క్రీస్తు కొరకు ప్రథమ హత సాక్షి పునీత స్తేఫాను చరిత్ర | కార్మెల్ శోభ

 పునీత స్తేఫాను 

స్తేఫాను అంటే కిరీటం అని అర్ధం. ఈయన అపోస్తులులు ఎన్నుకొన్న ఏడుగురు డీకనులలో ఒకరు. డీకనుగా స్తెఫాను అక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయుటకు ఎన్నుకొనబడ్డాడు. స్తెఫాను జ్ఞానము కలిగి, పవిత్రాత్మతో నింపబడి, మంచి ప్రవర్తన కలవాడిగా అందరికీ తెలిసిన వ్యక్తి.  తన జ్ఞానం ద్వార దేవుని గురించి బోధించి, హింసించబడి చంపబడ్డాడు.  ఈయన భోదన యూదులను కోపమునకు గురిచేసింది. యూదులు ఆయన మీద చూపిన క్రోదాన్ని, ఆయనకు కీర్తిని తీసుకువచ్చేలా చేశాడు. 

స్తేఫాను విశ్వాసం చాలా గొప్పది. ఆయన యూదుల చేత హింసించబడుతున్న అటువంటి అపనమ్మకం లేకుండా దేవుని  ఘనతను గురించి వారికి బోధించాడు.   ఎటువంటి పరిస్థితిలో కూడా దేవుని గురించి వివరిస్తూ ఎలా యూదులు తప్పుగా ఆలోచిస్తున్నారో వారికి తెలియజేయడంలో పూర్తిగా సఫలికృతం అయ్యారు. కాని ఆయనను వారు తప్పుగా అర్ధం చేసుకున్నారు. యేసు ప్రభువు బోధనలు ఈయన పాటించిన తీరు అందరు నేర్చుకోవాలి. తనను చంపుతున్న వారి కొరకు ప్రార్ధిస్తూ, ఆ పాపాన్ని వారి మీద వేయకండి అని వేడుకున్నాడు. మరణించే ముందు దేవుని ఇంత కష్టానికి గురిచేశాడని నిందించక, దేవునికి తన ఆత్మను అప్పగించాడు. 

స్తెఫానును బంధించుట 

స్తేఫాను దైవనుగ్రహం, శక్తి కలిగినవాడై గొప్ప అద్భుతములు, సూచక క్రియలు చేసెడివాడు. కొంత మంది స్తెఫానుతో వాదించెవారు. అతను చూపిన జ్ఞానమును,  ఆత్మతో  ప్రేరేపించబడి వాదించుటను  వారు ఎదుర్కోలేకపోయారు. ఆయనను ఎలా అయిన శిక్షించాలి అని వారు  పన్నాగం పన్నారు. అబద్ద సాక్ష్యం చెప్పుటకు కొందరిన కూర్చుకొని వారిచేత స్తెఫాను మోషేమీద దేవుని మీద దూషణ వాక్యాలు పలికినట్లుగా చెప్పుటకు కొందరిని కుదుర్చుకున్నారు. స్తెఫానుకు వ్యతిరేకముగా ప్రజలను, పెద్దలను ధర్మ శాస్త్రబోధకులను వారు స్తెఫానుకు వ్యతిరేకముగా పురికోల్పోరు. వారు స్తెఫానును బంధించి న్యాయసభ ఎదుటకు  తీసుకొని వచ్చారు. వారు తీసుకొనివచ్చిన అబద్దసాక్షులు స్తెఫాను పవిత్ర దేవాలయమునకు, మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాటలాడుచున్నాడాని, యేసు దేవాలయమును కూల గోడుతాడని, మోషే నుండి వచ్చిన  పారంపర్యమును   మార్పుచేస్తాడని చెబుతున్నాడని, వారు న్యాయ సభముందు చెప్పారు. అది వినిన వారు స్తెఫాను వైపు చూడగా ఆయన ముఖం వారికి దేవదూత వలె కనిపించినది. ఆయన పవిత్రత అది వారికి గుర్తు చేస్తుంది. ఆయన ముఖంలో  భయం, అందోళన వంటికి కాకుండా ప్రశాంతత, దేవదూతలా  కనబడుటకు కారణం ఏమిటి అంటే ఆయనకు దేవుని మీద ఉన్న ప్రేమ, దేవునికి తన జీవితమును అర్పించిన విధానం, ఆత్మతో నింపబడిఉండటం, విశ్వాసంతో నిండి ఉండటం వలన ఆయన  అటువంటి విపత్కర పరిస్థితిలో కూడా ఆయన తన ప్రశాంతతను కోల్పోకుండా ఉన్నాడు. 

స్తెఫాను వాదన 
ప్రధానార్చకుడు స్తెఫానును వారు చెప్పేది నిజమేనా? అని అడిగాడు అందుకు స్తెఫాను వారితో తన వాదనను ఇలా వినిపించాడు. మహిమగల దేవుడు మనం పూర్వీకుడగు అబ్రహాముకు కనపడి నీవు నీ దేశమును, నీ బంధువులను వీడి నేను చూపింపబోవు దేశమునకు వెళ్ళమని చెప్పగా ఆయన అట్లే చేశాడు, దేవుడు అబ్రహామునకు సొంత భూమిగా ఒక అడుగైనను ఇవ్వలేదు. కాని ఆయన సంతానానికి ఇస్తాను అని వాగ్ధానం చేశాడు. అలానే నీ సంతతి వారు 400 సంవత్సరాలు విదేశములో బానిసలుగా బాదలకు గురవుతారని, వారిని బాధలకు గురిచేసిన వారిని  తీర్పుకు గురిచేస్తాను అని చెప్పాడు. అటుల అబ్రహాము నుండి మోషే వరకు, ఎలా దేవుడు వీరికి తోడై ఉన్నది చెప్పాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నప్పటికీ ఎలా వారు దేవుని మాటలను వీడి జీవించినది కూడా వారికి తెలియజేశాడు. ఎలా వారు మోషేను దేవుడు పంపిన కాని తనని నాయకునిగా గౌరవించకుండా ఉన్నది వారికి తెలియజేశాడు.  మోషే నుండి దేవాలయం కట్టినప్పటి వరకు చెప్పి, ఎలా దైవ సమక్షము  గుడారములో ఉన్న విషయం చెప్పి, ప్రవక్త మాటలను వారికి చెబుతూ ఆకాశము దేవుని సింహాసనమని భూమి ఆయన పాదపీఠమని, సమస్తము దేవునిది అని చెప్పి దేవుని సందేశమును తిరస్కరించి, వారు హృదయమందు, చెవులయందు సున్నతి లేని వారి వలె ఉన్న విషయాన్ని వారికి తెలియజేశాడు. వారి పూర్వుల వలె పవిత్రాత్మను ఎదురించుచున్న విషయాన్ని వారికి తెలియజేశాడు. ఎలా వారు ప్రవక్తలను హింసించింది వారికి చెప్పాడు.
 
ఆలయము యొక ప్రాముఖ్యత - పెద్దలకు, న్యాయ సభకు ఆలయం గొప్పది. వారి జీవితం మొత్తం దాని మీదనే ఆదరపడి ఉన్నది. కాని ఆ కట్టడానికి కాదు ప్రాముఖ్యత దానిలో ఉన్న దేవునిది. ఎందుకంటే దైవ సమక్షము ఆ కట్టడములో ఉన్నది. ఈ ఆలయమును కట్టకమునుపు వారికి దైవ సమక్షపు గూడారము ఉండేది. దావీదు కాలము వరకు ఈ దైవ సమక్షపు గుడారము ఉన్నది. అప్పుడు దావీదు ఒక దేవాలయము కట్టుటకు దేవుని అనుమతి అడిగాడు కాని సోలోమోనే దానిని కట్టించాడు. దేవునికి ఈ ఆలయము మాత్రమే ముఖ్యం ఆనుకొనుట సమంజసము కాదు. ఈ విషయములను వారికి వివరిస్తూ, వారి పితరులు ఎలా ఈ విషయములను చెప్పిన ప్రవక్తలను హింసించిన విషయం వారితో చెబుతూ వీరు కూడా పవిత్రాత్మను ఎదురించుచున్నారని, మెస్సీయ్యాను గురించి చెప్పిన, చూపిన వారిని చంపివేశారు అని , మరియు యేసు ప్రభువును వారు శత్రువులకుఅప్పగించిన విషయం చెప్పి, దేవదూతల ద్వారా పొందిన చట్టమును వారే పాటించుటలేదు అని వారి తప్పును బయట పెట్టడం జరిగింది. 

స్తెఫానుపై రాళ్ళ వర్షం 

ఆ న్యాయ సభలోని వారు వారందరు ఆయన మాటలకు కోపముతో మండిపడ్డారు. స్తెఫాను పవిత్రాత్మతో నిండి, పరలోకం వైపు చూడగా ఆయనకు దేవుని మహిమ ఆయన కూడప్రక్కన యేసు ప్రభువు నిలబడి ఉండటం చూశాడు. ఆ విషయం వారికి తెలియజేస్తుండగా వారు కేకలు వేస్తూ, చెవులు మూసుకొన్నారు. అందరు ముకుమ్మడిగా విరుచుకుపడి, నగరము బయటకు తీసుకుపోయి రాళ్ళతో కొట్టారు. వారు రాళ్ళతో కొట్టుచుండగా స్తెఫాను "యేసు ప్రభూ! నా ఆత్మను గైకొనుము" అని ప్రార్ధించాడు. తరువాత మోకరిల్లి "ప్రభూ ! ఈ పాపము  వీరిపై  మోపకుము" అని మరణించాడు. 
Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభౄద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలు అందించడే ఈ బ్లాగ్ లక్ష్యం.

🔪 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నితన పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు