25వ సామాన్య ఆదివారము
సొలొమోను జ్ఞానగ్రంధము 2 : 12 , 17 -20
యాకోబు 3 : 16 - 4 : 3
మార్కు శుభవార్త 9 : 30 - 37
ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు నీతిమంతుడు మరియు దుష్టుడి జీవితం గురించి మాట్లాడుతున్నాయి. క్రీస్తు శిష్యులుగా, క్రైస్తవులుగా మనం నీతిమంతుని జీవితం జీవించి క్రీస్తువలె సేవక రూపం దాల్చాలని ఆహ్వానిస్తున్నాయి.
మొదటి పఠనాన్ని గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 50 వ సంవత్సరములో అలెగ్జాండర్ పరిపాలన కాలములో ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా తీసుకొనిపోయినపుడు ఆ ప్రవాస కాలములో కొంతమంది అక్కడ మిగిలిపోయారు తరువాత కొంతమంది తిరిగి వచ్చారు. మిగిలిపోయినవారు అక్కడ గ్రీకు సంస్కృతికి మరియు తత్వ శాస్త్ర విధానానికి ప్రభావితమై హీబ్రూ సంస్కృతిని విడి జీవించారు, తిరిగి వచ్చినవారు హీబ్రూ సంస్కృతికి కట్టుబడి ఉన్నారు. ఆలా కట్టుబడిన వారిని నీతిమంతులుగాను, విడనాడిన వారిని దుష్టులు గాను పరిగణించారు.
స్వల్పకాలిక జీవిత ఆనందం తో శోక మయమైన జీవితం మరణం తథ్యం. పూర్వుల సంప్రదాయములు, ధర్మ శాస్త్రానికి కట్టుబడి దేవుని ఆజ్ఞలను పాటించువారు దేవుని జ్ఞానం కలిగిన వారు. వారు ఏ విధముగా ఉంటారు అంటే కీర్తన కారుడు చెప్పినట్లు ప్రభువుని ధర్మ శాస్త్రమును ఆనందముతో చదివి ధ్యానించువాడు, అన్యాయమును ఎదిరించువాడు, దుష్టులకు, పీడితులకు ఆశ్రయము, చెడును ద్వేషించువాడు, దైవ ప్రజకు వెన్ను దన్నుగా నిలిచేవాడు.
సువిశేష పఠనంలో మూడు అంశాలను చూస్తాము అవి
చివరి గమ్యము
మొదటి స్థానము
చిన్నపిల్లల మనస్తత్వము
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి