28, డిసెంబర్ 2024, శనివారం

తిరు కుటుంబ పండుగ ఆదివారం

 తిరు కుటుంబ పండుగ ఆదివారం 

1 సమూయేలు 1:20-22, 24-28, 1 యోహాను 3:1-2, 21-24, లూకా 2:41-52

ఈనాడు తల్లి శ్రీ సభ తిరు కుటుంబ పండుగను కొనియాడుచున్నది. ఏసు మరియమ్మ మరియు ఏసేపు కుటుంబము ఆదర్శవంతమైన కుటుంబము మరియు పవిత్రమైనటువంటి కుటుంబము అని తెలుపుతూ ఆ యొక్క కుటుంబమును మన అందరి యొక్క కుటుంబములకు ఆదర్శంగా చేసుకొనమని తల్లి శ్రీ సభ ఈనాడు మన నుండి కోరుచున్నది. ఈయొక్క కుటుంబము ఆదర్శము ఎందుకనగా, ముగ్గురు కూడా తండ్రి చిత్తమును ప్రేమిస్తూ దానిని వారి యొక్క జీవితంలో నెరవేర్చారు. పరస్పరము ఒకరిని ఒకరు సహకరించుకుంటూ జీవించారు.

తండ్రికి తమ్ము తాము సమర్పించుకుంటు జీవించారు.

ఏసుక్రీస్తు ప్రభువు దేవుడైనప్పటికీ మానవునిగా ఒక కుటుంబంలో జన్మించారు ఆ కుటుంబంలో బిడ్డలు ఎలా జీవించాలో తెలిపారు. కాబట్టి ఆయన తన తల్లిదండ్రులతో జీవించిన విధానము అందరికీ కూడా ఒక సుమాత్రుకగా ఉండాలి. మరియమ్మ గారు ఏసేపు గారు ఏ విధముగా నైతే పుణ్య దంపతులుగా జీవించారో అదే విధముగా భార్యాభర్తలు జీవించాలి. ఏసేపు మరియమ్మ గారు వారి యొక్క దాంపత్య జీవితంలో అర్థం చేసుకుంటూ, ప్రేమను పంచుకుంటూ జీవింప సాగారు. మరీ ముఖ్యంగా బాల యేసు ప్రభువును ఈ లోకంలోనికి తీసుకొని రావడానికి వారు పొందినటువంటి అనేక శ్రమలు మనకు ఆదర్శం అవ్వాలి. దేవుని యొక్క కుటుంబంలో కూడా కష్టాలు వచ్చాయి కాబట్టి మన కుటుంబాలలో కష్టాలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు మనము పడిపోకుండా ధైర్యముగా నిలబడాలి.

ఈనాటి మొదటి పఠణంలో ఎల్కాన, హన్నా తమ బిడ్డ అయినటువంటి సమూయేలును దేవాలయంలో సమర్పించిన విధానమును చదువుకుంటున్నాము. ఈ భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవింప సాగారు ఎందుకనగా వారి యొక్క జీవితంలో హన్నాకు సంతానం లేని సమయంలో భర్త భార్యతో నీవు బాధపడవద్దు పది బిడ్డలకు సమానమైన భర్తను నేనున్నాను కదా అని తన భార్యను ఓదార్చి తనకు అండగా నిలబడ్డాడు. ఈ యొక్క కుటుంబము నిజముగా దేవుని మీద ఆధారపడుతూ జీవించిన కుటుంబం వారి యొక్క బిడ్డను కూడా దేవుని సేవ నిమిత్తము సమర్పించారు. ఈనాటి రెండవ పఠణంలో కూడా మనందరం కూడా దేవుని బిడ్డలం దేవుని యొక్క కుటుంబమునకు చెందిన వారసులమని తెలియజేస్తూ ఉన్నది.

ఈనాటి సువిశేష భాగములో మరియమ్మ గారు ఏసేబుగారు బాల యేసును దేవాలయములో సమర్పించిన విధానము అదేవిధంగా ఆయనను యెరుషలేము దేవాలయంలో కోల్పోయిన విధానము మరలా తిరిగి పొందుటన గురించి వింటున్నాం. ఈ యొక్క  సువిశేష భాగములో వీరిద్దరూ కూడా తమ యొక్క విధులను నెరవేర్చారు. బిడ్డ మీద ఉన్న ప్రేమతో మరల తిరిగి బిడ్డను వెదకుచు ఆయన కోసం తపించి ఉన్నారు ఇది కేవలం ఆయన మీద ఉన్న ప్రేమ వలనే. ఈ యొక్క తిరు కుటుంబము నుండి మనము కూడా గమనించవలసినటువంటి కొన్ని అంశములు ఏమిటనగా 

1. దేవుడిని కలిగి ఉన్న కుటుంబం 

2. దేవునికి విధేయించిన కుటుంబం 

3. నిస్వార్ధమైన కుటుంబం 

4. ప్రేమ కలిగిన కుటుంబం 

5. ఒకరినొకరు అర్థం చేసుకున్న కుటుంబం 

6. వినయము కలిగిన కుటుంబం

7. బాధ్యతలు నెరవేర్చిన కుటుంబం. 

ఈ యొక్క 2024వ సంవత్సర చివరి ఆదివారమున తిరు కుటుంబ పండుగ మన యొక్క కుటుంబాలు కూడా ఈ యొక్క తిరు కుటుంబమును పోలిన విధంగా ఉండాలి అని ఆలోచిస్తూ, మన కుటుంబములను సరిచేసుకుని జీవించటానికి ప్రయత్నం చేయాలి ఎందుకనగా కుటుంబమే బిడ్డలకు మొదటి పాఠశాల వారు అక్కడ నుండి అన్నీ కూడా నేర్చుకుంటారు కాబట్టి కుటుంబం మంచిదైతే సంఘం మంచిదవుతుంది, సంఘం మంచిదైతే ఊరే మంచిదవుతుంది, ఊరు మంచిదైతే రాష్ట్రం మంచిదవుతుంది ఈ విధంగా ఈ ప్రపంచమే మంచిగా అవుతుంది కాబట్టి మన కుటుంబములను సరిచేసుకుని జీవించటానికి ప్రయత్నం చేద్దాం. 

Fr. Bala Yesu OCD

24, డిసెంబర్ 2024, మంగళవారం

క్రీస్తు జయంతి సందేశం"డిసెంబర్ 25

"క్రీస్తు జయంతి సందేశం"డిసెంబర్ 25
ఈనాడు యావత్ ప్రపంచం మొత్తం కూడా క్రీస్తు జయంతి యొక్క పుట్టినరోజు పండుగను కొన్నియాడుచున్నది. ఈ పండుగ కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా మిగతా వారందరూ కూడా జరుపుకుంటారు ఏదో ఒక విధముగా వారి ఇంటిలో క్రిస్మస్ నక్షత్రమో, చెట్టునో ఉంచుకుంటూ వారి ఈ పండుగను జరుపుకుంటారు. 
1. క్రిస్మస్ పండుగ అందరికీ ఆనందంనిచ్ఛే ఒక పండుగ ఎందుకనగా 
-ఎన్నో వందల సంవత్సరముల నుండి ఎదురుచూస్తున్నటువంటి మెస్సయ్య జన్మించబోతున్నారు, - ప్రవక్తల యొక్క ప్రవచనములు నెరవేరబోతున్నాయి.
- దేవుని యొక్క రాకడ భూమి మీద మన జన్మంలా జరుగుచున్నది. దేవుడు ఈ భూమి మీదకు మనలాగా వచ్చి మన అందరిని కూడా పరలోకము చేర్చాలి అన్నదే ప్రభువు యొక్క కోరిక. ఇంగ్లీషులో ఒక గొప్ప మాట ఈ విధంగా రాయబడినది Jesus became so that we might become what He is. దేవుడు మానవుడు అయినది, మానవుని తనలాగా మార్చుట కొరకే. క్రీస్తు యొక్క జననము ద్వారా మనము మొట్టమొదటిసారిగా చరిత్రలో దేవుణ్ణి కనులారా చూడగలుగుతున్నాము, చెవులారా వినగలుగుతున్నాము. చేతితో తాకగలుగుతున్నాము. ఆయన యొక్క ఉనికిని మనము మన యొక్క జీవితంలో అనుభవించగలుగుతున్నాం. ఇది కేవలం దేవుడు మానవుల మీద ఉన్నటువంటి ప్రేమ వలన మాత్రమే చేసినటువంటి గొప్పదైనటువంటి పని. 
ఎందుకు దేవుడు మానవుడు అయ్యారు అని మనం ఇంకా ధ్యానించినట్లయితే ప్రభువు పతనమైనటువంటి మానవలోకమును రక్షించుట కొరకు, తప్పిపోయిన గొర్రెలను వెదకుట కొరకు, మనందరికీ పరలోక మార్గము చూపుట కొరకు ఆయన మనలాగా మారి మన మధ్యన నివసించారు. ఒక చిన్న సంఘటన మనకు ఇంకా క్లుప్తంగా ఈ అంశం గురించి వివరిస్తుంది. ఒక మంచు కురిసే(మంచు గడ్డ కట్టే స్థలం) ప్రాంతంలో ఒక రోజున కొన్ని పక్షులు ఒక భక్తుడు యొక్క ఇంటి దగ్గర చెట్టు మీద వాలి ఉన్నాయి అయితే బయట చాలా చలిగా, మంచు గడ్డలు కట్టడం వల్ల అక్కడున్నటువంటి పక్షులన్నీ కూడా ఎటు వెళ్లాలో తెలియక దీనస్థితిలో ఉన్నాయి వాటి పరిస్థితిని చూసినటువంటి ఆ భక్తుడు ఎలాగైనా సరే వాటిని రక్షించాలనుకున్నాడు కానీ అది ఎలా అని ఆయనకు తోచలేదు అప్పుడు తన ఇంటి ప్రక్కన ఉన్న ఒక షెడ్డులో కొంచెం మేత పెట్టి వాటిని లోపలికి పిలవటానికి ప్రయత్నం చేశాడు కానీ అక్కడున్న పక్షులు ఆయన మాట విని లోపలికి రాలేకపోయాయి ఎందుకంటే ఆయన స్వరాన్ని అవి గుర్తించలేకపోయాయి అప్పుడు ఆయన తన మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు నేను కూడా ఒక పక్షినైతే ఈ పక్షులన్నీ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్లి బ్రతికించి ఉండే  వాడినని భావించాడు. ఈ యొక్క విషయము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఎవరైతే ఇతరుల యొక్క స్వభావంలోకి వెళుతుంటారో, ఇతరులు లాగా మారతారు అప్పుడు వారికి అనేక విషయాలు తెలియచేసి వారిని రక్షించవచ్చు. దేవుడు కూడా చేసినటువంటి గొప్ప పని ఇదే మనలాగా వచ్చి మనందరినీ పరలోకం చేర్చాలనుకున్నారు, మనకు అనేక విషయాలు మన స్వభావంలో అర్థమయ్యే విధంగా తెలిపి మనలను మార్చాలనుకున్నారు. ఇది ఒక సంతోషకరమైనటువంటిది మానవాళి ఆనందమునుంచే వార్త.
.2. క్రిస్మస్ పండుగ మార్చే పండుగ అనగా భూలోకాన్ని పరలోకముగా మార్చినటువంటి గొప్ప పండుగ. దేవుడు ఉన్న స్థలము పరలోకం అదే దేవుడు భూలోకమునకు వచ్చి పరలోకంగా మార్చారు. మనకు  పరలోక అనుభూతిని కలుగ చేశారు. ఏసుప్రభు తన యొక్క రాకతో ఎందరినో మార్చారు మరి ఆయన రాకడ మనల్ని మార్చగలుగుతుందా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏసుప్రభు తన మాటల ద్వారా క్రియల ద్వారా సాన్నిధ్యం ద్వారా అనేక మందిని మార్చారు.
3.  క్రిస్మస్ అనగా దేవుడు మానవులకు దగ్గరైన వేళ. దేవుడు మానవులకు ప్రేమను పంచుటకు దగ్గరగ వచ్చారు మరి మనము దేవుని కొరకు రాగలుగుతున్నామా? ప్రభువే తన చిత్తము ప్రకారముగా మన కొరకు తన యొక్క మహిమాన్వితమైనటువంటి స్థలమును విడిచి మన కొరకు వచ్చారు. మనము దేవుని కొరకు దేవాలయానికి వస్తున్నామా?
రక్షకుని యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్న అందరూ కూడా కలిసి ఆనందంగా ఈ పండుగ కొనియాడుతూ, ప్రేమను పంచుతూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ దేవుడిని ఆరాధిస్తూ ఈ యొక్క పుట్టినరోజు పండుగను కొనియాడాలి.

Fr. Bala Yesu OCD

21, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాల నాలుగవ సామాన్య ఆదివారం

ఆగమన కాల నాలుగవ సామాన్య ఆదివారం 
మీకా 5:1-4 హెబ్రీ 10: 5-10 లూకా1:39-45
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ఏసుప్రభు యొక్క ఆగమనం కోసం ఎదురు చూసే వారందరిలో ఆయన యొక్క జన్మం జరుగుతుంది అనే అంశము గురించి తెలియజేయు చున్నవి. దేవుని ప్రణాళికకు సహకరిస్తూ ఆ ప్రణాళికను వ్యక్తిగత జీవితంలో అమలు చేస్తూ జీవించే ప్రతి ఒక్కరిలో దేవుడు జన్మిస్తారు.  ప్రభువు యొక్క జన్మదినం త్వరగా రాబోవుచున్నది కాబట్టి ఆయన రాక కొరకు ఆధ్యాత్మికంగా తయారవ్వాలి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు మీకా ప్రవక్త ద్వారా చేసినటువంటి వాగ్దానములను తప్పనిసరిగా నెరవేరుస్తారు అనే విషయమును తెలుపుచున్నారు. బెత్లెహేము నుండి రక్షకుడు ఉదయిస్తాడు అని ప్రవక్త తెలియజేశారు. దీనిలో ఒక అర్థము ఉన్నది. ఎందుకు ప్రత్యేకంగా దేవుడు బెత్లహేముని ఎన్నుకున్నారు రక్షకుని జన్మస్థలంగా? మొదటిగా బెత్లహేము అనగా హౌస్ ఆఫ్  ద బ్రెడ్ అని అదేవిధంగా దేవుని యొక్క నిలయము అని అర్థం కావున అక్కడినుండి రక్షకుడు జన్మిస్తారు. బెత్లహేము లేవీయులకు కేంద్ర స్థానంగా ఉన్నది. బెత్లహేము దావీదు రాజు యొక్క జన్మస్థలం. ఇశ్రాయేలును పరిపాలించే పాలకుడు మరియు దేవుడు పంపబోయే వ్యక్తి క్రీస్తు ప్రభువే ఎందుకంటే దేవుడు మరియమ్మకు ప్రత్యక్షమైన సమయంలో తనతో పలికిన మాటలు ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని అన్నారు.( లూకా 1:33). దేవుడు చిన్నదైనటువంటి బెత్లహేమును ఎన్నుకొని ఆ ప్రదేశమునకు రక్షకుని జన్మస్థలమును అర్థము  ఇస్తున్నారు. ఎఫ్రాతా అనేది ఒక చిన్న గ్రామం దానికి పెద్ద గుర్తింపులేదు అయితే దేవుడు మాత్రము ఆ గ్రామాన్ని ఎంచుకున్నారు. ఆయన ఈ భూలోకానికి రావడానికి ఒక గొప్ప ప్రాంతమును ఎన్నుకొనక కేవలం గుర్తింపు లేని అతి సామాన్యమైన ప్రాంతమున ఎన్నుకొని దానికి ఒక గొప్పదైన అర్థం ఇస్తున్నారు. మన జీవితంలో ప్రముఖమైన స్థలంలో జీవించడానికి ప్రయత్నిస్తాం కానీ దేవుడు మాత్రం ఒక చిన్నదైనటువంటి గుర్తింపు లేని స్థలము ఎన్నుకొని అక్కడ జన్మిస్తున్నారు.
దేవుడు అల్పులైనటువంటి చేపలు పట్టే శిష్యులను ఎన్నుకొని వారిని గొప్పవారిగా తీర్చిదిద్దారు సామాన్యురాలు అయినటువంటి మరియమ్మ గారిని ఎన్నుకొని దేవుని తల్లిగా చేశారు కాబట్టి ప్రభువు అల్పమైనటువంటి ప్రాంతంలో జన్మించి ఆ ప్రాంతములకే కొత్తదైన అర్థం ఇస్తున్నారు ఈ క్రిస్మస్ కాలమున అల్పుల మైనటువంటి మనలో జన్మించి మన యొక్క జీవితమునకు కూడా కొత్త అర్థమును దయ చేస్తారు. 
ఈనాటి రెండవ పఠణంలో ఏసు క్రీస్తు ప్రభువు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు అని తెలియజేశారు. 
ఈనాటి సువిశేష భాగములో మరియమ్మ గారు ఎలిజబెతమ్మను సందర్శించుట గురించి వింటున్నాం దేవదూత వద్ద నుండి శుభ వచనము విన్న మరియ మాత వెంటనే తన చుట్టమైన ఎలిజబెతమ్మను కలుసుకొనుటకు వెళ్ళుచున్నారు. దాదాపుగా నాలుగు రోజుల ప్రయాణం చేసి విసుగు చెందకుండా నజరేతు నుండి యూదయా పట్టణంలో ఉన్న  అయిన్ కరీము అనే ప్రాంతమునకు మరియ తల్లి 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి  ఎలిజబెత్తమ్మను కలుసుకున్నారు. ఈ యొక్క సువిశేష పట్టణములో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు.
1. అడగక మునుపే సహాయము చేయుట. మరియ తల్లిని ఎలిజబెత్తమ్మ సహాయము చేయమని పిలవలేదు కానీ మరియమ్మ గారే ఎలిజబెత్ పరిస్థితిని అర్థం చేసుకొని వారికి సహాయం చేయుటకు వెళ్లారు. కానా పల్లెలో కూడా మరియ తల్లియే చొరవ తీసుకొని వారు అడగకమునుపే సహాయం చేశారు. మన క్రైస్తవ జీవితంలో కూడా చాలా సందర్భంలో మనం ఇతరులు మనల్ని అడగాలనుకుంటాం అప్పుడే సహాయం చేస్తాం కానీ మరియ తల్లి యొక్క గొప్పతనం ఏమిటంటే అడగకపోయినా సహాయం చేసే గుణం అని మనం నేర్చుకోవాలి. 
2. ఆనందమును పంచుకొనుట. మరియమ్మ గారు దేవునికి తల్లిగా పిలవబడిన సమయంలో తన యొక్క ఆనందమును తన చుట్టమైన ఎలిజబెత్తమ్మతో పంచుకొనుటకు ఆనందముతో పరిగెడుచున్నారు. దైవ అనుభూతిని కలిగిన మరియమ్మ గారు ఇంకొక వ్యక్తిని సందర్శిస్తూ తన దైవ అనుభూతిని మరియు ఆనందమును ఇతరులకు ఇస్తున్నారు. మనం కూడా క్రైస్తవ జీవితంలో ఇతరులకు ఆనందం నివ్వటానికి ప్రయత్నించాలి. 
3. మరియమ్మ గారి యొక్క వినయం. మరియమ్మ గారు కూడా గర్భము ధరించి ఉన్నారు తాను కూడా ఇతరుల యొక్క సహాయం కావలసిన వారే కానీ తాను తన యొక్క సహాయం చూసుకోకుండా ఇతరులకు సహాయం చేయాలని తనను తాను తగ్గించుకొని ఎలిజబెత్ దగ్గరకు వెళుతుంది. వాస్తవానికి మరియమ్మ గారు దేవునికి తల్లిగా ఉండబోతున్నారు ఎలిజబెతమ్మ ప్రవక్తకు తల్లిగా ఉండబోతున్నారు ఈ సందర్భంలో మరియమ్మ గారి దేవుని తల్లి అయినప్పటికీ తన్ను తాను తగ్గించుకొని సేవాభావంతో ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్లి సేవ చేస్తున్నారు.
4. ఎలిజబెతమ్మ తన వయసులో చిన్నదైనా మరియమ్మ గారికి నమస్కరించి నా దేవుని యొక్క తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను అని మరియమ్మ గారిని గౌరవించి నమస్కరించినది మనం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకన్నా చిన్న వయసులో ఉన్నటువంటి వారి యొక్క గొప్పతనమును మంచితనము చూసినప్పుడు వారిని కూడా గౌరవించాలి. జీవం పోసిన దేవునికి జీవమునిచ్చుటకు నిన్ను తల్లిగా దేవుడు ఎన్నుకున్నారని ఎలిజబెత్తమ్మ మరియమ్మ గారిని గౌరవించారు.
ఈనాటి ఈ యొక్క దివ్యగంధ పఠణముల ద్వారా మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళికను అంగీకరిస్తూ ఆయన యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తూ జీవించాలి. మన యొక్క జీవితంలో ప్రభువు కొరకు తయారు చేసుకోవాలి. మరియ తల్లి మరియు ఎలిజబెతమ్మవలే ఇతరులకు సహాయం చేస్తూ, ప్రేమను పంచుతూ జీవించాలి. 
Fr. Bala Yesu OCD

14, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాల మూడవ ఆదివారం

ఆగమన కాల మూడవ ఆదివారం 
జెఫాన్య 3:14-18, ఫిలిప్పీ 4: 4-7 లూకా 3:10-18
ఈనాటి ఆదివారమును తల్లి శ్రీ సభ "ఆనందించు"(Gaudete Sunday)ఆదివారంగా పిలుస్తున్నది ఎందుకనగా ప్రభువు యొక్క జన్మము ఆసన్నమవుతున్నది కాబట్టి మనము సంతోషించాలి. ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు మనకు బోధించుచున్నటువంటి అంశము కూడా ఆనందించుట గురించియే. ఎందుకు మనము ఆనందించాలి అనే అంశమును ధ్యానించినట్లయితే మనకు అనేక విషయములు జ్ఞాపకం వస్తాయి;
- మనలను రక్షించే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
- మనతో ఉండే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
-  మనల్ని ప్రేమించే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
- మనల్ని క్షమించే దేవుడు వస్తున్నాడు కాబట్టి సంతోషించాలి
- మనలను పరలోకం చేర్చే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి ఈ విధంగా దేవుని యొక్క అనేక అంశములను గురించి మనము ఆనందించాలి.
ఏ విధముగానయితే మనము ప్రార్ధించినప్పుడు దేవుడు మనకు దయచేసినప్పుడు మనం ఆనందిస్తామో, అదేవిధంగా చిన్నపిల్లలు తమకు నచ్చిన దానిని వారు పొందుతున్నప్పుడు ఆనందిస్తారు మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మనలను తండ్రి వైపుకు నడిపించే ప్రభువు రాబోతున్నందుకు మనం కూడా సంతోషించాలి.
ఈనాటి మొదటి పఠణంలో జెఫన్యా ప్రవక్త ఇశ్రాయేలును, యెరుషలేమును సంతోషించమని తెలుపుచున్నారు. ప్రభువు వారి మీద ఉన్నటువంటి నిందలను తొలగించినందుకుగాను అదే విధముగా వారిని శత్రువుల యొక్క భారి నుండి కాపాడినందుకు సంతోషించమని తెలుపుతున్నారు. దేవుడు వారి యొక్క మధ్య ఉన్నందుకు, దేవుడు వారిని క్రింద పడనివ్వకుండా చూసుకుంటున్నందుకు అదే విధముగా వారికి నూతన జీవితమున వసుగుతున్నందుకుగాను ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను, యెరుషలేము వాసులను సంతోషించమని తెలుపుచున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు బానిసత్వమునకు పంపబడిన సమయంలో వారి నుండి స్వేచ్ఛ, ఆనందం తీసివేయబడినది ఇప్పుడు మరొకసారి దేవుడు వారిని విముక్తులను చేస్తూ వారికి ఇవ్వవలసినటువంటి ఆనందమును దయచేస్తున్నారు అందుకే ప్రవక్త ఆనందించండి అని తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు ప్రభువు నందు ఆనందించండి మహా ఆనందపడండి అని పలుకుతున్నారు. ప్రభువు యొక్క రాకడ కొరకై విచారింపక హృదయపూర్వకంగా ప్రార్థించమని పౌలు గారు తెలిపారు. పౌలు గారు ఫిలిప్ప ప్రజలకు దేవుని వాక్యము ప్రకటించు సందర్భంలో పరిసయ్యుల వలన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఫిలిప్పు ప్రజలను కూడా వారి జీవితంలో ఎదురయ్యే శ్రమలకు చింతింపక దేవునియందు నమ్మకంతో  వారిని హృదయపూర్వకంగా ప్రార్ధించమంటున్నారు వారి శ్రమలు కొద్ది కాలమే అంటున్నారు. ప్రభువు వస్తారు కావున ఆనందించమని అదే విధంగా మహా ఆనందంతో ఉండమని తెలుపుచున్నారు.
ఈనాటి సువిశేష భాగములో బప్తిస్మ యోహాను గారి మాటలు విన్న ప్రజలు వెంటనే హృదయ పరివర్తనమునకు చెందిన క్రియలను చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు.ఎవరైతే రెండు అంగీలను కలిగి ఉన్నారో వారు లేని వారికి ఒకటి ఇమ్మని తెలుపుతున్నారు అదేవిధంగా భోజన పదార్థములు కలిగిన వారు లేనివారికి ఇవ్వమని తెలుపుతున్నారు. ఈ మాటలు యొక్క సారాంశం ఏమిటంటే దేవుడు ఇచ్చిన దానిని ఉదారంగా ఇతరులతో పంచుకుని జీవించమని యోహాను గారు తెలుపుతున్నారు. అదేవిధంగా సుంకరులను అధిక సుంకమ వసూలు చేయవద్దంటున్నారు, అలాగే రక్షక భటులు వచ్చి అడిగినప్పుడు ఎవరికి కూడా హాని చేయకుండా న్యాయముగా వారిపట్ల ప్రవర్తించమని బప్తిస్మ  యోహాను గారు తెలిపారు. వాస్తవానికి ఈ మూడు అంశాలు కూడా సంతోషించదగినటువంటి అంశములే ఎందుకంటే వారు హృదయ పరివర్తనము చెంది ఇతరులకు సంతోషించే విధంగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే యోహాను గారు వారిని హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలి రమ్మంటున్నారో వెంటనే వారిలో ఉన్న పాపమును గ్రహించి  మెస్సయ్యాను స్వీకరించుట కొరకై తగినటువంటి క్రియలు చేయుటకు సిద్ధముగా ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీకి, మీలో పాపము చేయని వ్యక్తి ఈమె మీద మొదటి రాయిని వేయమన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ వారిలో ఉన్న పాపమును గ్రహించి వెంటనే తిరిగి వెళ్ళారు. ఈ యొక్క సువిషేశ భాగములో వున్న వ్యక్తులు కూడా వారి పాపపు జీవితమును సరి చేసుకొనుటకు సిద్ధపడుతున్నారు దాని వలన ఈ సమాజము కూడా సంతోషిస్తూ ఉన్నది. ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే నేను ఇతరులకు సంతోషిస్తున్నానా?. నా వలన నలుగురు సంతోషపడుతున్నారా?. నా రక్షకుని రాకడ కొరకు ఎదురుచూస్తున్నానా? నేను సంతోషంగా జీవిస్తున్నా? అని పరిశీలన చేసుకొని జీవించాలి.
మనం ఆనందంగా ఉండుట కొరకై ప్రభువు వస్తున్నారు కాబట్టి ప్రతినిత్యం కూడా ఆనందంగా జీవించడానికి పాపము లేకుండా పుణ్య క్రియలు చేస్తూ జీవిద్దాం. 
Fr. Bala Yesu OCD

7, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం 
బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గురించి తెలియజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఆగమన కాలంలో రెండవ మరియు మూడవ ఆదివారములో బప్తిస్మ యోహాను సందేశమును వింటుంటాం. దేవుని యొక్క రాకడ కొరకై మనందరం కూడా మన జీవితంలో మార్గమును సిద్ధము చేయాలి. ప్రతి ఒక్కరి ప్రయాణమునకు ఒక మార్గము అనేది తప్పనిసరిగా అవసరం ఎందుకంటే మార్గము లేనిదే ప్రయాణము సక్రమంగా జరగదు, గమ్యమును చేరలేము. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత్మ భూమికి నడిచే సమయములో దేవుడే స్వయముగా వారికి మార్గ సూపరిగా ఉండి వారిని నడిపించారు. మార్గము లేని జీవితము గమ్యము చేరటము కష్టం.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు స్వయంగా తన ప్రజల కొరకు బాబిలోనియా నుండి యెరుషలేమునకు మార్గమును సిద్ధం చేస్తారని తెలుపుతున్నారు కనుక బారుకు ప్రవక్త దుఃఖించే ఇశ్రాయేలు ప్రజలను సంతోషించమని తెలుపుచున్నారు. బారుకు ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను దేవుని చెంతకు తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నారు. వారి యొక్క బానిసత్వం ముగిసిన తర్వాత తిరిగి దేవుని చెంతకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క ఆగమన కాలంలో మనందరం కూడా మన యొక్క పాపపు జీవితమును వదిలి, దేవుని చెంతకు తిరిగి రావాలి అదే ప్రభువు కోరుకుంటున్నారు. ప్రభువు ఇశ్రాయేలు ప్రజల కొరకై తానే స్వయంగా మార్గమును సిద్ధం చేస్తున్నారు లోయలు పుడ్చుతున్నారు. ప్రభువు తన ప్రజలకు ఒక మంచి మార్గమును ఏర్పరిచి వారిని సంతోషంగా ఉండులాగా చేస్తారని బారుకు ప్రవక్త తెలియజేశారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీయులను దేవుని యొక్క రాకడ కొరకై సంసిద్ధత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ప్రార్థించుకొనమని తెలియజేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగములో యోహాను గారు ప్రభువు యొక్క రాకడ కొరకై మార్గమును సిద్ధం చేయుడని  వెలిగెత్తి యోర్థను నది తీరమున ప్రకటించుచుండెను. బప్తిస్మ యోహాను ఈ లోకమునకు వచ్చినదే యేసు ప్రభువు కొరకు మార్గమును సిద్ధం చేయుట కొరకు దాని ద్వారా ఏసుప్రభు ఇంకా త్వరగా తండ్రి పరిచర్యను ఈ లోకంలో చేయవచ్చు కాబట్టి.
మన జీవితంలో దేవుని యొక్క రాకడ కొరకు మార్గమును సిద్ధం చేయని యెడల దేవుడు మన ఇంటి గుండా ప్రవేశించరు, మనలోకి ప్రవేశించరు. మన యొక్క జీవితంకు మార్గమును హృదయ పరివర్తన ద్వారా, చెడును విడిచి పెట్టుట ద్వారా ఏర్పరచవచ్చు అప్పుడు దేవుడు మనలోకి ప్రవేశిస్తారు. మార్గమును సిద్ధం చేయుట చాలా కష్టం ఎందుకంటే అడ్డుగా ఉన్నటువంటి ప్రతిది కూడా తొలగించాలి అప్పుడే మార్గము ఏర్పరచగలరు కాబట్టి దేవుని యొక్క రాకడ కొరకు ఏదైతే అడ్డుగా ఉంటుందో మనము దానిని తీసివేయాలి. ప్రభువు కొరకు మార్గమును సిద్ధం చేయమని ఎడారిలో ఒక స్వరము వినబడెను అని యెషయా ప్రవక్త తెలియజేశారు. ఎడారి అనునది దేవుడిని కలుసుకునే ఒక స్థలం, మన జీవితాలు మార్చు స్థలం. మనము ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటారు అని తెలిపే ఒక ప్రదేశం. హాగారు ఎడారిలో ఉండగా దేవుడు ఆమెకు తోడుగా ఉన్నారు. ఏలియా నిర్జన ప్రదేశంలో ఉండగా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఎడారి వలె నిరుత్సాహమైనటువంటి సమయములు ఎదురైనప్పుడు మనము దైవ అనుభూతిని పొందగలము. దేవుడు మనకు తోడుగా ఉంటారు.
ప్రతి లోయ పూడ్చబడును అని తెలుపుతున్నారు అనగా మనలో మనలో ఉన్నటువంటి అసమానతలను దేవుడు తన యొక్క వాక్యము ద్వారా దివ్య సంస్కారాలు ద్వారా నింపుతూ సరిసమానం చేస్తారు. అదేవిధంగా పర్వతాలు కొండలు సమము చేయబడాలి అనగా మనలో ఉన్నటువంటి గర్వము, అహము అనేటటువంటి చెడు గుణములను సమానము చేయాలి అనగా వినయము కలిగి జీవించాలి. వక్రమార్గములు సరిచేయాలి అనగా మన యొక్క జీవనశైలిని మార్చుకోవాలి. ప్రభువుకి మన హృదయములో మార్గము సిద్ధము చేయాలంటే మన గర్వమును తగ్గించుకోవాలి, పాపపు జీవితాన్ని విస్మరించాలి. పరిత్యజించుకునే లక్షణము కలిగి ఉండాలి. ఈ యొక్క ఆగమన కాల రెండవ ఆదివారంలో మనందరం కూడా ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటంటే దేవుని కొరకు మనము మన జీవితంలో ఎలాంటి మార్గమును సిద్ధం చేస్తున్నాం?. ఆయన కొరకు అడ్డుగా ఉన్నటువంటి పాపమును తొలగించుకుని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా.? హృదయ పరివర్తనం చెందుతున్నామా లేదా? పాపక్షమాపణను కలిగి ఉంటున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
Fr. Bala Yesu OCD

The Feast of Epiphany

The Feast of Epiphany  క్రీస్తు సాక్షాత్కార పండుగ యెషయా 60:1-6,ఎఫేసీ3:2-3, మత్తయి 2:1-12 ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు జ్ఞానులపండుగను కొనియాడ...