12, మార్చి 2022, శనివారం

తపస్సు కాలం 2 వ ఆదివారం

తపస్సు కాలం 2 వ ఆదివారం

ఆది 15: 5-12, 17-18,  ఫిలిప్పి 3: 17,4: 1 , లూకా 9: 28-36.

-ఈ నాటి దివ్య పఠనాలు మన యొక్క రూపాంతరం గురించి భోదిస్తున్నాయి.
-మనం దేవునితో జీవించే సమయంలో మన యొక్క జీవితాలు కొంచెమైనా మారాలి. ఈ తపస్సు కాలం రెండవ వారంలో తల్లి శ్రీ సభ రూపాంతరం చెందమని కోరుతుంది.
-మన యొక్క ఉపవాస, ప్రార్థన, ధాన ధర్మాలు చేస్తూ మన జీవితాలు మార్చుకొంటూ దేవునికి దగ్గరై జీవించాలి.
-ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా తమ జీవితంలో మార్పును కోరుకుంటారు, కావాలనుకుంటారు.
-మనయొక్క జీవితాలు రూపాంతరం చెందాలంటే మనలో దైవాను గ్రహం ఉండాలి. దైవాను గ్రహం మనలోకి రావాలంటే మనం దేవుడ్ని విశ్వసించాలి. దేవుడ్ని వెంబడించి జీవించాలి. అదే విధంగా పవిత్రాత్మ దేవునికి మనం సహకరించుకొని జీవిస్తే మన జీవితాలు నిజంగా రూపాంతరం చెందుతాయి.

-ఈ నలభై రోజులు ధీక్షాకాలా సమయంలో మనం కూడా ఏదో ఒక విధంగా రూపాంతరం చెందాలి. బహుశా ప్రార్థించుటలోనో, విశ్వసించుటలోనో, చదువుటలోనో, బాధ్యత కలిగి జీవించుటలోనో ఏదో ఒక విధంగా మనం మారాలి.
-గొంగళి పురుగు గూడులో ఉండి కొన్నిరోజుల తరువాత సీతాకోక చిలుక అయినా విధంగా విశ్వాసులుకూడా రూపాంతరం చెందితే దేవుడు ఆనందిస్తారు.

ఈ నాటి మొదటి పఠనంలో దేవుడు అబ్రామును, అబ్రహాముగా మార్చుటను అదేవిధంగా అబ్రహాముతో చేసుకొన్న మొదటి ఒడంబడికను గురించి భోదిస్తుంది.
-దేవుడు ఎప్పుడు కూడా ప్రజలకు చేరువలోనే ఉంటారు. మానవుడు దేవుడ్ని విస్మరించి తప్పు చేసినప్పటికీ మళ్లీ మానవులతో సంబంధం కలిగి ఉండుటకు వారితో ఒడంబడికను చేసుకొంటున్నారు.

-అబ్రహాము కు దేవుడు ప్రత్యక్షమై తనకు సంతానం కలుగుతుందని చెప్పుచున్నారు.
-అబ్రహామునకు వయస్సు మల్లినది ముసలి ప్రాయంలో వున్నారు. అతని భార్య కూడా గొడ్రాలుగ ఉన్నారు. ఎన్నో సంవత్సరములు సంతానం కోసం ఎదురు చూశారు. కానీ ఫలితం దక్కలేదు.
-యావే దేవుడు అబ్రహామునకు దర్శనమిచ్చి నీకు ఆకాశమునందలి నక్షత్రములవలె, సముద్ర తీరమునందలి ఇసుకరేణువులవలె సంతానం కలిగి వృద్ధి చెందుతావు అని వాగ్దానం చేస్తున్నారు.
-ఆయన యొక్క జీవితాన్ని వృద్ధి చెందిస్తానని, వారికి కానాను దేశమును ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు.

-అబ్రహాము వాస్తవానికి అన్యుడు అయినప్పటికీ యావే దేవుని యొక్క మాటలు విశ్వసించారు. ఎటువంటి అనుభవం లేనప్పటికిని, అసంభవంగా ఉన్నప్పటికినీ అబ్రహాము  దేవుడ్ని నమ్ముచున్నారు.  
-అబ్రహాము దేవుని యొక్క మాటలను పూర్తిగా విశ్వసించారు అందుకే ఆయనను విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాం. ఆయన విశ్వాసమును బట్టియే నీటి మంతుడుగా పరిగణించ బడుతున్నారు .
-దేవుడు అబ్రహం తో చేసుకొన్న ఒడంబడిక బలమైనది అని తెలుపుటకు కొన్ని జంతువులను నడిమికి కోస్తున్నారు, వాటిని ప్రక్క ప్రక్కన పెడుతున్నారు. 

-ఆ కాలపు నియమాల ప్రకారం ఒప్పందం చేసుకొనేవారు నరకబడిన జంతువులమధ్య నడుస్తారు. అలా ఎందుకు చేసేవారంటే ఒక వేళా ఎవరైనా ఒప్పందం కు అవిధేయులై, మరిచి పోయి జీవిస్తే వారికి కూడా అలంటి దుస్థితి వస్తుందని వారియొక్క ఆచార నమ్మకం.
-ఇదే సాంగ్యం యొక్క విధానం యిర్మీయా 34: 18 - 19 లో కూడ చదువుతున్నాం.
-దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని, ఒడంబడికను బలపరచడానికి ఆ మామాసపు ఖండలు నిప్పుతో కదిల్చారు. ఆ యొక్క నిప్పు దేవుని యొక్క సాన్నిధ్యంకు గుర్తు.
-ఈ మొదటి పఠనంద్వారా అబ్రహాం దేవుడి మీద ఉన్న గొప్ప నమ్మకమును వెల్లడిచేస్తున్నారు. ఆది 15 : 6 .

-ఈ యొక్క ఒడంబడిక ద్వారా దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చుతున్నారు.  పేరు మార్చుట ద్వారా అబ్రహాము దేవునితో ఒక క్రొత్త జీవితమును ప్రారంభిస్తున్నారు.
-అబ్రహాము దేవునియొక్క సాన్నిధ్యమును కనులార అగ్నిరూపంలో చూడగలుగుతున్నాడు. దేవుని యొక్క అనుభూతిని తన జీవితంలో పొందుకుంటున్నారు.

- మన యొక్క విశ్వాస జీవితంలో కూడ మనం దేవుడ్ని విశ్వసించాలి అబ్రహాము వలె దేవునితో క్రొత్త జీవితం ప్రారంభించాలి, దేవునితో చేసుకొన్న ఒడంబడిక ప్రకారం జీవించాలి.
-అబ్రహాము కూడ దేవుని యొక్క కార్యం ఎలాగ జరుగునని ఒక వివరణ అడుగుచున్నారు. అబ్రహాము వలె మరియ తల్లి కూడ దేవుని యొక్క జన్మం గురించి ఎట్లా జరుగును అని అడిగారు. వీరిద్దరియొక్క ఆలోచనలకు తగిన విధంగా దేవుడు వారికి అంతా విశిదీకరిస్తున్నారు. ఇద్దరుకూడా దేవుడ్ని సంపూర్ణంగా నమ్మినవారే.

-ఈనాటి రెండవ పఠనంలో పునీత పౌలు గారు మనందరం పరలోక పౌరులమని గుర్తు చేస్తున్నారు. 
-భూలోక సంభందమైన విషయాల గురించి కాకుండా పరలోక సంభందమైన విషయాలు ఆలోచిస్తూ వాటి ప్రకారం జీవిస్తే మర్త్య శరీరములైన మన శరీరములను దేవుడు దివ్య శరీరం లుగా మార్చుతానని పౌలు గారు బోధిస్తున్నారు.
-మన యొక్క మర్త్య శరీరంలు వాటంతట అవే దివ్య శరీరములుగా మారవు పవిత్రాత్మ శక్తితోనే అది సాధ్యమవుతుంది.
-మన యొక్క శరీరాలు దివ్య శరీరాలుగా మార్చ బడాలంటే మనం శరీరం కు తగిన విధంగా కాకుండా ఆత్మకు తగిన విధంగా నడుచుకోవాలి. శారీరక వాంఛలకు దాసులు కాకూడదు అందుకు మనం పవిత్రాత్మ సహవాసం లో జీవించాలి. 

-జ్ఞానస్నానం ద్వారా మనం పవిత్రతను పొందాము ఇంకా పరిపూర్ణం గా పవిత్రులు కావాలంటే అనుదినం ప్రయత్నిఇంచాలి.
-పౌలు గారు అనేక మార్లు విశ్వాసులకు తెలియ చేస్తున్నారు. శరీరాను సారంగా కాకుండా ఆత్మను సారంగా జీవించమని .రోమి 8 : 5 -13 , గలతి 5 : 16 .

మన యొక్క జీవితంలో ఆత్మను సారంగా జీవిస్తే దేవున్ని సంతృప్తి పరచవచ్చు. పరలోక పౌరులు పరలోక ఆలోచనలు కలిగి జీవించాలి.
-మనం పరలోక పౌరులం అని మరిచి పోతున్నాం. ఈ లోకంలో ఉన్నప్పటికీ మనం దేవుని యొక్క వాకు అనుసారంగా జీవించటానికి ప్రయత్నఇంచాలి. 
-ఇహలోక దేహ వాంఛలకు లోనైనా వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు.
-ఆదాము అవ్వ తమ యొక్క దేహ వాంఛలను తృప్తి పరుచుకొన్నారు (తినవద్దన్న పండు తిన్నారు). పరలోకం గురించి మరిచి పోయారు. దేవుడిని సంతృప్తి పరచలేదు.
-లోభియెక్క ఉపమానంలో లూకా 12 :13 -21. ఈలోకమే శాశ్వతం అని భావించి తన ఆత్మతో తాను మాట్లాడుతూ తినుము త్రాగుము అని చెప్పుకొంటున్నారు. ఈ లోకం కన్నా పరలోకం విలువైనది అని మరిచిపోతున్నాడు. 
 
-మనం కూడ ఈ లోకంలో పేరు ప్రతిష్ఠలకోసం, ఆస్తిపాస్తుల కోసం కొట్టు మిట్టాడుతున్నాం, కానీ పరలోక పౌరులం కాబట్టి పరలోకంలో ప్రవేశించాలంటే పుణ్య కార్యాలు చేయాలనే అంశం మరిచిపోతున్నాం.

-దేవుని బిడ్డలుగా పవిత్రులుగా, పరలోకం పౌరులుగా మారాలంటే యేసు ప్రభువు చూపిన ఆ నీతి మార్గంలో మనందరం నడవాలి.
-మానవ శక్తితో ప్రయత్నిస్తే మనం చాల సార్లు శరీరమునే సంతృప్తి పరుస్తాం. కాబట్టి దేవుని యొక్క శక్తితో నడిచి పరలోకానికి వెళదాం.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువుయొక్క రూపాంతరం చెందుటను మనం చదువుకున్నాం. 
-యేసుప్రభువు యొక్క దివ్య రూప ధారణ వలన తండ్రి దేవుడు యేసుప్రభువు తన యొక్క ప్రియమైన కుమారుడని తెలుపుచున్నారు. ఆయన యొక్క దైవత్వం ప్రకటిస్తున్నారు.
-దివ్య బలిపూజలో గోధుమ అప్పం, ద్రాక్షా రసము యేసుప్రభువు యొక్క శరీర రక్తలుగా రూపాంతరం చెందుతున్నాయి.

-జ్ఞానస్నాన దివ్య సంస్కారం మనల్ని దేవునియొక్క పుత్రులుగా రూపాంతరం చెందిస్తుంది.
-పాప సంకీర్తనం ద్వారా పాపి పవిత్రుడయ్యెలా చేస్తుంది, వ్యక్తి మార్పు చెందుతున్నారు. వారి జీవితం మరి గొప్పవారిగా చేయబడుతున్నారు.
-దేవుడిని కలుసుకున్న సమయాలలో ప్రతి ఒక్కరి జీవితం రూపాంతరం చెందుతుంది.

మోషే జీవితం రూపాంతరం చెందుతుంది.
సౌలు జీవితం
పేతురు యొక్క జీవితం
మగ్దలా మరియమ్మ జీవితం.
-ఇంకా చాలామంది యొక్క జీవితాలు మారుతున్నాయి.

-మన జీవితంలో కూడ యేసు ప్రభువు వలె పర్వత అనుభూతి కావాలి.
-తూర్పు దేశంలో ఆధ్యాత్మికత లో ఒక ప్రత్యేక స్థానం ఉంది.
-దేవునితో గడపటానికి, దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించటానికి అదేవిధంగా దేవునితో ఆత్మీయ అనుభూతిని పొందడానికి ఎత్తైన పర్వతాలు సరైన ప్రాంతం అని కొందరి యొక్క విశ్వాసం, నమ్మిక అందుకే పర్వతాల మీదకు వెళుతుంటారు. 
-దేవుడు ఉన్నత స్థలంలో నివసిస్తున్నాడని కొందరి యొక్క నమ్మకం. కొన్ని శతాబ్దాలుగా ఈ నమ్మకం కొనసాగుతూనే ఉంది చాల మంది విశ్వాసులు దీనిని అనుసరిస్తున్నారు. కొండను ఎక్కి వెళ్ళటం ద్వారా దేవునికి మరింత దగ్గర అవుతామని కూడ కొంతమంది భావించేవారు. 
-పర్వతం పైన వున్న చల్లని వాతావరణం, గాలి, ప్రశాంతత కూడ దేవుడిని కలుసుకొనుటకు ఉపయోగపడును.

-పవిత్ర గ్రంధంలో కొన్ని సంఘటనలున్నాయి. దేవుడు మనుషులను కొన్న సమ్యలు.
మోరియా పర్వతం వద్ద అబ్రహాము దేవుడిని కలుసుకున్నారు.(ఆది 22 :11 -12 ).
సీనాయి పర్వతం పైన మోషే దేవుడిని కలుసుకున్నారు (నిర్గమ 24 :12 -18).
కార్మెల్ కొండమీద ఏలీయా దేవుడిని కలుసుకున్నారు (1 రాజులు 18: 31 -41).
తాబోరు కొండమీద శిష్యులు దేవుడిని కలుసుకున్నారు.
కల్వరి కొండమీద యేసు ప్రభువు నిజమైన దేవుడని సైనికుడు గ్రహిస్తూ ఆయన్ను కలుసుకున్నారు. 
-యేసు ప్రభువు యొక్క మరణం తరువాత కూడ శిష్యులు పర్వతం వద్దకు వెళ్లారు అని కొందరి నమ్మకం. 

మనం చుసిన అన్ని ఉదాహరణాలలో అందరూ పర్వతం ఎక్కిన తరువాతనే దేవుడు వారిని కలుసుకుంటున్నారు. 
-మనయొక్క విశ్వాస జీవితంలో కూడ 
పవిత్రత అనే పర్వతం ఎక్కాలి.
మంచితనం అనే పర్వతం ఎక్కాలి.
స్వార్థం విడిచి ముందుకు సాగాలి.
ప్రేమని అలవర్చుకుని పర్వతం ఎక్కాలి. 
శోధనలు అనే పర్వతం ఎక్కాలి. 
శ్రమలు అనే పర్వతం ఎక్కాలి.

-ఎప్పుడైతే మనం ఇహలోక కోరికలు, శోధనలు అధిగమించి మంచిగా ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క మాట ప్రకారం ఆయనకు విధేయత చూపుతూ ఆయనయొక్క ఆజ్ఞలు పాటిస్తామో అప్పుడు మనకు దేవుని దర్శనం, అనుభూతి కలుగుతుంది. ప్రయత్నం చేసినవారందరు పర్వతం ఎక్కలేరు కేవలం కష్టపడి, అన్ని ఇబ్బందులను అలసటలను ఎదుర్కొని వెళ్లే వారే  ఎక్కగలరు. 
-పర్వతం ఎక్కే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, కష్టపడాలి, అలిసిపోతాం, అయినా సరే ముందుకు వెళితే దైవ అనుభూతి కలుగుతుంది. మనయొక్క విశ్వాస జీవితంలో కూడ దైవ అనుభూతి కావాలంటే ఆధ్యాత్మికంగా మనం కష్టపడాలి. ఈలోక ఆశలు విడిచి పెట్టడానికి కష్టపడాలి, శోధనలలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి . అప్పుడే మనం దేవుడిని కలుసుకొనగలం.

-యేసు ప్రభువు తాబోరు పర్వతం ఎక్కినది తండ్రిని కలుసుకొనుటకు తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుటకు కావల్సిన శక్తిని, ధైర్యం ను పొందుటకు అలాగే తండ్రి యొక్క సమ్మతి తీసుకొనుటకు ఆయన పర్వతం మీదకు వెళ్లుచున్నారు.

-వ్యక్తిగతంగా తనను తాను సిద్ధం చేసుకొనుటకు, ప్రార్థించుటకు ప్రభువు పర్వతం మీదకు వెళ్లారు.
-తపస్సుకాల మొదటి ఆదివారంలో యేసుప్రభువు మానవ స్వభావంలో ఎదుర్కొన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రెండవ వారంలో యేసుప్రభువు యొక్క దైవత్వంను ధ్యానించుకోవాలి.  ఆయన నిజముగా దేవుని కుమారుడని తెలుసుకోవాలి.

-ప్రభువు శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నారా. ఆయనయే వారు ఊహించే మెస్సయ్య అని ఎరుక పరుచుచున్నారు. యేసు ప్రభువు పేతురు, యోహాను, యాకోబులను ఎందుకు పర్వతంకు తీసుకొని వెళుతున్నారంటే ఇద్దరు లేక ముగ్గురు చెప్పే సాక్ష్యం నిజమవుతుందని. (ద్వితీ 19 : 15 ) అంటే ఒక విషయాన్ని నిరూపించాలంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షులవసరం . అందుకే ప్రభువు ముగ్గురిని తీసుకొని వెళుతున్నారు. ఆయన యొక్క దివ్య రూప ధారణకు వారే సాక్ష్యులు.

-యేసు ప్రభువు ప్రార్థించే సమయంలో రూపాంతరం చెందుతున్నారు. మనయొక్క జీవితాలు కూడ ప్రార్థనలో రూపాంతరం చెందాలి.
-ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆనాటి యూదులు యొక్క నమ్మకం అలాగే పౌలు గారి యొక్క భోదన ఏమిటంటే నీతిమంతులు యొక్క శరీరాలు దివ్య శరీరములుగా మారె అవకాశం ఉందని తెలుపుచున్నారు. (1 కొరింతి 15 :49 , 2 కొరింతి 5 : 1 -10 ).

-నీతిమంతులు దేవుని యొక్క మహిమను పంచుకొంటారు. మోషే 40 రోజులు దేవునితో గడిపిన తరువాత ఆయన మహిమను పంచుకొంటున్నారు. (నిర్గమ 34 )
-మనం కూడ నీతిమంతులుగా జీవించాలి, అదియే దేవుడు మన నుండి కోరుకుంటారు.
-యేసుప్రభువు వస్త్రాలు తెల్లగా వున్నాయి. అవి ఆయన యొక్క పవిత్రతకు గుర్తు కాబట్టి.
-మోషే, ఏలీయాలకు కూడ పర్వతం మీద దేవుని యొక్క అనుభూతి కలిగినది అందుకే వారిద్దరూ అక్కడ దర్శనంలో కనిపించారు. 

-మండుచున్న పొదలో దేవుడు మోషేకు దర్శనం ఇచ్చారు, నిర్గమ 3: 1 -4.
-సీనాయి పర్వతం మీద దేవునితో గడిపారు. దేవునితో ఉన్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది.(నిర్గమ 24 :1 , 34 : 29 ).
-ఏలీయా హోరేబు కొండవద్ద కలుసుకున్నారు (1 రాజు 19: 9 -18).
-మోషే అలాగే ఏలీయాలు ఇద్దరు గొప్ప ప్రవక్తలు ఎందుకంటే మోషే దేవుని వల్ల వారికి ధర్మ శాస్త్రమును ఇచ్చారు. ఏలీయా ప్రవక్తలందరికి నాయకుడు వంటివారు అందుకే యేసు ప్రభువు యొక్క సిలువ శ్రమలు పొందటానికి సరైన సమయం అని తెలియచేయుటకు ఇద్దరు కనబడుచున్నారు.

-ఈ దర్శనంలో తండ్రి దేవుడు ఇతడు నా ప్రియమైన కుమారుడు ఇతడిని ఆలకించండి అని పలుకుచున్నారు.
-ఆయన స్వరమును ఆలకించి జీవిస్తే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. ఆయన మాటలు వినక పొతే మన జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు.
-పవిత్ర గ్రంధంలో కొంతమంది దేవుని స్వరం విన్నారు. కొందరు వినలేదు, వారికి చివరి ఫలితం ఎలావుంటుందో కూడ మనకు తెలుసు కాబట్టి ఆయన మాటలు వినాలి.

-మనయొక్క జీవితంలో మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం దినమూ రూపాంతరం చెందాలి. ఈ తపస్సు కాలంలో మన జీవితాలు దేవునికి ఇష్టమైన విధంగా మారాలి. 
మనం మన యొక్క పాపపు జీవితం నుండి రూపాంతరం చెందాలి 
స్వార్థంనుండి, నిస్వార్థిగా రూపాంతరం చెందాలి.
లోక వ్యామోహాలనుండి దేవుని వైపుకు రూపాంతరం చెందాలి. 
అధికార వాంఛలనుండి, సేవా భావమునకు రూపాంతరం చెందాలి.
అసూయా, ద్వేషం నుండి ప్రేమించుటకు రూపాంతరం చెందాలి.
ప్రార్థించుటలో, ప్రేమించుటలో రూపాంతరం చెందాలి.
-దేవుని యొక్క అనుగ్రహం తో రూపాంతరం చెంది దేవునికి మనయొక్క తల్లిదండ్రులకు సంతోషమును ఇద్దాం.

REV. FR. BALA YESU OCD

తపస్సు కాల రెండవ ఆదివారము

తపస్సు కాల రెండవ ఆదివారము

ఆది 15 : 5 -12 , 17 -18, ఫిలిపీ త్రీ:17 - 4 :1,  లూకా 9 :28 -36.

క్రీస్తునాదునియందు ప్రియ దేవుని బిడ్డలారా  ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలి అని తెలియచేస్తున్నాయి. తల్లి  శ్రీ సభ మనలనందరిని కూడా ప్రార్థన శక్తి ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించాలని   ఆహ్వానిస్తున్నాయి.

మొదటి పఠనంలో  విశ్వాసమున   తండ్రి  అయిన అబ్రాహామును రెండు విషయాలలో తన మాట మీద గురి ఉంచమని దేవుడు కోరుతున్నాడు.1) నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు 2) అబ్రాహాము సంతతికి భూమిని దారాదత్తం చేస్తానని దేవుడు అబ్రాహామును వాగ్దానం చేస్తున్నాడు 

1) నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు:  దీనికి అబ్రాహాము, ప్రభు నువ్వు నాకు ఏమి ఈయగలవు నేను బిడ్డలు లేని వాడిని, నీవు నాకు సంతానం కలిగించలేదు అంటున్నాడు.ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అబ్రాహాము తనను తాను అనుమానించుకుంటున్నాడు, నేను ముసలివాడను నాకు సంతాన ప్రాప్తి లేదు అని అపనమ్మకం అబ్రాహాము వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అబ్రాహామును దేవుడు కల్దియా దేశం నుండి పిలిచి తనను ఒక గొప్ప మహాజాతిగా తీర్చిదిద్దుతాను, నిన్ను దీవించేవారిని దివిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను,  నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దివిస్తాను అని వాగ్దానం చేసిన మాటలను మరచిపోయి కూడా అబ్రహాము దేవుని మీద  ఈ విధంగా పలికియున్నాడు.

 అప్పుడు దేవుడు అబ్రాహాముతో నీకు పుట్టినవాడే నీకు వారసుడవుతాడు అతడి సంతానం నక్షత్రములవలె అవుతుందని చెప్పినపుడు అబ్రాహాము నమ్మాడు, ఆయన  నమ్మకాన్ని బట్టి దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా చేసాడు. 

2) దేవుడు అతని సంతతికి భూమిని దారాదత్తం చేస్తానని వాగ్దానం చేయుట:

       దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం, అబ్రాహాము దేవుడు తన యొక్క సంతతికి ఇస్తానన్న భూమిని తండ్రి దేవుడు మాట తప్పకుండా ఇస్తాను అని మాటిచ్చి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత, అబ్రాహాము దేవుని యెక్క మాటను విశ్వసముతో నమ్మాడు. విశ్వస ఒప్పందాన్ని 15వ అద్యాయములో చూస్తున్నాము.  దేవునిపై నమ్మకము ఉంచితే మనకు కావలిసినదంత దేవుడు మనకు ఇస్తాడని, మొదటి పఠనము మనకు తెలియజేస్తుంది.


3) సువిశేష పఠనము

   ఈ యొక్క పఠనంలో   క్రీస్తు యొక్క దివ్యరూపం దాల్చడం, క్రీస్తు యొక్క వస్త్రములు తెల్లగా ప్రకాశించడం మరియు ఆయనతో పాటు మరో ఇద్దరు దివ్య వ్యక్తులు మోషే మరియు ఏలీయా కనబడ్డారు అన్న విషయాన్ని  తెలియపరచటం మనము చూస్తున్నాము. ఈ యొక్క  ముగ్గురు వ్యక్తులుకూడా

1) మోషే: మంచి నాయకుడు పుణ్యాత్ముడు, దేవుని యొక్క ముఖాన్ని ముఖ్య ముఖీగా చూసినవాడు, అంతే కాకుండా దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి వాగ్దాన భూమివైపు నడిపించటం కూడా చూస్తున్నాము.

2) ఏలీయా: ఏలీయా అంటేనే ఒక గొప్ప మహాశక్తి పేరు పొందిన వాడు, దేవునితో  సంబాషించిన వ్యక్తి, ఏలీయా, బాలు ప్రవక్తలను మట్టు పెట్టి దేవుని యొక్క   కీర్తిని అందరికి పరిచయం చేసినవాడు. ఈయన అనేక అద్భుత కార్యములను, మనము రాజుల రెండవ గ్రంధములో చూస్తున్నాము. ఈయన  మరణించకుండానే పరలోకమునకు కొనిపోబడినట్లు మనం రాజుల రెండవ గ్రంధంలో చూస్తున్నాము.

దేవుని ధర్మ శాస్త్ర  చట్టాల ప్రతినిధిగా మోషేను, ప్రవచనాల ప్రతినిధిగా ఏలీయాను  ఉన్న వారి ముందు  క్రీస్తు దివ్యరూపం ధరిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా క్రీస్తు పొందబోయేటటువంటి  శ్రమలను , కష్టాలను మరియు బాధలను సిలువ మరణము గురించి క్రీస్తుతో సంభాషించటం చూస్తున్నాము.

 వీటినన్నిటిని గ్రహించినటువంటి పేతురు క్రీస్తు దగ్గరకు వచ్చి మనము ఇక్కడ ఉండుట సమంజసము  అందుకని మీకు, మోషే మరియు ఏలీయాకు గుడారములను నిర్మిస్తాం అని పేతురు క్రీస్తు ప్రభువుతో పలుకుచున్నాడు. ఇది ఇలా ఉండగా ఆకాశము నుండి తండ్రి దేవుడు ఈయన నా కుమారుడు ఈయనను చూచి  నేను ఆనందించుచున్నాను,  ఈయనను ఆలకించండి అని దేవుడు మనల్ని ఆదేశిస్తునాడు, అంటే క్రీస్తు చెప్పిన ప్రతిమాటను కూడా పాటిస్తూ, అనుసరిస్తూ, జీవించాలని తండ్రి దేవుడు మననందరికి తెలియజేస్తున్నాడు.

కాబట్టి ప్రియాయమైన క్రైస్తవ విశ్వాసులారా ఈ నాటి పఠనాలు అన్ని కూడా మానవులమైన మనం, ఎటువంటి స్థితిలో ఉన్నాకూడా క్రీస్తు యొక్క మార్గములో పయనిస్తూ, క్రీస్తుయొక్క అనుచరులుగా జీవించాలని మరియు దేవుడు  మనందరిని కూడా అయొక్క బాటలో నడపాలని , ఆశీర్వదించాలని ఈ నాటి దివ్యబలి పూజలో పాల్గొందము.

Br.Simon


పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...