13, నవంబర్ 2021, శనివారం

33 వ సామాన్య ఆదివారం

33 వ సామాన్య ఆదివారం

దానియేలు 12:1-3, హెబ్రీ 10:11-14,18  మార్కు 13:24-32

నేటి దివ్య గ్రంధ పఠనాలు దేవుడు ఎప్పుడు  మనతో ఉంటారనే విషయాన్ని గురించి

 బోధిస్తున్నాయి. మన  యొక్క  కష్ట కాలంలో  అంత్య దినములలో దేవుడు మనతో 

ఉంటారని తెలుపుచున్నా యి,  ఈ పఠనాలు.  అలాగే ఈ దివ్య పఠనాలు దేవుని  రెండవ 

రాకడను గురించి కూడా బోధిస్తున్నాయి. దేవుని యొక్క రాకడకై  అందరు  సంసిద్దులై జీవించాలి.

ఈనాటి మొదటి పఠనంలో దానియేలు  ప్రవక్తకు కలిగిన నాల్గవ దర్శన వివరణ మనం

 వింటున్నాం.

మానవులు మరణించి సమాధి చేయబడిన తరువాత  మట్టిలో నిద్రించే చాలా మంది

 సజీవులగుదురు  అని చెపుతున్నాయి. ఆనాడు విశ్వాస పాత్రులుగా జీవిస్తున్న  

యూదులను నాలుగవ అంతియోకు అన్యాయంగా వారిని శిక్షకు గురిచేసి, చంపివేశారు. 

నాల్గవ అంతియోకు (సిరియా) గ్రీకు రాజు, ఆయన యూదా ప్రజలమీద అనేక రకాలైన 

 ఆంక్షలు విధించి, వారు గ్రీకు మతస్తుల ఆచారాలను , పద్దతులను ఆచరించాలని 

ఒత్తిడి చేశారు. యూదా ప్రజల సున్నతిని తిరస్కరించారు, దేవాలయాన్ని ధ్వంసం 

చేశారు, దేవాలయంలో ఉన్న విలువైన వస్తువులను నాశనం చేశారు అది మాత్రమే 

కాకుండా వారికి విలువైన పవిత్ర గ్రంధం తోర యొక్క భాగాలను కాల్చి వేశారు. ప్రజలు 

గ్రీకు దేవతలను , దేవుళ్లను ఆరాధించాలని ఒత్తిడి చేసిన సమయంలో ప్రవక్తకు దేవుని 

యొక్క అభయ సందేశాలు వినిపించబడ్డాయి.

దేవుని పట్ల విశ్వసనీయత కలిగి జీవించిన ప్రతి యూదుడు కూడా, మరణించిన 

తరువాత,శరీరంతో పునరుత్థానం చెందుతారని తెలుపు చున్నారు.

దానియేలు ప్రవక్త, బాధలు అనుభవించే ప్రజలకు ఒక ఊరట ఇస్తున్నారు. యావే దేవుడు

ఎప్పుడు కూడా తన ప్రజలకు చేరువలోనే ఉంటారని, యూదులు కూడా యావే దేవుడు 

కష్టకాలంలో,  ఈ లోకంలోకి దిగి వచ్చి తమకు తోడుంటారని ప్రగాఢంగా నమ్మారు.

దానియేలు గ్రంధం 11:21-39 వచనములు మనం చదివితే అక్కడ సిరియా రాజు 

యొక్కఅహం, ఆయన యొక్క దురాలోచనలు , ఆయన యొక్క స్వార్ధం , ఆయన చేసే 

హింసలుఅన్నీ అర్థమవుతాయి. ఎన్ని విపత్తులు ఎదురైన సరే ప్రజలలో ఒక విధమైన 

ఆశను,నమ్మకాన్ని కలుగజేస్తున్నారు ప్రవక్త.

వారి జీవిత అంత్య దినములు సంభవించినప్పుడు దేవుని కోసం 

ఎలాగా జీవిస్తున్నమన్నదిముఖ్యం. దేవుని జీవ గ్రంధమునా వ్రాయబడిన  పేర్ల వారు 

జీవిస్తారు అని తెలుపుచున్నారు.దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ , దైవ ప్రేమ, సోదర 

ప్రేమ కలిగిన వారందరి యొక్క  పేర్లు జీవ గ్రంధ మందు వ్రాయబడుతాయి. 

నిర్గమ 32:32-33, కీర్తన 69:28.

2 వ వచనంలో చనిపోయి మట్టిలో నిద్రించే వారు సజీవులగుదురు అని ప్రవక్త

 తెలుపుచున్నారు. ఇదియే క్రైస్తవ విశ్వాసం మరియు యూదుల విశ్వాసం , అంతిమ 

దినమున అందరు కూడా లేపబడుతారని తెలుసుకున్నాం. పవిత్ర గ్రంధంలో ఆనాడు 

యెహెజ్కేలుప్రవక్త ఎండిన ఎముకలకు ప్రవచనం చెప్పగానే వారు సజీవులై లేచారు. 

యెహెజ్కేలు 37:7-8.

దీని ద్వార ప్రభువు చెప్పే విషయము  మనకు అర్థమగుచున్నది. దేవుని కొరకు 

చనిపోయిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచి చనిపోయినవారు మరలా దేవుని కృప 

వలన సజీవులౌతారని. యెహెజ్కేలు 37:13. యూదులు పునరుత్థాన భాగ్యం కలుగుతుంది అనివిశ్వాసించారు. 2 మక్కబీయులు 7:9 . ఏడుగురు  సోదరులు ప్రాణాలు 

 త్యాగం చేయడానికిసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మరణం గురించి భయం లేదు. 

మరణం తరువాత దేవునితోజీవం ఉందని  గ్రహించారు/విశ్వాసించారు.యూదా ప్రజలు 

తమ జీవిత అంత్య కాలం గురించి కలవర పడ్డారు. వారి కష్టాలలో దేవుడు దానియేలు 

ప్రవక్త ద్వార వారితో మాట్లాడి, బాధలను స్వీకరించి, నీతివంతమైన జీవితం గడపడం 

ద్వార ఆనందం గా మృత్యువుని చేరుకొమ్మని అభయమిచ్చారు.

ఈనాటి మొదటి పఠనంలో విశ్వాసుల జీవితాలను  బలపరచిన వారికి , దైవ జ్ఞానం 

బోధించిన జ్ఞానులకు, దేవుని యొక్క ధర్మము నేర్పించిన వారు ఎల్లప్పుడు కూడా దేవుని 

యొక్క బహుమతి పొందుతారని ప్రవక్త తెలియ పరుస్తున్నారు. వివేకవంతులైన 

నీతిమంతులకు దేవుని తీర్పువలన బహుమానం లభిస్తుందని, మూర్ఖులు, దుష్టులు 

శిక్షించబడతారని ఈనాటి మొదటి పఠనం వివరిస్తుంది.

రెండవ పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వంకు ఉన్న గొప్ప తనం గురించి

 తెలుపుచున్నారు. పూర్వ నిబంధన ప్రధాన యాజకులు  ఒకే రకమగు బలులు

 అర్పించినప్పటికి ప్రజల పాపాలను తొలగించ లేకపోయారు. కానీ క్రీస్తు ప్రభువు తన 

యొక్కబలి ద్వార అందరి పాపాలను ఒక్కసారిగా మన్నించారు.

ఆయన సమర్పించిన బలికి రక్షణ సామర్ధ్యం ఉంది. యేసు క్రీస్తు సమర్పించిన ఈ ఒకే 

ఒక బలి విశ్వాసులను దేవుని ఎదుట  నీతిమంతులుగా చేస్తుంది,  శుద్దీకరిస్తుంది అధె 

విధముగా అందరిని  రక్షణ పొందుటకు  సహాయ పడుతుంది.  పాత నిబంధన 

గ్రంధంలోని  అన్నీబలులు కూడా క్రీస్తు ప్రభువు సమర్పించిన  కలువరి బలిలో 

పరిపూర్ణమైనవి. క్రీస్తు ప్రభువు ఈ బలి సమర్పించి  దేవుని కుడి ప్రక్కన 

ఆసీనుడైయున్నారు. ఆయన యొక్క యాజకత్వ సమర్పణ ద్వార, స్వీయ త్యాగం 

మనందరం నేడు శుద్దులుగా ఉంటున్నాం. పరిశుద్దత కలిగి ఉంటున్నాం. మనకు 

దేవుడు క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ ద్వార 

 

మనమందరం పాపములనుండి శాశ్వతంగా పవిత్రులుగా చేయబడితిమి.

ఈనాటి సువిశేష పఠనం దేవుని యొక్క రాకడను గురించి బోధిస్తుంది. క్రీ. శ . 69 లో

 రోమియులు క్రైస్తవులను, అధే విధంగా నూతనంగా   క్రైస్తవత్వమును స్వీకరించిన

 యూదులను హింసలకు గురిచేస్తున్న కాలంలో తన ప్రజల యొక్క విశ్వాసాన్ని

 బలపరచడానికి దేవుడు మరలా  వస్తాడనే నమ్మకం కలిగిస్తూ మార్కు గారు ఈ 

వచనాలను వ్రాస్తున్నారు. తనకు కలిగిన దర్శనం వల్ల మనుష్య కుమారుని రాకడ 

జరిగినప్పుడుప్రపంచంలో కొన్ని ప్రకృతి మార్పులు జరుగుతాయని అనగా సూర్యుణ్ణి 

చీకటి క్రమ్మటం, నక్షత్రాలు రాలి పడటం వంటి సంకేతాలు  కనిపిస్తాయని వివరించాడు.

వాస్తవానికి  నిజమైన విశ్వాసులకు అవన్నీ భయపెట్టే సంకేతాలు కావు. దేవుని ఆజ్ఞల 

ప్రకారంగా జీవించని వారికి మాత్రమే అవి భయాన్ని కలుగచేస్తాయి. యేసు ప్రభువు 

యొక్క మాట వలన మనమందరం అత్తి చెట్ల నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. అత్తి చెట్ల 

ఆకులు వసంత ఋతువు చివర్లోనే చిగురిస్తాయి. అవి అలా కనిపించినప్పుడు  ఒక క్రొత్త 

కాలం సంభవించినది అని మనకు తెలుస్తుంది. ఆకులు రాలిపోయాయి అంటే  చెట్టు 

చనిపోయింది అని కాదు అర్ధం, క్రొత్త ఆకులు వస్తాయి అని అర్ధం.  దేవుని యొక్క 

రెండవ రాకడ   జరిగినప్పుడు  కూడా క్రొత్త కాలం ప్రారంభమగుచున్నది, దానికి గాను 

అందరు కూడా విశ్వాసులుగా జీవించాలి. దేవునియొక్క రాకడ కోసం మనం ఎప్పుడు 

సంసిద్దులై జీవించాలి. లోకాంత్యం అంటే లోకం మొత్తంబూడిద కావడం కాదు. ఈ 

లోకంలో ఉన్న పాపం , ద్వేషం, సైతాను ఆలోచనలు అని కూడా వదలి లోకమంతా 

దేవుని  రాజ్యం ,ప్రేమ రాజ్యం , శాంతి రాజ్యంగా మార్చడమే. లోకమంతట నూతనత్వం , 

నవ జీవన వినూత్న చైతన్యం వర్ధిల్లీ ఉండటం. 

2 కోరింథీ 5:17 . యేసుప్రభువు చెప్పినటువంటి మూడు విషయాలు

-యెరుషలేము దేవాలయము ధ్వంసం

-లోకాంత్యం – దేవుని రాజ్యంగా మారటం

-క్రీస్తు ప్రభువు రెండవ రాకడ

మొదటి రెండు కూడా నెరవేరాయి కాబట్టి మూడవది తప్పక నెరవేరుతుందని ఆనాటి 

ప్రజలు విశ్వసించారు. దేవుని గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. తెలిస్తే ఆ 

సమయంలో సిద్దపడతారు. క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు మనం సిద్ద పడాలి.

దేవుని యొక్క రాకడ కొన్ని విషయాలను తెలియ పరుస్తుంది.

1.   సర్వం కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉంది.

2.  ఆయన క్రీస్తు నిజముగా దేవుడు అనే సత్యమును తెలియ పరుస్తుంది.

3.  దేవుడు మానవుల కష్టాలను తొలగించి వారికి సంతోషమును పంచి పెడతారు.

4.  దేవుడు రెండవ సారి వేంచేసే సమయంలో అందరు కూడా ఆయన మనుష్య కుమారుడని తెలుసుకొని విశ్వసిస్తారు. 27 వ వచనంలో  దూతలు దేవుడు ఎన్నుకొనిన వారిని ప్రోగుచేస్తారు.

1. ఎవరు ఎన్ను కొనబడిన వారు ? ఎవరైతే దేవుని యందు జ్ఞాన స్నానము పొంది ఉన్నారో

 అలాగే దేవుని కొరకు బాధలు అనుభవిస్తారో , ప్రార్థించే వారందరు ,సాయం చేసే వారందరు

 కూడా దేవుని యొక్క దూతల చేత  ప్రోగుచేయబడతారు. లూకా 18:7.

2.   ఎన్నుకొనబడిన వారు అంటే దేవుని యొక్క మెప్పు పొందిన వారు. రోమి 8:33

3.   పవిత్రులు , వినయవంతులు, సానుభూతి కలిగినవారు, సహనం కలిగిన వారు. కోలస్సీ 3:12.

ప్రపంచ నలుమూలల నుండి ఎన్నుకొనబడిన వారిని ప్రోగుచేస్తారు. మత్తయి 25:31-32.

-మన యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా జాగురుకులై  ఉండి  జీవించాలి.

మనం అంత్య కాలమునకు సిద్దపడాలి. దేవుని యొక్క ప్రకారం జీవిస్తే భయపదనక్కరలేదు.

 దేవుడు శాశ్వతంగా జీవించేవారు ఆయన పలోకిన ప్రతిమాట నెరవేరుతుంది. కాబట్టి మన

 జీవితంలో ఆయన రాకడ కోసం సిద్దపడుతూ జీవించాలి.

Rev.Fr. BalaYesu OCD


6, నవంబర్ 2021, శనివారం

32 వ సామాన్య ఆదివారం ( పేద వాని అర్పణ గొప్పతనం )

1 రాజులు17:10- 16          హెబ్రీ 9:  24-28       మార్కు 12:38-44 

ఈనాటి పఠనాలు దివ్య పఠనాలు  దేవునికి ఉదారంగా సమర్పించే అర్పణ గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క దీవెనల వలన  పొందిన ప్రతిది దేవునికి,  పొరుగు వారికి సమర్పించుటకు మనందరికీ మంచి హృదయం ఉండాలి అని ఈ దివ్య పఠనాలు మనకు తెలుపుచున్నాయి. దేవుని మీద ఆధారపడుతు  మనకు ఉన్నదంతా సమర్పించుకొని  జీవిస్తే  దేవుడు ఇంకా మనలను ఆశీర్వదిస్తారు. ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఏలియా ప్రవక్తను సారెఫతు వితంతువు దగ్గరకు పంపిస్తున్నారు. ఈమె ఒక అన్యురాలు  అయినప్పటికి  కూడా దేవుని యొక్క  కృపకు నొచుకుంది. 

ఈనాటి మొదటి పఠనం యొక్క సన్నివేశం మనం గమనించాలి. ఏలియా ప్రవక్త , "ఆహాబు రాజు , ఎసెబేలు రాణి మరియు మిగతా ప్రజలు అన్య దైవములను ఆరాధించే సమయములో మూడున్నర సంవత్సరాలు ఆ దేశమున కరువు వస్తుందని" ఏలియా ప్రవక్త హెచ్చరించారు. యాకోబు 5:17 . ఈ కరువు కాల సమయములో దేవుడు ఎలియాను సారెఫతు  పంపిస్తున్నారు. ఒక క్లిష్ట సమయములో  దేవుడు ధనమున్న వారిని వదలి వేసి కేవలం అద్భుతం చేయుటకు ఒక పేద వితంతువును ఎన్నుకొంటున్నారు. 

ఈమెలో వున్న కొన్ని ముఖ్య లక్షణాలు మనం ధ్యానించుకోవాలి. 

ఆమె యొక్క గొప్ప విశ్వాసం :- ఏలియా ప్రవక్త ఈమెతో తన కోసం రొట్టెను కాల్చుకొని రమ్మని పిలిచిన సందర్బంలో, వెంటనే దేవుని యందు వున్న విశ్వాసంతో  ఆమె ఏలియా కోరిన విధంగా చేశారు. మార్కు 9:23. తన యొక్క విశ్వాసం వలన దేవుడు అద్భుతం చేస్తారని నమ్మారు. విశ్వాసం ఉంటేనే దేవుడు అద్భుతాలు చేస్తారు. అబ్రహాము విశ్వసించారు కాబట్టి  జాతులకు  జ్యోతిగా దీవింపబడ్డారు. 

మోషే, దేవుడను విశ్వసించారు కాబట్టి యిస్రాయేలును నడిపించారు. ఉత్తమ నాయకునిగా పిలువబడ్డారు. కననీయ స్త్రీ  విశ్వసించినది కాబట్టి దేవుడిని అడిగింది, వరం పొందింది. యాయిరు విశ్వసించారు కాబట్టి యే  క్రీస్తుని మేలు చేయమని అడిగారు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసేది విశ్వాసంవలెనే . ఎందుకంటే - క్రైస్తవ జీవితానికి ,దేవున్ని వెంబడించేవారికి ఉండవలసిన ప్రధాన లక్షణం విశ్వాసం. 

-విశ్వాసం ఉంటేనే ప్రార్థిస్తాం 

-విశ్వాసం ఉంటేనే గుడికి వెళ్తాం

 -విశ్వాసం ఉంటేనే దేవుని ఆజ్ఞలు పాటిస్తాం 

-విశ్వాసం ఉంటేనే దేవున్ని వెంబడిస్తాం 

ఈమె యొక్క జీవితంలో దేవుని మీద సంపూర్ణ  విశ్వాసం ఉన్నది కాబట్టియే, ప్రవక్త మాటలను విశ్వసించింది. ఇది మాత్రమే కాదు. ఏలియా దేవుని ప్రవక్త అని విశ్వసించింది. దేవుడిని అతడు అడిగితే మేలు జరుగుతుందని విశ్వసించినది. 

2. ఉదారంగా ఇచ్చే  మనస్సు :- ఈ వితంతువు తన జీవితములో తనకు సహాయం చేసేవారు లేక పోయిన కానీ, తనకు ఉన్న దానిలో తాను ఉదారంగా ఇచ్చే మనస్సు ఉంది. 

ఆమె ఎలియతో నేను ఇవ్వను అని చెప్పి ఉండవచ్చు, కానీ తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటంలోనే నిజమైన సంతోషం , ప్రేమ దాగి ఉన్నాయి అని ఆమె భావించింది. 

-ఉదారంగా ఇస్తే దేవుడు దీవిస్తారని భావించింది. లూకా 6:38 

-ఉదారంగా ఇస్తే దేవుడు వారిని ప్రేమిస్తారు 2 కోరింథీ 9:6-7 

- మనకు ఉన్న దానిలో సహాయం చేయకపోతే మనం దేవుని ప్రేమలో ఎదగలేము 1 యోహాను 3:17 

ఈ వితంతువు ఉదారంగా  ఇచ్చారు కాబట్టియే ఆమె జీవితంలో ఎటువంటి కొరత లేదు. 

3. త్యాగం చేసే గుణం :- ఈ వితంతువు  పేదరికంలో ఉన్నప్పటికీ, ఎప్పుడు వర్షాలు వస్తాయో లేదో తెలియదు. అయినప్పటికీ ఆమె తమ యొక్క ఆహారం త్యాగం చేసుకున్నారు. ఈమె దగ్గర ఉన్నది కొద్దిగా మాత్రమే, అది తిని వారు కూడా చనిపోదాం అనుకున్నారు. ఆ పిండి కేవలం ఒక్కరికి మాత్రమే వస్తుంది.  అయిన ఆమె త్యాగం చేసింది. అంత బాధ అయిన పరిస్థితుల్లో  ఉన్న ఆమె తాగ్యం చేసి జీవించింది, అందుకే దేవుడు ఆమెను దీవించారు. ఆమె తన జీవితం మొత్తము దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు త్యాగం చేసుకొని జీవించింది. 

మనకు ఉన్న దానిలో త్యాగం చేసుకొని, దేవునికి  సమర్పించి జీవిస్తే, తప్పని సరిగా అది పెద్ద సమర్పణయే. చాలా సందర్బంలో దేవుడు మెచ్చుకునే సమర్పణ  ఏమిటంటే, దేవునికి ఉదారంగా యిచ్చుట - ఉదాహరణ- పేద విధవరాలి కానుక , తొలి క్రైస్తవ సంఘం , సారెఫతు వితంతువు. 

4. ఆమె యొక్క సంపూర్ణ విధేయత:-ఈమెలో దేవుని యొక్క ప్రవక్త పట్ల , దేవుని పట్ల ఉన్న విధేయత చూస్తున్నాం. చెప్పిన మాటను వెంటనే చేసింది. దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, విధేయత కలిగి జీవిస్తే, మన జీవితంలో ఎప్పుడు కూడా మేలు కలుగుతుంది. దేవునికి కావలసినది సంపూర్ణ విధేయత, నా చేతిలో ఏమీలేదు. అంతా   నీవే అని తెలిపే విధేయత. విధేయించిన చాలా మందిని  దేవుడు  దీవించారు. ఉదా-అబ్రహాము , మోషే, యోహోషువా, పేతురు మరియమ్మ, మొదలగువారు.

 ఈ వితంతువు కూడ దేవునికి విధేయత చూపుతూ జీవించింది. కరువు రోజులు గడిచి పోయే వరకు, తరగని ఆహారం అద్భుత వరంగా పొందింది. 

రెండవ పఠనంలో  యేసు క్రీస్తు  ప్రభువు  యొక్క యాజకత్వం  గురించి  బోధించబడింది. తండ్రి  దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్న యేసు క్రీస్తు ప్రభువు యాజకత్వం ఒక ప్రత్యేకత  కలిగి  ఉందని  రచయిత తెలుపుతున్నారు .  ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు,    పూర్వ నిబంధన కాలపు యాజకులకు మధ్య గల వ్యత్యాసాన్ని తెలియచేస్తున్నాడు. పూర్వ కాలపు ప్రధాన యాజకుడు, కేవలం మానవులు నిర్మించిన  గర్భ గుడిలో  ప్రవేశించగలిగారు. వారు ప్రతి నిత్యం,  పదే పదే బలులను అర్పించవలసి వచ్చేది. వారు తమను తాము  సమర్పించుకోలేదు. కానీ క్రీస్తు ప్రభువు  తనను తాను  సమర్పించుకున్నారు. తన జీవితం ఉదారంగా మనకు ఇచ్చారు, తన జీవితంను త్యాగం చేశారు. క్రీస్తు ప్రభువు తనను తాను సమర్పించుకొని నేరుగా పర లోకంలో , దేవుని సన్నిధిలో ప్రవేశించారు. తనను విశ్వసించి, తన చెంత చేరిన వారందరి, పాపాల పరిహారం కోసం, దేవునికి మొరపెడుతున్నారు. తన ప్రజల పాప పరిహారం కోసం యేసు ప్రభువు, ఒకే ఒక బలిని సమర్పించారు. దేవునికి విధేయత చూపుతూ, క్రీస్తు ప్రభువు జీవించారు. 

ఈనాటి  సువిశేషంలో  రెండు భాగాలు  ఉన్నాయి. మొదటి భాగంలో యేసు ప్రభువువారు  పరిసయ్యులు , ధర్మ  శాస్త్ర  భోధకుల  విశ్వాస జీవితాన్ని సరి చేస్తున్నారు. తమ స్వార్ధ ప్రయోజనాలకోసం , ధనార్జన  కోసం తమ అధికారాన్ని  దుర్వినియోగం చేయుటను,  యేసు ప్రభువు తీవ్రంగా ఖండిస్తున్నారు. మత పెద్దలు , పేదలను ,నిస్సహాయులైన  ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారని, వితంతువుల ఆస్తి- పాస్తులను,  కబళిస్తున్నారు అని యేసు ప్రభువు పరిసయ్యులను, మత పెద్దలను హెచ్చరిస్తున్నారు. 

ఈ ధర్మ శాస్త్ర  బోధకులు , పరిసయ్యులు చాలా గర్విష్టులు, అందరిని అసహ్యించుకునే వారు. స్వర్గానికి  వారు మాత్రమే వెళతామని నమ్ముతారు. ప్రజలు స్వర్గంలో ప్రవేశించాలంటే ముందుగా,  వారికి సేవలు చేయాలని కోరుకుంటారు. యూదులు సత్య ఉపదేశం ప్రకారం, దైవ జ్ఞానం తక్కువ ఉన్న ప్రజలు, ముందుగా ఎవరైనా  ధర్మ శాస్త్ర బోధకులు, వారి వద్దకు వస్తే నమస్కరించాలని కోరుకుంటారు. ఈ మత పెద్దలు వారికి దైవ జ్ఞానం  ఎక్కువగా ఉందని భావించేవారు. దేవుడు వారు  చెప్పినట్లు వింటారు అనుకుంటారు. ప్రజా నాయకులు మతం పేరుతో, పేద ప్రజల నుండి ధనం లాగుకునేవారు. ధన దాహం వారికి ఎక్కువగా ఉండేది. అవసరంలో ఉన్న వారి పట్ల వారికి ఏ మాత్రం జాలి , ప్రేమ , కరుణ ఉండవు. 

ప్రజలు దైవ రాజ్యంలో  ప్రవేశించడానికి ఈ మత పెద్దలే   ఆటంకముగా ఉంటున్నారు. 13 వ వచనం (మత్తయి   23:13-14). వారి యొక్క  అసత్య బోధనల వలన , వారి యొక్క వివిధ రకాల ఆజ్ఞల వలన , వారు మోపించే  భారాల వలన, ప్రజలను పర లోకంలో ప్రవేశించకుండా ఒక ఆటంకంగా ఉంటున్నారు. 

మత పెద్దలు విందుల యందు, ఆసనములను కోరుకునేవారు. ఎందుకంటే మోషే  ధర్మ  శాస్త్రమును, బాగా చదివినవారు అనే ఆహం తో వున్నారు కాబట్టి, ఇవన్నీ కూడా వారి కపట జీవితానికి సూచనలు. వారిలో నిజమైన దైవ భక్తి లేదు. 

సువిశేష రెండవ భాగంలో  పేద వితంతువు యొక్క కానుకను దేవుడు అభినందించిన విధానం మనం  చదువుచున్నాము. కానుకల పెట్టె దగ్గర  ప్రతి ఒక్కరి యొక్క కానుకను ప్రభువు పరిశీలించారు. చాలా మంది ధనవంతులు,  వారు కానుక వేసేటప్పుడు, అది అందరికి కనబడాలని, విసిరి వేస్తూ ఉంటారు. ఆనాటి ధర్మ శాస్త్ర బోధకులు కూడా అలాగే అందరికి కనబడేలా విసిరి వేసేవారు,  ఎవరెవరు ఎంత వేసేది బాగా కనపడుతుంది. 

ధనవంతులు, అలా ధర్మ పెట్టెలో వేసే కానుకలు అందరూ బాగా చూడవచ్చు. ఎందుకంటే వారే చూపించుకోవాలి అనుకుంటున్నారు. వారి యొక్క సమర్పణ దేవునికి నచ్చలేదు. వారు కేవలం వారి యొక్క విధులు, బాధ్యతలు మాత్రమే నెరవేర్చారు. వారు ఇచ్చింది కూడా చూపించుకోటానికే, నిజంగా దేవునికి ఇవ్వటానికి కాదు. ఇతరులు తమ   గురించి  తెలుసుకోవాలని అలా చేశారు. 

ప్రభువు పేదరాలి యొక్క కానుకను మెచ్చుకున్నారు. వితంతువులకు సమాజంలో  ఆదరణ లేదు, ఆదాయం ఎక్కువగా లేదు, బయటకు వస్తే హేళన చేసేవారు. అయినప్పటికీ తనకు ఉన్నదంతా దేవునికి సమర్పించారు. 

మిగతవారు వారికి ఇవ్వబడిన సమృద్దిలో సమర్పిస్తే ఈమె మాత్రం తన దగ్గర ఉన్న మొత్తం సమర్పించారు. ఆమె మొదట్లో కానుక  ఇచ్చేటప్పుడు, ఈ కానుక చిన్నది అని ఆలోచించి ఉండవచ్చు, అయినప్పటికీ, నాకు ఉన్నదంతా నీదేనయ్యా , అని దేవునికి సమర్పించింది. ఈ రోజు  మనం కూడా దేవునికి మనకున్న దానిలోనే కొద్దిగా దేవునికి ఇస్తున్నాము, కానీ దేవునికి మొత్తం సమర్పించుట లేదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతిభలను ఆయన సేవకు సమర్పిస్తున్నవా? దేవుడిచ్చిన మంచితనం ,ప్రేమ సమర్పిస్తున్నవా? ధనమును దేవునికి సమర్పిస్తున్నవా ? మనకు ఉన్నదంతా ఇవ్వాలంటే, సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడి జీవించాలి. దేవుడిస్తారనే నమ్మకం ఉండాలి. 

దేవున్ని సంపూర్ణంగా నమ్మిన వారే ఇలాగా ఉండగలరు. మన జీవితంలో కూడా, క్రీస్తు ప్రభువు కోసం, మనకు ఉన్నదంతా, త్యాగం చేసి జీవించాలి. తొలి క్రైస్తవ సంఘం,  అన్నీ కూడా అమ్మి వేసుకొని, అందరు పంచుకొని ఒకరికొకరు సహాయం చేసుకొని సంతోషంగా జీవించారు. మనం కూడా దేవునికి సంపూర్ణంగా ఇవ్వాలి. ఇస్తే దేవుడే ఇస్తారు.  

Rev.Fr. Bala Yesu OCD

సామాన్య 32 వ ఆదివారం (2)

 1రాజులు 17 :10 - 16, హెబ్రీ 9: 24 - 28, మార్కు 12: 38 -44

క్రిస్తునాధుని యందు ప్రియమైన బిడ్డలారా సహోదరి సహ్ోదరులారా నాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను మనం గమనించినట్లయితే ఉదార స్వభావం గురించి బోధిస్తున్నాయి

మనం ఒక మంచి గుర్తింపు కోసం తాపత్రయ పడే సమాజంలో జీవిస్తాం. నేటి సమాజంలో హోదా, గౌరవం, ఆకర్షణీయ రూపం చాల ముఖ్యం. వాస్తవానికి మనం ఎలాంటి వారమైన అందరూ మనల్ని ఎలా చుస్తున్నారన్నదే ప్రదానం. నాటి సువార్తలో ధర్మశాస్ర బోధకులను, పదుగురి గుర్తింపు కోసం తాపత్రయ పడే వారీగా చూపిస్తూ, అందుకు భిన్నంగా అసలు గుర్తింపు గురించి ఆలోచన ,ధ్యాసే లేని ఒక పేద విధవరాలితో పోల్చి ఆమెను అణకువకు, సంపూర్ణ ఆత్మ సమర్పణకు ఆదర్శంగా చూపించటం జరిగింది.

గుర్తింపుకై ఆరాటం : ధర్మశాస్త్ర బోధకులు చట్టాన్ని వివరించే వారీగా, వారి గొప్ప జ్ఞానాన్ని బట్టి ప్రజల గౌరవాన్ని పొందేవారు. చట్టం పట్ల వారి భక్తిని వ్యక్తపరుస్తూ వారు పొడుగాటి తెల్లని వస్త్రాలను ధరించే వారు. వారు ఎదురొస్తే ప్రజలు లేచి నిలబడి వారిని బోధకుడా అని గౌరవంగా నమస్కరించాల్సి ఉంటుంది. అసలు సమస్య ఏటంటే ఇలా గౌరవాన్ని పొందడాన్ని వారు తమ హక్కుగా భావించటం మొదలై చివరకు అది వారి అహంభావానికి, హోదాకు, ప్రతిష్టకు గుర్తుగా మారిపోయింది. దేవుని చుట్టం పట్ల చూపాల్సిన గౌరవాన్ని వారు తమ పట్ల చూపాలని కోరుకొసాగారు. ఈనాటి మన సమాజంలో కూడా పదవిలో ఉండే కొందరు ఇలాగే ప్రవర్తిస్తుంటారు అందుకే ప్రభువు, ధర్మశాస్త్ర బోధకులను, విధవరాండ్ర ఆస్తులను దిగమింగే స్వార్థపరులైన దోపిడీ దారులుగా బహిరంగంగా తమ భక్తిని ప్రదర్శించే డాంబికులుగా దుయ్యబట్టారు. అధికారం, పదవి అనేవి చాలా సందర్భాల్లో స్వార్థంతో, అవినీతితో ముడిపడి ఉంటాయి.

ఈనాటి సువార్త మొదటి భాగంలో చెప్పుకున్న ధర్మశాస్త్ర బోధకునికి, రెండవ భాగంలో వివరించిన పేద విధవరాలికి మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది.

సమాజంలో ఎటువంటి గుర్తింపు లేని విధవరాలి అతి సాధారణమైన భక్తిని, తల బిరుసు తనముతో సమాజములో పేరు ప్రతిష్టలు కోసం ఆరాటపడే కొందరు మత పెద్దల భక్తితో పోల్చటం జరిగింది. అదేవిధంగా ఎంతో ఆర్భాటంగా విరాళాలు ప్రకటించే స్తోమత గల్గిన డాంభికులైన దాతలతో కూడా ఆమె పోల్చబడింది. వారు తమకున్న అధిక సంపద నుండి యేవో కొంత ఇచ్చి ఉండవచ్చు. అర్పణలు ఇవ్వటంలో సాధారణంగా మూడు రకాల దాతలు ఉంటారు. ఒకటి సణుగుడు దాతలు వాస్తవానికి వీరికి ఇవ్వటమే ఇష్టం ఉండదు. రెండు నియమ దాతలు ఇవ్వటం తప్పని వ్యక్తిగత బాధ్యత గనుక తప్పనిసరై ఇస్తారు. వారు  గొణగక పోవచ్చు కానీ మనస్ఫూర్తిగా మాత్రం ఇవ్వరు. మూడు కారుణ్య దాతలు వీరు ఎస్టీ పూర్తిగా ఇస్తారు. ఇక అలాగే కొందరు తాము దోచుకున్న దాంట్లోది అన్యాయంగా ఇతరుల నుండి కొల్లగొట్టిన సొమ్ములోంచి ఇస్తారు. ఉదాహరణకు జక్కయ్య (లూకా 19:8 ) అయితే పేద విధవరాలు మాత్రం తన వద్ద ఉన్నదంతా తన కష్టార్జితమంతా ప్రేమతో అర్పించింది. ఈనాటి సువార్త ఆనాడు నివసించినవారివైపు కాదు ఈనాడు నివసిస్తున్న మనవైపు వేలేత్తిచూపుతుంది. మరి మనం కూడా పేరు కోసం డాంబికులుగా ప్రవర్తిసున్నామా  లేక మనస్ఫూర్తిగా ఇస్తున్నామా?

ఉదారతకు దేవుని దీవెనలు :

దేవుని కృపానుగ్రహం పట్ల పేద విధవరాలు తన అపార నమ్మకాన్ని ప్రదర్శించినట్లుగానే ఈనాటి ప్రధమ పఠనం సారఫెతులోని మరొక అన్యురాలైన విధవరాలు దుర్భర కరువు సమయంలో తన కోసం దాచుకున్న తన చివరి ఆహార వనరుల్ని ఏలీయా ప్రవక్తతో ఎలా పంచుకుంటుందో వివరిస్తుంది. ఆమె త్యాగపూరిత ఉదారతకు బహుమానంగా మిగిలిన కరువు కాలమంతా వారి జీవనానికి అవసరమయ్యే అనుదిన ఆహార వనరులతో దేవుడు వారిని సంహృద్దిగా దీవించాడు. కనుక ఉదారత్వం అనేది హృదయం నుండి రావాలి. ఉదారత్వం మన హృదయాల నుండే వస్తుందా? అని మనలను సూటిగా నిరాఘాటంగా ప్రశ్నిస్తున్నారు. విధవరాలి ఉదారత్వాన్ని మన ప్రభువు యేసు మెచ్చుకున్నా విధంగా ఈనాటి రెండవ పఠనం మనలను దేవునికి మన సాటి సహోదరి సహోదరులకు సంపూర్ణముగా ఉదారంగా సమర్పించుకోవాలని పిలుపునిస్తుంది. ఈనాటి సువార్త పఠనం శ్రీసభ పట్ల, పేదల పట్ల మరింత ఉదారత చూపాలని, ధనికులను కలవరపరచి, ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించటం లేదు కానీ మనం పేదలమైన, ధనికులమైన అవసరాల్లో ఉన్న వారిపట్ల ఉదార గుణం కలిగి ఉండాలని పిలుపునిస్తుంది.

మదర్ తెరెసాగారు తన జీవితములో జరిగిన ఒక సంఘటను గురించి చెప్పారు. ఒక రోజు ఆమె ఒక వీధిలో వెళుతున్నప్పుడు ఒక భిక్షగాడు ఆమెవద్దకు వచ్చి అమ్మ అందరు మీకు సహాయం చేస్తుంటారు.  నేను కూడా మీకు ఇస్తానమ్మా రోజంతా ఆడుకుంటే నాకు రెండు రూపాయలు మాత్రమే వచ్చాయి దాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను అని అన్నాడు. అప్పుడు మదర్ తెరెసాగారు సందిగ్ధంలో పడ్డారటఒకవేళ అమ్మ అతని దగ్గరనుండి రెండు రూపాయిలు తీసుకుంటే ఆ రాత్రికి అతని తినేందుకు ఏమి ఉండదు. ఒకవేళ తీసుకోకుంటే అతన్ని నిరాశపరిచినట్లు అవుతుంది. కాబట్టి అమ్మ అతని ముందు చేతులు చాచి అతను ఇచ్చిన డబ్బును తీసుకుందట.

తర్వాత ఒకసారి ఆమె మాట్లాడుతూ భిక్షగాడు ఇచ్చిన కానుక నాకు నోబెల్ బహుమతికన్నా గొప్పగా అనిపించింది. ఎందుకంటే అతను తన వద్ద ఉన్నదంతా ఇచ్చేశాడు. ఇవ్వటంలో ఉన్న ఆనందాన్ని నేను అతని ముఖంలో చూశాను రోజంతా ఎండలో తిరుగుతూ  అడుక్కోని పొందిన రెండు రూపాయలను ఇవ్వటం అనేది తన విషయంలో ఎంతో గోపా త్యాగం. రెండు రూపాయలు అంటే చాల తక్కువ డబ్బు  దాంతో పెద్దగా నేనేమి కొనలేను కొనలేక పోవచ్చు. అయితే అతను దాన్ని త్యాగం చేసాడు. త్యాగాన్ని  నేను స్వీకరించాను. అది నా దృష్టిలో ఎన్నో వేలరూపాయల కన్నా ఎక్కువే.  ఎందుకంటె దాన్ని అతను ఎంతో ప్రేమతో ఇచ్చాడు దేవుడు మనం చేసే పని ఎంత గొప్పదా అని చూడరు కానీ దానిని ఎంత ప్రేమతో చేశామా అనే దాన్ని చూస్తారు.

కనుక మనం కూడా మనకు ఉన్నదాంట్లోంచి నిర్భాగ్యులు, పీడితులతో పంచుకోవాలి దానిని గోనుకుంటానో లేక విధిలేక చేస్తున్న పని గానో భావించక మన స్వీయ దృక్పథంతో, మానవీయ సౌబ్రాత్రుత్వంతో, ఇష్టపూర్తిగా చేయాలన్నదే ఈనాటి సందేశం.

బ్రదర్. రత్న రాజ్ .సి.డి.

 

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...