20, జనవరి 2021, బుధవారం

పునీత యేసేపు

దేవుడు ఇస్సాకు రిబ్కా లను తోబియాతు సారాలను కలపడం వలన దేవుడు మానవులకు తగిన వారిని వారి జీవిత భాగస్వాములుగా చేస్తారని మనకు తెలుస్తుంది. అటువంటప్పుడు మరియమాత కన్యకగా తన కన్యత్వాన్ని కోల్పోకుండా దేవుని కుమారుణ్ణికి జన్మను ఇస్తుంది . ఆమెలో ఎటువంటి పాపము లేదు , ఆమె దేవుని కుమారునికి  జన్మనివటం వలన దేవుని తల్లి అవుతుంది. ఈమెకు ఇంత గొప్ప వ్యక్తికీ ఎటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేస్తారు అంటే దానికి సమాధానము పునీత జోజప్ప గారు. ఖచ్చితముగా ఆయనలో అనేక ప్రత్యేకతలు కలిగి ఉండాలి. ఏమిటి ఆ ప్రత్యేకతలు అంటే, పవిత్ర గ్రంధములో  అయన ఒక్క మాట మాట్లాడనప్పటికీ  అతని ప్రవర్తన ,జీవనశైలి , దైవాంకిత జీవితం స్పష్టముగా కనపడుతూవుంటాయి . అందుకే పవిత్రగంధము ఆయనను నీతిమంతుడు అని సంభోదిస్తుంది. 

యేసేపు గారి ప్రత్యేకతలు ఏమిటి అంటే , అయన దయార్ధహృదయము, పవిత్రత , ధర్మశాస్త్ర అవలంభన , కుటుంభకాపరి . 


మోషే ధర్మ శాస్త్రం ప్రకారంగా  ఒక వ్యక్తి తన భార్యకు వ్యభిచారకరనముగా విడాకుకులు ఇవ్వవచ్చు. ఈ విడాకులనేవి రెండు రకాలుగా ఇవ్వవచ్చు. మొదటిగా ఒక స్త్రీ చేసిన తప్పును అందరికి చెప్పి ఆమెను శిక్షించవచ్చు. రెండవ విధముగా ఆమెకు ఆమె కుటుంబానికి ఎటువంటి అనర్ధము జరగకుండా  సాక్ష్యం కలిగివుండి భార్యని రహస్యముగా విడనాడవచ్చు. పునీత యేసేపు గారి దయార్ధహృదయాన్ని మనము ఇక్కడ చూస్తాము. తన భార్య తన ప్రమేయము లేకుండా గర్భం దాల్చిన తరువాత ఆమె కుటుంబానికి ఎటువంటి అపకీర్హ్తి కలగకూడదని రహస్యముగా ఆమెను విడనాడాలి అని కాంక్షించాడు . 


పునీత యేసేపు గారి పవిత్రత చాల గొప్పది . దేవుడు పరమ పవిత్రుడు. తన కుమారుణ్ణి ఈ లోకానికి ఒక స్త్రీ ద్వారా తీసుకురావడానికి ముందుగానే ఆమెను పవిత్ర పరిచాడు,ఆమెలో ఏ పాపమూ లేకుండా చేసాడు. తరువాత తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. దేవుని తల్లి మరియు దేవుని కుమారుని  పవిత్రను ఆస్వాదించాలి అంటే, లేక అంతటి వారితో జీవించాలి అంటే అఅంతటి నిష్ఠ కలిగి జీవించేవారే వారి సాన్నిధ్యములో ఉండగలరు. పునీత యేసేపు గారు అంతటి పవిత్రులు. మరియతల్లి   కన్యకగా ఉంది ఆమె కన్యత్వాన్ని కాపాడుతూ ఆమె అంత పవిత్రముగా జీవించాలి అంటే పునీత యేసేపు వారి అంతటి పవిత్ర ఉండాలి. 

ఎల్లప్పుడూ దైవఒడంబడికలకు అనుకూలముగా జీవించాలి అంటే దానికి ప్రార్థన మరియు దైవ జ్ఞానం అవసరము. యేసేపు గారు ప్రార్థనలో దిట్ట అని చెప్పా వచ్చు. ఆయనకు స్వప్నంలో దేవుదూతలు దర్శనము ఇస్తున్నారు. ఇవి నిజానికి ప్రార్థనలో ని అంతస్తులు . అయన ప్రార్థనలో అంతగా ఎదిగారు కాబట్టే దేవుని దూతలు ఆయనకు దర్శనము ఇస్తున్నారు. జరుగబోయే విషయాలు చెపుతున్నారు. ప్రార్దిచేతివంటివారు దేవునితో సత్సంభందాన్ని కలిగిఉంటారు. వారు దేవుని ఆజ్ఞలని పాటిస్తారు. అందుకే యేసేపు గారు దేవాలయములో అర్పించడానికి తీసుకొనివెళుతున్నారు. ఇక్కడ మనము యేసేపు గారు దేవుని ఆజ్ఞలను పాటించుటలో ఎంత ఖచ్చితముగా ఉంటారో చూస్తాము.   

పాత నిబంధనలో మనము యేసేపు గారిని చూస్తూ ఉంటాము అయనను ఫరో రాజు తన రాజ్య కోశాధికారిగా చేస్తారు. నూతన నిబంధనలో దేవుడు తన కుమారునికి , మరియు తన తల్లికి సంరక్షకునిగా నియమించుకున్నాడు. వ్వారి అలానాపాలన చూసుకోవడడినికి. ఇది నిజానికి దేవుని ప్రణాళిక ఎందుకంటే బాల యేసు అనేక ఆపదల నుండి కాపాడటానికి దేవుడు దేవదూతలు  ఏర్పాటు చేయవచ్చు కానీ యేసేపు గారిని నియమించుకున్నాడు అంటే యేసేపు గారి సంరక్షణ అంత గొప్పది. పునీత అవిలాపురి తెరెసమ్మ గారు యేసేపు గారి సంరక్షణ అంటే చాల ఆనందపడేది ఎందుకంటే అయన సంరక్షకుడిగా ఉంటె ఎవరు ఏమి చేయలేరు అని అందుకే ఆమె స్థాపించిన అన్ని ఆశ్రమాలకు ఈ పునీతుని పేరు పెట్టింది. 

ఈ సంవత్సరాన్ని పునీత యేసుపు సంవత్సరముగా  కొనియాడటము ఎంతో సంతోషము , ఈ పునీతుని అడుగు జాడలల్లో నడిచి అయనను మన అనుదిన జీవితములో అనుసరిద్దాం. 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...