25, ఫిబ్రవరి 2026, బుధవారం

జక్కయ్య యేసు ప్రభువు కలుసుకొనుట

 జక్కయ్య యేసు ప్రభువు కలుసుకొనుట 

లూకా 19: 1-10 

యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దానిగుండ వెళ్ళుచుండెనుఅక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెనుఅతడు యేసును చూడవలెనని యత్నించేనుకాని పొట్టివాడగుటచేతనుజనసమూహాము  ఎక్కువగా ఉండుటచేతను  చూడలేకపోయెనుకనుక అతడు ముందుకు పరుగుదీసి  దారిన పోవనున్న యేసును చూచుటకైఒక మేడి చెట్టును ఎక్కెనుయేసు అచటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో "జక్కయ్యత్వరగా దిగిరమ్ము దినము నేను నీ ఇంటిలోనుండ తలంచితినిఅని చెప్పెనుఅతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెనుఇది చూచిన వారందరు "ఈయన పాపియొద్దకు అతిధిగా వెళ్ళెనుఅని సణుగుకొనసాగిరిజక్కయ్య నిలబడి యేసుతో, "ప్రభూనేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదునునేను ఎవనికైనను అన్యాయము చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయుదునుఅని చెప్పెనుఅందుకు యేసు "నేడు  ఇంటికి రక్షణ వచ్చినదిఏలయనఇతడును అబ్రహాము కుమారుడేమనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు"అని అతనితో చెప్పెను.  

ఎవరు  జక్కయ్య ?

జక్కయ్య అంటే నీతిమంతునిగా పరిగణింపబడినవాడు అని అర్ధంమొదటిగా తన పేరుకు తగిన వాడిగా జీవించకపోయినప్పటికి తరువాత తన నామ సార్ధకం చేసుకున్నవాడు  అతను ఒక  సుంకరిమరియు ధనవంతుడు అనేక మంది సుంకం వసూలు చేసే వారికి ఒక అధిపతి లాంటి వాడుఅటువంటి వాడు యేసు ప్రభువుకోసం తన ధనం దానం చేసినవాడుఆస్తి అంతస్తులు కోసం మోసం చేయడంఎక్కువ పన్నులు వసూలు చేయడం వృత్తిగా ఎంచుకున్న వ్యక్తికాని తన ఆస్తిపాస్తులను తృణప్రాయంగా యేసు కోసం వదులుకున్నాడు అంటే యేసు ప్రభువును అతను ఎంతగా అభిమానించాడోప్రేమించాడో  మనం తెలుసుకోవచ్చుఊహించవచ్చు.    జక్కయ్య యేసుప్రభువును కలుసుకోవడానికిఆయన మాటలను వినటానికి  తనకు వచ్చే అన్ని ఆటంకములను అదిగమించిధృడ నిశ్చయంతో యేసు ప్రభువును చూసిన వ్యక్తియేసు ప్రభువు తన ఇంటికి వస్తాను అనగానే ఎంతో ప్రేమగా విందు తన ఇంటికి  తీసుకువెళ్లాడుతనకు తన కుటుంబమునకు రక్షణ తెచ్చుకున్నాడుతన జీవితంలో యేసు ప్రభువు కంటే ఏమి గొప్పది కాదు అని తన దాతృత్వాన్ని బాహాటంగా ప్రకటించిన వ్యక్తి తన ఆస్తిని ఇతరులకు  దానం చేసిన వ్యక్తికాని మొదటి నుండి ఆయన అటువంటి వాడు కాదుయేసు ప్రభువు రాకతోటి తన జీవితాన్ని మార్చుకొని యేసు అనుచరునిగా జీవించిన వ్యక్తి.

యెరికో పట్టణ ప్రాముఖ్యత ఏమిటి?

యేసు ప్రభువు యెరికో పట్టణము మీదుగా యెరుషలేము వెళుతున్నారుయేసు ప్రభుని చివరి ప్రయాణం ఇదిఆయన యెరుషలేము పోవాలనే నిర్ణయంతో ఉన్నారుఅక్కడ రక్షణ కార్యాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకొని వున్నారుమరల ఇక్కడకు రాకపోవచ్చుయెరికో యెరుషలేముకు సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుందికనుక త్వరగా అక్కడనుండి వెళ్ళాలి అని  ప్రభువు అనుకొనుచున్నాడుయెరికో నగరమునకు   యేసు ప్రభువు వచ్చారని తెలుసుకొని చాలా మంది అక్కడకు వచ్చారువారిలో ఒకరు జక్కయ్య అనే ఒక సుంకరి.

ఏమిటి యెరికో యొక్క ప్రాముఖ్యత అంటే అది యిస్రాయేలు మొట్ట మొదటిగా కైవసం చేసుకున్న వాగ్దాన భూమిలో భాగంఇక్కడ నుండి వారు మిగిలిన ప్రాంతమును కైవసం చేసుకున్నారుయేసు ప్రభువు కాలంలో కూడా  ప్రాంతం చాలా ముఖ్యమైనది ప్రాంతం వేసవి కాలంలో రోమా పౌరులలో ధనవంతులకు  నగరం విడిది ప్రదేశంగా ఉండేదివాణిజ్య పరంగా యెరికో చాలా ముఖ్యమైన పట్టణం ఎందుకంటే  జేరికో నుండే , అక్కడ ఉన్నటునవంటి ఓడరేవు ద్వారా ఎన్నో రకాలుగా ఉత్పత్తులను ఎగుమతి చేసేవారు.  మరియు అక్కడ ఉన్నటువంటి మూడు ప్రధాన పన్నులు వసూలు చేసే కేంద్రాలలో యెరికో ఒకటిఇక్కడ ఉండేటువంటి జక్కయ్య  పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి సుంకరులకు నాయకుడుమరియు  పట్టణములోని ఒక ప్రముఖ ధనవంతుడుఆవిధంగా ఆయన యెరికోలో ప్రముఖుడు  యెరికో చాలా ముఖ్యమైన గొప్ప నగరముగానే కాక యిస్రాయేలు చరిత్ర ప్రకారముగా కూడా ముఖ్యమైనది కనుక  వారు ఎలా మొదటగా వాగ్ధాన భూమిలో అడుగుపెట్టి యెరికోలో మొదటి విజయం పొందారో యేసు ప్రభువు మొదటిగా యెరుషలేములో రక్షణ కార్యం పూర్తి చేసేముందుగాఒక తప్పి పోయిన వానిని వెదకి రక్షించడం ద్వారా తాను  లోకంలోనికి వచ్చిన పనికి  యెరుషలేము వెళ్ళే ముందుగానే మొదటి విజయమును జక్కయ్య రక్షణ ద్వారా చూస్తున్నారు  

ఒక సుంకరికి ప్రజలు ఇచ్చే గౌరవం ఏమిటి

సుంకరి యేసు ప్రభువు దగ్గరకు రావడం చాలా  అరుదుగా జరుగుతుందిఎందుకంటే అతడు పన్నులు వసూలు చేసేవాడుప్రజలు అందరు యేసు ప్రభువును చూడటానికి , ఆయన మాటలు వినడానికి వస్తుంటారుఅప్పుడు అక్కడ సుంకరిని చూసినట్లయితే వారిని అగౌరవంగా చూస్తారుకనుక చాలా అవసరం అయితేనే వారు ఇతరులను కలవడానికి , మరి ముఖ్యంగా పది మందిలో కలవడానికి సిద్ధపడుతారు తప్ప అవసరం లేకుండా ఎవరిని కలువరు సుంకరులు సాధారణంగా ధనికులుఆస్తిపాస్తుల కోసం ఎటువంటి పనులనైన చేయడానికి సిద్ధంగా ఉండేవాడుసంపాదనే ధ్యేయంగా జీవించే ఒక వ్యక్తులువీరిని దేశద్రోహులుగా చూసేవారువీరు రోమా సామ్రాజ్యం తరుపున  చాలా కఠినముగా పన్నులు వసూలు చేసేవారుపేదవారు , విధవరాలు అని కూడా చూడకుండాదయకనికరం లేకుండా పన్నులు వసూలు చేసేవారురోమా సామ్రాజ్యం వారికి ఎంత వసూలు చేయాలో ముందుగా ముందుగానే వారికి ఒక లక్ష్యం పెడుతుందిఇది వారు ముందుగానే కత్తి తరువాత వారికి ఇష్టమైన విధంగా  వారు వసూలు చేస్తూనే వుండేవారు విధంగా వీరు ధనికులు అయ్యారని ప్రజలను పీడిస్తున్నారని , వీరి మీద ప్రజలకు కోపం ఉండేది అటువంటి ఒక వ్యక్తులకు నాయకుడు అయిన జక్కయ్య యేసు ప్రభువును చూడటానికి వస్తున్నాడు.

ఎందుకు జక్కయ్య యేసు ప్రభువును చూడాలి అని అనుకుంటున్నాడు

జక్కయ్య యేసు ప్రభువు గురించిఆయన సుంకరులను కూడా చేరదీయడం గురించి విని వుంటాడుయేసు ప్రభువు యొక్క అద్భుతాలను గురించి విని ఉంటాడుతాను కూడా పాపిని అనితాను ఆయన దగ్గరకు వెళితేతనను అంగీకరిస్తాడో లేదోఒకసారి ఆయన మాటలను విని ఆయనను  కలవడానికి  వెళ్లాలాలేదా అని నిర్ణయించుకోవడానికి వెళ్ళి వుండవచ్చుఒకసారి తనను కలసి తన పాప స్థితి గురించి చెప్పితనను క్షమించమని వేడుకోవడానికి వెళ్ళి వుండవచ్చు. తాను దేవుని నుండి దూరముగా ఉన్నానుఇక  పాప జీవితం జీవించలేను అని తనకు పాప క్షమాపణ ఇవ్వమని అడగడానికి వెళ్ళి ఉండవచ్చు.

జక్కయ్య యేసు ప్రభువును కలువుటకు గల ఆటంకములు ఏమిటి

జక్కయ్య ఇటువంటి ఆలోచనలతో యేసు ప్రభువును కలవాలి అని వెళుతునప్పటికి ఆయన యేసు ప్రభువును వెంటనే  కలవలేక పోతున్నాడుఆయనకు చాలా ఆటంకములు ఎదురు అవుతున్నాయివాటిలో కొన్ని ఏమిటి అంటే మొదటిగా తన పొట్టితనం పెద్ద ఆటంకం అవుతుందిజక్కయ్య  పొట్టివాడు కావడం వలన యేసు ప్రభువును చూడటానికి అది పెద్ద ఆటంకం అయ్యిందితనలో యేసు ప్రభువును చూడాలి అనే ఆశ ఇంకా ఎక్కువ అవడం వలన తన పొట్టితనంను అధిగమించడానికి ఆయన మెడి  చెట్టును ఎక్కుచున్నాడుతన పొట్టితనమును పట్టించుకోవడం లేదుదీనిని అధిగమించడానికి ఒక ఆయుధముగా చెట్టును చూస్తున్నాడువెంటనే  చెట్టును ఎక్కుచున్నాడుతనకు ఉన్న మరో ఆటంకం ఏమిటి అంటే అక్కడ ఉన్న సమూహంప్రజలు అందరు ఒక గుంపుగా ఉండుట వలనముందుకు వెళ్లలేక పోయాడు గుంపులో ఉన్నవారు ఎవరు అంటే వారు కూడా యేసు ప్రభువును చూడాలనుకున్న వారేవీరు అందరు జక్కయ్య కంటే ముందు ఉన్నారుఅనేక సార్లు యేసు ప్రభువును చూడాలిఆయనతో మాట్లాడాలి అనుకున్నవారు లేక ఆయనతో వున్నవారే ఆయనను కలవటానికి ఇతరులకు ఆటంకం అవుతున్నారు ఇంకా ఉన్న ఆటంకములు ఏమిటి అంటే తనకు ఉన్న పేరు ప్రఖ్యాతలుఒక వేళ యేసు ప్రభువు దగ్గరకు ఇంత ధనవంతునిగా ఉండిఒక సాదారణ వ్యక్తిలా ఆయనను  చూడటం కోసం చెట్లు ఎక్కడం ఏమిటి ? అని ఇతరులు అనుకుంటారు ఏమో అనే భావన కూడా ఒక ఆటంకంతన బంధువులు స్నేహితులు తన గురించి ఏమి అనుకుంటారో అని ఆటంకం ఇంకా మనకు కనపడే మరియొక ఆటంకం ఏమిటి అంటే తాను సుంకరి కాబట్టి తనను చూచిన ప్రజలు తనను హేళన చేస్తారు అని ఆయనకు భయం ఉండి ఉండవచ్చు ఇవి అన్ని జగ్గయ్యకు ఉన్నటువంటి ఆటంకములేకాని జక్కయ్య  ఆటంకాలు మొత్తం అధిగమించి యేసు ప్రభువును కలుస్తున్నారు.  

మన జీవితంలో యేసు ప్రభువును కలుసుకోవడానికి గల ఆటంకములు ఏమిటి?

మన జీవితములో యేసు ప్రభువును కలువటకు మనకు ఉన్నటువంటి ఆటంకం ఏమిటి అని మనం గుర్తించి దానిని అధిగమించి ఆయనను కలుసుకోవాలిఅది ఎంత వరకు మనం చేశాముఒక సారి ఆత్మ పరిశీలన చేసి చూసుకోవాలి ఆటంకాలను అధిగమిస్తూ ప్రభువును కలుసుకొనుటకు ప్రయత్నించాలిమనలను ప్రభువు దగ్గరకు పోవుటకు  ఏమి ఆటంక పరుస్తుందో ముందుగా మనం గ్రహించాలిఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామోఅప్పుడు దానిని  అధిగమించుటకు సులువుగా ఉంటుంది. 

జక్కయ్య గొప్పతనం

జక్కయ్య యేసుప్రభువు తన ఇంటికి వస్తాను అని అన్నందుకు చాలా ఆనందపడుతున్నాడుయేసు ప్రభువును చూడాలి అని మాత్రమే అనుకున్న వ్యక్తికిచాలా గొప్ప అవకాశం  వచ్చినందుకు దానిని సద్వినియోగం చేసుకోవాలని  జక్కయ్యఆయన  ఏమి చేయబోతున్నాడో మొత్తం చెబుతున్నాడుతన ఇంటికి వచ్చిన వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు అని ఆయనకు తెలుసుతనను అందరు అసహ్యంగా చూస్తున్నారు అని తెలిసి అటువంటి వ్యక్తి ఇంటికి వచ్చిన యేసు ప్రభువుకు తాను ఎవరినైన మోసము చేసినట్లయితే వానికి నాలుగు రేట్లు ఇస్తాను అని చెబుతున్నాడుతన ఆస్తిలో సగం పేదవారికి ఇస్తాను అని అంటున్నాడుతన దగ్గరకు వచ్చినది రక్షకుడు అని రక్షణ పొందటానికి జక్కయ్య తనను అర్హునిగా చేసుకుంటున్నాడు.

ప్రభువు ఎందుకు  లోకానికి వచ్చారుఆయన ఏమి చేస్తున్నారు

యేసు ప్రభువును చూచుటకు జక్కయ్య చేసిన అన్ని పనులను ప్రభువు గమనిస్తున్నాడుఅందుకే జగ్గయ్యతో, ‘జక్కయ్య దిగిరమ్ము నేను మీ ఇంట  రోజు ఉండదలచాను’ అని అంటున్నాడు. “మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడుఅని అతనితో చెప్పెను. అంటే యేసు ప్రభువు జక్కయ్య కోసం వచ్చాడుజక్కయ్య లాంటి వారికోసం వచ్చాడునీకోసం నాకోసం వచ్చాడు. “మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు మాటలు  సువిశేష భాగంలోనే కాదుబైబిల్ మొత్తంలో కూడా చాలా ముఖ్యమైనవిఎందుకంటే యేసు ప్రభువు  లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశ్యం గురించి చెపుతున్నాయి.  దేవుడు ఎవరో మనకు తెలియపరుస్తున్నాడుదేవుడు మనలను వేదకుతున్నారుమనలను కనుగొన్నప్పుడు ఆయన ఎంతో ఆనందపడుతున్నాడు.  దేవుడు వెదకటం ఆరంభిచిన తరువాత మనం ఆయనను వెదకుతున్నాము కనుక ఆయనను వెదికే వారికి ఆయన దర్శనం ఇస్తారు. 

వివేకవంతుడు అవుతున్న జక్కయ్య

జక్కయ్య యొక్క జీవితం ఒకసారి మనం చూడాలి ఎందుకంటే జక్కయ్య యేసు ప్రభువు తన ఇంటికి వచ్చిన తరువాత కొన్ని మాటలు చెపుతున్నాడుఅవి ఏమిటి అంటే నేను ఎవరినైన మోసం చేసినట్లయితే వారికి నాలుగు రేట్లు ఇస్తానుమరియు నా ఆస్తిలో సగం పేదవారికి ఇస్తాను అని చెబుతున్నాడుఎందుకు  మార్పు వచ్చింది అతనిలో  అంటే ఆయన ఎప్పటికీ ఊహించని సంఘటన తన జీవితంలో జరుగుతుందిఅది ఏమిటి అంటే అందరిని ఎంతో ప్రేమతో ఆదరించే వ్యక్తిపాపులను క్షమించే వ్యక్తితన లాంటి సుంకరిని మత్తయిని తన శిష్యుడుగా చేసుకున్న వ్యక్తిఅనేక మంది పాపులను క్షమించిన వ్యక్తి అందరు శిక్షించమని చెబుతున్న కానినేను నిన్ను శిక్షించను అని చెప్పిన ప్రభువుమరణించిన వారిని కూడా మరల జీవమిచ్చిన ప్రభువుఅందరు ఆయనను ముట్టుకున్న చాలు ఆనుకొని చాలా మంది ప్రజలు ఉండగా కరుణామయుడు నా యింటికి వచ్చాడు అనే ఆనందముతోమరియు తాను పాపి అని సుంకరి అని అందరిచేత ద్వేషింపబడే వాడినైన  నా యింటికి ప్రభువు వచ్చాడు అని ఆనందముతో నాకు ఇక సంపదలు లోక సౌఖ్యలు అన్నిటికంటే విలువైన ప్రభువు మార్గం కనుగొన్నాను అనే ఆనందముతో జక్కయ్య  మాటలు చెబుతున్నాడు. 

పశ్చాతాపం మనలను ఎలా మారుస్తుందిపశ్చాతాపం మనకు ఎలా కలుగుతుంది?

పశ్చాత్తాపం అంటే హృదయ పరివర్తనం. హృదయ పరివర్తనం మన జీవిత విధానం మరియు, లోకాన్ని మనం చూసే విధానంలో మార్పు తీసుకువస్తుంది. పౌలు గారి జీవితంలో ఇదే జరుగుతుంది, జక్కయ్య జీవితంలో ఈ మార్పు మనం చూస్తాము.   పశ్చాత్తాపం పొందిన ప్రతి వ్యక్తి జక్కయ్యలానే ప్రవర్తిస్తాడుఎందుకంటే పశ్చాత్తాపం మనిషికి ఏది ముఖ్యమో తెలియచేస్తుందిఏది విలువైనాదోఏది విలువ లేనిదో తెలియజేసివిలువైన దానిని  పొందడం కోసం ఎంతటి దానినైన  కోల్పోవడానికైనా సిద్ధ పడేలా చేస్తుందిఇక్కడ క్రీస్తు కోసంరక్షణ కోసం తన సంపదను తృణప్రాయంగా భావిస్తున్నాడు జక్కయ్యఇది జక్కయ్య యేసు ప్రభువు తనకు ఇచ్చిన రక్షణకుప్రేమకు బదులుగా చేస్తున్నాడుపశ్చాత్తాప పడటం లేక మారు మనస్సు పొందడం అనేదిప్రతి నిత్యం క్రీస్తుకు అనుకూలముగా మనలను మనము సంస్కరించు కోవడంక్రీస్తు ప్రేమకు అనుకూలముగా జక్కయ్య తనను తాను సంస్కరించుకుంటున్నాడుమనకు మార్గం చూపుతున్నాడుక్రీస్తు ప్రేమకు జక్కయ్య వలె మనము కూడా అదే విధంగా స్పందించాలిప్రతి నిత్యం మనల్ని మనం సంస్కరించుకోవాలి.

రక్షణ యొక్క ఫలాలు మన నిజ స్థితిని తెలియజేస్తాయా?

నేడు  ఇంటికి రక్షణ వచ్చినదిఏలయనఇతడును అబ్రహాము కుమారుడే." యేసు ప్రభువు జక్కయ్యను ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని అంటున్నాడుఇది జక్కయ్యకు చాలా గొప్ప ప్రశంస ఎందుకంటే సుంకరులను యూదులు ఎంత ఘోరముగా చూసేవారంటే హంతకులువ్యభిచారులు కంటే సుంకరులే ఘోరమైన పాపులుగా వారినిగా చూసేవారుఅటువంటి వ్యక్తిని యేసు ప్రభువు ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని అనటం గొప్ప ప్రశంస అబ్రహాము కుమారుడు అనడం అనే మాటకు చాలా ప్రాముఖ్యత ఉన్నదియోహను సువిశేషంలో 8: 39  వచనంలో యేసు ప్రభువు మీరు అబ్రహాము కుమారులు అయినచో ఆయన పనులే మీరు చేసేవారు అని చెబుతున్నాడుఅబ్రహాము కుమారులు లేక కుమార్తె అంటే మనం ఆయన వలె విశ్వాసం కలిగిఅబ్రహాము వలె దేవునికి చెందిన పనులువిశ్వాస జీవితపు పనులు చేయడం అవి మనలను అబ్రహాము బిడ్డలను చేస్తాయిఇప్పుడు జక్కయ్య తన పశ్చాత్తాపం ద్వారం తన ఆస్తిని దానం చేయడం ద్వారా తాను మోసం చేసిన వారికి  నాలుగు రేట్లు ఇవ్వడం ద్వారాయేసు ప్రభువు చేత అబ్రహాము కుమారుడు అని అనిపించుకుంటున్నాడు. మనం నిజ జీవితం ఇదే మనం దేవునికి చెందిన వారముఆయన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నిద్దాం.

లూకా 5: 1-11

 లూకా 5: 1-11

యేసు ఒక పర్యాయము గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయనయొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచట రెండు పడవలను చూచెను. జారరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డుననుండి లోనికి త్రోయమని, అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో "మీరు పడవను ఇంకను లోతునకు తీసికొని వెళ్లి చేపలకై మీ వలలను వేయుడు" అనెను అందుకు సీమోను "బోధకుడా! మేము  రాత్రి అంతయు శ్రమించితిమి. కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము" అని ప్రత్త్యుత్తరము ఇచ్చెను. వల వేయగనే,  వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు రెండవ పడవలోనున్న తమ తోటి వారికి, వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా, వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది  చూచి యేసు పాదములపై పడి "ప్రభూ ! నేను పాపాత్ముడను. నన్ను విడిచిపొండు" అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను, అతని తోటి వారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జెబదాయి కుమారులు యాకోబు, యోహానులును అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అపుడు సీమోనుతో "భయపడవలదు. ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు"అనెను. ఆజాలరులు పడవలను ఒడ్డునకుచేర్చి తమ సమస్తమును విడిచి పెట్టి యేసును అనుసరించిరి. 

ధ్యానము: దేవుని వాక్కును ఆలకించుటకు ప్రజలు నెట్టుకొనుచు ప్రభువు వద్దకు వస్తున్నారు. ప్రభువు వాక్కు దేవుని వాక్కు. ఆయన వాక్కు అధికారముతోను, సూచక క్రియలతోను, అద్భుతాలతోను, జాలి, దయ మరియు విడుదలతోను కూడి  ఉన్నది. దేవుని వాక్కు ప్రజలకు అనేక సందర్భంలో వస్తుంది. కాని యేసు ప్రభువె దేవుని వాక్కు. ప్రజలకు అనేక సంవత్సరాలుగా దేవుని వాక్కును వినిపించే వారు లేరు. యేసు ప్రభువుతోటి మరల దేవుని వాక్కును వింటున్నారు. దేవుని వాక్కును వినుటకు ప్రజలు ఎంతో ప్రేమతో, ఆశతో వస్తున్నారు. ఏమిటి ఈ దేవుని వాక్కు? ఈ వాక్కు ఏమి చేస్తుంది? దేవుని వాక్కు జీవం అయి ఉన్నది. వాక్కు దేవుడే. ఈ వాక్కు కేవలం జీవం మాత్రమే కాదు మానవునికి భరోసాను ఇస్తుంది. వాక్యం ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యం వెలుగునిస్తుంది. ఈ వాక్యం వివేకాన్ని ఇస్తుంది. ఈ వాక్కు మానవుని వక్ర మార్గాలను సరిచేస్తుంది. ఈ వాక్కు మానవుడు చేసిన పాపాలకు ప్రశ్చాత్తాపము పొందేలాగా చేస్తుంది. ఈ వాక్కు మనలను పాపవిముక్తులను చేస్తుంది. ఈ  వాక్యం మనకు మంచినే అనుసరించే శక్తిని ఇస్తుంది. యేసు ప్రభువు దగ్గరకు   ప్రజలు ఈ వాక్కును వినడానికి, పొందడానికి వస్తున్నారు. 

ప్రజలను చూసి  వారికి ప్రభువు  దేవుని వాక్కును వినిపిస్తున్నారు. దేవుని వాక్కును వింటున్న ప్రజలు ప్రభువు దగ్గర నుండి జీవం పొందుతున్నారు. విశ్వాసం పొందుతున్నారు. వారి జీవితాలలో దేవునికి వారికి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు, మరియు నుత్నికరించుకుంటున్నారు. ప్రభువు మాటలు విన్న వారు దేవుని సాన్నిధ్యాన్ని  పొందుతున్నారు.   ప్రభువు వద్ద నుండి ప్రజలు వాక్కును పొందటం ద్వార మరియు  ఆయన వద్దకు రావడం ద్వారా దేవునితో సఖ్యతను ఏర్పరుచుకుంటున్నారు. ప్రభువు దగ్గర వాక్కు వినుట వలన ప్రజలు నూతన జీవాన్ని పొందుతున్నారు.  ప్రభువు వాక్కును వినడం వలన వారికి కలిగే ప్రయోజనాలు ఆ ప్రజలకు తెలుసు, వారు అనుభవపూర్వకంగాఇది  తెలుసుకున్నారు.  ఎంతో మందిని ఆయన స్వస్థ పరచడం జరిగింది. కనుకనే ఆయన మాటలు వినడానికి ప్రజలు వస్తున్నారు. 

అక్కడ ఉన్న జాలరులు ప్రభువుకు  తన వాక్కును అందించడానికి,  పడవనిచ్చి అక్కడ  కూర్చొనడానికి  సహాయం చేశారు. ప్రభువు వాక్కు ఆ జాలరులు కూడా విన్నారు. ప్రభువు గొప్పవారు అని వారికి తెలుసు. దేవుని వాక్కు వినిన వారికి ఆయన వాక్కు యొక్క శక్తి కూడా తెలుసు. వారు ఆ రాత్రి మొత్తం చేపల కోసం శ్రమించారు అయినప్పటికీ వారికి ఏమి  దొరకలేదు. అందరి అవసరాలను చూసే ప్రభువు, రోగాలను తగ్గించే ప్రభువు, జీవాన్ని ఇచ్చే ప్రభువు, వీరి అవసరాన్ని గురించలేరా? ఆ ప్రభువు    వారి అవసరమును, వారి  నిరాశను గుర్తించి, వారికి చేపలు పడుటకు వలను ఎక్కడ వెయ్యాలో  చెబుతున్నారు. కాని దానికి వారు ప్రభువుతో మేము రాత్రి మొత్తం శ్రమించాము కాని ఫలితము లేదు అని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రభువు మీద వున్న విశ్వాసంతో, సముద్రము మీద వారికి ఉన్న అనుభవాన్ని, ఇంతకాలం వారు పనిచేసిన పరిజ్ఞానాన్ని పక్కన పెట్టి, ప్రభువు మాట ప్రకారం, ప్రభువు చెప్పినట్లు తమ వలలను వేస్తున్నారు. వారికీ ఆశ్చర్యకరంగా వారి వల చినుగునన్ని చేపలు పడుతున్నవి. 

ప్రభువు మాట వినుట వలన వచ్చే ప్రయోజము  ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ప్రభువు మాట వినుట వలన మనకు ఎప్పుడు సమృద్ధి కలుగుతుంది. అది ఎటువంటి సమృద్ధి అంటే కేవలం వారికి మాత్రమే కాక అనేక మంది ప్రయోజనం పొందే విధంగా కలుగుతుంది. అందుకే తోటి వారు సహాయము చేయుటకు అక్కడకు వస్తున్నారు. పేతురు గారు ఇది చూసి ప్రభువు పాదములపై పడి నేను పాపాత్ముడను నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అని అంటున్నారు. ఎందుకు పేతురుగారు నేను పాపాత్ముడను నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అని అంటున్నారంటే, పేతురుకి తన అనుభవం మొత్తం గుర్తుకు వస్తుంది. ఆ రోజు వరకు పేతురు గారు చేపలు పట్టే  వృత్తిలోనే ఉన్నాడు. ఎప్పుడు, ఎక్కడ చేపలు ఉంటాయో వారి అనుభవపూర్వకంగా తెలుసు. పేతురుకు తన అనుభవం మీద, తన వృత్తి మీద అపనమ్మకం లేదు. కాని తనకు తెలియని విషయం, తన అనుభవానికి మించిన జ్ఞానము ప్రభువు దగ్గర ఉన్నది అని ఆయనకు తెలుస్తుంది. ప్రభువు కేవలం ఒక ప్రవక్త కాదని, దేవుని రక్షకుడని , ప్రభువు పావనుడని ఆయనకు తెలుస్తుంది. తన పాప జీవితం లేక తన సాధరణ జీవితం, తాను జీవించే జీవితం ఆంధ్ పావనమైనది కాదని.   కనుక  ప్రభువు అంతటి పావనుని  సహచర్యంలో ఉండుటకు నేను అర్హుడను కాను అని తెలుసుకుంటున్నారు. అందుకే ప్రభువా నన్ను వదలి పొమ్ము అని   అంటున్నారు.  కానీ ప్రభువు మాత్రం పేతురుతో భయపడవలదు అని ధైర్యాన్ని ఇస్తున్నాడు. పేతురును ప్రభువు మనుషులను పట్టేవానిగా చేస్తాను అని అభయమిచ్చి పేతురును దీవిస్తున్నాడు. తరువాత పేతురు ప్రభువు శిష్యునిగా అనేక మందిని ప్రభువు అనుచరులుగా మారుస్తున్నారు. 

సంభాషణ : ప్రభువా! మీ వాక్కు ఎంత మధురమైనది. మీ వాక్కు వినుటకు ప్రజలు ఎంతో ఆశతో వస్తున్నారు. మీ వాక్కు వినుట వలన మాకు జరిగే ప్రయోజనము ఏమిటో మేము తెలుసుకుంటున్నాము. అందుకు మీ వాక్కు వినుటకు అందరు వస్తున్నారు. మీ మాట వినుట వలన మా జీవితంలో ఏమి కలుగుతుందో, మీ మాటను ఆలకించి చేపల కోసం వలను వేసిన వారి ద్వారా తెలుసుకుంటున్నాము. ప్రభువా మీరు ఓకే సాధారణ చేపలు పెట్టె వ్యక్తిని మనుషులను పట్టే వానిగా చేస్తున్నారు. 

ప్రార్థన : ప్రభువా! మీ వద్దకు ప్రజలు దేవుని వాక్కును వినడం కొరకు ఎంతో ఆశతో వస్తున్నారు. మీ దగ్గరకు వచ్చిన వారిని ఎంతో ఆనందంగా మీరు పంపుతున్నారు. వారు వారి వారి సమస్యల నుండి వారికి  విముక్తిని ఇస్తున్నారు. తండ్రితో వారి బంధాన్ని నుత్నికరించుకుంటున్నారు. అంతేకాక మీ మాటలు వినుట వలన ఎలా వలల నిండా చేపలు పడ్డాయో  చూసి పేతురు  మరియు జెబదాయి కుమారులు ఆశ్చర్యపోతున్నారు. మీరు పావనమూర్తి అని తెలుసుకుంటున్నారు. మేము మేము కూడా మిమ్ములను తెలుసుకొని, మా సమస్యల నుండి విముక్తి పొందేలా చేయండి. ఆ జాలరుల వలె మిమ్ము అనుసరించే అనుగ్రహం దయచేయండి ఆమెన్. 


పాస్కా ఆరవ ఆదివారం

 పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియ...