
ఈ యొక్క 2024వ సంవత్సర చివరి ఆదివారమున తిరు కుటుంబ పండుగ మన యొక్క కుటుంబాలు కూడా ఈ యొక్క తిరు కుటుంబమును పోలిన విధంగా ఉండాలి అని ఆలోచిస్తూ, మన కుటుంబములను సరిచేసుకుని జీవించటానికి ప్రయత్నం చేయాలి ఎందుకనగా కుటుంబమే బిడ్డలకు మొదటి పాఠశాల వారు అక్కడ నుండి అన్నీ కూడా నేర్చుకుంటారు కాబట్టి కుటుంబం మంచిదైతే సంఘం మంచిదవుతుంది, సంఘం మంచిదైతే ఊరే మంచిదవుతుంది, ఊరు మంచిదైతే రాష్ట్రం మంచిదవుతుంది ఈ విధంగా ఈ ప్రపంచమే మంచిగా అవుతుంది కాబట్టి మన కుటుంబములను సరిచేసుకుని జీవించటానికి ప్రయత్నం చేద్దాం.
Fr. Bala Yesu OCD
24, డిసెంబర్ 2024, మంగళవారం
క్రీస్తు జయంతి సందేశం"డిసెంబర్ 25
21, డిసెంబర్ 2024, శనివారం
ఆగమన కాల నాలుగవ సామాన్య ఆదివారం
14, డిసెంబర్ 2024, శనివారం
ఆగమన కాల మూడవ ఆదివారం
7, డిసెంబర్ 2024, శనివారం
ఆగమన కాలము 2 వ ఆదివారం
30, నవంబర్ 2024, శనివారం
ఆగమన కాలం మొదటి ఆదివారం
23, నవంబర్ 2024, శనివారం
34వ సామాన్య ఆదివారం
16, నవంబర్ 2024, శనివారం
33 వ సామాన్య ఆదివారం
15, నవంబర్ 2024, శుక్రవారం
అంత దినములు ఎలా ఉండును
అంత దినములు ఎలా ఉండును
లూకా 17: 26-37
నోవా దినములయందు ఎట్లుండెనో, మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము వారిని నాశనము చేసినది. ఇట్లే లోతు కాలమున కూడ జరిగినది. ప్రజలు తినుచు, త్రాగుచు, క్రయవిక్రయములు చేయుచు, సేద్యము చేయుచు, గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కాని లోతు సొదొమనుండి విడిచిపోయిన దినముననే ఆకాశము నుండి అగ్ని గంధకము వర్షింపగా అందరు నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును. ఆ నాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు క్రిందికి దిగిరాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడకమీద ఉన్న యిద్దరిలో ఒకడు కోనిపోబడును. ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ, ఒకరు కొనిపోబడును. మరియొకరు విడిచి పెట్టబడును." "ప్రభూ! ఇది ఎక్కడ జరుగును?" అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబరమున్న చోటనే రాబందులు చేరును" అని యేసు చెప్పెను.
అంతదినములు ఎలా ఉండును? అని ప్రభువు ఈ సువిశేషభాగంలో చెబుతున్నారు. ఒకసారి నోవా దినములను, లోతు దినములను గుర్తు చేస్తున్నారు. నోవా రోజులలో అందరు తినుచు త్రాగుచు ఉన్నారు. అందరు వారి వారి రోజు వారి పనులలో నిమగ్నమై ఉండగా ఎటువంటి హెచ్చరిక లేకుండా, హఠాత్తుగా జలప్రళయము వచ్చింది, లోతు కాలంలో ప్రజలు వారి వారి పనులలో ఉన్నారు. ఆసమయంలోనే ఆకాశం నుండి గంధకము వర్షించినది. ప్రభువు రోజు ఎప్పడు మనకు ఇష్ఠమైనపుడు, మనం కోరుకున్నప్పుడు రాదు.
ప్రభువురోజు ఎటువంటి హెచ్చరిక లేకుండా వస్తుందా? ప్రభువు అనేక రోజులకు ముందుగానే హెచ్చరిస్తారు. నోవా కాలంలో, మరియు లోతు కాలంలో కూడా ప్రభువు ప్రజలను హెచ్చరించాడు. అప్పటినుండి నోవా , లోతు ఆ రోజు కోసం సిద్ధపడ్డారు. నోవా దేవుని ఆజ్ఞ ప్రకారం ఒక ఓడను తయారు చేసాడు. మిగిలిన ప్రజలు వారి వారి పనులలో నిమగ్నమై ఉన్నారు కాని ప్రభువు మాటను పట్టించుకోలేదు. నోవా మాత్రము వారితో కలవకుండా తనకు దేవుడు చెప్పినట్లుగా చేసాడు. జలప్రళయము వచ్చింది నోవా కుటుంబము మాత్రమే రక్షించబడింది. మిగిలిన వారు మాత్రము ప్రాణములను కోల్పోయారు. లోతు కాలములో కూడా ప్రభువు ప్రజలను హెచ్చరించాడు , కాని వారు చేసే పనులలోనే వారు ఆనందం వెదుకుకున్నారు . అందరు వారి వారి పనులలో నిమగ్నం అయిపోయారు. లోతు కుటుంబము మిగిలిన వారి వలే కాకుండా జీవించడం జరిగింది. లోతు కుటుంబం రక్షించబడింది.
దేవుడు మనలను హెచ్చరించినప్పుడు మనం సిద్ధపడాలి, అలా కాకుండా అంత సవ్యముగా ఉన్నది అనే అపోహలో ఉండి క్షమాపణ పొంది, రక్షించబడే అవకాశం కోల్పోతారు. నోవా కుటుంబం రక్షించబడింది, కాని లోతు కుటుంబంలో అందరు రక్షించబడలేదు. లోతు భార్య దేవుడు చెప్పినట్లు చేయకుండా ఆ పట్టణమునకు ఏమి జరుగుతుందో చూడాలనుకుంది, వెనకకు తిరుగుతుంది. ఉప్పు స్థంభం వలె మారిపోతుంది. మన కుటుంబంలో దేవుడు ప్రేమించే వ్యక్తి ఉన్నంత మాత్రమున మన కుటుంబం మొత్తం రక్షించబడాలని లేదు. ప్రతి వ్యక్తి కూడా తాను పరివర్తన చెంది మారితే దేవుని అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. వారి కుటుంబంలో మంచి వారు ఉండటం కొంత వరకు మాత్రమే వారికి ఉపయోగపడుతుంది కాని వారి వ్యక్తిగత జీవితం కూడా ప్రభువు ఆజ్ఞలకు లోబడి ఉండాలి.
ప్రభువుని రాక సమయంలో కూడా ఇలానే జరుగును అని దేవునివాక్కు చెబుతుంది. ఇది ప్రతి ఒక్కరు వారి వారి జీవితములను సరిచూసుకుని జీవించాలి. ఆ రోజు ఎవరు అయితే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు రక్షించబడతారు. ఎవరి జీవితం మరియొకరి జీవితం మీద ఆధారపడి ఉండదు. ఎవరి జీవితమునకు వారే బాధ్యత వహించాలి. ఇది భయపడే రోజు ఏమి కాదు, ప్రతి నిత్యం సిద్దపడి ఉంటె అది ప్రభువు సాక్షాత్కారం అయ్యేరోజు. సరియైన సిద్ధపాటు లేకపోతే అది భయపడవలసిన రోజే అవుతుంది.
సిద్ధపాటు
ప్రభువు రాకడకు ఆయన అనుచరులు ప్రతి నిత్యం సిద్దమై ఉండాలి. ఎందుకు ప్రభువు రోజు కోసం ప్రతినిత్యం అప్రమత్తముగాను, సిద్ధముగాను ఉండాలి అంటే ఆ రోజు ఎలా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందరు వారి వారి పనులలో ఉన్నప్పుడు, అప్రమత్తంగా లేనప్పుడు వస్తుంది. దేవుని ఆజ్ఞలకు ఎవరు అయితే బద్ధులై ఉంటారో వారికి అది ఎప్పుడు వచ్చిన భయ పడవలసింది ఏమి ఉండదు. ఎందుకంటే వారు ఆ రోజు కోసం సిద్ధంగా ఉన్నారు. జలప్రళయము వచ్చినప్పుడు దేవుని మాట ప్రకారం జీవించిన నోవా కుటుంబం రక్షించబడింది, లోతు రక్షించబడ్డాడు. దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే దానికి సిద్దపడటం.
ప్రార్ధన : రక్షకుడవైన ప్రభువా! మీ రాకడకు నేను ఎప్పుడు సిద్ధముగా ఉండుటకు నోవా,లోతుల వలె మీ ఆజ్ఞలకు ఎప్పుడు బద్ధుడనై జీవించే విధంగా నన్ను మలచమని వేడుకుంటున్నాను. నా జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకుండా మీ ఆజ్ఞలను నేర్చుకుంటూ, మీ మాటను పాటించుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి. నా జీవితమును పవిత్రీకరించుకొనుటకు మీ అనుగ్రహాలు దయచేమని వేడుకుంటున్నాను. ఆమెన్
The Feast of Epiphany
The Feast of Epiphany క్రీస్తు సాక్షాత్కార పండుగ యెషయా 60:1-6,ఎఫేసీ3:2-3, మత్తయి 2:1-12 ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు జ్ఞానులపండుగను కొనియాడ...