26, ఫిబ్రవరి 2026, గురువారం

మంచి కాపరి

 పాస్క కాలపు నాలుగవ ఆదివారం (మంచి కాపరి)

అపో 13: 14, 43-52, దర్శన 7:9,14-17  యోహను 10:27-30 

సువిశేషం : నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికీ నాశము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నా కిచ్చిన నా తండ్రి అందరి కంటే గొప్పవాడు. కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను, నా తండ్రి ఏకమైయున్నాము అని చెప్పెను. 

యోహను  9 వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక గ్రుడ్డి వానిని యేసు ప్రభువు స్వస్థత పరుస్తున్నాడు. కొంత మంది ఇంకా ఆయనను సాతానుచే ఈ అధ్భుతాలు చేస్తున్నాడు అని అంటున్నారు, పరిసయ్యులు ఆయన మీద కోపంగా ఉన్నారు. పదవ అధ్యాయంలో యేసు ప్రభువు యూద నాయకులను దొంగలు దోపిడి వారు అని అన్నారు. 9 వ అధ్యాయం లో  యేసు ప్రభువు నేనే లోకానికి వెలుగు అని చెబుతున్నారు. మరల ఒక గ్రుడ్డి వానికి చూపును ఇవ్వడం ద్వారా ఆయన ఈ లోకానికి వెలుగు అని చాటుతున్నారు. ఈ రెండు ఆధ్యాయాలలో యేసు ప్రభువు లోకానికి వెలుగు అవ్వడం ద్వార ఆయన చెంత ఉంటే మనకు ఏమి జరుగుతూంది అని తెలుస్తుంది. వెలుగు లోనే మనకు అంతయు స్పష్టముగా కనపడుతుంది. ఎవరు ఏమిటి అని తెలుస్తుంది. మనం నడిచే మార్గంలో ఉన్న అన్నీ మనం చూసి అటువంటి అపాయంకు గురికాకుండా వుంటాము అని ఈనాటి సువిశేషం తెలియ చేస్తుంది. ఎందుకు అంటే వెలుగైన ప్రభువే మనకు కాపరి అని 10 వ అధ్యాయం తెలియచేస్తుంది. 

 10 వ అధ్యాయంలో కాపరి గురించి వింటున్నాం.  ఇక్కడ నేను మంచి కాపరి అని చెపుతున్నారు. దీని ద్వారా మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. ఆయన వెలుగు నుండి మనం మన మార్గాన్ని చూడ గలిగి, ఆయన కాపుదలలో, గ్రుడ్డి వాని వలె తప్పి పోకుండా , సురక్షితమైన మార్గంలో, పచ్చికలలో ఉంటాము అని తెలియజేస్తున్నారు. 

 ప్రియ మిత్రులారా గ్రుడ్డి వానిని సరిగా చూడకుండా పరిసయ్యులు అతన్ని బయట పడవేశారు. నిజానికి పరిసయ్యులు అతనిని కాపరి వలె ఆయన బాగోగులు చూడాలి. కానీ వారు అదేమీ పట్టించుకోవడం లేదు.  యోహను 9:34. కానీ యేసు ప్రభువు మంచి కాపరి వలె ఆయనకు చూపును ఇస్తున్నాడు. ఇక్కడ మనం యేసు ప్రభువు మరియు పరిసయ్యులు మధ్య వ్యత్యాసం చూడవచ్చు. 

యేసు ప్రభువు ఒక మంచి కాపరి వలె అతని బాధను చూసి , తనకు అవసరాన్ని తీరుస్తున్నారు, కానీ పరిసయ్యులు కాపరులం, లేక మత పెద్దలం అని చెప్పుకుంటున్నారు కానీ తన కష్టాన్ని తీర్చడానికి ఏమి చేయడం లేదు. పరిసయ్యులు మంచి కాపరులు కాదు అని తెలుస్తుంది. పేరు చెప్పుకోవడానికి మాత్రమే వారు ఉన్నారు. 

ఆ గ్రుడ్డి వాడు యేసు ప్రభువుని మాటలు వింటున్నాడు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల మాటలు కాదు ఎందుకంటే ఆ గ్రుడ్డి వానికి యేసు ప్రభువు మాత్రమే చూపును ఇవ్వగలడు అని తెలుసు.  పరిసయ్యులు ఆ స్వస్థత పొందిన వ్యక్తిని  అక్కడ నుండి బయటకు పంపుతున్నారు. ఆ వ్యక్తి  యేసు ప్రభువు వద్ద ఉన్నాడు. ఆయనను ఎవరు ఏమి చేయలేరు. పరిసయ్యుల ఒత్తిడి పని చేయలేదు. ఆయన వారి మాట వినలేదు. కానీ యేసు ప్రభువు మాట వింటున్నాడు. నా గొర్రెలు నా స్వరమును ఆలకించును అని యేసు ప్రభువు చెబుతున్నాడు. 

ఇక్కడ గొర్రెలు అంటే కేవలం మాట వినేవి  లేక విశ్వాసించేవి అనేవి మాత్రమే కాదు. ఆయనకు చెందిన వారము. ఆయనకు చెందిన వారము, ఆయనను అనుభవించిన వారము కనుక ఆయన గురించి తెలిసిన వారము కనుక ఆయనను విశ్వసిస్తున్నాం.  కానీ కొంత మంది ఆయనను  విశ్వసించుట లేదు. అందుకే యేసు ప్రభువు అంటున్నారు , మీరు నా మందలోని వారు కారు కాబట్టి మీరు నమ్మరు అని అంటున్నారు. 

మనం ఎలాగ ఆయనకు చెందిన వారము అవుతాము అంటే  ఆయన మాట వినుట ద్వారా మరియు ఆయనను అనుసరించుట ద్వారా. అంటే నీవు ఆయన మాట వింటే , ఆయనను అనుసరిస్తే, నీవు ఆయనకు చెందిన వాడివి.   యోహను 8:47. లో యేసు ప్రభువు "దేవునికి సంబంధించిన వాడు దేవుని మాటలను ఆలకించును. మీరు దేవునికి సంబంధించినవారు కారు. కనుక , మీరు వాటిని ఆలకింపరు" అని పరిసయ్యులతో అంటున్నారు.  నీవు వినుటలేదు అంటే ఆయనకు చెందిన వారు కాదు అని అర్ధం. 

ఆయన స్వరమును ఆలకించు వారికి ఆయన ఏమి ఇస్తాడు? 

నేను వారికి నిత్య జీవము ప్రసాదింతును  , ఎవరు వానిని నాశనం చేయలేరు, అని ప్రభువు పలుకుచున్నారు. ఆయనకి చెందిన వారికి ఆయన ఇచ్చే బహుమానం ఏమిటి అంటే నిత్య జీవం. ఇది మనం మొదటి నుండి చూస్తూనే వున్నాం. మూడవ అధ్యాయం 16  వచనం. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి , తన ఏకైక కుమారుని ప్రసాదించేను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను." యోహను 6: 40"కుమారుని చూసి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును. "  ఆయనను నమ్మిన వారికి నిత్య జీవం ఉంటుంది. 

నా గొర్రెలు నా స్వరమను వినును,  నేను వానిని ఎరుగుదును.  ఈ మాటలను యేసు ప్రభువు  ఎవరు అయితే అతనిని నమ్మటం లేదో వారికి చెబుతున్నారు.  పరిసయ్యులకు చెబుతున్నారు. అంతకు ముందు యేసు ప్రభువు ఒక అద్భుతం చేశారు. వారు యేసు ప్రభువును నమ్మక వారి అపనమ్మకం వెల్లడి చేసి ఉన్నారు.  యేసు ప్రభువు చేసిన పనుల బట్టి వారు ఆయనను నమ్మాలి. కానీ ఇక్కడ పరిసయ్యులు నమ్ముట లేదు ఎందుకు అంటే వారు వారే నాయకులు , కాపరులు అనుకుంటున్నారు, వారికి ఇతరులను నడిపే శక్తి, జ్ఞానం లేకుండానే. ఒక రకమైన అహం వారిని పీడిస్తుంది. దాని నుండి వారు బయటకు రావడం లేదు. ప్రజల సమస్యల ఎడల వారికి అవగాహన కూడా లేదు. అవగాహన లేకుండా ఏవిధంగా వారు ప్రజలను నడిపించగలరు? 

యేసు ప్రభువును ప్రజలు నమ్ముతున్నారు, నిజానికి పరిసయ్యులు నాయకులే,  కానీ వారిని ప్రజలు నమ్మడం లేదు అని తెలుస్తుంది. పరిసయ్యులు వారిని వారు కాపరులుగా అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు వారిని కపట కాపరులుగా చెప్తున్నారు. అందుకే, నాకంటే ముందు ఉన్న వారు అందరు దొంగలు ,  దోపిడి చేసేవారు అని చెపుతున్నారు. వీరు కాపరులుగా నటించారు. నిజమైన కాపరులుగా వారు ప్రవర్తించలేదు. అనేక సార్లు స్వార్ధ కొరికలతో జీవించారు. యోహను 10: 8 "నాకు ముందుగా వచ్చిన వారందరు దొంగలు, దోపిడి గాండ్రు, గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు." వీరు ఇటువంటి వారు కాబట్టే ప్రజలు వారిని అనుసరించలేదు. 

మనుష్య కుమారుడు ఎటువంటి కాపరి 

యేసు ప్రభువు తన పాలన లేక ఏ విధముగా వారిని చూస్తారో చెప్తున్నారు, యేసు ప్రభువు ఈ ప్రజలు నా వారు అని చెబుతున్నారు. నేను వారిని ఎరుగుదును అని అంటున్నారు.  వీరు నా వారు అంటున్నారు.  ఎందుకంటే తండ్రి వాటిని నాకు ఇచ్చాడు, కానీ పరిసయ్యులు ఆ విధంగా చెప్పలేక పోయారు. కేవలం మేము ఎలా ఉండాలో మాత్రమే చెబుతాము అన్నట్లు ఉన్నారు. ఏమి తెలుసు యేసు ప్రభువుకి ఈ ప్రజల గురించి అంటే మనకు వాక్యం, ఆయనకు అంతా తెలిసే మన కోసం మరణించడానికి సిద్దపడ్డాడు అని చెబుతుంది. నీ సమస్యలు తెలుసు, నీ జీవితం తెలుసు, నీ తప్పులు తెలుసు, నీ ఒప్పులు తెలుసు, నీవు బయట పెట్టని అన్నీ విషయాలు తెలుసు, నీవు ఆయన నుండి ఏమి దాచి ఉంచలేవు కానీ వానిని బట్టి నిన్ను శిక్షించక, రక్షించడం ఎలానో తెలుసు. 

పరిసయ్యులకు నిజముగా తమ ప్రజలు ఎవరో తెలియదు, యేసు ప్రభువు నా ప్రజలు నాకు తెలుసు అని  చెబుతున్నారు.  యేసు ప్రభువుకు పరిసయ్యులకు ఉన్న తేడా ఏమిటి అంటే అంతకు ముందు ఒక గ్రుడ్డి వానిని స్వస్థ పరిచారు. ఆయనకు ఏమి కావాలో యేసు ప్రభువుకి తెలుసు. 

వారు  నన్ను అనుసరించును, ఎవరు వానిని నా నుండి అపహరింపలేరు. అని ప్రభువు పలుకుతున్నారు. నిజమైన క్రైస్తవుడు తండ్రి స్వరము తెలుసుకుంటాడు. వారు ఇతరులను అనుసరించరు. ఎలా మనకు తండ్రి స్వరం తెలుసు. ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు. నీకు ఆయన  ఎటువంటి కాపరి అని తెలుసుకుంటే నీవు ఆయన స్వరమును తెలుసుకోవచ్చు. ఈ రోజు ప్రతిదీ వినుటకు మంచిగా ఉన్నది, దేవుని నుండి అని పలుకుతున్నారు, ఇతరులును ఇబ్బంది పెట్టకుండా, జీవిస్తే చాలు అనుకుంటున్నారు. కానీ ఇతరులకు మంచి చేయడం, ఇబ్బంది పెట్టకపోవడమేకాదు, తప్పును ఖండిచడం కూడా , సౌలును దేవుడు చెబుతున్నారు, ఎందుకు నాన్ను హింసిస్తున్నావు? అప్పుడు ఆయన అడుగుతున్నాడు ప్రభూ, నీవు ఎవరు? నీవు హింసించే యేసును. 

ఎందుకు ఆయన స్వరాన్ని మనం వినాలి? నీవు ఎవరు, ఏమి చేస్తున్నావు,ఏమి చేయాలి అని తెలుసుకోవడానికి నీవు ప్రభువుని స్వరం వినాలి. లేక పోతే నీవు చేసేది మొత్తం మంచిది అని మనం అనుకుంటూవుంటాం. నిజం తెలుసుకోవడానికి నీవు ప్రభూని స్వరం వినాలి. 

ఇంకా ఎందుకు మనం ఆయన స్వరం వినాలి?  యేసు ప్రభువు చెబుతున్నారు నా గొర్రెలు నా స్వరమును వింటాయి అంటున్నారు, ఆయన స్వరము మనము వినకపోతే ఆయనను మనము తెలుసుకోలేము. నా గొర్రెలు నా స్వరమును వింటూనే వుంటాయి. ఆయన స్వరం వినకపోతే నీకు క్రైస్తవుడవు కాదు. ఆయన స్వరాన్ని వినకపోతే నీకు రోజు వచ్చే సాతాను శోధనలు నీవు జయించలేవు. సాతాను స్వరాన్ని కేవలం మనం ఎదుర్కొనేది తండ్రి స్వరము ద్వారానే. నీవు ఆయన స్వరం వినకపోతే నీవు ఆయనకు చెందిన వాడివి కాదు. ప్రభువు చెబుతున్నారు, నా గొర్రెలు నా స్వరమును వినును అంటున్నారు. 

 దావీదు సాతనును ఎలా ఎదుర్కొన్నాడు అని కీర్తనలలో వింటాము.  కీర్తన 143:2-3 . చాల సార్లు నేను దేవుని వాక్కు మీద ఆదరపడి ఎదుర్కొన్నాను అని దావీదు 5 వ వచనం లో చెబుతున్నాడు. ఆయన స్వరమును నీవు వినకపోతే నీ పాపమును నీవు విడిచి పెట్టవు , ఆయన స్వరమును వినకపోతే నీకు ఆయన వాగ్ధానములు కోల్పోతావు. ఇంకా ప్రభువు వారు నాశనం చెందక జీవింతురు అని చెబుతున్నారు. 

ఆయన స్వరమును వింటే ఆయన జీవితాన్ని ఇస్తాడు, నిత్య జీవితాన్ని ఇస్తాడు, అంతే కాదు ఎవరు వారిని నా నుండి తీసుకొని వెళ్లలేరు. అందుకంటే ఆయన లోనే  వారికి రక్షణ , ఆశ్రయం ఉంది. ఆయన ఎవరిని ఆయన వద్ద వుండమని బలవంతం చేయలేదు. నీవు నన్ను అనుసరిస్తావా ? నీవు దేనికి బయపడనవసరం లేదు. కనుక ఆ విధంగా జీవిద్దాం. 



వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ- యేసు ప్రభుని కరుణ

 వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ- యేసు ప్రభుని కరుణ

యోష 43:16-21 , పిలిప్పీ 3:8-14, యోహ8:1-11 

ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువు ఎవరు అనేది మనం చూస్తాం. యేసు ప్రభువు దైవ లక్షణాలు మనకు ఇక్కడ కనబడుతాయి. ఈ సువిశేషంలో కనబడే ప్రతి ఉపమానంఅద్భుతం లేక సంఘటనలు యేసు ప్రభువుని దైవత్వంను  తెలియజేస్తుంది.
నేపధ్యం : యెరుషలేములో గుడారాల పండుగ జరుగుతుంది. ఇది యిస్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో  గుడారాలలో ఉంటునప్పుడు,  ఏ విధంగా దేవుని కరుణ వారి మీద ఉన్నది అని గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగ.  ఈ పండుగ జరుపుకునే రోజులలో వారు దేవాలయం దగ్గరే చిన్న చిన్న గుడారాలు నిర్మించి దానిలో ఉంటారు. ఈ సందర్బంలో వారు ఒక స్త్రీని వ్యభిచారంలో పట్టుబడినది అని తీసుకొని వచ్చారు. ఆమెకు ఏ శిక్ష వేయాలి అని అడుగుతున్నారు.
ఎందుకు వారు యేసు ప్రభువు వద్దకు తీసుకొని వచ్చారు ?
వారు ఆమెను యేసు ప్రభువు దగ్గరకు తీసుకురానవసరం లేదు, ఎందుకంటే వారి ఇష్ట ప్రకారం ఆమెకు మరణ శిక్ష విధించాలి అంటే అది యూదయా పెద్దలు నిర్ణయించకూడదు. దానిని రోమా సామ్రాజ్య అధికారులు నిర్ణయించాలి. కానీ యేసు ప్రభువును ప్రజల ముందు, దేవుని నుండి వచ్చిన వాడు కాదు అని నిరూపించాలి,  అదేవిధంగా కుదిరితే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని నిరూపించాలి. ఎందుకు వీరు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు? కారణం స్పష్టమైనది. అది ఏమిటి అంటే యోహను శుభవార్ 5 వ అధ్యాయం నుండి 10 వ అధ్యాయం వరకు చాలా ముఖ్యమైన పండుగలు జరుపుకుంటున్నారు యూదులు, ఈ పండుగలు మొత్తం దేవుడు వారితో ఉండి ఏ విధంగా వారిని కాపాడాడు అని గుర్తు చేసుకుంటున్నారు. ఈ అన్ని పండుగలలో యేసు ప్రభువు అక్కడ ఉన్నారు, మరియు వారికి భోదించాడు, అంతే కాదు,  మోషేకు దేవుడు తాను ఉన్నవాడను లేక జీవించువాడను లేక జీవాన్ని అని ఎలా తెలియ పరిచాడో,  అదే విధంగా యేసు ప్రభువు కూడా ఈ పండుగ రోజులలో తాను ఎవరు అనేది తెలియ చేశారు ,  ముఖ్యంగా , నేనే జీవాహారం అని , జీవ వాక్కు అని వెలుగు అని వారికి తెలియచేశాడు. ఈ పండుగలలోనే మెస్సీయ్య వాస్తాడు అని వారి నమ్మకం కూడా,  కాని యేసు ప్రభువే ఆయన అని వారికి నమ్మడం ఇష్టం లేదు,  కనుక   ఆయనను నిందించడానికి వారికి ఒక కారణం కావాలి.  అందుకే  వారు  వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొని వస్తున్నారు.
ఈమె ఎవరు పరిసయ్యుల ,ధర్మ శాస్త్ర భోదకుల పక్షపాతం
ఆమె పెళ్లి చేసుకున్న స్త్రీ అయి వుండాలి ఎందుకంటే వారు చెప్పే నియమము పెళ్లి చేయబడిన,లేక ప్రధానం చేయబడిన వారికి సంబందిచ్చినది  , ద్వితీ 22:23-24 లో పెళ్లి చేసుకున్న స్త్రీ లేక ప్రధానం చేయబడిన యువతి వేరె వారితో శారీరక బందం కలిగివుంటే అటువంటి వారిని రాళ్ళతో కొట్టి చంపమని చెబుతుంది. లెవీయ కాండం 20:10 లో వ్యభిచారానికి మరణ శిక్ష విధించమని చెబుతుంది. యేసు ప్రభువు దగ్గరకు ఆమెను తీసుకొని వస్తున్నారు. వారికి తెలుసు ఆమె తప్పుచేసింది. లెవీ 20:10 , ద్వితీ 22:22. రెండు సందర్భాలలో ఆమెను చంపివేయాలి అని అంటున్నది.
ఇక్కడ ఒక స్త్రీ పాపం చేసినట్లయితే ఆమెతో పాటు భాగస్తుడైన  వ్యక్తిని కూడా అలానే శిక్షించాలి. కానీ ఇక్కడ జరుగుతుంది దానికి పూర్తిగా విరుద్దంగా వుంది. ధర్మ శాస్త్ర భోధకులు , పరిసయ్యులు కేవలం ఒక స్త్రీని మాత్రమే పాపం చేసిన వ్యక్తిగా చూపిస్తున్నారు. ఇక్కడ ఆమెను ఒక వ్యక్తిగా కూడా వారు చూడటం లేదు ఒకరకంగా ఆమెను యేసు ప్రభువుని పరీక్షించడానికి ఆయన దేవుని నుండి వచ్చిన వ్యక్తి కాదు అని చెప్పడానికి ఈమెను వాడుకుంటున్నారు.
 వారు ఏవిధంగా యేసు ప్రభువును  నిందించాలి అనుకున్నారు?
యేసు ప్రభువు వద్దకు  ఆ స్త్రీ ని తీసుకుపోతే వారికి  తెలుసు, ఆయన ఆమె పాపంను  చేసిన వ్యక్తిని క్షమిస్తాడు అని , కానీ దాని ద్వారా యేసు ప్రభువు  మోషే ధర్మ శాస్త్రాన్ని పాటించాడు, లేక దానికి విలువ ఇవ్వడు అని అందరికీ తెలియ చేయావచ్చు , అని వారి ఉద్దేశం. అంతే కాదు దేవుని నుండి వచ్చిన వాడైతే దేవుడిచ్చిన ధర్మ శాస్త్రాన్ని గౌరవించాలి కదా , దానిని గౌరవించడం లేదు, కనుక ఆయన దేవుని నుండి వచ్చిన వాడు కాదు అని చెప్పవచ్చు. ఇంతకు ముందే నేను ధర్మ శాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు దానిని పరిపూర్తి చేయడానికి. మత్తయి5వ అధ్యాయంలో నేను శిక్షించడానికి కాదు రక్షించడానికి వచ్చాను అని చెబుతున్నాడు. ఒక వెళ ఆయన రాళ్ళతో కొట్టాలి అని అంటే, ప్రజల ముందు ఆయన పాపులు, సుంకరుల స్నేహితునిగా వారితో ఈయన తిని త్రాగుతాడు ,కానీ వారిని కాపాడాడు అని చెప్పవచ్చు. మరియు నేను పాపులను వెదకి రక్షించడానికి వచ్చాను అని ఇతను చెప్పే మాటలు అని కట్టు కథలు అని చెప్పవచ్చు. అంతేకాదు చట్టాన్ని తన చేతులలోకి తీసుకున్నాడు అని రోమా సామ్రాజ్య అధికారులుకు వ్యతిరేకి అని చెప్పవచ్చు. రోమా సామ్రాజ్యానికి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేసిన ఆనాటి రోజులలో మరణ దండన ఉండేది. ఈ విధంగా యేసు ప్రభువును వారు తొలగించాలి అనుకున్నారు. ఆమెకు శిక్ష విధించాలి అనే వారి కోరిక కాదు, దానికి ముందుగా ఆయనను దేవుని  నుండి వచ్చిన వాడు కాదు  అని నిరూపించాలి అని అనుకున్నారు.  
 ఇక్కడ వారి ప్రధానమైన ఆరోపణ ఏమిటి అంటే ఒక స్త్రీ పాపంలో పట్టుబడింది. ఆమెను  శిక్షించాలి అని, వారు పట్టుబడితే లెవీయకాండం ప్రామాణికంగా 20:10 ని తీసుకుంటే ఆమెతోపాటు ఉన్న వ్యక్తిని కూడా వారు తీసుకురావాలి. లేదు ద్వితీ 17:6 లేక 19:15 ను ప్రామాణికంగా తీసుకుంటే వారికి ఎక్కువ మంది సాక్షులు కావాలి, ఇంకా వారు ఒకనికి మరణ శిక్ష విధించాలి అనుకున్నట్లయితే వారు రోమా సామ్రాజ్య అధికారుల దగ్గరకు వెళ్ళివుండాలి. యూదాయ అధికారులకు మరణ శిక్ష విధించే అధికారం లేదు కనుక. కానీ ఇవన్నీ నిజమైన కారణాలు కాదు యేసు ప్రభువును ఎలా పరీక్షించాలి. ఎలా తప్పు పట్టాలి, ఎలా ఆయన గొప్ప వాడు కాదు అనిచెప్పాలి అనేవే వీరి ప్రధాన ధ్యేయం.      
యేసు ప్రభువు ఏమి రాసి ఉండవచ్చు?
యేసు ప్రభువు తన వేలితో నేల మీద రాస్తున్నారు. ఏమి రాసిఉండవచ్చు ? వారి పాపాలనా? లేక యూదులలో గొప్పవారు  చేసిన పాపాలనా? ఏమి అయిన ఆయిఉండవచ్చు. ఈ ప్రశ్నకి జవాబు ఎవరికి తెలియదు, కానీ అనేకమంది దైవ శాస్త్ర పండితులు కొన్ని ఊహలు చేశారు, ఎవరైతే అక్కడ ఆ స్త్రీని నిందిస్తూన్నారో వారి పాపలను అని , లేకపోతే యూదులలో వ్యభిచారంలో పట్టుబడిన వారి పేర్లు అని , ఉదా . తామరు  మొదలగువారు. లేక కొన్నిసార్లు యూదులు మరణశిక్ష తప్పిస్తూ ఉంటారు వారి పేర్లు అయిఉండవచ్చు.లెవీయ కాండం లో అక్కడ  ఇద్దరినీ శిక్షించమని ఉంది , ఇక్కడ కేవలం ఆ స్త్రీ ని మాత్రమే తీసుకొని వచ్చే ఆ పురుషుడు ఎక్కడ ? ఎందుకు ఆయనను వడాలిపెట్టారు. 
యేసు ప్రభువు మీలో  పాపం లేనివారు మొదటి రాయి వేయమని అంటున్నారు.
సాక్షి యొక్క చేయి,  మొదటి రాయి వేయాలని ధర్మ శాస్త్రం చెబుతుంది. ద్వితీ 17:7 ఇక్కడ యేసు ప్రభువు , మొదటి రాయి వేసే వాడు  ఎటువంటి పాపం లేని వాడు అనగానే అందరు వెళ్ళిపోతున్నారు. అంటే వారీలో పాపం ఉంది. అని వారు తెలుసుకుంటున్నారు. మనం ఇక్కడ గుర్తించవలసినది వారు వారి నిజ స్థితి తెలుసుకుంటున్నారు. నేను కూడా దేవుని దయకు అర్హత పొందాలి అంటే ఇతరులు శిక్షింపబడాలి అని కోరుకోకూడదు.
ఆమె సిగ్గుతోటి అక్కడ ఉంది అని  యేసుప్రభువుకు  తెలుసు,  అందుకే ఆమెతో నీవు పాపం చేశావా అని కూడా ఆడగటంలేదు, ఆమె చేసింది పాపమే. కానీ ఆయన క్షమించడానికి సిద్దంగా ఉన్నాడు,  ఇక పాపం చేయకు అని  చెపుతున్నారు. యేసు ప్రభువుకి తెలుసు ఆమెను   వారు  ఏమి చేస్తారో  అని భయ పడనవసరంలేదు.అందరు వెళ్లిపోయారు. ఆమె ఇప్పుడు క్రీస్తు వద్ద ఉన్నారు, రక్షకుని దగ్గర ఉన్నారు అంటే ఆమెకు ఖండన లేదు. ఎందుకంటే క్రీస్తుతో ఉంటే వారికి తీర్పు ఉండదు అని మనం దేవుని వాక్యంలో వింటున్నాం. రోమి 8:1 క్రీస్తుతో ఏకమై జీవించు వారికి ఇప్పుడు ధండన వుండదు. మీలో తప్పు చేయనివారు మొట్ట మొదటి రాయి వేయమని చెబుతున్నారు. అంటే ఆమెలానే మీరు కూడా తప్పు చేసినవారే, ఆయన మాత్రమే ఆమెను శిక్షించగలడు, ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు కానీ ఆయన ఆమెను శిక్షించకుండా పరివర్తనకు పిలుస్తున్నారు.
ఎందుకు వారు ఆమె మీద రాయి వేయలేక పోయారు?
పరిసయ్యులు వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని  యేసు ప్రభువు దగ్గరకు తీసుకొని వచ్చారు. ఆమెను శిక్షించడానికి వారు ఎంతో ఆనందంతో అక్కడకి వస్తున్నారు, కానీ వారిలో కూడా ఈ పాపం ఉంది అని అంటున్నారు యేసు ప్రభువు. వారిలో చెడు పెట్టుకొని ఇతరులను శిక్షించాలని వారు కోరుకుంటున్నారు, మనలో ఎప్పుడైతే ఇటువంటి పాపం ఉంటుందో అప్పుడే మనం ఇటువంటి శిక్షను ఇతరులకు  వేయించడానికి ప్రయత్నిస్తాం. దావీదు పాపం చేసిన తరువాత దేవుడు అతని దగ్గరకు నాతాను ప్రవక్తను పంపినప్పుడు, దావీదు ప్రవక్తతో పాపం చేసిన వాడు తప్పక మరణించాలి అంటున్నాడు.  కానీ అది నీవే అంటున్నప్పుడు ఎడుస్తున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు.  మనం అనేక సార్లు ఇలానే ఉంటున్నాము. యేసు ప్రభువు మీలో ఏ తప్పు లేని వాడు అని అన్నప్పడు వారి జీవితాలు, వారి ముందు కనపడుతున్నాయి. వారు ఏమి చేసింది, వారికి జ్ఞప్తికి వస్తుంది. యేసు ప్రభువు ఒక మాట అనగానే అది జరుగుతుంది. ఆయన దేని గురించి అంటున్నాడో అర్ధం అవుతుంది. జక్కయ్య వైపు చూడగానే ఆయన జీవితం మొత్తం తెలుస్తుంది ఆయన తాను సంపాదించినది మొత్తం ఇవ్వడానికి సిద్దపడ్డాడు. లెవీని రమ్మనగానే మొత్తం వదలి వెళుతున్నాడు. వీరిని మీలో ఏ తప్పు లేని  వారు అనగానే వారి తప్పులు మొత్తం వారికి తెలుస్తున్నాయి. పాపం చేసిన స్త్రీ కి మరణ శిక్ష వెయ్యాలి అని పరిసయ్యులు కోరుతున్నారు. అంటే వారికి అదే శిక్ష పడాలి.  యేసు ప్రభువు మనం నిజమైన పరిస్థితి ఏమిటి అని తెలుసుకోమని అంటున్నారు. మనం పాపులము అని తెలుసుకోమని చెబుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువు ఆమెకు మరణ శిక్ష విధిస్తే అక్కడ ఉన్న వారికి కూడా అదే శిక్ష పడుతుంది అని చెబుతున్నారు. దానికి అందరు వెళ్ళి పోతున్నారు
ఎటువంటి ప్రశ్నలకు ఈ సువిశేష భాగం సమాధనం ఇస్తుంది?
లింగ వివక్ష గురించి , క్షమించడం గురించి , సమానత్వం గురించి కృప వరం గురించి మరణ తీర్పు గురించి మనకు ఉన్న అన్నీ ప్రశ్నలకు ఈ  సువిశేష భాగం సమాధానం ఇస్తుంది. అంతేకాదు మనం ఎలా ఉండాలి అనికూడా తెలియజేస్తుంది. మన చెడు ఆలోచనలు, మన నటన , మన ఆత్మ వంచన తెలియజేస్తుంది. ఈ స్త్రీని కాపాడాలి అంటే తప్పక వారి నటన, వంచన మొత్తం బయటపెట్టాలి. ఇది మనకు రక్షకుని గొప్ప మనస్సును , సామాజిక రుగ్మతల మీద ఆయన భావాన్ని  తెలియజేస్తుంది.
ధర్మ శాస్త్ర భోదకులు , పరిసయ్యుల ఆలోచన ఏవిధంగా ఉంది ?
ఆ స్త్రీ ని శిక్షించడం వారికి ముఖ్యం కాదు, అది ప్రధాన సమస్య కాదు , ఇద్దరు వ్యభిచారం చేసినప్పుడు వారిలో ఒకరు ఎక్కువ పాపం ఇంకొకరు  తక్కువ పాపం చేయారుగా? అప్పుడు ఇద్దరినీ తీసుకొని రావాలిగా? తప్పు ఎవరు చేశారు అని  నిర్ణయించేది ఇక్కడ ,ధర్మ శాస్త్ర భోదకులు మరియి పరిసయ్యులు. వారు మోషే ధర్మ శాస్త్రాన్ని వారి ఇష్టప్రకారం భోదించెవారు. అదే విధంగా దానికి వివరణ ఇచ్చేవారు. ఇతరుల పాపపుణ్యాల నిర్ణయించే మనం,  మనం ఎలా ఉండమో చూసుకోవాలి అని చెబుతుంది. అప్పుడు నీవు ఇతరుల పాపం గురించి మాటలాడవు. స్త్రీని వారు ఒక వస్తువులా చూస్తున్నారు.
మనం పాత నిబంధనం లో చూస్తే అక్కడ  యూద తన కోడాలితో పాపం చేసి ఆమెను శిక్షించాలి అంటాడు. నిజానికి ఇక్కడ కూడా జరుగుతుంది ఇదే తమకు కావాల్సినవాడిని తప్పించి వేరె వారిని శిక్షించడం వారికి అలవాటుగా మారిపోయింది. అటువంటి వాటికి ఆలోచనకు ముగింపు ఇవ్వాలని యేసు ప్రభువు చెబుతున్నారు.
పరిసయ్యుల , ధర్మ శాస్త్ర భోదకుల ప్రవర్తన ఇక్కడ పాపంలానే ఉంది.  యేసు ప్రభువు వారిని వారి అధికారాన్ని సవాలు చేస్తున్నారు అది తట్టుకోలేని వారు ఇవన్నీ చేస్తున్నారు. యేసు ప్రభువుకి శిక్ష  రోమా సామ్రాజ్యం చేత విధించాలి అని అనుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈరోజు వారు యేసు ప్రభువును పరీక్షించారు. అంతే కాదు ఆ స్త్రీని చంపాలని అనుకున్నారు.  యేసు ప్రభువు మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడం కోసం ఒక స్త్రీ ప్రాణాన్ని తీసి వేయుటకు వెనుకడుగు వేయుట లేదు.
యేసు ప్రభువు ఆలోచన ఏమిటి?
ఈ సంఘటనలో యేసు ప్రభువు ఒక సంఘ సంస్కర్త వలె కనిపిస్తారు. నిజానికి యేసు ప్రభువు మొదటి నుండి అలానే ఉన్నాడు.  స్త్రీని మాత్రమే పాప కారణం అన్నట్లు చూడటం మనకు అలవాటు అయింది, అటువంటి ఆలోచనలు మన నుండి తొలగించాలి అని అనుకుంటున్నారు..
వ్యభిచారంలో పట్టు బడిన స్త్రీ మీద   యేసు ప్రభుని  ప్రేమను చూడవచ్చు. యేసు ప్రభువు  ఆ స్త్రీని తీసుకొని వచ్చిన వారికి వారి జీవితాన్ని పరిశీలించుకోమని అడుగుతున్నారు.  ఆమె తప్పు చేయలేదు అనటం లేదు. ఇక నుండి చేయవద్దు అంటున్నారు.
 యేసు ప్రభువుతో  స్త్రీ మాటల ద్వార మనం అర్ధం చేసుకోవలసినది ఏమిటి అంటే ఆయనతో ఉంటే మనం పాపములను తొలగించుకునే మార్గం ఉంటుందిఎందుకంటే ఆయన మనం పాపములను తీసివేసి మనలను పవిత్రులను చేస్తాడుఆయనతో ఉండుటకు అర్హత పొందుతాము.
 

హృదయ పరివర్తనా ? లేక నాశనమా? లూకా 13:1-9

 హృదయ పరివర్తనా ? లేక నాశనమా? లూకా 13:1-9

మన రక్షణకు అవసరమైనది హృదయ పరి వర్తన. ఈనాటి సువిశేషం ద్వార దీనిని ప్రభువు వెల్లడి చేస్తున్నారు.  మనం  మారు మనస్సు పొందక పోతే మనం నాశనం అవుతాము అని యేసు ప్రభువు వెల్లడిచేస్తున్నారు. నేను చాలా పాపములు చేసెను ఇంకా నన్ను దేవుడు నన్ను క్షమించడులే అని మనం బాధకు గురికానవసరం లేదు. కాని మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనలను శిక్షించకుండా మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం ఉపయోగించుకుంటే నీవు శిక్షకు గురికావు. నివివే ప్రజలు పాపం చేసిన వారు మారు మనసు పొందినందుకు వారిని శిక్షించడం లేదు. 

దేవుని యందు నీకు అభయం ఉంది అది ఏమిటి అంటే నీకు ఒక అవకాశం ఇవ్వడానికి సిద్దాముగా ఉన్నాడు. సాతాను నీకు  రక్షణ లేదు అని చెబుతుంది, కానీ యేసు ప్రభువు కోసం ఆ అవకాశం తీసుకొస్తాడు. మొదటి తిమోతి రెండవ అధ్యాయం 5 వ వచనం మనకు ఇది చెపుతుంది. "దేవుడు ఒక్కడే,దేవుని ,మనుజులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు  ఒక్కడే ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రయ ధనముగా ఆయన తనను తాను అర్పించుకొనేను."

"ఆ సమయమున కొందరు, గలీలియ దేశీయులు బలులు సమర్పించునప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి." యేసు ప్రభువు దీని గురించి ఏమి చెప్పడం లేదు వారికి, అక్కడ పిలాతు తప్పు చేశాడు అని కానీ వారు అలా చేసి ఉండకూడదు అని కానీ ఏమి మాటలాడటం లేదు. ఆ విషాదాన్ని గురించి మాటలాడటం లేదు. ఎందుకు పిలాతు వారిని చంపించి ఉండవచ్చు అంటే ఆనాటి రోజులలో ఎక్కువగా గలీలియ నుండే రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు ఎక్కువగా వస్తుండేది. రోమా సామ్రాజ్యం ఎటువంటి విప్లవాలను సహించదు అని చెప్పడానికి చేసి ఉండవచ్చు. ఇక్కడ వారు ఘోరంగా అవమానింప బడ్డారు ఎందుకంటే వారు బలులను అర్పించుచున్నప్పుడు వారిని చంపిస్తున్నాడు పిలాతు. ఇది మనిషి కావాలని చేసిన మారణహోమం. 


అందుకు యేసు, "అటుల చంపబడిన ఈ గలీలియ వాసులు తక్కిన గలీలియ వాసులకంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? అని అడుగుతున్నారు? ఇటువంటి సమయంలో మనం చనిపోయిన వారు ఎవరు? వారు ఏమి చేశారు? అని చర్చించుకుంటాం. కానీ యేసు ప్రభువు దాని గురించి మాటలాడటంలేదు.  నీకు ఇటువంటిది జరిగితే అన్నట్లు మాటలాడుతున్నారు?
దేవాలయానికి ఇద్దరు ప్రార్ధన చేసుకోవడానికి ఇద్దరు వచ్చారు. ఒకడు సుంకరి మరియొకడు పరిసయ్యుడు, పరిసయ్యుడు తాను చేసే పనుల బట్టి నేను మంచి వాడిని అని అనుకుంటున్నాడు. నిజానికి కాదు ఎంతో కపటం అతనిలో ఉంది. నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి పోతున్నది సుంకరియే. నీ జీవితం ఎలా ఉంది ఇక సారు ఆలోచించు.  నా జీవితంలో కొన్ని సార్లు ఇతరుల కంటే నేను మంచి వాడిని అనుకుంటాము. కానీ దాని గురించి నీవు ఆలోచించనవసరం లేదు. 

యేసు ప్రభువు అడిగిన ప్రశ్నకు ఆయనే జవాబు ఇస్తున్నాడు. కాదు అని. మరల  "హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను."  హృదయ పరివర్తనం అనేది  నీవు రక్షణ పొందడానికి దేవుడు పెట్టిన షరతు ఇది. నేను ఏమి చేయాలి ఈ హృదయ పరివర్తన పొందడానికి. పునీత పౌలు గారి జీవితం మనకు నేర్పుతుంది, హృదయ పరివర్తన ఎలా ఉంటుంది అని. ఆయన క్రీస్తుని తెలుసుకున్న తరువాత ఆయన జీవితం మొత్తం యేసుతోనే. అందుకే ఆయన అంటున్నాడు.ఇక క్రీస్తే నాకు జీవము.  


యేసు ప్రభువు వారితో  శిలోయము  అను బురుజు కూలి, దాని క్రిందపడి మరణించిన  పదునెనిమిదిమంది,తక్కినయెరుషలేము నివాసులకంటే ఎక్కువ అపరాధులు ఎంచుచున్నారా? ఇక్కడ మరల యేసు ప్రభువు మరియొక ప్రశ్న అడుగుతున్నారు. ఇంతకు ముందు అడిగినటువంటి ప్రశ్న మరల జవాబు ఆయనే ఇస్తున్నారు. కానీ అక్కడ మనిషి చేసిన మరణ హోమం ఇక్కడ ప్రకృతి ద్వార జరిగిన విషాదం. కానీ ప్రశ్న మాత్రం ఒకటే. ఎందుకంటే అనేక సార్లు మన ఇటువంటి విషయాలే వింటువుంటాం. అది ప్రకృతి వల్ల జరిగిన మనిషి వల్ల జరిగిన కొంత మంది నాశనం అయ్యారు. ఇది కేవలం వారి భౌతిక నాశనమే. వారు మంచి వారు అయితే వారికి రక్షణ ఉంటుంది. కానీ యేసు ప్రభువు అడిగేది, నీవు వీటి గురించి కాక నీ గురించి ఆలోచించమని అడుగుతున్నారు. 

ఈ ప్రశ్నకు కూడా కాదు అని యేసు ప్రభువే సమాదధానం ఇస్తున్నాడు. అంటే కాదు  హృదయ పరివర్తన చెందనిచో మీరందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలుకుతున్నారు. అంటే మరలా మరలా యేసు ప్రభువు హృదయ పరివర్తన గురించి చెబుతున్నారు. ఒక వేళ  హృదయ పరివర్తన చెందక పోతే నాశనం కొని తెచ్చుకున్నవారి వలె మనం మారిపోతాం. దేవుడు హెచ్చరించిన సమయంలో కొంత మంది హృదయ పరివర్తన చెందారు వారు ఎవరు అంటే  నినీవే ప్రజలు, యేస్సీయారాజు,  అదే హెచ్చరిక నోవా కాలంలో వచ్చింది. సొదొమో గోమొర్రోకు వచ్చింది కానీ వారు దేవుని మాట వినలేదు. పర్యవసానం మనం చూస్తున్నాం. మన రక్షణకు పూజలు, బలులు ముఖ్యం  కాదు. ఏమిటి అంటేహృదయ పరివర్తన. హృదయ పరివర్తన లేక నాశనమా ? నిర్ణయం మనదే. 

 యేసుప్రభువు వారికి   అంజూరపు చెట్టు ఉపమానం చెప్పారు. . దేవుడు మన నుండి ఎప్పుడు కూడా పండ్లను కోరుకుంటున్నారు. ఈ చెట్టు తన యొక్క ప్రజలు. యాజమాని  దేవుడు, తోటమాలి, యేసు ప్రభువు.  
  
తోటమాలితో  ఇదిగో! నేను మూడేండ్లనుండి ఈ అంజూరపు చెట్టు పండ్లకోరకు వచ్చుచున్నాను. కానీ నాకు ఏమియు దొరకలేదు. దీనిని నరికి వేయుము. ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు?అనెను. ఇక్కడ దేవుడు అన్నీ ఇచ్చాడు. మొత్తం ఇచ్చిన తరువాత మన నుండి దేవుడు ఫలాన్ని ఆశిస్తున్నాడు. ఏమి ఇవ్వకుండా కాదు. నాకు ఏమి ఇచ్చాడు దేవుడు అని నీవు  ఎప్పుడైనా అనుకున్నావా? కానీ దేవుడు ఇచ్చిన అనుగ్రహాలు ఒకసారి లెక్కించుకో?

అందులకు తోట మాలి అయ్యా ! ఇంకొక యేడు ఓపిక పట్టుడు. నేను దీని చుట్టు పాదుచేసి ఎరువు వేసేదను. ఎవరు ఈ తోటమాలి? యేసు క్రీస్తు నీకోసం నాకోసం దేవుని ముందు మొరపెట్టుచున్నారు. అబ్రహాము అడిగినప్పుడు దేవుడు క్షమిస్తున్నారు. మోషే అడిగినప్పుడు క్షమిస్తున్నారు. ఖచ్ఛితముగా మనం ప్రధాన యాజకుడు, తన కుమారుడు  మన కోసం అడిగినప్పుడు దేవుడు ఓర్పు తో ఒప్పుకుంటున్నారు. దేవుడు మన మీద ఉన్న ప్రేమతో ఒప్పు కుంటున్నారు. న్యాయముగా అయితే ఇది జరుగకూడదు. ఎందుకు అంటే న్యాయముగా మనం శిక్షకు గురి కావాలి. కానీ కలకాలం ఇలానే ఉండదు. మనకు ఇచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. 

ముందుకు ఫలించిన సరి. లేనిచో కొట్టి పారవేయుడు, అని పలికెను. యేసు ప్రభువు ద్వారా మనకు మరియొక అవకాశం వచ్చింది. ఇది చివరిది ఎందుకంటే అంతకు ముందు మనకు చాలా అవకాశాలు వచ్చినవి. మోషే ద్వార ధర్మ శాస్త్రం ఇచ్చి నీవు ఈ విధంగా జీవించమని దేవుడు చెప్పాడు. అప్పుడే మోషే చెప్పారు, యొహ్ో షువా చెప్పారు , మీరు దేవుని ఆజ్ఞల ప్రకారముగా జీవించిన జీవిస్తారు లేదా మరణిస్తారు అని చెప్పారు. న్యాయాధిపతులు ద్వారా ప్రభువు వారికి మంచి జీవితం జీవించమని చెప్పారు, ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించారు. యేసు ప్రభువుతో వచ్చినది చవరి అవకాశం కనుక హృదయ పరివర్తన పొంది మంచి ఫలాలను ఇవ్వడానికి ఎప్పుడు సిద్దాముగా ఉందాం. 

సామాన్య 6 వ ఆదివారం

 సామాన్య 6 వ ఆదివారం

 లోకమును కాక  దేవున్ని నమ్ముము 

యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26 

ఈనాటి మొదటి పఠనంలో యిర్మియా ప్రవక్త ద్వార మనం ఎవరిని నమ్మలో చెపుతున్నారు. నీవు ఈ లోకం కానీ దానిలోని వ్యక్తులను లేక వస్తువులను , ఆస్తులను నమ్మితే ఏమి జరుగుతుంది. నీవు మోసపోతావు. ఒకసారి యోసేపును గుర్తుకు చేసుకోండి. ఆయన తన అన్నలను నమ్మాడు, నా అన్నలే కాదా! నన్నుఏమిచెయ్యరు అనుకున్నాడు.తనఅన్నలుఆయననుఅమ్ముకున్నారు. సాంసోను ను చూడండి. తన ప్రేయసి తనను మోసం చేయదు అనుకున్నాడు. తన ప్రేయసి తనను పట్టించిది. అది తన మరణానికి దారితీసింది. ఏసావును తన తమ్ముడు మోసం చేశాడు. యేసు ప్రభువును తన శిష్యుడే డబ్బులు కోసం అమ్ముకున్నాడు. నాబాలు తన సంపదను నమ్ముకున్నాడు అది ఆయనను కాపాడలేక పోయింది. నీవు ఈలోకాన్ని కానీ దానిలో ఉన్న వాటిని కాని  వ్యక్తులనుకానీనమ్మితే నీవు మోసానికి గురి అవుతావు. మరి దేనిని నమ్మాలి? నీ నమ్మకమును దేవుని యందు ఉంచినట్లయితే నీవు అవమానమునకు గురికావు, ఎవరు నిన్ను ఏమి చేయలేరు. 

ఎందుకు యిర్మియా ప్రవక్త వారికి ఈ మాటలను చెపుతున్నారు. కారణం ఏమిటిఅంటే వారికి చాలా సంపదలు వస్తున్నాయి.   వీరు ఆనందంగానే వున్నారు. వారికి కష్టలు ,బాధలు ఏమి లేవు.  ఇంకా సమస్య ఏమిటి అంటే వారు దేవునిని మరిచిపోయారు. ఎప్పుడైతే బాబిలోనియా దేశము వారి మీదకు దండెత్తి వస్తున్నారో అప్పుడు వారు ఈజిప్టు వారిని కాపాడుతుంది అని దానితో ఒక కూటమిలా ఏర్పడాలి అని, వారి దగ్గరకు వెళుతున్నారు. వీరు ఎంత అమాయకులు అంటే, వీరి పూర్వీకులను ఈజిప్టు వారు ఎంత ఇబ్బంది పెట్టింది, బానిసలుగా చేసింది ఇవన్నీ  మర్చి పోయారు.  రాజకీయ, సామాజిక కూటముల మీద, అక్కడ ఉన్న వేరె వారి విశ్వాసాల మీద ఆధారపడుతున్నారు. వారిని  కాపాడిన దేవుని దగ్గరకు రావడం మర్చిపోయారు. అందుకే యిర్మియా చెపుతున్నారు. ఇతర దేవుళ్ళను, మనుషులను, లోకాన్ని, వస్తువులను, ఆస్తులను నమ్మి మోసపోవద్దు. వారు అందరు మిమ్ములను మోసం చేసారు, మీ బిడ్డలను మీరు వారికి బలిగా ఇచ్చారు, వారు మిమ్మలను కాపాడారా? మీ నాయకులు ఈజిప్ట్ మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, వారు మిమ్ములను బానిసలుగా చేయలేదా? మొదట మిమ్ములను ఆదరించారు, కానీ మీకు ఎల్లప్పుడు మంచి చేయారు వారు. దేవుడిని నమ్మండి. ఆయన తప్ప ఎవరిమీద నమ్మకం ఉంచిన మీరు అవమానమునకు గురి అవుతారు అని చెబుతున్నారు.  

దేవుడు ఎందుకు వీరిని కాపాడుతారు? ఎందుకంటే వీరు ఒప్పందపు ప్రజలు. నేను మీ దేవుడను మీరు నా ప్రజలు అని దేవుడు వారికీ చెప్పారు. దేవుడు వారికి దగ్గర ఉన్నప్పడు వారికి ఉన్న స్వార్ధ , ద్వేష , అసూయ, పగలుతో ఉండటం కుదరడం లేదు కనుక వారి స్వార్ధ ప్రయోజనాల కోసం వారు దేవుడిని నుండి దూరంగా వెళ్ళి పోతున్నారు. ఎప్పుడైతే వారు ఇతర వ్యక్తులను, దేవరలను, రాజులను ఆశ్రయిస్తున్నారో ఇది మొదట సంతోషంగా ఉంటుంది. కానీ తరువాత కొంత కాలానికి వారిని మరల బానిసలుగా చూస్తారు. ఇది వారికి తరచుగా జరుగుతూనే ఉంది.  ఇవన్నీ మీకు తెలిసి ఇంకా ఎందుకు మీరు దేవుడి దగ్గరకు కాకుండా ఇతరుల వద్దకు వెళుతున్నారు? అని  యిర్మియా ప్రవక్త వారిని అడుగుతున్నారు. నిజానికి వీరు ఇతరుల దగ్గరకు సహాయం కోసం వెళ్ళేది, తెలియక కాదు,  వీరు అంత తెలిసే చేస్తున్నారు. అంతకు ముందుకగానే దేవుడు వీరిని హెచ్చరించారు. మీరు మీ మనసున అన్య దైవతములను ఆరాధించి ప్రభువు నుండి వైదొలుగుతారేమో జగ్రత్త" అని ద్వితీయోపదేశ కాండము 11 వ అధ్యాయం 16 వ వచనంలో చూస్తున్నాం, ఇది ఒక విధమైన తిరుగుబాటు దేవుని మీద కనుకనే వారు బానిసలుగా మారుతున్నారు. మనం ఎలా ఉన్నామో?ఒక సారి ఆలోచించుకోవాలి. ఆయనను ఆపదలో సహాయం చేయమని అర్ధించాలి. 

దేవుడిని వీరు నమ్మి , నిభందన ప్రకారం వీరు జీవిస్తే ఏమి జరుగుతుంది?  దానిని గురించి ఈనాటి మొదటి యిర్మియా 17: 8 వ వచనం మనకు తెలియచేస్తుంది. దేవుని మీద నమ్మకం ఉంచి , ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే వారిని దీవిస్తాను అని చెపుతున్నారు. అంతేకాదు దేవునిమీద నమ్మకము ఉంచిన వారు "ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలెనుండును. అది ఎదుగుచు వ్రేళ్ళు జోన్పించును. అది బెట్టుకు భయపడదు. అంతే కాదు 

 దానిఆకులు పచ్చగా నుండును, వానలు కురవకున్నను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడు పండ్లు కాయుచుండును." ఒక సారి ఈ మాటలను మనం అర్దం చేసుకుంటే దేవుడు ఆయన మీద నమ్మకం కలిగి జీవించినట్లయితే నీకు ఏ చింత అవసరం లేదు అని చెపుతున్నారు. వారు ఎటువంటి సమస్యలకు కానీ, హింసలకు గాని బెణకరు. వారికి ఇంకా ఎవరి తోడ్పాటు అవసరం లేదు. వానలు కురియకున్న వారి ఎదుగుదల లోపించదు. అందుకే యిర్మియా వారితో ఎందుకు మీరు ఇతరుల వద్దకు సహాయం కోరుతూ పోతున్నారు.  ఆ పరిస్థితి   మీకు దేవుని విడచి ఇతరుల దగ్గరకు పోయినందుకే కదా ? అని తెలియ చేస్తున్నారు. ద్వితీయోపదేశకాండము 28-29 ఆధ్యాయాలలో దేవుని నిభందనకు అనుకూలంగా జీవిస్తే ఏమి జరుగుతుందో దేవుడు తెలియచేస్తున్నారు. కానీ కొన్నాళ్ళ తరువాత ఆశీర్వాదం పొందిన తరువాత వీరు మారిపోతున్నారు. 

ఈనాటి  సువిశేషంలో యేసు ప్రభువు  పేదలు , ఆకలిగొన్నవారు , హింసలకు గురి అయిన వారు ధన్యులు అని తెలియ చేస్తున్నారు. పేద వానికి తెలుసు లేమితనం ఏమిటో, నీకు ఎప్పుడు పేదరికం లేక పోతే నీకు కలిమితో ఉన్నప్పుడు దాని గొప్పతనం తెలియదు. కష్టం లేకుండా మనం ఏమి నేర్చుకోలేము. కష్టం మనకు చాలా నేర్పుతుంది. 

పేదరికం ఇక్కడవారి సాంఘిక,సమాజక జీవితం గురించి తెలియచేస్తుంది.వారి పేదరికం, ఆకలి , విలాపం, ద్వేషంనికి సంభందించినవి. ఎందుకంటే వీరు వీటన్నటికి గురవుతున్నారు. లూకా 6:20-22. మీరు ఆనందించండి  అని చెపుతున్నారు. ఆనందం భౌతిక కారణాల వలన వచ్చేది కాదు. అది ఆంతరంగికమైనది.  వీరు వేరె వారిని ఎట్టి పరిస్థితులలో కూడా ఇబ్బందికి గురి చెయ్యరు ఎందుకంటే వీరికి అంత శక్తి లేదు, కానీ ఇతరులు వీరిని ఇబ్బందులు  కలిగించారు.  ఇక్కడ మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1. పేదరికం 2. ఆకలి 3. దుఃఖితులు వీరు ముగ్గురు ధన్యులు. యేసు ప్రభువు ఈ మాటలు వీరికి ఊరట ఇవ్వడానికి చెప్పడంలేదు.  మనం ఎప్పుడు తినడనికి కొరత లేక పోయినట్లయితే, మనకు ఉన్న సమృద్దిని లెక్క చేయం, అది ఇచ్చిన దేవునికి  కృతజ్ఞత చూపం. మనకు పేదరికం తెలియకపోతే మనకు ఉన్న కలిమికి విలువఇవ్వం, అది ఇచ్చిన దేవుని లెక్క చేయం. మనకు ఎప్పుడు బాధలు లేకపోతే సంతోషం విలువ తెలియదు ఆ సంతోషంకు  విలువఇవ్వం అదే ఈనాటి సువిశేషంలో జరుగుతుంది. 

ఆకలిగొనియున్న మీరు ధన్యులు మీరు సంత్రుప్తి పరుపబడుదురు యేసుప్రభువును నమ్మినవారు తెలుసుకున్నవారు జీవితాలను మార్చుకుంటున్నారు,ఇతరులకు విలువ ఇస్తున్నారు. పేదలను అభాగ్యులను అక్కున చేర్చుకుంటున్నారు. వారు జీవితంలో ఎన్నడూ పొందని శాంతి సమాదానం పొందుతున్నారు.  యేసును నమ్మిన వారు ఆశీర్వదించబడి, రక్షణపొందుతారు. యేసును నమ్మిన వెంటనే అన్నీ మార్పులు జరుగవు. యెరుషలేము లో ఉన్న క్రైస్తవులు పేదవారు అందుకే పౌలు గారు వేరె వారి దగ్గర నుండి వారికి సహాయం ఇప్పించాడు. అంత ఒకేసారి మారిపొదు. ముందుగా ఒకరి మనస్సు,వారివిధానం, వారి నమ్మకం మారుతుంది.తదుపరి సమృద్ది సమకూరుతుంది.   

మనుష్య కుమారుని నిమిత్తం, మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి నిందించి, మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభువును అనుసరించినట్లయితే ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. మత్తయి 5:10-11. ఇది మిగిలిన వాటి కంటే  వేరు ఎందుకంటే  దానిలో వీరు అనేక  విధాలుగా  హింసించ బడతారు. అ.కా 14:22.  ఇవి జరుగుతున్నప్పుడు మీరు ఆనందముగా ఉండమని చెపుతున్నారు. దేవుని నమ్ముకున్న వారిని హింసించడం కొత్త కాదు.  ఈ విధంగా చేయడాన్ని దేవునికి సేవ చేస్తున్నాం అని  కూడా అనుకుంటారు. యోహను 16:2. యూదులు చాలా మందిని ఇలా హింసించారు. హెబ్రీ 11:36-40. ప్రవక్తలను ఇలనే చంపారు. క్రీస్తు అనుచరులు నూతన ప్రవక్తలు లేక దేవుని వాక్కుని బోధించువారు. లూకా  సువిశేషం మాత్రమే అక్కడ  జరిగే అనర్థాలు గురించి వివరిస్తుంది.6:24-26. ధనవంతులు వారికి ఉన్న ధనం వలన వారు అనేకమైన మయాలలో విహరిస్తూ వుంటారు. ఇది కేవలం తాత్కలితమైనది అని గుర్తింపకపోతే అనర్ధమే.1తిమోతి3:7.ధనం కానీ ఇంకా ఏది కూడా మనలను ఆ ప్రభువు నుండి వేరు చేయకుండె విధంగా మనం ఆయనను నమ్మి, పేద సాదలను గుర్తిస్తూ జీవిస్తే ఎప్పుడు ఆయనతోనే సంతోషంగా జీవిస్తాము.

యేసు తో సమృద్ది

 5 వ సామాన్య ఆదివారం

యేసు తో సమృద్ది 

లూకా 5: 1-11 

 క్రీస్తు నాధుని యందు ప్రియ మిత్రులారా ,ఈనాటి  సువిశేషంలో యేసు ప్రభువు శిష్యులను ఎన్నుకోవడం చూస్తున్నాం. ఎందుకు యేసు ప్రభువు వీరిని ఎన్నుకున్నారు. వారికి ఉన్న లక్షణాలు ఏమిటి? వారు గొప్ప వారా ? లేక వారు ఎప్పుడు దేవుని మాటను ఖచ్చితముగా పట్టించేవారా ? వారు తెలివిగాలవారా? జ్ఞానవంతులా? అనేటువంటి ఈ ప్రశ్నలు అన్నింటికీ  సమాధానం కాదు అనే , అయిన యేసు ప్రభువు వారిని ఎన్నుకుంటున్నారు.ఈ లోకం దేనికి పనికి రారు అని చెప్పేవారిని దేవుడు ఎంనుకొంటున్నారు. వారి ద్వార గొప్ప కార్యాలు చేస్తున్నారు. 1 కోరింథీ 1:27 మనం చూస్తున్న. "వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు, లోకముచే అవివేకులుగాభావింపబడువారిని దేవుడు ఎన్నుకొనేను."   యేసు ప్రభువు మొదటి శిష్యులు సంపూర్ణులు కారు వారిలో అనేక లోపాలు ఉన్నాయి. మొదటి పఠనంలో యోషయా తన అయోగ్యత వెల్లడి చేస్తున్నారు. కానీ దేవుని మాటలను చెప్పడానికి తాను సిద్దము అని చెబుతున్నారు. పేతురు కూడా తన అయోగ్యతను వెల్లడి చేస్తున్నారు, అది తెలియచేసి దేవుని అనుసరించదానికి సిద్దపడుతున్నాడు. 

యేసు ప్రభువు అనేక మందికి స్వస్థత ఇచ్చిన తరువాత ఇక్కడికి వస్తున్నారు. అందుకే  అక్కడ చాలా మంది ఉంటున్నారు. ఆయన మాటలు వినాలని, స్వస్థత పొందాలని వస్తున్నారు.  అక్కడ ఉన్న పడవలలో యేసు ప్రభువు కూర్చొని దేవుని వాక్కుని వినిపించారు. అక్కడ జాలరులు చేపలు పట్టుకున్న తరువాత ఏమి దొరకక వారి వలలను శుభ్రం చేసుకున్నారు. అంతకు ముందే యేసు ప్రభువు సిమోను పేతురు అత్త గారిని స్వస్థ పరిచారు, కనుక కృతజ్ఞత భావంతో వారి పడవను ఇచ్చి ఉండవచ్చు.

పేతురుకి యేసు ప్రభువు లోతుకి వెళ్ళి వల వేయమని అంటున్నారు. పేతురు చెబుతున్నారు. రాత్రి అంత కష్ట పడిన  ఉపయోగం లేదు కానీ నీవు చెప్పినట్లయితే చేస్తాను అని వల వేస్తున్నారు. పేతురుకి చాలా ఇబ్బందిగా ఉండవచ్చు, దేవుని వాక్కు విన్నా  కానీ తనకు రాత్రి మొత్తం పని చేసిన వారికి ఏమి దొరకలేదు. 

దేవుని పిలుపు చాలా విచిత్రముగా ఉంటుంది , ఎందుకంటే యేసు ప్రభువు జాలరి కాదు. పేతురు జాలరి చిన్నప్పటి నుండి చేపలు పడుతున్నాడు.  రాత్రి మొత్తం కష్ట పడ్డారు కాని ఏమి దొరకలేదు. అక్కడ చేపలు లేవు అని అనిపించవచ్చు. అయిన యేసు ప్రభువు అడుగుతున్నారు వల వేయమని, నేను జాలరిని , అదికాకుండా  రాత్రి మొత్తం పని చేశాను అక్కడ లేవు అని నాకు తెలుసు. నీవు దేవుని గురించి గొప్పగా చెప్పావు ఎందుకంటే నీవు బోధకుడవు  కనుక నీకు దేవుని గురించి బాగా చెప్పావు అని అనుకోని  ఉండవచ్చు.  చేపలు గురించి నీకు తెలియదులే అని అనుకోని ఉండవచ్చు కానీ యేసు ప్రభువు చెప్పినట్లు మాత్రం చేస్తున్నాడు. ఎందుకంటే నా కంటే నీవు గొప్ప వాడవు అని గ్రహించి. పేతురు గారికి ఇష్టం ఉండక పోవచ్చు.  కాని పేతరు దేవుని మాటను విధేయించారు. 

 పేతురు అంటున్నారు ప్రభువా రాత్రి మొత్తం మేము పని చేశాము కానీ ఏమి దొరకలేదు. అక్కడ ఏమి ఉండకపోవచ్చు కానీ మీ మాట తీసువేయలేక మేము వల వేస్తాము, అని వల వేస్తున్నారు. పేతురు, యేసు ప్రభువు చెప్పినట్లు చేయక పోతే ఏమి జరుగుతుంది. వారికి దొరికే సమృద్ది దొరికేది కాదు. సమృద్ది ఉండేది కాదు, యేసు ప్రభువు మాటలలో అటువంటి శక్తి ఉంది. నీకు సమృద్ది దొరుకుతుంది, నీకు మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్న వారికి అది ఉంటుంది. మరలా పేతురుని ఆయన ఎన్నుకుంటున్నారు. అంత కంటే గొప్ప పనికి. దేవుని వాక్కును ప్రజలకు తీసుకువెళ్లాడానికి. దైవ రాజ్యనికి అందరిని సిద్దంచేయడానికి ఎన్నుకుంటున్నారు. 

నీవు గొప్ప దైవ జనుడవు నీవు చెప్పిన మాటలు బాగున్నాయి, కానీ నేను జాలరీని నాకు తెలుసు అక్కడ చేపలు ఉన్నాయో , లేవో. నీ మాట మీద నమ్మకముంచి కాదు కానీ నీ మాట కాదనలేక వల వేస్తున్నాను అనుకోని వుండవచ్చు, అక్కడ జరిగిన దానికి అంటే వారికి వలలు చీనుగునన్ని చేపలు పడటం చూసి అనుకుంటున్నారు, ఈయన సాధారణ భోదకుడు కాదు.  ఈయన అసాధారణమైన వ్యక్తి అని అర్ధమై , మోకరించి నన్ను వదలి వెళ్ళు ప్రభువా నేను అపవిత్రుడను అని చెపుతున్నారు, తన నిజ స్వరూపం ఆయనకు  తెలుస్తుంది. నిజానికి నీవు ఎటువంటి వాడవు అని నీకు తెలిసేది యేసు ప్రభువు సమక్షంలోనే. ఇదే మొదటి పఠనంలో జరుగుతుంది. . నీవు అహం తో వున్నట్లయితే దాని అర్ధం నీవు ఇంకా దేవుడిని తెలుసుకోలేదు. మనం మన ప్రక్క వారి గురించి లేక చెడ్డ వారి గురించి పోల్చుకొని నేను మంచి వాడినే అని అనుకుంటున్నాము.  

వారి సొంత బలం మీద ఆదారపడినప్పుడు వారికి ఏమి దొరకలేదు, ఎప్పుడు అయితే వారు యేసు ప్రభువు మాట వింటున్నారో వారికి ఎప్పుడు దొరకనంత చేపలు దొరుకుతున్నాయి. ఎప్పుడైతే నీవు ఆయన మాటకు కట్టుబడుతావో నీ శక్తిని ,నీ ప్రతిభను నీవు పూర్తిగా వినియోగించవచ్చు, దేవుడు  నిన్ను పూర్తిగా తనకు అనుకూలముగా ఉపయోగించుకుంటారు. ఇది విశ్వాసంతో కూడిన విధేయత ఎందుకంటే అక్కడ చేపలు లేవని నా అనుభవం చెపుతుంది కానీ నేను వల వేస్తాను నీవు చెప్పావు కాబట్టి , ఆయన  విధేయత యొక్క ఫలితం అన్నీ చేపలు పడటం, పేతురు గారు ఎన్నడూ పట్టుకోలేనాన్ని చేపలు , ఇది పేతరు గారికి యేసు ప్రభువుని గొప్పతనం చూడటానికి ఉపయోగపడింది.  

యేసు ప్రభువుని వినడానికి ప్రతి ఒక్కరు వచ్చారు, కష్టాలలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, బాదలలో ఉన్నవారు, మానసిక రొగులు, దేవుని వాక్కు కోసం వచ్చిన వారు ఇలా అన్నీ రకాల ప్రజలు ఉన్నారు. కానీ వారి మద్య మరియొక వర్గం వారు కూడా ఉన్నారు వారే రాత్రి మొత్తం పని చేసి కూడా ఏమి లేకుండా ఉన్నవారు, వారి పని ఉంది కానీ చేసిన తరువాత  ఫలితం మాత్రం శూన్యం. ఈ కోవలోని వారు పేతురు, మరియు మిగిలిన జాలరులు. ఒకరకమైన భాద ఇంటికి ఏమి తీసుకోపోవాలి అని , అంత శ్రమ వృధా అయ్యింది అని, వారు కూడా యేసు ప్రభువు మాటలు విన్నారు. యేసు ప్రభువు భోదన తరువాత వారితో మాటలాడుతున్నారు. మనలో అనేక మంది ఈ కోవలోని వారే. ఈ శూన్యత నుండి బయట పడాలి అంటే మనం ఆయనతో ఉండాలి. అప్పుడు మనం సమృద్దిని పొందుతాము. 

 ఈ అద్భుతం తరువాత ,ఆశ్చర్యం , భయం , వారి అయోగ్యత మొత్తం వారి ముందు కనపడుతున్నాయి, ఇతను ఎవరూ ? స్వస్థత ఇస్తున్నారు, సాతానును వెడలగొడుతున్నారు, చేయమన్నది చేయగానే లెక్కకు మిక్కుటముగా ఆ పని ఫలితం ఉంటుంది. ఇంతటి దైవ జనుడి వద్ద నేను ఉండవలసిన వాడిని కాదు అని  తన అయోగ్యతను వ్యక్త పరుస్తున్నారు, నా నుండి వెళ్ళమని చెబుతున్నారు. 

ప్రభు ! నా నుంచి వెళ్లిపో , నేను పాపాత్ముడను - ఎందుకు ఇలా అంటున్నారు,  యేసు ప్రభువును  గొప్ప తనం చూసిన తరువాత పేతురు  తన స్వరూపాన్ని చూసుకుంటున్నారు, ఎందుకంటే ఎప్పుడైతే దేవున్ని చూస్తామో అప్పుడు మన నిజ స్వరూపం మనకు తెలుస్తుంది. లేకపోతే మనం మనలను గొప్ప వారిగా చూసుకుంటాం. ప్రభు ! నేను పాపిని నన్ను విడిచి పెట్టుము. అని అంటున్నాడు.  మొదటి పఠనములో యోషయా ప్రవక్త ఒక దర్శనము చూస్తున్నారు. ఆ దర్శనం ద్వార ఒక విషయం తెలుసుకుంటున్నారు, పాపి దగ్గరకు కూడా దేవుడు వస్తారు అని తెలియ చేస్తున్నారు. అంటే దేవుడు  నేను పాపిని అని నన్ను దూరం చెయ్యరు అని తెలుస్తుంది. ఇక్కడ పేతరు గారు  మొదటి సారి యేసు ప్రభువుని కలుస్తున్నప్పుడు తనను తాను కలుసుకుంటున్నారు, తన గురించి తెలుసుకుంటున్నాడు. నన్ను గురించి నేను పూర్తిగా  తెలుసుకునేది  యేసు ప్రభువుని సమక్షంలోనే , ఆయన సమక్షంలో నేను ఏమిటో నాకు పూర్తిగా అవగతమవుతుంది. ఇక్కడ పేతురు గారికీ  దేవునికి తన మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. అంటే నేను ఈ విధంగా ఉన్న నన్ను ఆయన దూరం పెట్టారు అని ఆయన్ను అభిమానించడం, ప్రేమించడం మొదలు పెడుతున్నారు. 

నిన్ను చేపలు పట్టువానిగా కాక మనుషులను పట్టు వానిగా చేయుట అంటే  ఏమిటి? ఇది ఏవిధముగా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి? పునీత పేతురుగారు  ద్వార అనేకమంది  జ్ఞాన స్నానం పొందుతున్నారు. అపోస్తుల కార్యాలు 2 వ అధ్యాయం 41 వ వచనం మనం చదువుతాం. ఆయన భోధన విని రమారమి 3000 మంది జ్ఞానస్నానం పొందారు. 4 వ అధ్యాయం లో 5000 మంది అవుతున్నారు. ఆయన దైవ రాజ్యమునకు మనుషులను పట్టే వానిగా మారుతున్నారు. అంతే కాదు దానిలో సమృద్దిని సాధిస్తున్నారు. ప్రియ మిత్రులారా ఈ సువిశేషం ద్వార మనం దేవునితో ఉంటే మనకు సమృద్దిగా ఆయన అన్నీ ప్రసాదిస్తారు అని తెలుసుకుంటున్నాం కనుక ఆవిధంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఆమెన్ 

యేసు ప్రభువు బాప్తిస్మ ఆదివారం

 యేసు ప్రభువు బాప్తిస్మ ఆదివారం 

యెషయా 40:1-5, 9-11, తీతు 2:11-14,3:4-7, లూకా 3:15-16,21-22

యేసు ప్రభువు బప్తిస్మము చాలా ప్రాముఖ్యత కలిగినది మన రక్షణ చరిత్రలో అందుకనే సువార్తికులందరు దీని గురించి రాసారు. మత్తయి 3:14-15 యేసు ప్రభుని బప్తిస్మము ఆయన పాపం చేసినందుకు కాదు దేవుని ఆజ్ఞలకు అనుకూలముగా స్వీకరించాడు అని తెలియచేస్తుంది. యోహాను , యేసు ప్రభువుల మధ్య సంభాషణ ద్వారా ఇది తెలుసుకుంటున్నాము. యోహాను బప్తిస్మము పాప జీవితానికి ముగింపును పలికి నూతన జీవితాన్ని సాగించడానికి కానీ యేసు ప్రభువు స్వీకరించిన బాప్తిస్మము ఒక నూతన కార్యాన్ని స్వీకరించడానికి, అంటే తన పెంపుడు తండ్రి అయినా యేసేపు గారి పని అయిన వడ్రంగి పనిని వదలి ఒక నూతన కార్యాన్ని స్వీకరిస్తున్నారు లేక మొదలు పెడుతున్నారు. ఆ నూతన కార్యం ఏమిటి అంటే మానవ రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యం మొదలు పెట్టడానికే యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు. 

యేసు ప్రభువు బప్తిస్మము తీసుకున్నప్పుడు జరిగిన విషయాలు మనము గురించి ఈ రోజు మనము వింటున్నాము. అవి ఏమిటి అంటే 1. పరలోకం తెరవబడుతుంది. పరలోకం తెరవబడటం అనే మాట దర్శన గ్రంధం లోని భాషలా ఉంది. పరలోకం తెరవ బడటం అంటే  యుదయా ప్రజలు పరలోకానికి భూలోకానికి మధ్య ఒక విభజన ఉంది అని, అవి ఇప్పుడు వేరు చేయ బడినవి  అని నమ్మారు.  అంటే ఇప్పుడు పరలోకానికి , భూలోకానికి ఒక అడ్డు ఉందని అది కొన్ని ప్రత్యేక సంధర్భాలలో తొలగించబడుతుంది అని వారి నమ్మకం. ఎప్పుడు  ఈ ప్రత్యేక సంధర్భం లేక ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే పాత నిబంధనలో ప్రవక్తలు , దీర్ఘ దర్శులు దేవ రహస్యాలను చూస్తారు కాబట్టి వారి దృష్టిలో పరలోకం భూలోకం ఏకమవుతాయి. అంటే దేవుడు భూలోకానికి వస్తున్నాడు అని అర్థం. పరలోకం మరియు భూలోకం మధ్య సంగమం ఏర్పడుతుంది. 

ఇది చాలా కాలం తరువాత యేసు ప్రభువు బాప్తిస్మము రోజున జరుగుతుంది. మనం యెషయా  64:1 లో చూసినట్లయితే యెషయా ప్రవక్త "ఓ దేవా ! నీవు పరలోకం చీల్చి క్రిందికి దిగి రమ్ము" అని అంటున్నారు. ఈ ప్రార్ధన అర్ధం దేవుడు ఆయన్ను పూర్వ కాలంలో వలే తెలియ పరచాలి అని, నిర్గమ 19:16-19 , ఇక్కడ దేవుడు పర్వతము నుండి వస్తారు. అంటే దేవుడు పరలోకం నుండి భూలోకానికి వస్తూంటారు. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే దేవుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియ చేసే సమయంలో లేక కొన్ని గొప్ప కార్యాలు ప్రారంభించే సమయములో జరుగుతుంది.  

యేసు ప్రభువు బాప్తిస్మము లో జరుగుతుంది కూడా ఇదే. ఇక్కడ సంభాషణ  జరుగుతుంది యేసు ప్రభువుకి మరియు దేవునికి మద్యలో, అందుకే యేసు ప్రభువు ప్రారంభించే పని, సరి అయినది అని దేవుని ఆమోదం పరలోక వాణి ద్వార మరియు పవిత్రాత్మ  యేసు ప్రభువు  మీద పావుర రూపమున దిగి రావడం ద్వార తెలుస్తుంది. రక్షణ కార్యాన్ని ప్రారంభించడానికి  దేవుని అనుగ్రహం ఇక్కడ జరుగుతుంది. పవిత్రాత్మ ఈ కార్యానికి తోడ్పాటు అందిస్తుంది. 

 పరలోక వాణి  : బాప్తిస్మము జరుగుతున్న సమయములో పరలోకము నుండి ఒక వాణి  వినబడుతుంది.  ఇక్కడ జరిగిన ఈ సందర్భంలో మిగిలిన వారు నిజముగా అక్కడ ఉన్న వారందరికీ వినబడింది లేనిది మనకు తెలియదు. ఎందుకంటే యేసు ప్రభువు పౌలుకు  డమాస్కస్ (అ. చ 9:7,22:9) దర్శన మిచ్చిన సమయములో పౌలుతో ఉన్న ప్రజలు వెలుగును మాత్రమే చూసారు, శబ్దం విన్నారు కానీ ఆ మాటలను గుర్తు పట్టలేదు. యేసు ప్రభువుకు మాత్రము ఇక్కడ తండ్రి మాటలు ఊరటను బలాన్ని ఇస్తున్నాయి. 

దేవుడు ప్రజలతో మాట్లాడటం మనం పాత నిబంధనలో కూడా  చూస్తాం. ద్వితీ 4:10-12, నిర్గమ 3:4 కనుక పరలోక వాణి అనేది యిస్రాయేలు ప్రజలకు తెలుసు. నీవు నా ప్రియమైన కుమారుడవు పరలోక వాణి పలుకుతుంది  అని వింటున్నాము.  అంటే ఈ మాటలు యేసు ప్రభువు కొరకు వచ్చినవి. ఈయన దేవుని కుమారుడు అని అదే విధముగా ఈయన చేసే పని దేవుని కార్యము అని తెలియచేస్తుంది. అంటే ఈయన చేయబోయే పనికి తండ్రి ఆమోదం ఉంది అని తెలియచేస్తుంది. 

ఈ క్రీస్తు బాప్తిస్మము మనకు ఏమి తెలియ చేస్తుంది? అని అంటే మొదటిగా దేవుని ప్రణాళిక అమలు చేయడానికి నేను సిద్దముగా ఉండాలి అని తెలియ చేస్తుంది. ఎందుకంటే పునీత బాప్తిస్మ యోహను గారు యేసు ప్రభువు బాప్తిస్మము స్వీకరించడానికి వచ్చినప్పుడు, నేను నీకు బాప్తిస్మము ఇవ్వడానికి అర్హుడను కాను నేనే నీ వద్ద బాప్తిస్మము స్వీకరించ వలసిన వాడను అని అంటున్నారు. కాని యేసు ప్రభువు ఇప్పడు నిర్ణయించబడిన విధముగా జరగనివ్వమని చెబుతున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక చేయడానికి ఆయన తన గొప్పతనం  లేక దేనినైనా కూడా వదులు కోవడానికి సిద్దముగా ఉన్నాడు అని తెలియచేస్తున్నారు. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. ఈ రోజుతో తన రక్షణ కార్యాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన పరిచర్య , స్వస్థత చేయటం, క్షమించడం, దేవుని నుండి దూరముగా వెళ్ళిన వారిని వెదకి  తీసుకురావడం మొదలు పెట్టబోవుచున్నారు. వానికి ముందుగా  బాప్తిస్మ యోహను దగ్గరకు వస్తున్నారు. యోహను పాప క్షమాపణ పొందడానికి పశ్చాతాపం కలిగి జీవించమని పిలుపు ఇచ్చారు, వారికి బాప్తిస్మము ఇస్తున్నారు. 

ఎందుకు యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు?  యోహను ఇచ్చే బాప్తిస్మము పాప క్షమాపణకు మరి యేసు ప్రభవులో ఎటువంటి పాపం లేదు కదా ! యేసు ప్రభువుకి ఈ బాప్తిస్మము అవసరం లేదు, అందుకే యోహను యేసు ప్రభవుతో  నేనే నీ వద్ద బాప్తిస్మము తీసుకోవలసిన వాడిని, నేను నీకు బాప్తిస్మము ఇవ్వడమా ? అని అంటున్నారు. కానీ యేసు ప్రభువు ఇప్పటికీ ఇటులనే కానిమ్ము, సంకల్పమును మనము ఇప్పుడు ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని చెపుతున్నారు.  దాని అర్దము దేవుని సంకల్పమును నెరవేర్చుటకు నేను ఏమి చేయడానికి అయిన సిద్దమే అని తెలుపుతున్నారు. యేసు ప్రభువు జీవితము మొత్తము కూడా తండ్రి దేవుని సంకల్పమును నెరవేర్చడమే. అది చేయడము కోసము యేసు ప్రభువు ఎంత వరకు అయిన వెళతారు. తన కంటే తక్కువ వాడైన యోహను దగ్గర పాప క్షమాపణకు ఇచ్చే బాప్తిస్మము తీసుకుంటున్నారు. తన శిష్యుల కాళ్ళు కడుగుతున్నారు, తన ప్రాణాన్ని ఇస్తున్నారు.  దేవునితో తన సమానత్వాన్ని వదలి మానవునిగా మన మధ్యకి వస్తున్నారు. కారణం ఏమిటి అంటే దేవుని సంకల్పం నెరవేరాలి. యేసు ప్రభువు ఒక అనమకునిగా ఎందుకు జన్మించాలి, ఎందుకు మరణించాలి, పాపుల చేత ఎందుకు నిందించబడాలి, ఎందుకు వారి చేత శిక్షించబడాలి , అన్నిటికీ సమాదానం యోహానుకు యేసు ప్రభువు ఇస్తున్నారు. దేవుని సంకల్పం నెరవేరుటకు ఈ విధముగా జరుగనివ్వు అని అంటున్నారు. దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను ఏమైనా చేస్తాను అని చెబుతున్నారు. 

ఈ రోజు యేసు ప్రభువు బాప్తిస్మము ద్వార ఈ సుగుణాన్ని అలవర్చుకోవాలి దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను ఏమి చేయడానికైనా సిద్దముగా ఉండాలి. మనము కూడా ఆ విధంగా జీవించడానికి సిద్దముగా ఉందాం. ఆమెన్ 

Fr. Amruth 


అష్ట భాగ్యాలు

 అష్ట భాగ్యాలు 

నాలుగవ సామాన్య ఆదివారం 

 మత్తయి 5:1-12 

యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూచేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు దైవ రాజ్యము వారిది.  శోకార్తూలు ధన్యులు వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు వారు భూమికి వారాసులగుదురు. నీతినిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరుపబడుదురు. దయామయులు ధన్యులు వారు వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. శాంతి స్తాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్ధము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బాహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహనందపడుడు. 

యేసు ప్రభువు ప్రసంగాలలో చాలా ముఖ్యమైన ప్రసంగం ఈ అష్టభాగ్యాల ప్రసంగం.  అనేక మందిని ప్రభావితం చేసిన ప్రసంగం మరియు అనేక మంది చేత ప్రశంసించబడిన ప్రసంగం కూడా ఇదే. ఈ అష్టభాగ్యాలు ఒకరకముగా క్రైస్తవుని విధులు, లేక ప్రతి క్రైస్తవుని భాధ్యతలు  అని చెప్పవచ్చు.   ధన్యులు అనే మాట ఇక్కడ  అనేక సార్లు వింటున్నాం. ఇక్కడ వాడిన పదం మారికోస్  అనే పదం. ఇది  దేవునికి మాత్రమే వాడే పదం.  ధన్యులు అనే పదం నూతన నిబంధనలో దేవుని రాజ్యంలో పాలుపంచుకొనుటలో వచ్చే ఆనందం వ్యక్తం చేయడానికి వాడటం జరిగింది.  యేసు ప్రభువు చెప్పే ధన్యత ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఇది మానవుని యొక్క పూర్తి ఆనందం గురించి చెబుతుంది.  సంపూర్ణమైన  ఆనందం ఏమిటి అనేది ఇక్కడ మనము చూస్తున్నాము. ఈ ధన్యత ఎనిమిది  విధాలుగా మనం చూస్తున్నాము. ఎనిమిది అనేది స్వర్గీయ సంపూర్ణతను  తెలియచేస్తుంది. 

 ధన్యత అనే పదం మూడు విధాలుగా చెప్పవచ్చు.   మొదటిగా ధన్యత అనేది సంపూర్ణంగా ఆనందంతో  ఉండే స్థితి. రెండవదిగా మానవుని భావాలు, మరియు పరిస్తితులు ఎల్లప్పుడు పవిత్రంగా ఉండే విధం. మూడవదిగా దేవుని పని. కొన్ని దేవుడు భవిష్యత్తులో మానవునికి ఇచ్చే ఒక అనుగ్రహం గురించి తెలియజేస్తుంది. 

దీనాత్ములు ధన్యులు దైవ రాజ్యము వారిది. దీనాత్ముములు అనే  పదం ఆర్ధికంగా ఒక వ్యక్తిని యాచించె విధంగా చేయబడటం గురించి చెప్పేది. వీరు వారి జీవనం కోసం  వేరె వారి మీద ఆదారపడి జీవించేవారు.  పేదవారు అంటే జీవనం కోసం ఇతరుల మీద అదరపడేవారు. పాత నిబంధనలో పేదవారు వినయం కలిగిన వాడు. సహాయం లేనివాడు అనే అనేక అర్ధాలు ఉన్నాయి.  దీనాత్ములు అని అన్నప్పడు దేవుని యందు తమ నమ్మకం ఉంచిన వారు అని అర్ధం. పేదవారిగా ఉన్నకాని వారి నమ్మకమును ఇహలోక వస్తువుల, లేక మనుషుల  మీద ఉంచినట్లయితే వారిని పేదవారు అంటారు కాని దీనాత్ములు అని అనరు. ఎవరు పేదవారు అయిన ధనికులు అయిన దేవుని మీద ఆధారపడి జీవించె వారిని దీనాత్ములు అని అంటారు.  ఇక్కడ  వీరికి దేవుని రాజ్యం ఇవ్వబడుతుంది అని చెప్పడం లేడు. దేవుని రాజ్యం వీరిది అని చెప్పబడుతుంది. అంటే వీరు దేవుని రాజ్యానికి వారసులు అది వారి సొంతం అనే అర్ధం ఇక్కడ మనం చూస్తున్నాం.  ఇహలోక  వ్యక్తులు , వస్తువులు కాకుండా దేవుని మీద ఆదారపడి జీవించడానికి ఇది నాంది పలుకుతుంది. 

శోకార్తూలు ధన్యులు వారు ఓదార్చబడుదురు.  అష్ట భాగ్యాలలో రెండవదిగా మనం చూసేదీ శోకార్తులు ధన్యులు అని వారు ఓదార్చబడుతారు అని మనం వింటున్నాం. ఇక్కడ ఓదార్చేది దేవుడే ఎందుకంటే ఈ శోకం ఎందుకు వస్తుంది అని  మనం అర్ధం చేసుకున్నప్పుడు మనకు ఇది రెండు విషయాలు తెలియజేస్తుంది.  సహజంగా శోకానికి కారణాలు రెండు కారణాలు.  మొదటిది మరణం . ఎప్పుడైతే మనకు చాలా దగ్గరి వారు మరణిస్తారో, అప్పుడు మనం శోకానికి గురి అవుతాము. అది వారికి మనకు మధ్య ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. అప్పటినుండి మనకు వారితో ఉన్న సాన్నిహిత్యం తెగిపోతుంది అని గ్రహించినప్పుడు శోకానికి గురి అవుతాము. ఒక వేళ మరణించిన వారితో మనకు ఉన్న సాన్నిహిత్యం గొప్పది అయినచో మన శోకం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవ కారణం పాపం. ఒక వ్యక్తి పాపం చేయడం వలన శోకం  కలుగుతుంది. మరణం లో వలె ఇక్కడ కూడా సంబంధం దెబ్బతింటుంది. ఎవరితో ఈ సంబంధం దెబ్బతింటుంది అని అంటే దేవునితో ఉన్న సంబంధం దెబ్బతింటుంది. దేవునితో ఉన్న ఈ సంబంధం పాపకారణముగా దెబ్బతిన్నప్పుడు, దానిని గ్రహించిన వ్యక్తి బాధ పడుతాడు, పశ్చాత్తాప పడుతాడు, అప్పుడు సహజముగా ఆ వ్యక్తి శోకానికి గురి అవుతాడు. ఇటువంటి పరిస్తితిలో ఉన్న వారిని దేవుడే ఓదారుస్తాడు. దీనినే మనం యోషయా గ్రంధంలో చూస్తాము. పాప కారణముగా దేవునితో వున్న సంబంధాన్ని పోగొట్టుకొనిన వారు శోకానికి గురి అయినచో అది చూసిన దేవుడే వారికి ఓదార్పు ఇస్తారు. 

వినమ్రులు ధన్యులు వారు భూమికి వారాసులగుదురు. వినమ్రతను బైబుల్లో రెండు అర్ధాలు వచ్చే విధంగా వాడటం మనం చూస్తాము. మొదటిగా ఈ పదాన్ని వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఉన్న ఒక సుగుణం వలె వాడటం జరిగింది. రెండవదిగా  సాంఘీక అసమానతలకు  గురిఅయిన వారికి కూడా దీనిని వాడటం చూస్తాము. పాత నిబంధనలో రెండవ దానికి ప్రతీకగా ఈ పదాన్ని వాడటం జరిగింది. దేవుడు ఏర్పాటు చేసిన నాయకుల లక్షణం కూడా ఈ వినమ్రత కలిగి ఉండటము మనం గమనించవచ్చు. కేవలం వినమ్రత కలిగిన వ్యక్తి మాత్రమే శక్తి గలవాడు అనేటువంటి సందర్భాలు కనబడుతాయి. మోషే ఇటువంటి వ్యక్తి. సంఖ్యా 12:3 మోషే వినమ్రత కలిగిన నాయకునిగా దేవుడు చేస్తున్నాడు. యేసు ప్రభువు వినమ్రత మనకు చాలా ముఖ్యం ఎందుకంటే ఆయనే  చెబుతున్నాడు నెను వినమ్ర హృదయుడను అని,  కనుక దాని పర్యావసానం వారి భూమికి వారసులు అవుతారు. దీనినే  మనం 37 వ కీర్తనలో చూస్తున్నాం. 

నీతినిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరుపబడుదురు.  నీతి నిమిత్తము ఆకలిదప్పులు కలిగినవారు ధన్యులు అని మనం ఇక్కడ వింటున్నాం. ఒక రకముగా ఈ మాటలు ఆకలి, దాహంల గురించి మాటలాడిన విధముగా ఉన్నాయి. యేసు ప్రభువు నెను నిజమైన ఆహారము , నన్ను భుజించువారు ఎన్నటికిని ఆకలిగొనడు అని , నన్ను విశ్వాసించువాడు ఎన్నటికిని దప్పికగొనడు అని చెబుతారు. యోహను 4:14. ఎందుకు, ఎవరి కోసం మనం  ఆకలిదప్పులు కలిగిఉండాలి అనే ప్రశ్నకు మనం ఇక్కడ నీతి నిమిత్తము అనే జవాబు చూస్తున్నాము. నీతి నిమిత్తము అన్నప్పుడు మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి బాప్తిస్మ యోహనుగారు. మత్తయి సువార్త 3:15 వ వచనంలో ఈ మాటలు గురించే మనం వింటాము. యోహను చేత జ్ఞాన స్నానం పొందటం దేవుని సంకల్పం అయినట్లయితే ఆ విధంగా జరగనివ్వు అని యేసు ప్రభువు అంటారు. దేవుని సంకల్పం నెరవేర్చడమె నీతి అనే అర్ధం ఇక్కడ చూస్తాము. ఇక్కడ ఎవరు పెద్ద లేక చిన్న అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. దీనినే మత్తయి 21:32 లో చూస్తాము. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటె దేవుని నిర్ణయాన్ని పాటించుటకు మనం సిద్ధపడి ఉండటం. ఎవరు అయితే ఈవిధంగా చేయడానికి సిద్దముగా ఉంటారో వారు సంతృప్తి పరుపబడుతారు. ఈ ఆకలిదప్పులు అన్నీ తీరిపోతాయి. 

దయామయులు ధన్యులు వారు వారు దయను పొందుదురు. దయామయులు ధన్యులు  అనే మాటను వింటున్నప్పుడు, మనకు యేసు ప్రభువు చెప్పిన ఉపమానాలు గుర్తుకు వస్తాయి, ఎందుకంటే మనం దేవుని దయను పొందుటకు  ఖచ్ఛితముగా ఇతరులకు ఈ దయను మనం చూపించగలగాలి. ఎపుడైతే దేవుని దయను , కృపను పొంది ఆ దయను ఇతరులకు చూపించకుండా ఉన్నప్పుడు మనం దేవుని నుండి దయను పొందుటకు అర్హులము కాము అని మనకు యేసు ప్రభువు తెలుపుతున్నారు. ఇక్కడ మాత్రమే కాదు , పరలోక ప్రార్ధనలో , తన తోటి పని వానిని క్షమించలేనివాని ఉపమానం ద్వారా యేసు ప్రభువు మనకు దీనిని తేటతెల్లం చేస్తున్నారు. దేవుడు ఎంత దయమయుడు అనే విషయం కూడా మనం ఇక్కడ  తెలుసుకోవచ్చు, పాత నిబంధనలో దేవుడు దయమయుడు అని త్వరగా కోపపడు వాడు కాదు అని మనం తెలుసుకుంటాం. నూతన నిబంధంలో యేసు ప్రభువు ఎంత దయమయుడో మనం చూస్తాము. ఈ భాగ్యం దేవుని దయను పొందగోరు వారు ఏ విధంగా  ఇతరులకు  దయను చూపాలో తెలియజేస్తుంది. మరియు దేవుని దయ పొందటం మనం ఇతరులకు చూపించే దయ  మీద ఆధారపడి ఉంటుంది అని తెలియజేస్తుంది. 


నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. హృదయం అనేది ప్రేమ అప్యాయతలకు  నిలయం.  మానవ భావాలు అన్నీ ఇక్కడనుండే వస్తాయి. అన్నీ నిర్ణయాలు ఇక్కడ నుండే మనకు ప్రారంభమవుతాయి. పరి వర్తన కూడా ఇక్కడ నుండే వస్తుంది. వీటి అన్నింటికీ కూడా  నిర్మల హృదయ అనేది చాలా ముఖ్యమైనది,  24 కీర్తన మనకు దిని యొక్క ముఖ్యమైన ఫలితాన్ని తెలియజేస్తుంది. ప్రభుని పర్వతము ఎక్కుటకు అర్హుడేవడు ? పవితం హృదయం కలవాడు అని మనకు బైబుల్ నేర్పుతుంది. వీరు ఎవరు అంటే   వీరి జీవితములో ఎటువంటి నాటకీయత ఉండదు. వీరి బాహ్య జీవితం , ఆంతరంగిక జీవితం మధ్య వ్యత్యాసం ఏమి ఉండదు. మొత్తం కూడా ఒకే రకముగా ఉంటుంది. కీర్తన 51:10-11 మనకు ఇది తెలియజేస్తుంది. నిర్మల హృదయం , కళంకం లేని చేతులు గలవారు దేవుని చూచుటకు అర్హులు.  వారు దేవుని చూస్తారు అని మనం వింటున్నాము.  కాని ఇక్కడ పవిత్ర అనేది దేవుని చూడుటకు ఒక షరతులా ఉంది. మరియ మాత, యోసేపు వారు , చిన్ని బిడ్డలు వీరు పవిత్రులు అందుకే వారి సాన్నిధ్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దర్శన గ్రంధంలో తెల్లని వస్త్రములు ధరించిన వారు యేసు ప్రభువు ఎక్కడకి వెళ్ళిన అక్కడకు వెళ్లారు. ఎందుకంటె వారు పవిత్రులు కనుక. దేవుని దగ్గర ఉండుటకు, పవిత్రత చాలా ముఖ్యమైనది. పవిత్రులు దేవుణ్ణి దర్శిస్తారు. 


శాంతి స్తాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు. శాంతి అనే మాటకు అనేక రకాలైన అర్ధాలు ఉన్నాయి. ఇక్కడ ఇది కేవలం ఎటువంటి గొడవలు లేక సమస్యలు , యుద్దాలు లేకపోవడం మాత్రమే కాదు. మానవుడు పూర్తిగా ఆనందమును అనుభవించేలా చేయడం. ఇక్కడ యేసు ప్రభువు ధన్యత ప్రకటిస్తుంది , శాంతిని ప్రేమించెవారికి కాదు, ఎవరు అయితే శాంతిని స్థాపించడానికి ప్రయత్నిస్తారో వారికి ధన్యత చేకూరుతుంది అని తెలియజేస్తున్నాడు. వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెబుతున్నారు. ఈ అష్ట భాగ్యాలలో మనం చూసేదీ ఏమిటి అంటే ఎవరు అయితే ఈ పనులు చేయడానికి సిద్దమవుతారో పూర్తిగా దేవునికి చెందినవారిగా ఉంటున్నారు అని , అంటే ఆయన వారిని తనతో గడిపే విధాముగా లేక తన కుమారులు అయ్యే విధముగా లేక తన రాజ్యంలో పాలుపంచుకొనే వారినిగా చేస్తున్నాడు.   

ధర్మార్ధము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది. ఇక్కడ   దేవుని నిమిత్తము, ఆయన వాక్కు నిమిత్తము హింసించబడే వారు ధన్యులు అని చెప్పబడుతుంది.  అనేక మంది ఈ విధంగా హింసించబడ్డారు. వీరికి పరలోకంలో గొప్ప బహుమానం కలదు అని యేసు ప్రభువు చెబుతున్నాడు. ఈలోకంలో ఉండగా ఆయన నిమిత్తము హింసించబడినప్పుడు మనము ధన్యులమే. హింసించే వానికి ఆయన గురించి తెలియదు. ఎప్పుడైతే మనం యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలను పాటిస్తామో మనం నిజమైన యేసు ప్రభువు  అనుచరులం అవుతాము. ఆయన శిష్యులుగా జీవిస్తాము కనుక అటుల జీవించుటకు ప్రయత్నించుదాం. 


క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం

 క్రీస్తు  సాక్షాత్కార మహోత్సవం 

 యెషయా 60:1-6, ఎఫెసీ 3:2-3,5-6, మత్తయి 2:1-12   

హెరోదురాజు పరిపాలన కాలములో యూదయ సీమయందలి బెత్లేహేము నందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు నుండి యెరుషలేమునకు వచ్చి, "యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పున చూచి మేము ఆరాధింప వచ్చితిమి" అని అనిరి. ఇది విని, హెరోదు రాజు, యెరుషలేము నగర వాసులందరు కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను, ధర్మ శాస్త్ర బోధకులను సమావేశ పరచి  "క్రీస్తు ఎచట జన్మించును" అని ప్రశ్నించేను. "యూదయ సీమ యందలి బెత్లేహేము నందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమ యందలి బెత్లేహేమా!నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏలన నా యిస్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో  నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను." అంతట హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి, నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలిసికొనెను. పిమ్మట అతడు వారిని బెత్లేహేమునకు పంపుచు "మీరు వెళ్ళి, జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నెను వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను." రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్లిపోయిరి. అదిగో !తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శినియై , ఆ శిశువు వున్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రము చూచినప్పుడేంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి, తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి, సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువుకు బంగారము, సాంబ్రాణి పరిమళ ద్రవ్యములను కానుకలుగ సమర్పించిరి. హెరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు హెచ్చరింపగా, వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. 

హేరోదు రాజు  యూదయ ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం  37వ సంవత్సరం నుండి 4వ సంవత్సరం వరకు పాలించాడు. ఈ హేరోదు పాలన కాలంలో యేసు ప్రభువు పాలించాడు. మికా గ్రంధం ప్రకారం ( 5:1-3 ) బేత్లెహేము రక్షకుని జన్మ స్థలం. అంతే కాదు అది దావీదు రాజు జన్మ స్థలం కూడా. 

హేరిడేటస్ ప్రకారం ఈ ముగ్గురు రాజులు మేదియాన్ తెగకు చెందినవారు. మెదియా పర్షియా రాజ్యంలో భాగంగా ఉండేవారు.  వారు పర్షియా పాలనకు ముగింపు పలికి వారు పాలించాలి అని అనుకున్నారు. కాని అది సాధ్యం కాకపోవడంతో పాలన వ్యవహారాలను వదలివేసి అధికార వ్యామోహం లేకుండా యాజకులుగా స్థిరపడ్డారు. పర్షియాలో వారిని జ్ఞానులుగా మరియు పవిత్రులుగా చూసేవారు. వారు ప్రవచనాలు చెప్పడంలో, వైద్య శాస్త్రంలో మరియు అంతరిక్ష శాస్త్రంలో ప్రసిద్ధులు. అంతరిక్షంలో వేర్పడే మార్పులను పట్టి భవిష్యత్తును చెబుతారని అందరు వీరిని నమ్మేవారు. వీరిని మనం మరియు అప్పటి ప్రజలు కూడా జ్ఞానులు అనే చెబుతున్నాం. అసలు జ్ఞాని అంటే ఏమిటి పవిత్ర గ్రంధంలో అని అంటే, మంచి చెడులను తెలుసుకొని, మంచిని మాత్రమే అనుసరించ గలిగిన శక్తి గలిగిన వారు అని అర్ధం. మంచి చెడులను తెలుసుకొనే విచక్షణ ఉండి కూడా మంచిని అనుసరించ లేని వానిని బైబుల్ జ్ఞాని అని చెప్పదు. తెలుసుకోవడం మాత్రమే జ్ఞానానికి కొలమానం కాదు. అది ఆచరణకు సంభందించినది. 

ఈ అన్యుల రాక తూర్పు నుండి వస్తున్నారని మనము వింటున్నాము. యేసు ప్రభువు అబ్రహము కుమారుడు అని అయన ద్వారా అందరు దీవించబడతారు అని తెలియచేస్తుంది. ఆదికాండము 22:18.   .ఈ ముగ్గురు రాజులు లేక జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం దేవుని యొక్క ప్రణాళికే ఎందుకు అంటే ఆది కాండం 22 వ అధ్యాయం 18 వ వచనం లో అబ్రహాము సంతతి ద్వార జాతులన్నీ దీవించ బడుతాయి అని మనం తెలుసుకుంటాం. అది ఈ రోజు ఈ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం ద్వార జరుగుతుంది. యేసు ప్రభువును దేవునిగా మొదట ఆరాధించిన ప్రజలు అన్యులు, యూదులు కాదు. ఈ ముగ్గురు రాజులు దేవుని అర్పించే వాటిని యేసు ప్రభువుకి అర్పించి ఆయనను దేవునిగా గుర్తించి, తెలుసుకొని, ఆయనను  ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 8:11 లో మనం తూర్పు పడమరల నుండి ప్రజలు అబ్రహాము తో కూర్చుంటారు అనే వింటున్నాం. అది ఇక్కడ నెరవేరుతుంది.  

ఈ ముగ్గురు రాజులు ఒక నక్షత్రం చూసి , ఒక గొప్ప వ్యక్తి యిస్రాయేలులో  జన్మించారని తెలుసుకున్నారు. వారు నిజానికి ఆ నక్షత్రం ద్వారా ఎదో ఎదుకుతున్నారు. ఇన్నాళ్ళు వారిని బానిసలుగా చూసిన పర్షియా రాజ్యమ నుండి స్వతత్రం వారు వెదుకుతున్నారు. వారి బానిసత్వాన్ని తీసువేసే రాజు కోసం వారు వెదుకుతున్నారు. అందుకే వారు యేసు ప్రభువును రాజుగా గురించి రాజుకు బాహుమానంగా ఇచ్చే బంగారం వారు ఇస్తున్నారు. వీరు యాజకులు అని మనం చెప్పుకున్నాం. యాజకులు దేవునికి సాంబ్రాణి దూపము వేయాడం వారి కర్తవ్యం. వీరు యేసు ప్రభువుకు సాంబ్రాణిని అర్పిస్తున్నారు. వారి దేవునిగా మరియు వారి ప్రధాన యాజకునిగా వారు యేసు ప్రభువును గుర్తిస్తున్నారు. వారు సుగంధ ద్రవ్యాలను అర్పిస్తున్నారు. ఇవి చనిపోయిన వారికి అభ్యంగణం చేయడానికి వాడేవి. ఎందుకు ఇవి వారు అర్పిస్తున్నారు అంటే యేసు ప్రభువు తన మరణం, శ్రమలు అన్నీ వారి కొరకు అని తెలియజేయుటకు ఇవి వారు ఇస్తున్నారు. 

 వీరి అన్నీ సమస్యలకు సమాధానం యేసు ప్రభువే అని వారు నమ్మారు. ఈ నక్షత్రం వారి సమస్యలను తీర్చే వారిని చూపిస్తుంది అని వారు ఆ నక్షత్రాన్ని అనుసరించారు. కాని వారు అక్కడ ఏమి చూస్తున్నారు. చిన్నారి బాలయేసుని మాత్రమే.  వీరు జ్ఞానులు , గొప్పవారు వీరు తెలివిగలవారు.  చిన్నారి బాల యేసును, సరిగా లేని ఒక పశువుల పాకను, చూసి కూడా వారికి ఎటువంటి అపనమ్మకం కలగలేదు. ఆయనను ఆరాధించారు. అక్కడ వారు దేవుని మహిమను చూసారు , వారు అంత దూరం కేవలం కొన్ని బహుమతులు ఇవ్వడానికి వెళ్ళలేదు. అక్కడ వారు ఎదో చూస్తున్నారు , వారు ఆ చిన్న బిడ్డను ఆరాధిస్తున్నారు. వారి మోకాళ్ల మీద ఉన్నారు.  దేవుడు మానవుని రూపంలో వారు చూసారు. వారు ఆనందముగా కృతఙ్ఞతలు చెప్పి  వెళుతున్నారు. 

అందుకే మనము ఈ పండుగను క్రీస్తు సాక్షాత్కార పండుగగా పిలుస్తాము అంటే దేవుడు తనను తాను తెలియ చేసుకోవడం.  ఒక నక్షత్రం ద్వారా దేవుడు ఆయనను వారికి తెలియ పరుచుకున్నాడు. వారు జ్ఞానులు కనుక  నక్షత్రం ద్వారా యేసు ప్రభువు దేవుడు అని గుర్తించారు. నీవు ఆయన చేసిన పనులు గురించి వినివున్నావు కనుక ఆయనను తెలుసుకొని ఆయనను వారు ఆరాధించినటులా నీవు కూడా ఆరాధించాలి. 

పునీత సిలువ యోహనుగారు ప్రకారం మానవుని విషాదకర పరిస్తితి ఏమిటి అంటే దేవుడు  అనేక విధాలుగా మనకు తనను తాను  తెలియపరుచుకుంటున్న మనం అది గుర్తించలేకపోతున్నాము ఈరోజు. 

ఇక్కడ మనం మరియమాత, యోసేపు వారిని చూస్తున్నాము. ఈ రాజులు ఎక్కడ నుండి వచ్చారు, వారు ఏమి చేయబోతున్నారు. ఏమి అడుగుటలేదు. వారిని రావద్దని వారించడం లేదు. ఇది తీరుసభ ఉండవలసిన తీరు గురించి తెలియజేస్తుంది. యేసు ప్రభువు అందరిచేత ఆరాధించబడటానికి, తెలుసుకొనబడటానికి మౌనంగానే సహకరిస్తున్నారు. అది ఒకరకంగా తీరుసభ లేక నివు నేను ఇతరులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు చేయవలసిన పని. 

ఈ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం మనకు దేవున్ని ఎరుకపరచుట మాత్రమే కాక మనం ఎలా ఉండాలో తెలియజేస్తుంది. ముగ్గురు రాజులు యేసు ప్రభువుని తెలుసుకొని ఆయనకు తమ ఆర్పణలతో పాటు తామని తాము అర్పించుకొని ఆయనకు విధేయత చూపుతున్నారు. ఆయన వారికి ఎటువంటి అనుగ్రహాలు ఇవ్వనప్పటికి వారు ఆయనను గుర్తించి ఆనందంతో దేవుని దర్శించము అని వెళుతున్నారు, మనం దేవుని గుర్తించి ఆయనను ఆరాధించి మన విధేయతను చూపాలి. మరియమాత, యోసేపు వలె అందరికి ఆహ్వానించి ఎవరిని దేవుని దర్శించటానికి మనం ఆటంకం కాకుండా ఉండాలి. హెరోదు వలె దేవుని తన అధికారమునకు ఆటంకం అనుకోకుండా ఆయనతో కలిసి ఉండటానికి ప్రయత్నించాలి. ఆవిధంగా జీవించాడానికి ప్రయత్నించుదాం. 


మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం

 మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం 

ఈ రోజు మనం మూడు ముఖ్యమైన పండుగలు చేసుకుంటున్నాము. మొదటిది మరియ మాత దివ్య మాతృత్వ పండగ. ఏమిటి మరియమాత మాతృత్వం, ఆ మాతృత్వ గొప్పతనం ఏమిటి అంటే ఇది సాధారణ మాతృత్వం కాదు. దేవునికి తల్లి అవ్వడం. దేవునికి తల్లి అవ్వడం అంటే  ఏమిటి ? రెండవది యేసు ప్రభువుకు సున్నతి చేసి పేరు పుట్టిన రోజు. మూడవదిగా ఈరోజు మనము నూతన సంవత్సరములోనికి అడుగుపెడుతున్నాము. 

ఈ యొక్క పదాన్ని 431వ సంవత్సరంలో ఎఫెసుస్ కౌన్సిల్ లో మొదటిగా మరియమాత దేవుని తల్లి అని అనడం జరిగింది. దానిమీద అనేక వాదనలు జరిగాయి.  వీటన్నింటి సారాంశం ముఖ్యముగా  దేవుని గురించే. అది యేసు ప్రభువు ఈలోకమునకు మానవునిగా రావడం వలన ఈ మానవ రూపంలో దైవత్వాన్ని పూర్తిగా చూపించడం ప్రధాన అంశం యేసు ప్రభునియొక్క మానవత్వాన్ని మరియు దైవత్వాన్ని పూర్తిగా మనము పూర్తిగా అంగీకరించినప్పుడు మరియమాత యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తాము. మరియమాతకు ఉన్న పేరులలో చాలా ముఖ్యమైనది దేవుని తల్లి. ఆమె దేవునికి మానవునిగా జన్మనిచ్చిన తల్లి. ఈ పేరుకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది యేసు ప్రభువు పూర్తిగా మానవుడు మరియు దేవుడు అని చెప్పే సందర్భంలో ఈ పేరుతో మరియమాతను సంబోధించడం జరిగినది. ఇది  ఇప్పటినుండే కాదు అంతియోకియకు చెందిన ఇగ్నేషియస్ అనే పునీతుడు నూట ఏడవ సంవత్సరంలో మన ప్రభువును  మరియమాత తన గర్భంలో దేవుని రక్షణ మార్గానికి సహకరించింది అని చెప్పేవారు. ఆమె దేవుని తల్లి అని ఆరిజిన్ గారు రెండవ శతాబ్దంలోనే చెప్పారు. కాపాడొసియాన్ పితరులు అయిన పునీత  గ్రెగరీ గారు మరియమాతను దేవుని తల్లిగా అంగీకరించకపోతే అయన ఇచ్చే దైవత్వం నుండి మనం వైదొలుగుతున్నాం అని అంటారు. ఎందుకు అంటే  యేసు ప్రభువు మీరు దేవుని వాక్కును పాటించినట్లయితే మీరు నా సహోదరి సహోదరులు అవుతారు, నా తల్లి అవుతారు అని చెబుతారు. అటువంటి అప్పుడు తన గర్భం నందు మోసి , దేవుడు చెప్పినట్లుగా మీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నేను నీ దాసురాలును అని చెప్పేరు, ఇంకా అంతకన్నా దేవుని వాక్కును పాటించిన వారు ఎవరు  ఉన్నారు. 

 అయితే నాలుగవ శతాబ్దంలో మరియమాత దేవుని తల్లి అని ఒప్పుకోవడానికి అంగీకరించలేదు నెస్టోరియాన్ అనే బిషప్ గారు. ఆయన చెప్పిన కారణం ఆమె కేవలం మానవ యేసుకి మాత్రమే జన్మనిచ్చినది అని చెప్పారు. కానీ ఆయన తన మానవ స్వభావం మరియు దైవ స్వభావం రెండు కూడా మిళితమైఉన్నవి. 

యేసు ప్రభువు మనకు దివ్య సత్ప్రసాదం స్థాపించి మనకు ఒక బహుమతిని ప్రసాదించాడు. యేసు ప్రభువు మనకు మరియొక బహుమతి ఇచ్చాడు అది యేసు ప్రభువు తన ప్రాణమును విడిచే ముందు ఈ బహుమానం మనకు ప్రకటించాడు. అది ఏమిటి అంటే మరియమాతను తన ప్రియమైన శిష్యుడుకు ఇచ్చాడు. ఇన్నాళ్ళూ యేసు ప్రభువుకు మాత్రమే ఆమె  తల్లి కాని ఇప్పటి నుండి ఆమె తన శిష్యుడుకు మాత్రమే తల్లి కాకుండా మన అందరికి కూడా తల్లి అవుతుంది. 

ఇప్పటి నుండి మరియ మాత అందరికి ప్రతి ఒక్కరికీ కూడా ఆమె తల్లి అవుతుంది. ఎప్పుడైతే దేవదూత నీవు కుమారున్నీ ప్రసవించబోతున్నావు అని అప్పటినుండి ఆమె యేసు ప్రభువు తల్లిగానే మనము చూస్తాము. ఎందుకంటే  ఎలిజబెతమ్మ మరియతల్లి తన వద్దకు రాగానే నా ప్రభువుని తల్లి నావద్దకు రావడం నాకు ఎలాగు ప్రాప్తించేను అని అంటున్నది, ఆమె పవిత్రాత్మ ప్రభావం చేత ఈ మాటలు అంటున్నది కనుక మనం ఆమెను పవిత్రాత్మే దేవుని తల్లి అని చెబుతున్నది అని అర్ధం అవుతుంది. 

ఈమె దేవుని తల్లి అయితే మనకు ఏమిటి అని మనం అనుకోవచ్చు, ఈమె దేవునికి మాత్రమే కాదు మనకు కూడా తల్లి ఎందుకంటే యేసు ప్రభువు మానవునికి ఇచ్చిన చివరి రెండు బహుమతులు ఏమిటి అంటే మొదటిది తాను ఎల్లప్పుడు మనతో ఉండటానికి దివ్య సత్ప్రసాదం ఒసగడం మరియొకటి మరియమాతను తన ప్రియ శిష్యునిగా ఇవ్వడం వలన మన అందరికి ఆమెను తల్లిగా ఇస్తున్నాడు. ఆమెను తల్లిగా యోహను తన ఇంటికి తీసుకొని వెళుతున్నాడు. మనం ఆమెను మన తల్లిగా తీసుకొని వెళ్ళాలి. 

మరియమాతకు  దెవదూత మంగళ వార్తను ప్రకటించినప్పుడు నీవు దేవుని కుమారునికి జన్మ ఇస్తావు అని అన్నపుడు  మరియమాత  విశ్వాసంతో తన విధేయతను చూపించింది. నేను దేవుని దాసురాలను అని మరియమాత చెప్పింది. మరియమాత  యేసు ప్రభువుకు తల్లి అవుతుంది.  

ఈనాటి సువిశేషంలో మారియమతను యేసు ప్రభువుతో చూస్తాము, ఇక్కడ చాలా గొప్ప మాటలు మనకు వినపడుతున్నాయి. ఆమె ఈ విషయాలను అన్నింటినీ తన మనసున పదిలం చేసుకొని మననం చేసుకొని జీవిస్తుంది అని చెబుతుంది. ఇది మనకు అత్యున్నత మార్గాన్ని మనకు చూపిస్తుంది. మనం మన జీవితంలో ఎలా ఎల్లప్పుడు మంచి ఆలోచనలతో ఉండాలో చెబుతుంది. మరియమాత జీవితంలో అనేక దుర్ఘటనలు ఉన్నాయి,  యేసు ప్రభువు తనకు దూరం అవుతారు, యేసు ప్రభువు తనతో ఉండటంలేదు. కాని ఈ బాల యేసుకు సంబంధించిన అన్నీ విషయాలను తన మదిలో నిపుకొని తన జీవితంలో ఎటువంటి చెడు భావాలకు లోనుకాకుండా ఆమె జీవిస్తుంది. మనకు కూడా ఇది ఒక మంచి మార్గమును చూపిస్తుంది. 

 మరియమాత నేను మీ దాసురాలను అని చెప్పినప్పుడు ఆమె అవ్వ చేసిన పని అయిన అవిధేయతను  తన తన విధేయత ద్వారా దేవునికి ఇష్ట పుత్రికగా అయ్యింది. 

మనలను రక్షించడానికి వచ్చిన దేవుడు మన మధ్యనే ఉన్నాడు. తన ఆహ్వానాన్ని తీసుకొని మరియమాత వలె తమ జీవితాలను దేవుని ప్రణాళికకు అనుకూలముగా మారితే మనం ఎప్పుడు ఆమె వాలే ఉంటాం. 

 మానవుని స్వేచ్ఛను ఎప్పుడు కూడా దేవుడు గౌరవిస్తాడు. మరియమాతకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశం మరియమాత వినియోగించుకున్నది. ఇది మనందరికీ కూడా వ్యక్తిగతముగా,   ఆహ్వానముగా వుంది, ఆ కుటుంబంలో భాగం అవుదాం.

చెడు నుండి నేర్చుకొనవలసిన మంచి

 చెడు నుండి నేర్చుకొనవలసిన  మంచి 

 ఆమోసు 8: 4-7, 1 తిమోతి 2:1-8 లూకా 16 : 1-13

యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: ఒక ధనవనంతుని వద్ద గృహానిర్వాహకుడు  ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతని పై నేరము మోపబడెను. యజమానుడు అతనిని  పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉంద వీలుపడదు అని చెప్పెను.  అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరివలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను అని , యజమానుని ఋణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటివానితో నీవు నా యజమానునికి ఎంత ఋణ పడి ఉన్నావు ? అని అడిగెను వాడు నూరు మణుగుల నూనె అని చెప్పెను. అపుడు అతడు వానితో నీ ఋణపత్రము తీసుకొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము అని చెప్పెను. అంతట అతడు రెండవ వానితో నీవు ఎంత ఋణపడి ఉంటివి? అని అడిగెను. వాడు నూరుతూముల గోధుములు అని బడులుపలికెను. అపుడు వానితో నీ ఋణ పత్రము  తీసికొని ఏనుబది అని వ్రాసికొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయన, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలయన , ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్యనివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు, గొప్ప విషయములలోను నమ్మదగినవాడిగా ఉండును. కనుక, ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము  విషయములలో మీరు నమ్మదగిన వారు కానిచో, మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏలయన , వాడు ఒకనిని ద్వేషించును, వేరొకనిని ప్రేమించును. లేదా , ఒకనిని అనుసరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవ మును , ద్రవ్యమును సేవింపలేరు.  

క్రీస్తు నాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా లూకా సువార్త 15, 16  ఆధ్యాయాలలో ప్రధానమైన ఉద్దేశ్యం దేవుని రాజ్యం.   

యేసు ప్రభువు చెప్పిన ఉపమానాలలో అర్ధం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండే ఒక ఉపమానం ఇది. తన యజమానికి రావలసిన ఋణాన్ని తగ్గించుచున్న గృహ నిర్వహకుని గురించి ఇక్కడ మనం చూస్తున్నాము. మనం చూసే ఈ ఉపమానం యొక్క సంధర్బం ఏమిటి అంటే యూదయ ప్రాంతం లో చాలా మంది భూస్వాములు ఉండేవారు. కాని వారు పట్టణములలో ఉండేవారు. వారి భూమిని కౌలుకు ఇచ్చే వారు. వారు తమ ఆస్తులను , పొలాలను , వాటి మీద వచ్చేటువంటి ఆదాయమును, కౌలును అన్నింటిని చూసుకోవడానికి కొంతమంది గృహ నిర్వహకులను ఏర్పాటు చేసుకునేవారు. వీరు ఆ కౌలును లేక పంట కోసేటప్పుడు యజమానునికి వచ్చేటు వంటి భాగాన్ని అతనికి చెరవేసేవారు. ఈ ఉపమానం డబ్బును అధికముగా ప్రేమించేవారికి , మరియు దానిమీదే ఆధారపడే వారికి ఒక గుణపాఠం నేర్పుతుంది. అధే విధంగా పేదవారికి ఒక రకముగా ఈయన అభయాన్ని ఇస్తున్నాడు దేవుని మీద ఆధారపడమని. తన శిష్యులను పేదరికాన్ని చూసి భయపడ వద్దు అని చెబుతు ధనవంతులు కావాలని అవినీతి  పనులు చేయ వద్దు అని చెబుతున్నారు. 

ఒక ధనవనంతుని వద్ద గృహానిర్వాహకుడు  ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతని పై నేరము మోపబడెను. 

ఇక్కడ మనం ముగ్గురును చూస్తున్నాము. యజమాని, గృహానిర్వహకుడు, యజమానికి  ఋణ పడినటువంటి వారు.  మనకు యజమాని గురించి పూర్తిగా తెలియదు ఆయన ఎటువంటి వాడు అతని గుణగణాలు  ఏమిటి ఇవి ఏమి మనకు అంతగా తెలియవు. యజమానుడు గృహ నిర్వహకుని మీద వచ్చిన అన్ని అభియోగాలపై విచారణ జరిపించారా? గృహ నిర్వహకునికి తన యజమానుని ఇంటిలో ఉన్న వారి అందరిమీద అధికారం ఉంటుంది, వారు అందరు సరిగా పని చేస్తున్నారా , అందరు ఆయనకు ఇవ్వవలసిన కౌలు మరియు మిగిలినవి ఇస్తున్నారా అని చూసుకోవాలసినది గృహానిర్వహకుడే. ఒక వేళ గృహ నిర్వహకునిమీద అసూయ తోటి లేక ఇతర కారణాల తోటి ఆయన మీద ఏమైనా నేరం మోపుతున్నారో కూడా మనకు తెలియదు. యజమానికి లాభం రాకపోయినచో అది గృహ నిర్వహకుని యొక్క చేతకాని తనంగా చూస్తారు. యజమానికి జరిగిన అవమానంగా చూస్తారు. గృహ నిర్వహకుని మీద ఇక్కడ వచ్చిన నేరం ఏమిటి  అంటే అతను తన యజమానుని సంపదను వృధా చేస్తున్నాడు అని  నేరం మోపబడింది. అంటే అతను చేయ వలసిన పని చేయకుండా , యజమాని అప్పగించిన బాధ్యతను అతను సరిగా చేయడం లేదు. కనున యజమానుడు అతనిని తీసివేయుటకు నిశ్చయించుకొని ఆ మాటను అతనికి తెలియజేస్తున్నాడు. తనను లెక్కలు అప్పజెప్పమని అడుగుతున్నాడు. ఇప్పుడు గృహానిర్వహకుడు తన తెలివితేటలను వాడుతున్నాడు. అప్పటి వరకు సోమరిగా ఉన్నాడు. కాని తన ఉద్యొగం పోతుంది అని తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. 

అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది.

ఇక్కడ గృహ నిర్వాహకుడు తనకు తానే చెప్పుకొనుచున్నాడు. నేను ఇప్పుడు ఏమి చేయాలి? నా యజమాని నన్ను పని నుండి తీసివేస్తున్నారు, నేనా కష్టించి పని చేయలేను. యాచించుటకా నాకు సిగ్గుగా ఉన్నది. తనతో తాను మాటలాడుకున్న ఈ మాటల నుండి మనకు కొన్ని విషయాలు స్పష్టమగుచున్నవి అవి ఏమిటి అంటేఈ వ్యక్తి తన యజమాని సంపదను పాడు చేస్తున్నాడు. అంటే ఇతను ఒక రకముగా ఇతను తన పనికి తగిన శక్తి సామర్ధ్యం కలిగిన వాడు కాదు. అని అర్ధం అవుతుంది. కనుక యజమాని తనకు తనను పని నుండి తీసి వేస్తున్నాను లెక్కలు తీసుకు రమ్మంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి మొత్తం కూడా కోల్పోతున్నాడు. తన నీడను , ఇక ఎక్కడ ఉండాలో తెలియదు, తాను భవిష్యత్తుకు ఏమి దాచుకోలేదు, తాను కష్టమైన పని చేయలేడు , అడుగుకొనలేడు , ఇప్పుడు అతను ఏమి చేయాలి తనను పని నుండి తీసివేసిన తరువాత ఎవరైన తనకు ఆశ్రయం ఇవ్వాలి. కనుక తన యజమానికి ఉన్న ఋణస్థులను అందరిని పిలుస్తున్నాడు. ఎవరైతే ఋణ పడి ఉన్నారో అందరి ఋణాలను  తగ్గిస్తున్నాడు.  అతని వద్ద డబ్బులు, లేక ఆస్తి ఏమి లేదు అని తెలుస్తుంది. కాని వృధా ఖర్చులు మాత్రం చేస్తూ ఉండేవాడు. అనవసరపు ఖర్చులు చేసేవాడు.  తాను ఇతర పనులకు, ముఖ్యంగా శారీరక శ్రమతో కూడిన పనులు చేయుటకు , యాచించుటకు  తాను సరిపోను అని తెలుసుకుంటున్నాడు. ఇక్కడ ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు అది ఏమిటి అంటే తన యజమానునికి ఋణ పడిఉన్న వారిని పిలిచి వారు ఇవ్వవలసిన మొత్తాన్ని తగ్గించుకోమని చెబుతున్నాడు. అంటే వారి వద్ద నుండి ఆశ్రయం పొందాలని అనుకుంటున్నాడు. 

గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరివలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను అని , యజమానుని ఋణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటివానితో నీవు నా యజమానునికి ఎంత ఋణ పడి ఉన్నావు ? అని అడిగెను వాడు నూరు మణుగుల నూనె అని చెప్పెను. అపుడు అతడు వానితో నీ ఋణపత్రము తీసుకొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము అని చెప్పెను. అంతట అతడు రెండవ వానితో నీవు ఎంత ఋణపడి ఉంటివి? అని అడిగెను. వాడు నూరుతూముల గోధుములు అని బడులుపలికెను. అపుడు వానితో నీ ఋణ పత్రము  తీసికొని ఏనుబది అని వ్రాసికొనుము అనెను.

గృహనిర్వాహకుడు  ఋణగ్రస్తుల ఋణాన్ని  తగ్గించడం, వారు యజమానునికి ఇవ్వవలసినది ఎంత , లేక వారు చేసుకున్న ఒప్పందం మొత్తం గృహ నిర్వహకుని వద్ద ఉంటుంది. ఇక్కడ మనం చూసిన 50 మణుగుల నూనె , 20 తూముల  గోదుములు  తగ్గించడం ద్వారా ఋణస్థులు ఆనందంగా ఉంటారు. ఈ తగ్గించిన ఋణం  చాలా పెద్ద మొత్తం లో తగ్గించడం జరిగింది, కనుక ఖచ్ఛితముగా వారు ఇంత సహాయం చేసినందుకు అతనిని అడుకుంటారు.  ఎందుకు ఈ గృహ నిర్వాహకుడు ఇది చేస్తున్నాడు అంటే తనని ఋణస్తులందరు మంచి వాడు అని అనుకోవాలి. తరువాత అతనికి ఆశ్రయం కల్పించాలి. ఇంత పెద్ద మొత్తంలో తగ్గించినందుకు ఇది ఖచ్ఛితముగా జరుగుతుంది. ఎందుకంటే మనిషి తన స్వలాభం చూసుకుంటాడు కనుక , తనకు లాభం చేకుర్చిన గృహనిర్వహకునికి సహాయం పడడం తన విధిగా బావిస్తాడు అని గృహ నిర్వాహకుడు అనుకుంటున్నాడు. 

ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయన, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజల కంటే యుక్తిపరులు. 

ఇక్కడ యజమాని గృహనిర్వహకుని పొగుడుతున్నాడు. ఎందుకంటే అతను తెలివిగా ప్రవర్తించాడు. తన భవిష్యత్తు కోసం ఎంతో తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. యజమాని పొగుడుతున్నాడు. కాని యేసు ప్రభువు ఎందుకు ఈ పనిని ప్రశంసిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకానికి సంబందించిన వారు వారి భవిష్యత్తు కోసం ఎంతవరకు అయిన పోయి తమ జీవితాలలో కావలసిన వాటిని సమకూర్చుకుంటారు. యేసు ప్రభువు వీరు వెలుగు పుత్రులు కంటే తెలివిగలవారు. ఎందుకు అంటే విశ్వాసులు వెలుగు పుత్రులు యోహను 12:37. 

విశ్వాసులందరు కు మరియు ముఖ్యముగా వెలుగు పుత్రులకు  , మరియు డబ్బుల వాడకం  గురించి చెప్పిన ఉపమానం ఇది. ఇది శిష్యులకు కూడా చెప్పిన ఒక ఉపమానం. డబ్బును ప్రేమించే వారి కోసం కూడా చెప్పిన ఒక ఉపమానం. యజమాని గృహానిర్వహకుడిని పొగుడుతున్నాడు. ఇతను ఎవరు ఒక గృహ నిర్వహకుడిగా తన దగ్గర ఉన్న వాటిని పాడు చేసిన వాడు. చివరకు తన భవిష్యత్తుకు కూడా ఏమి తన దగ్గర పెట్టుకోలేదు. అటువంటి ఒక వ్యక్తిని పొగడటం ఏమిటి ? అతను తన పనిని సరిగా నిర్వర్తించలేదు. 

అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలయన , ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్యనివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. 

9 వ వచనంలో యేసు ప్రభువు చెబుతున్నారు. మీ సంపదతో మిమ్ములను పరలోక రాజ్యానికి ఆహ్వానించే స్నేహితులను ఏర్పాటు చేసుకోనండి  అని చెబుతున్నారు. మీ సంపదను మీ వద్దనే మీరు మరణించినంత వరకు పెట్టుకున్నచో మనం లూకా 12 వ అధ్యాయంలో చూసిన ధనికుని జీవితంలో ఏమి జరుగుతుందో అదే మన జీవితంలో కూడా జరుగుతుంది. ఎలా నేను అవినీతితో సంపాదించిన సంపదతో  పరలోకంలో నిధిని ఏర్పాటు చేసుకోగలను? 

ధనం  గురించి మనం నేర్చుకొనవలసిన మంచి ఏమిటి అంటే? మన ధనాన్ని  క్రీస్తు కోసం, క్రీస్తు విలువల కోసం వాడటం.  గురించి , ఆయన విలువలకు వాడటం.ఈ లోక సంపద అంటే డబ్బు, భోజనం, ఆస్తి ఐశ్వర్యం, భూమి అయితే పరలోక రాజ్య సంపద అనేది ఇతర ప్రజలను గెలుచుకోవడం. వారికి సేవ చేయడం, మనకు ఉన్న దానిని వారితో పంచుకోవడం. అప్పడు అవి మనకు పరలోకంలో సంపదలుగా మారుతాయి. మొదటి క్రైస్తవ కుటుంబాలు ఇలానే జీవించాయి.   స్వల్ప విషయములలో నమ్మదగినవాడు, గొప్ప విషయములలోను నమ్మదగినవాడిగా ఉండును. కనుక, ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము  విషయములలో మీరు నమ్మదగిన వారు కానిచో, మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? 

ఇక్కడ మనం అర్ధం చేసుకొనవలసినది యేసు ప్రభువు ఈ గృహ నిర్వహకుని యొక్క తెలివిని , తన భవిష్యత్తు కోసం తన ప్రదర్శించిన యుక్తిని మెచ్చుకున్నాడు కాని తాను చేసిన పనిని కాదు. ఇతను నమ్మదగిన వ్యక్తి కాదు. ఎందుకంటే అతను తన పనిని సరిగా నిర్వర్తించిన వ్యక్తి కాదు.  అందుకే యేసు ప్రభువు చెబుతున్నారు. మీరు స్వల్ప విషయాలలో నమ్మదగిన వారు కాకపోతే పరలోక సంపదలను ఎవరు మీకు ఇచ్చును అని అంటున్నారు. ఏమిటి ఈ పరలోక సంపదలు? అంటే మంచి పనులు యకొబు రాసిన లేఖ 2: 15-17.    

ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏలయన , వాడు ఒకనిని ద్వేషించును, వేరొకనిని ప్రేమించును. లేదా, ఒకనిని అనుసరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవ మును , ద్రవ్యమును సేవింపలేరు.  

డబ్బు మనం అనేక మంచి పనులకు కూడా వాడుతూఉంటాం కాని అనేక సార్లు అది మనలను అన్ని విధాలుగా మన జీవితాలను నిర్ణయిస్తుంది. అందుకే మనం దేవునికి మరియు డబ్బుకు సేవ చేయలేం. ధనాన్ని  సేవించినచో మనము దానికి బానిసలు అవుతాము దానిద్వారా మనం ఒక యత్రం వలె మారిపోతాం. దేవున్ని  మరియు ధనంను మనం సేవించడం కుదరదు.  ఇక్కడ ఒక్క ధనమే కాదు దేవునితో వేరె దేనిని మనం పోల్చలేము. మరి ముఖ్యముగా దేవునికి మరియు ధనానికి సఖ్యత అనేది ఎక్కడ కుదరదు. ఎందుకంటే ఎప్పుడైతే మన దగ్గర ధనం ఎక్కువ అయితే అప్పుడు అది గర్వానికి  దారి తీస్తుంది. సంపదకి మనిషి బానిస అయినప్పుడు దేవున్ని తిరస్కరిస్తాడు. అది కాకుండా దైవము ధనము ఎప్పుడు కలసి పోవు. కాబట్టి ఎల్లప్పుడు మనం దేవునికి దగ్గరగా మనం ఉండాలి. ఆమెన్. 

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...