26, ఫిబ్రవరి 2026, గురువారం

నిష్కళంక మాత మహోత్సవం

 నిష్కళంక మాత మహోత్సవం

లూకా  1:26-38

తదుపరి ఆరవమాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక  యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికివచ్చి, ఆమెతో "అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఎలినవారు నీతో ఉన్నారు" అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలతచెంది ఆ శుభవచనము ఏమిటొ అని ఆలోచించుచుండగా దేవదూత "మరియమ్మా !భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" అనెను. అంతట మరియమ్మ " నేను పురుషుని ఎరుగను కదా! ఈద్ ఎట్లు జరుగును?"  ఆ దూతను ప్రశ్నించేను. అందుకు ఆ దూత ఇట్లనెను: "పవిత్రాత్మ నీవపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను అవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు  దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిశబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు  మళ్ళినది గదా! గొడ్రాలైన  ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము. ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు" అంతట మరియమ్మ "ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!" అనెను. అంతట  ఆ దూత వెళ్ళి పోయెను.

ఈరోజు నిష్కళంక మాత మహోత్సవం జరుపుకుంటున్నాము. ఏమిటి ఈ పండుగ అంటే మరియ మాత తన తల్లి గర్భంలో పడినప్పటి నుండి ఎటువంటి పాపం లేకుండ పుట్టింది. మరియమాతలో ఎటువంటి మలినం అనేది లేదు. మరియ మాతను  పాపంలో పడకుండా తన వరప్రసాదాలు ముందుగానే ఇచ్చి తల్లి గర్భంలో పడినప్పటి నుండి పాప రహితురాలుగా ఆమెను చేశాడు అని అర్ధం. 

ఈ ఆలోచన రెండవ శతాబ్దం నుండి తిరిసభలో ఉన్నది. కాని 4 శతాబ్దంలోనే ఒక పండుగలా చేయడం జరుగుతుంది. 1854 9 వ భక్తినాధ పోపు గారు ఈ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. ఈ పండుగ మనకు  మరియమాతకు  తల్లి గర్భంలో పడతున్నప్పుడే, యేసు ప్రభువు శిలువ    శ్రమలు ,  మరణం, పునరుత్థానల ఫలితాన్ని ముందుగానే  ఇచ్చి ఆమెలో   జన్మ పాపం లేకుండా ఆమెను రక్షించారు అని భోదిస్తుంది. ఇది ఎలా సాధ్యము అంటే దేవుడు కాలనికి అతీతుడు. ఆయన అలా చేయగలడు. దీని అర్ధం మరియ మాతకు మెస్సీయ్యా అవసరం లేదు అని కాదు. ఆమెకు ఆయన రక్షణ ముందుగానే ఇవ్వబడింది.

పాపం లేకుండా ఎవరైన సృష్టించబడ్డారా? మొదట మానవుడు పాపం లేకుండానే సృష్టించబడ్డాడు. కాని తరువాత సాతాను మాటను స్త్రీ విని పాపం అంతకట్టుకున్నది.  మొదటి స్త్రీ ఏవను,  పడిపోయిన దేవదూత పాపం చేయడానికి ప్రోత్సహించినది. దేవుడు చేయవద్దని చెప్పిన పనిని చేపించి, పాపము చేసేలా చేసింది.  మరియ మాత దగ్గరకు వచ్చిన దేవదూత పడిపోయిన దేవదూత కాదు, గాబ్రియేలు దేవ దూత , ఈ దూత ప దేవున్ని  పూర్తిగా విధేయించిన దేవదూత. పడిపోయిన దేవ దూత వచ్చినప్పుడు దేవున్ని  విధేయించ వద్దు అని ఏవకు చెప్పింది. కాని , గాబ్రియేలు దేవదూత  వచ్చినప్పుడు దేవున్ని నమ్మమని. ఆయన ప్రణాళికకు సహకరించమని చెబుతుంది. మరియ మాత   తన జీవితం మొత్తం అలానే , ఆ ప్రణాళికకు సహకరిస్తూ జీవించినది. అందుకే తిరుసభ పితరులు ఆమెను రెండవ ఏవ అని పిలుస్తారు. దేవుడు మన  తల్లి తండ్రులను గౌరవించమని చెబుతున్నారు. ఇది దేవుని పది ఆజ్ఞలలో నలుగవది. యేసు ప్రభువు తన తల్లిని గౌరవించారు. మనం కూడా ఆమెను అలానే గౌరవించాలి. 

మరియమాతకు ఈ అనుగ్రహం ఇవ్వవలసి అవసరం చాలా ఉంది,  ఎందుకంటే ఈ లోకం రక్షించబడాలి అనేది దేవుని సంకల్పం.  అందుకు దేవుని  కుమారుడు ఈ లోకానికి రావాలి.   ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ లోకానికి వస్తారో, ఆ పవిత్రుడను ఎవరు ఆహ్వానించగలరు. కేవలం ఎవరు అయితే  ఏ పాపం లేకుండా ఉంటారో వారు మాత్రమే.  అప్పుడే  ఆయనకు ఏ మలినం అంటకుండా ఉంటుంది.  అంటే ఆయన తల్లిలో ఏ పాపం ఉండకూడదు, ఆమె పవిత్రంగా ఉండాలి.    అప్పుడే అది జరుగుతుంది. కనుక ముందుగానే మరియమాతను , తండ్రి దేవుడు  తన కుమారున్ని  ఈ లోకానికి తీసుకురావడానికి ఆమెలో ఎటువంటి పాపము లేకుండా ఆమెను  సిద్దపరుస్తున్నారు. 

ఆదికాండం 3: 15 లో దేవుడు సర్పముతో " నీకును, స్త్రీకిని, నీ సంతతికిని, ఆమె సంతటికిని మధ్య వైరము కలుగ చేయుదును. ఆమె సంతతి నీ తల చితుకగొట్టును. నీవేమో వాని మడమ కరిచేదవు." అని చెబుతున్నారు. ఇక్కడ సాతానుతో ఈ వైరం ఎప్పుడు ఉంటుంది.  ఒక వేళ మరియ మాతలో  పాపముకాని, లేక  చిన్న మలినం ఉన్న , సాతానుతో సహకరించినది అవుతుంది.  కనుక ఆమెలో ఏ పాపము ఉండకూడదు అందుకే ఆమెను దేవుడు జన్మ పాపము లేకుండా చేస్తున్నాడు. ఇవి అన్ని కూడా ఆమె కొరకు కాదు,  ఆమె ద్వారా ఈ లోకానికి వస్తున్నటువంటి తన కుమారుడు , పవిత్రుడు.  ఆ పవిత్రుడు ఈ లోకములోనికి రావాలి అంటే,  ఆయనను తీసుకు వచ్చే స్త్రీ కూడా పవిత్రురాలుగానే ఉండాలి. అపవిత్రతో ఈ ప్రభువును ముట్టుకొనుట అసాధ్యము. అపవిత్రంగా  దివ్య మందసాన్ని తాకుతున్న వారు చనిపోతున్నారు. ప్రభువును ఈ లోకానికి తీసుకువచ్చే తల్లి పవిత్రంగా ఉండాలి కనుక ప్రభువు ఆమెను ఎటువంటి మలినం అంటకుండా చేస్తున్నారు. 

మరియమాత జన్మపాపం లేకుండా జన్మించడం. ఆమె గొప్పతనం ఏమికాదు . ఆమె ఔన్నత్యము తరువాత ఆమె జీవించిన విధానం తెలుపుతుంది. తన జీవితాన్ని మొత్తాన్ని దేవునికి అర్పించినది. దేవుని దాసురాలిగా జీవించింది. ప్రభువును ధ్యానిస్తూ జీవించింది. తరువాత కూడా ఏ పాపము లేకుండ జీవించింది ఇక్కడ ఆమె ఔన్నత్యం తెలుస్తుంది. 


మత్తయి 9:35-10:1,6-8

 మత్తయి 9:35-10:1,6-8

యేసు అన్ని పట్టణములను, గ్రామములను తిరిగి, ప్రార్ధనామందిరములలో బోధించుచు, పరలోకరాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధిబాధలనెల్ల పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొర్రెలవలే చెదరియున్న జనసమూహమును చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు" అని పలికెను. యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు, వారికి అధికారమును ఇచ్చెను. కాని, చెదరిపోయిన గొర్రెలవలెనున్న యిస్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి, పరలోకరాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్టురోగులను శుద్దులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు. 

ధ్యానం: నిన్ననే మనం నిష్కలంక మాత పండుగను జరుపుకున్నాం. ఈ పండుగ సందర్భంగా  ఈ లోకానికి దేవుడు చెప్పిన  మొదటి సువార్తను గురించి ధ్యానిస్తుంటాము. ఏమిటి ఈ మొదటి సువార్త అంటే స్త్రీ కి పుట్టబోయే మెస్సీయా. ఈ మెస్సీయ్యా ద్వారా మనం రక్షించబడుతాము. యేసు ప్రభువు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రకటించేది ఆయన గురించే. ఆయన గురించి ఆయన చెప్పే మాటలు వట్టి మాటలు కాదు, ఎందుకంటే ఆయన ద్వారా అందరు స్వస్థత పొందుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నారు. ఏమిటి ఈ పరలోక రాజ్యమును గురించిన సువార్త అంటే? అప్పటివరకు  యిస్రాయేలు ప్రజలు మెస్సీయాను గురించి ఎదురుచూస్తున్నారు , ఇప్పుడు మెస్సీయా వారి దగ్గరకు వస్తున్నారు. యేసు ప్రభువు చేస్తున్న స్వస్థతలు, ఆయనే మెస్సీయా అని  నిరూపిస్తున్నవి. అవి ఆయన మెస్సీయ్యా అనుటకు గుర్తుగా ఉన్నాయి. 

యేసు ప్రభువుకు, ఆయన పనిలో పాలుపంచుకొనే వారు కావలి. ఆయనను అనుసరిస్తూ ఆయన వలె జీవించేవారు కావలి. వారు ప్రజల బాధలను చూసి , యేసు ప్రభువు ఎలా స్పందిచారో అలానే స్పందించే మనస్సు కలిగిన వారు అయిఉండాలి. ఇది కేవలం యేసు ప్రభువు శిష్యులు మాత్రమే కాదు, ఆయన అనుచరులు అందరు చేయవలసిన పని. ఎవరు అయితే ప్రభువుచేత అనుగ్రహాలు పొందుతున్నారో, స్వస్థతలు పొందుతున్నారో, వారు ఇతరులకు  యేసు ప్రభువు చూపించిన ప్రేమను చూపించాలి. మనము ప్రభువు నుండి పొందిన దానికి ఇతరులతో పంచుకోవడానికి వెనుకడుగువేయకూడదు. 

ప్రజలను చూచినప్పుడు యేసు ప్రభువు చాలా బాధ పడ్డారు. ఆ కారుణమయుని కడుపు తరుక్కు పోయింది అని చదువుతున్నాము.  ప్రజలకు సరైన కాపరులు లేరు అని ప్రభువు చెబుతున్నారు. అందుకే ప్రభువు తన శిష్యులను ఎలా బ్రతకాలో చెబుతున్నారు. ఎలా కాపరులుగా ఉండాలో నేర్పుతున్నారు. ఏహెజ్కెలు ప్రవక్త కూడా యిస్రాయేలు ప్రజలు కాపరి లేని వారి వలె ఉన్నారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు కేవలం కాపరిగా మాత్రమే రాలేదు. ప్రభువు మంచి కాపరి. ప్రభువే "నేను నా మంద కోసం నా ప్రాణామును కూడా ధారపోయుదును" అని చెబుతున్నారు. ఆయన ఎటువంటి కాపరి అనేది మనం ఈ సువిశేష భాగంలో చూస్తున్నాము. ప్రభువు కేవలం వారి అనారోగ్యాన్ని మాత్రమే చూడటం లేదు. వారి  సమస్యలను చూసి, ప్రభుని కడుపు తరుక్కు పోయింది. అంటే ప్రభువు ప్రజల అన్ని సమస్యలను చూస్తున్నారు. వారి వ్యక్తిత్వాలు, వారి సంబంధాలు, వారి సమస్యలు అన్నింటినీ ప్రభువు చూస్తున్నారు. వాటి ద్వారా  వారు పొందే అనేక బాధల నుండి వారిని కాపాడాలని ప్రభువు కోరిక. ఒక మంచి కాపరి మాత్రమే వారిని ఈ సమస్యల నుండి బయటకు తీసుకురాగలరు. ఆ కాపరి ప్రభువు వలె ఉండాలి. ప్రభువు వలె చూడాలి. ప్రభువు వలె వినాలి. ప్రభువు వలె వారి జీవితాలలో పాలుపంచుకోవాలి. 

ప్రభువు చెప్పినట్లుగా నడుచుకోవడానికి అనేక మంది సిద్దముగా ఉన్నారు. కాని వారికి ప్రభువు మాటలను ఎవరు చెబుతారు. ఎవరు ప్రజలను తన సొంత వారినిగా చూస్తారు. ప్రభువు వలే ఎవరు తన మందను కాపాడుతారు. అందుకే యేసు ప్రభువు కోతగాండ్ర కోసం పార్థన చేయమని అడుగుతున్నారు. దేవున్ని, కోతగాండ్రును పంపించమని ప్రార్ధించమంటున్నారు. అంటే కోతగాండ్ర పని యేసు ప్రభువు వలె ఉండటం. ఇది ఈ లోకంలో ప్రతి కైస్తవుని పని. అప్పుడె లోకం నిజమైన కాపరులు కలిగి ఉంటుంది. అందుకె యేసు ప్రభువు తన శిష్యులను పిలుస్తున్నారు. వారికి అన్ని అధికారాలు ప్రభువు ఇస్తున్నారు. వారు చేయవల్సిన అన్ని పనుల గురించి ప్రభువు వారికి చెబుతున్నారు. వారికి  ప్రజలను , అన్ని రకాలైన సమస్యలనుండి కాపాడే శక్తి ఇస్తున్నారు. . 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన : ప్రభువా! మీరు  మా పరలోక రాజ్యమని మేము తెలుసుకున్నాము. మీరు ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ, వారి వ్యాధులను, తీసివేస్తూ, స్వస్థతనుఇవ్వడం వలన మీరు మెస్సీయ్యా అని మేము గుర్తిస్తున్నాము. ప్రభువా! ప్రజల బాధలు తట్టుకోలేక మీ కడుపు తరుక్కుపోయింది, ప్రభువా , ఆ ప్రజలను చూసినట్లు మమ్ములను కూడా ఒకసారి చూడండి. మాలో ఉన్న అన్ని సమస్యలను తొలగించండి. ప్రభువా మీ మాటలను పాటించుచు ఎల్లప్పుడు, మీమ్ము అనుసరించే అనుగ్రహం దయచేయండి. ప్రభువా! మీ అనుచరునిగా, మీ వలె జీవిస్తూ , ఉండుటకు సిద్దంగా ఉన్న మమ్ము , మీ శిష్యుల పంపినట్లుగా  మీ సందేశాన్ని ఇస్తూ, ప్రజల అవసరాలలో బాధలలో పాలుపంచుకొంటూ, ఎప్పుడు ప్రజలను మీ వైపు తీసుకువచ్చే కాపరులుగా మమ్ము మలచండి. ప్రభువా! ప్రజల సమస్యలు మీ సొంతవి అన్నట్లు  మీరు భావించారు అందుకే , మీ కడుపు తరుక్కు పోయింది, తండ్రిని కాపరుల కోసం ప్రార్ధించమని చెబుతున్నారు.  ఇతరుల పట్ల , మీరు కనపరచిన  మనస్తత్వం, మాకు దయచేయండి. ఆమెన్.  

మార్కు 1: 1-8

 మార్కు 1: 1-8

దేవుని కుమారుడు యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. యెషయా ప్రవక్తవ్రాసిన విధమున: "ఇదిగో నీ మార్గమును సిద్ధమొనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. 'ప్రభు మార్గమును సిద్ధమొనర్పుడు. ఆయన  త్రోవను  తీర్చిదిద్దుడు'అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను." ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు  హృదయపరివర్తనము అనెడు బప్తిస్మము పొందవలెనని ఎడారియందు యోహాను ప్రకటించు చుండెను. యూదయా దేశస్థులందరు, యెరూషలేము పురవాసులెల్లరు అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ, యొర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానము ఇచ్చుచుండెను. యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుమునకు తోలుపట్టిని కట్టుకొని, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను. "నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను. నేను మిము నీటితో స్నానము చేయించితిని. కాని అయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును" అని యోహాను ప్రకటించుచుండెను.  

మార్కు సువార్త బాప్తిస్త యోహానుగారి పరిచర్యతో మొదలవుతుంది. మార్కు సువిశేషకుని ప్రకారం  యేసు ప్రభువుని బాప్తిస్మము తోటి ఆయన పరిచర్య  మొదలవుతుంది. యోహాను ఇచ్చేటువంటి బాప్తిస్మము మారుమనసు కొరకు.  అంటే ఒక వ్యక్తి తన పాపములు తెలుసుకొని , ఇకనుండి అటువంటి పనులు చేయకుండా మారడం.  పరలోక రాజ్యం స్థాపన అనేది మానవుని మారు మనసుతొటి మొదలవుతుంది. 
 యోహాను ఎడారిలో ఎలుగెత్తి   ప్రభుని మార్గాన్ని సిద్దం చేయమని చాటుచున్నాడు. ఎడారి నివాస యోగ్యం కాని ప్రదేశం. ఎడారి అంటే ఎటువంటి పంటలకు అనుకూలంగా లేని ప్రదేశం.  ఎడారి అనేది మతపరమైన పనులకు  వాడబడుతుంది.   ఆరోజులలో  యోహను యూదయ దేశపు  ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము  సమీపించినది. మీరు హృదయ పరివర్తన చెందుడు చెబుతున్నాడు. . యోహను ఎందుకు ఏడారికి వెళ్ళాడు? ఆయన అక్కడ ఏమి చేస్తున్నారు? ఏడారికి దేవుని అనుగ్రహం పొందటానికి వెళుతుంటారు, దేవునితో మాటలాడటానికి  మరియు శోధించబడానికి వెళుతుంటారు. పరీక్షింపబడటానికి వెళుతుంటారు. బైబుల్లో అనేక మంది ఇటువంటి ఉద్దేశ్యములతోనే ఏడారికి వెళుతుంటారు. యోహను ఎడారిలో దేవుని అనుగ్రహం పొందివున్నాడు. అక్కడ ప్రజల కొరకు  ఒక  సందేశం దేవుని నుండి పొందుతున్నాడు. అదే ప్రభువు మార్గమును సిద్దము చేయడం. హృదయ పరివర్తన పొందటం.  దానికి గుర్తుగా ఆయన బాప్తిసం ఇస్తున్నాడు. యోహాను ఇచ్చే బాప్తిసం మారుమనస్సు పొందుటకు అని మనకు తెలుస్తుంది. ఇది పశ్చాత్తాపాన్నీ తెలుపుతుంది.

హృదయ పరివర్తనకు   పశ్చాత్తాపం మొదటి మెట్టు. పశ్చాత్తాపం మనకు ఎప్పుడు కలుగుతుంది?.   ఎప్పుడైతే మనం చేసిన పని, లేక చెప్పిన మాట, లేక ఆలోచించిన ఆలోచన పొరపాటని లేక తప్పు అని గ్రహించి, ఆ విధంగా చేయడం వలన,  మనలను ప్రేమించిన వ్యక్తి ని బాధ పేడుతున్నామని తెలుసుకొని ఆ మార్గము నుండి మరలినప్పుడు మాత్రమే అది పశ్చాత్తాపం అవుతుంది. పరివర్తనకు మార్గం అవుతుంది. 

ఈ పరివర్తన గురించి మనం పాత నిబందనలో కూడా   చూస్తాము. 1. సొదొమ , గోమర్రోలకు ప్రకటించిన హృదయ పరివర్తన, 2. నినేవేకు ప్రకటించిన  హృదయ పరివర్తన. ఇక్కడ మనం చూసేది వారు హృదయ పరివర్తన చెందినచో వారు క్షమించ బడుతారు. అందుకే నినివే ప్రజలు  బూడిద మీద పోసుకొని , గోనె తాల్చి వారు పశ్చాత్తాపం ప్రకటించారు, రక్షించబడ్డారు. కాని ఇక్కడ యోహను ప్రకటించే హృదయ పరివర్తన కేవలం గోనె తాల్చడం, బూడిద మీద పోసుకోవడం గురించి కాదు. వారు  చేసేపనులు పశ్చాతాపన్ని తెలియచేయాలని చెబుతున్నాడు. 

ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని  ఎడారిలో  ఒక వ్యక్తి ఎలుగెత్తి  పలుకుచుండెనని  ఈ యోహనును గూర్చియే యోషయా ప్రవక్త  పలికింది. యోహను హృదయ పరివర్తన గురించి మాటలాడుతున్నాడు అంటే వారు కేవలం బప్తిస్మం తీసుకోవడం మాత్రమే కాదు, వారు చేయవలసిన పనులను గురించి చెబుతున్నాడు. ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు అని అంటున్నాడు. ఏడారిలో మార్గమును సిద్ధం చేయడం ఏమిటి? ఎందుకు అంటే? ఎడారి అనేది ఒక గమ్యం అంటు లేకుండా ఉంటుంది. అటువంటి ప్రదేశంలో మార్గమును సిద్ధం చేయడం అంటే అగమ్యగోచరంగా ఉన్న మన జీవితాలకు ఖచ్ఛితముగా మార్గాన్ని అలవరచుకోవడం అవసరం అని తెలుపుతుంది.  ఎప్పుడైతే  మన జీవితాలకు ఒక నిర్ధిష్టమైన మార్గంను సిద్ధం చేయగలుగుతామో, అప్పుడు మనం యేసు ప్రభువును ఆహ్వానించవచ్చు. 

యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుమునకు తోలుపట్టిని కట్టుకొని, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను. కొన్ని వందల సంవత్సరాల తరువాత యిస్రాయేలు ప్రజలు ఒక ప్రవక్తను చూస్తున్నారు. వారు  ప్రవక్తల గురించి విన్నారు కాని ప్రవక్త ఎలా ఉంటారో చూడలేదు. ఇప్పుడు వారు యోహను రూపంలో ఒక ప్రవక్తను చూస్తున్నారు. మనం ఏలియా ప్రవక్త ఎలా ఉండేవాడో వింటాము. అదే విధంగా యోహనును చూడటం ద్వారా ఒక ప్రవక్తను వారు తెలుసుకున్నారు. యోహనులో మనం చూసేదీ కేవలం ఒక ప్రవక్తను మాత్రమే కాదు. దేవునికోసం పూర్తిగా సంసిద్ధంగా ఉన్న వ్యక్తిని. తన యొక్క వస్త్రధారణ , తన ఆహారం అన్నీ కూడా తాను ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 

యూదయా దేశస్థులందరు, యెరూషలేము పురవాసులెల్లరు అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ, యొర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానము ఇచ్చుచుండెనుమనం అందరు తప్పు చేయడం గురించి తెలుసు, మనం ఏమైనా పొరపాటు చేసినప్పుడు ఎవరిని అయిన బాధ పెట్టి ఉండవచ్చు. అది ఎప్పుడైతే మనకు అర్ధం అవుతుందో మనము బాధ పడుతుంటాము. నిజానికి అటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే మనం పశ్చాతాపం కలిగిఉన్నట్లు. యోహాను దగ్గర జ్ఞాన స్నానం పొందడానికి వచ్చిన వారు అందరూ వారి వారి పాపాలను తెలుసుకొని, దేవున్ని వారి పనుల ద్వారా బాధ పెట్టము అని తెలుసుకొన్నవారు. మారు మనస్సు పొందుటకు సిద్దంగా ఉన్నవారు. యోహాను ఇచ్చిన బాప్తిసం ద్వారా వారి పాపాలు తీసివేయబడటం లేదు. కానీ దేవునికి వారి మారు మనస్సు తెలియజేస్తున్నారు. వారి పాపాలు ఎలా క్షమించబడతాయి? దాని గురించి యోహాను చెబుతూ యేసు ప్రభవు రాకను ప్రకటిస్తున్నాడు. 

"నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను. నేను మిము నీటితో స్నానము చేయించితిని. కాని అయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును" అని యోహాను ప్రకటించుచుండెను. యేసు ప్రభువు దైవత్వం గురించి యోహాను వివరిస్తూ ఎలా ఆయన మన పాపములను తీసివేయబోతున్నాడో వివరిస్తున్నారు. యోహాను గొప్ప ప్రవక్త అయినప్పటికీ ప్రభువు ముందు తాను ఏమిటో తెలిసిన యాదార్ధవాది. ఎప్పుడు తన వాస్తవ స్థితిని తెలుసుకొని జీవించిన వ్యక్తి. ఆయనే ప్రభువు గురించి " నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని చెబుతున్నారు. ఎంతో నిష్టతో,  పరిశుద్దత కోసం కఠినమైన దీక్ష జీవితం జీవిస్తున్న ఆయనే, ప్రభువు పాదరక్షల వారును కూడా విప్పుటకు నేను యోగ్యుడను కాను అంటున్నారు. 

ఇంత మహోన్నతుడైన ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏమి చేయబోతున్నాడు? మనకు పవిత్రాత్మతో జ్ఞాన స్నానం ఇస్తాడు. మన పాపములను ఆయన పవిత్రాత్మతో ఇచ్చే జ్ఞానస్నానం తీసువేస్తుంది. అంతే కాక పవిత్రాత్మ మనకు తోడుగా ఉంటుంది. పవిత్రాత్మ ప్రభావం వలన మనిషి పూర్తిగా మారిపోయి ప్రభువు చెప్పినట్లు జీవిస్తూ, పాప క్షమాపణ పొంది, ప్రభువు కోసమే జీవించేలా మారుతారు. 

లూకా 5:17-26

 లూకా 5:17-26 

ఒకనాడు ఆయన బోధించుచుండగా యేరుషలేము, గలిలీయ, యూదయాలోని గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులును, ధర్మశాస్త్ర బోధకులును ఆయన ఎదుట కూర్చుండియుండిరి. స్వస్థతనిచ్చు ప్రభుశక్తి ఆయనయందుండెను. అపుడు కొందరు పక్షవాత రోగినొకనిని పడకపై మోసికొని వచ్చి, ఇంటిలోపల బోధించుచున్న ఆయనచెంతకు చేర్చ ప్రయత్నించిరి. ఆ ఇల్లు జనసమూహముచే క్రిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అపుడు వారు ఇంటిపైకి ఏక్కి, కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందుట దించిరి. యేసు వారి విశ్వాసమును చూచి, "ఓయీ! నీ పాపములు క్షమింపబడినవి" అని అతనితో చెప్పెను. అందుకు పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు "దైవ దూషణములు పలికెడి ఇతడెవరు?దేవుడు తప్ప మరెవ్వరు పాపములు క్షమింపగలరు?' అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి "మీ హృదయములలో ఏల తర్కించుకొనెదరు? ఏది సులభ్యతరము? నీ పాపములు క్షమింబడినవి అనుటయా? కాని, భూలోకమునయ మనుష్యకుమారునకు పాపములు క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును"అని చెప్పి, పక్షవాత రోగితో "నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నాను" అని పలికెను. ఆ పక్షవాత రోగి తక్షణమే లేచి, పడకను తీసుకొని దేవుని స్తుతించుచు తన ఇంటికి వెళ్ళెను. వారందరు ఆశ్చర్యచకితులై భయపడుచు "నేడు మనమెట్టి వింతలను చూచితిమి" అని దేవుని పొగడిరి. 

పరిశీలన : యేరుషలేము, గలిలీయ, యూదయాలోని గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులును, ధర్మశాస్త్ర బోధకులును  యేసు ప్రభువు ఎదుట ఆయన బోధించుచుండగా కూర్చొని ఉన్నారు. ఎందుకు వీరు అక్కడ కూర్చొని ఉన్నారు? ఆయన బోధనలు ఆలకించడానికే వీరు వచ్చారా? ఈ ప్రశ్నలు మనం అడిగినప్పుడు మనకు వచ్చే సమాధానం ఏమిటి అంటే ఆయన మాటలు వినడానికి వారు రాలేదు. వీరు మతపరమైన నాయకులు. వీరు ఎక్కువ సమయాన్ని వారి నియమాల గురించి సంప్రదాయల గురించి మాటలాడేవారు. వారు మనిషి చేసిన నియమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. కాని దేవుని వాక్కుకు ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. యేసు ప్రభువు బోధనలను వారికీ వ్యతిరేఖముగా ఉన్నవి అని వారు అనుకునేవారు. యేసు ప్రభువు బోధనలను వినడానికి ప్రజలు గుంపులు గుంపులుగా రావడం వారని ఒక రకమైన భయం లోనికి నెట్టింది. కనుక వారు యేసు ప్రభువు మాటలను తప్పు పట్టడానికి, ఎవరెవరు ఆయన మాటలను వింటున్నారని తెలుసుకోవడానికి వస్తున్నారు.  

స్వస్థతనిచ్చు ప్రభుశక్తి ఆయనయందుండెను. యేసు ప్రభువు చేసిన అన్ని  పనులు  దేవుని తోడ్పాటుతో జరుగుతున్నావి. ఆయన చేసిన పనులు మాత్రమే కాదు, ఆయనతో తండ్రి, పవిత్రాత్మ ఎప్పుడు తొడుగానే ఉన్నారు. ఆయన చేసిన ప్రతి పని ఆయన శక్తినే కాదు, దేవుని శక్తి తెలియజేస్తుంది. అందుకే ఆయన చేసే పనులు దైవ కార్యములే. ఆయన మాటలు కూడా దైవ మాటలే. అందుకే ఆయన ఒక మాట చెప్పగానే అది జరుగుతుంది. ఇది ఆదిలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇలానే జరుగుతుంది. 

కొందరు పక్షవాత రోగినొకనిని పడకపై మోసికొని వచ్చి, ఇంటిలోపల బోధించుచున్న ఆయనచెంతకు చేర్చ ప్రయత్నించిరి. ఆ ఇల్లు జనసమూహముచే క్రిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అపుడు వారు ఇంటిపైకి ఏక్కి, కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందుట దించిరి. ఆనాటి కాలంలో యిస్రాయేలు ప్రజలు ఇళ్ల కప్పును మట్టి మరియు ఎండిన గడ్డితో కలిపిన మిశ్రమంతో చేసేవారు. ఆ కప్పును తీసివేసి పక్షవాత రోగిని ప్రభువు ముందు తీసుకొని వస్తున్నారు. యేసు ప్రభువు ఒక బోధకునిగా వారికి దేవుని గురించి, దైవ రాజ్యం గురించి చెబుతున్నారు.  ప్రజలు అందరు ఆయన బోధనల యందు ఎంత ఆశక్తి కలిగి ఉన్నారో వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తీర్చుకోవడానికి కూడా అంతే  ఆసక్తి కలిగి ఉన్నారు. కారణం ఏమిటి అంటే మెస్సీయ్యా కాలంలో జరుగుతుంది అని వారు వినిన అన్ని స్వస్థతలు యేసు ప్రభువు ద్వారా జరుగుతున్నవి. 

యేసు వారి విశ్వాసమును చూచి, "ఓయీ! నీ పాపములు క్షమింపబడినవి" అని అతనితో చెప్పెను. యేసు ప్రభువు ఆ పక్షవాత రోగి విశ్వాసము చూసి కాదు, అతనిని తీసుకొని వచ్చిన వారి విశ్వాసము చూచి ఆ వ్యక్తితో నీ పాపములు క్షమించబడినవి అని అంటున్నారు. యేసు ప్రభువు ఒక మాట అంటున్నారు అంటే అది వెంటనే జరుగుతుంది. ఆయన మాట్లాడిన వెనువెంటనే అది కార్య రూపం దాల్చుతుంది. కనుక ఆ వ్యక్తి పాపములు క్షమించబడినవి. 

ఈ మాటలను వినిన ధర్మ శాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఖచ్ఛితముగా ఇటువంటి మాటలు ఆయన నుండి వచ్చిన వెంటనే ఆయనను తప్పు పట్టాలని అనుకుంటున్నారు. ఇప్పుడు వారికి  యేసు ప్రభువును తప్పు పట్టుటకు ఒక అవకాశం దొరికింది కనుకనే వారు, ఇతను ఎవరు పాపములు క్షమించడానికి, అది దేవుడు మాత్రమే చేయగలడని, దేవుడు చేసే పని, ఇతను తాను చేస్తాను అని అంటున్నాడు అంటే ఇది దైవ దూషణం అని వారు వారిలో వారు తర్కించుకొంటున్నారు. అది గ్రహించిన యేసు ప్రభువు తనకు ఉన్న శక్తిని గురించి చెప్పడమే కాదు. ఆయనకు మానవుని పాపములను క్షమించే అధికారం ఉన్నదని తెలియజేస్తున్నాడు. అది ఎలా అంటే, ఆ వ్యక్తి పాపము వలనే ఆ సమస్య వచ్చినట్లయితే, పాపము తొలగిన వెంటనే తన ఆరోగ్యం పొందగలుగుతాడు.  ఆ వ్యక్తి పాపముల క్షమించబడితేనే  స్వస్థత పొందుతాడు. అందుకే యేసు ప్రభువు "నీ పడకను ఎత్తుకొని ఇంటికి వెళ్లిపో" అని చెబుతున్నాడు. ఆయన చెప్పినట్లే ఆయన చేస్తున్నాడు. దీని ద్వారా యేసు ప్రభువు, దేవుడు చేసిన పనులు చేస్తాడని ఆయన దేవుడని మనకు అర్ధం అవుతుంది. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు మొదటి నుండి మీ దైవత్వాన్ని చూపిస్తున్నకాని మేము మాత్రం అనేక అనుమానలతో , అపనమ్మకంతో మీ మిమ్ములను అగౌరపరిచాము. మీమాటలకు, చేతలకు తేడా లేకున్న మేము మాత్రము మీ మాట వెంటనే కార్య రూపం దాల్చుతున్నది అని గ్రహించడంలో విఫలం అయ్యాము. ప్రభువా ధర్మ శాస్త్ర భోదకులు , పరిసయ్యుల వలె, సాంప్రదాయాలకు , మనిషి చేసిన నియమాలకు ప్రాముఖ్యత ఇచ్చి దైవవాక్కును అశ్రద్ద చేశాము. ప్రభువా పక్షవాత రోగిని క్షమించినట్లు, మమ్ములను కూడా క్షమించండి. మేము మీ దైవత్వాన్ని ఎప్పుడు అనుభవిస్తూ మీ అనుగ్రహాలు పొందేలా మమ్ము దీవించండి. ఆమెన్ 

మత్తయి 18:12-14

 మత్తయి  18:12-14

ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబదితొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా? అది దొరికినపుడు తప్పిపోని తక్కిన తొంబది తొమ్మిదింటికంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయమముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒకడైనను నాశమగుట పరలోకమదుండు మీ తండ్రి చిత్తము కాదని తెలిసికొనుడు. 

ధ్యానము:  యిస్రాయేలు ప్రజలు దేవున్ని వారి కాపరిగా చూస్తున్నారు. ప్రవక్తలు ముఖ్యంగా ఏహెజ్కెల్, యోషయా మరియు యిర్మీయా ప్రవక్తలు అనేక పర్యాయాలు దేవున్ని కాపరి అని సంబోధిస్తున్నారు. కాపరి తప్పిపోయిన గొర్రెలను వెదకి  మరల తన మందలోనికి  తీసుకొని వస్తాడు. మెస్సయ్యా తప్పిపోయిన వారిని మరల దేవుని దగ్గరకు తీసుకొని వస్తాడు అని వారు నమ్మేవారు. యేసు ప్రభువు కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువు మాత్రమే కాపరి కాదు, తప్పి పోయిన వారిని తిరిగి యేసు ప్రభువు వద్దకు తీసుకువచ్చే వారు అందరు కాపరిగా ఉంటారు. యేసు ప్రభువు తప్పిపోయిన వారిని వెదకి వారి, సమస్యలను తీర్చి మరల వారిని తండ్రి దగ్గరకు తీసుకురావడానికి, ఒకరి వద్దకు కాదు ప్రతి వ్యక్తి వద్దకు వస్తున్నారు. అందరినీ తండ్రి దగ్గరకు తీసుకురావడానికి చేయవలసినవి అన్ని కూడా చేస్తున్నారు. 

ఎవరు తప్పి పోయారు? నీతిని తప్పిన ప్రతి వ్యక్తి , పరలోక రాజ్యానికి దూరంగానే ఉన్నారు వారు అందరు తప్పి పోయిన వారే.  అటువంటి వారి అందరినీ ప్రభువు తన వద్దకు తీసుకు వస్తున్నారు, పరలోక రాజ్యంలో స్థానం కలిపిస్తున్నారు. వీరు నీతిని తప్పుటకు అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ సార్లు ఇలా జరుగుటకు యిస్రాయేలు నాయకులే కారణం అయ్యారు. ఎందుకు వారు తప్పి పోయారు అని ప్రశ్నించినప్పుడు అనేక సమాధానాలు మనకు వస్తాయి. వాటిలో ముఖ్యమైనవి అనేక మంది అవకాశం లేని వారు వున్నారు.  వారని దేవునికి సంబంధించిన అన్ని విషయాలలో దూరంగా పెట్టడం జరిగినది. కొంతమంది వారి స్వల్ప ఆనందం కోసం వెళ్ళి తిరిగి రాలేక తప్పి పోయిన వారు ఉన్నారు. ఎటువంటి కారణాలతో వారు దూరంగా ఉన్న,  వారిని యేసు ప్రభువు మరల దేవుని దగ్గరకు తీసుకొని వస్తున్నారు. ఎవరిని కోల్పోవడం ప్రభువుకు ఇష్టం లేదు. అందుకె యేసు ప్రభువే తండ్రితో నీవు నాకు ఇచ్చిన వారిని, ఎవరిని కొల్పోననీ అంటున్నారు. వారి కోసం ప్రార్ధన చేస్తున్నారు. 

యోషయ 40: 11 లో "ఆయన కాపరివలె తన మందను మేపును. గొర్రె పిల్లలను తన బాహువులతో కూర్చి, రొమ్మునయనించుకొని మోసికొనిపోవును."కాపరి వలె ఆయన తన మందను మెపును, ఆయన తన గొర్రె పిల్లనను తన వడిలో ఆడించును. యెహెజ్కెల్ 34:1 "యిస్రాయేలు కాపరులారా మీకు అనర్ధము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారేగాని గొర్రెలమందలను మేపుటలేదు…  తప్పిపోయిన వానిని వెదకి తొలుకొని వచ్చుట లేదు పైగా వారి పట్ల క్రూరముగా , కఠినముగా ప్రవర్తించుచున్నారు." నా గొర్రెల కోసం వెదుకుదును.   ప్రభువే నా కాపరి అనే కీర్తన అందరికీ ఇష్టం ఎందుకంటే ప్రభువు మనలను ఎంత కాపాడుతాడో ఎటువంటి బయళ్ళు దగ్గరకు తీసుకుపోతారో చూస్తాము. ప్రభువు మనకు కాపరి అయితే మనలను ఆయన ఏ బాటలో తీసుకుపోతున్న చింత లేకుండా ఉండవచ్చు. కాని యిస్రాయేలు కాపరులు అలా లేరు అనే విషయం యెహెజ్కెల్ గ్రంధంలో చూస్తాము. తప్పిపోయిన వారి పట్ల ఈ కాపరులు కఠినముగా వ్యవహరించారు. వారిని సమాజంలో తక్కువగా చూడటం మొదలపెట్టారు, అగౌరపరిచారు. వారిని అపవిత్రులుగా చేశారు. ఇటువంటి కారణాలే యేసు ప్రభువు సమయంలో కూడా ఉన్నాయి. 

ఒక వ్యక్తిని కోల్పోవడం  కూడా యేసు ప్రభువుకి  ఇష్టం లేదు. అనేకమంది కాపరులు వారి గౌరవం గురించి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు. కాపరిగా ఉండటాన్ని అంత గొప్ప పనిగా చూసేవారు కాదు. కాని యేసు ప్రభువు మంచి కాపరిhttps://amruthavellaturi.blogspot.com/2023/03/blog-post_48.html. ఒక గొర్రె మంద నుండి బయటకు పోతే మంద మొత్తము పోయినట్లుగా ఆయన బాధపడుతారు. అది దొరికినంత వరకు ఆయన దాని కోసం వెదకుతారు. దొరికినంత వరకు వేదకుతానే ఉంటారు. ఎందుకు ప్రభువు అంతగా వెదకుతున్నారు? ఒక వ్యక్తి  తప్పిపోయిన సమాజం మొత్తం దాని బాధను అనుభవిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా దేవుని సృష్టే. దేవుని బిడ్డే. కొన్ని సార్లు ఒక వ్యక్తి తప్పు చేయడం వలన సమాజం మొత్తం పర్యవసానం అనుభవిస్తుంది.  యిస్రాయేలు నాయకులు తప్పు చేసినప్పుడళ్ల అనేక బాధలు ప్రజలు అనుభవించారు. 

  యేసు ప్రభువు చెప్పిన ఈ  ఉపమానం చిన్న పిల్లల మీద, బలహీనులుగా ఉన్న మీద ప్రభువు కరుణ ఎలా ఉన్నదో మనం తెలుసుకోవచ్చు.   అధికారులు, నాయకులు  ఎవరు కూడా ఈ చిన్న బిడ్డలను కోల్పోవడానికి కారణం కాకూడదు అని ప్రభువు కోరుతున్నారు.  ఈ తప్పిపోయిన వారిని ఎలా మరలా సంఘం లోనికి తీసుకొని రావాలి. వారిని మరల తీసుకొనివచ్చినప్పుడు  ఎవరు అడ్డుకోవలదు అని ప్రభువు  చెబుతున్నారు. అందుకే యేసు ప్రభువు తప్పి పోయిన వారి వద్దకే వెళుతున్నారు, పాపులు, సుంకరులు మొదలగువారితో మాటలడుతున్నారు. వారిని అడ్డుకోవాలనుకున్న వారిని ముఖ్యముగా పరిసయ్యులను, ధర్మ శాస్త్ర బోధకులను  వారిస్తున్నారు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా ! మీరు మంచి కాపరి. మీరు తప్పి పోయిన మమ్ములను వెదకి మరలా తండ్రి వద్దకు చేర్చుటకు చాలా కృషి చేశారు. ప్రభువా నేను తప్పి పోవుట మీకు ఇష్టం లేదు అని తెలుసుకొని ఎంతో ఆనందంగా ఉన్నాము. ప్రభువా మీరు ఎలా అయితే ఎటువంటి కారణాలతో తప్పిపోయిన మమ్ము చీదరించుకోకుండా మేము మీతో ఉండాలిన కోరుకుంటున్నారు. కొన్ని సార్లు మా స్వార్ధం కోసం, అవసరాల కోసం కూడా మేము దూరంగా వెళ్ళి పోతున్నాము, అటువంటి సమయాలలో మీ ప్రేమను గురించే అనుగ్రహం మాకు దయచేయండి. మీ ప్రేమను గుర్తించి, మీ వద్దకు తిరిగి వచ్చే వారిని మేము ఎప్పుడు అడ్డుతగలకుండా ఉండే మంచి మనసు మాకు దయచేయండి. ఎవరు మీ నుండి తప్పి పోవుటకు మేము కారణం కాకుండా మా జీవితాలను మలచండి. ప్రభువా తప్పి పోయిన వారిని తిరిగి పొందినప్పుడు మీకు ఉండే ఆనందంలో మమ్ములను కూడా భాగస్వాములను చేయండి. ఆమెన్ 

మత్తయి 11:28-30

 మత్తయి  11:28-30

భారముచే అలసిసొలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు  విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాదుశీలుడనియు, వినమ్రహృదయుడననియు మీరు నా నుండి మీరు నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలన, నా కాడి  సులువైనది, నా బరువు తెలికైనది. 

ధ్యానం : "భారముచే అలసిసోలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను" యేసు ప్రభువు చెబుతున్న ఈ భారము ఏమిటి ? నా యొద్దకు రండు అని ప్రభువు చెబుతున్నాడు. యేసు ప్రభువు ప్రజలకు ఒక ఆహ్వానం ఇస్తున్నారు. ఆ ఆహ్వానం ఎందుకు? ఎందుకు ప్రభువు తన యొద్దకు  రమ్మంటున్నారు? ఆయన ఏమి ఇస్తాను అంటున్నారు? ప్రజలు ఎందుకు అలసిసోలసియున్నారు? నా కాడి మీరు ఎత్తుకొనుడు అని ప్రభువు చెబుతున్నారు. ఆయన కాడి అంటే ఏమిటి? నేను సాదుశీలుడననియు, వినమ్రహృదయుడననియు అని నా నుండి నేర్చుకోండి అని ప్రభువు చెబుతున్నారు. ఆయన నుండి ఏమి నేర్చుకోమని ప్రభువు చెబుతున్నారు? నా కాడి సులువైనది, నా బరువు తెలికైనది అని ప్రభువు చెబుతున్నారు. ఏమిటి  ఆయన కాడి? ఆయన బరువు ఎలా తేలికగా ఉంటుంది? ఈ సువిశేష భాగం చాలా చిన్నది అయిన మనకు చాలా  ప్రశ్నలు, జవాబులు ఇక్కడ దొరుకుతాయి. 

ప్రజలు భారముచే అలసిసొలసి ఉన్నారు. ఏమిటి ఈ భారము? పరిసయ్యులు , ధర్మ శాస్త్ర భోదకులు ఎలా ప్రజల మీద మోయలేని భారమును మోపుతున్నరో మనం పరిశుద్ద గ్రంధంలో చూస్తాము. మోయలేని భారం వారు ప్రజల మీద మోపుతున్నారే కాని, వారికి సహాయ పడుటకు వారి చిటికిన ఏలును కూడా వారు కదపరు అని ప్రభువు పలుకుతున్నారు. ఇక్కడ భారము అంటే వారి సాంప్రదాయాలు, నియమాలు మాత్రమే కాదు. వారి జీవితములో వారు అనుభవిస్తున్న అనేక మైన జీవిత బాధలు కూడా ఉన్నవి. ఇక్కడ ఇంకొక అర్ధం కూడా ఉన్నది, వారు అవలంభిస్తున్న తోరా , పవిత్ర గ్రంధం లోని మొదటి ఐదు గ్రంధాలు. వీటిని పాటిస్తున్నాము అనే అపోహలో, వారికి ఉన్న నియమాలను, అలివికాని విధంగా  అనేక రేట్లు పెంచుకుంటూ పోయారు. ఈ భారము కూడా ఈ ప్రజల మీద ఉంది. ఈ భారములతో ప్రజలు అలసి పోయారు. అందుకే ప్రభువు భారముచే అలసిసోలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకి రండి అంటున్నారు. 

"నా యొద్దకు రండు నేను మీకు విశ్రాంతి నొసగెదను" ఇది ఒక గొప్ప ఆహ్వానము, ఎవరికో ఒకరికి కాదు, ప్రతి ఒక్కరికి ఈ ఆహ్వానం ఇస్తున్నారు. ఇది సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంధంలో, వివేకవంతురాలైన స్త్రీ ఇచ్చిన, విందుకు ఆహ్వానం ఇచ్చినట్లుగా ఉన్నది. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన వారు, ఇప్పటివరకు పొందిన భారాన్ని వారు తొలగించుకోవచ్చు. అది ఎటువంటి భారం అయిన కావచ్చు. పాపం భారంతో ఉన్నవారు, ఆయన వద్దకు వస్తే వారి పాపముల భారం తొలగిస్తారు. ధర్మ శాస్త్ర భోదకుల నియమాలతో వారి చెప్పిన వాటిని చేయలేక నిరాశ, నిస్పృహలో ఉన్న వారు  ఆయన వద్దకు వచ్చి సేదతీరవచ్చు. దేవుని అనుగ్రహం కోసం వెదకి వేసారిన వారికి ఇది ప్రభువును కనుకగొని ఆయనతో ఉండుటకు ఇది గొప్ప అవకాశం. 

నా కాడిని మీరు ఎత్తుకొనుడు అని ప్రభువు చెబుతున్నారు. కాడి అంటే రెండు ఎద్దులను లేక పశువులను పొలం దున్నటకు లేక ఏమైనా మోయుటకు జత చేస్తూ ఉపయోగించేది. బండి బరువు మొత్తం కూడా కాడి మీదనే ఉంటుంది. యేసు ప్రభువు నాకాడి  మీరు ఎత్తుకొనుడు అని అంటున్నప్పుడు, వారు ఎటువంటి కాడిని మోస్తున్నారో ఆయనకు తెసులు. కాడి దించేది కేవలం వారి గమ్యం చెరినప్పుడే. ఈ ప్రజలు సాంప్రదాయాలు, నియమాలు, బలులు అన్ని  పాటిస్తున్నప్పటికి వారి గమ్యం అయిన దేవున్ని చేరడం లేదు. ఈ కాడి చాలా భారంగా ఉన్నది. ఇటువంటి కాడి కంటే యేసు ప్రభువుని కాడిని ఎత్తుకొనమని ప్రభువు చెబుతున్నారు.  నా కాడి  సులువైనది, నా బరువు తెలికైనది. అని ప్రభువు చెబుతున్నారు. ఎందుకు ప్రభువు కాడి సులువైనది? ఎందుకంటే ప్రభువు దేవుని ఆజ్ఞలను పెంచి ప్రజలకు ఇవ్వడంలేదు. వారిని కఠిన విధానాలు పాటించమని చెప్పడంలేదు. ప్రభువుని విధానం చాలా సులువైనది. సాంప్రదాయాలు, నియమాలు, బలులు, వీటి అన్నింటి కంటే సులువైనది. ఎందుకంటే ఆయన విధానం ప్రేమ, కరుణ, క్షమాపణ, మారు మనసు. ఈ కాడిని ఎత్తుకుంటే గమ్యం చేరడం సులభం. గమ్యం వారి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఆయనే ప్రతిఒక్కరి చివరి గమ్యం. 

 సాదుశీలుడనియు, వినమ్రహృదయుడననియు మీరు నా నుండి మీరు నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. యేసు ప్రభువు దగ్గరకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి  ఆయన ఎంత కరుణామయుడు అనే విషయం తెలుస్తుంది. యేసు ప్రభువు ఉపమానాలు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన వద్దకు వచ్చిన వారిని, ఆయనను కాదు అన్నవారిని, ఆయనను కొట్టిన వారిని, ఆయనతో తిరిగి ఆయన ఎవరో తెలియదు అనిన వారిని, ఆయన క్షమించిన విధానం, వారికి ఆయన చూపించిన ప్రేమ, ఆయన సాదుశీలుడని, వినమ్రహృదయుడని తెలియజేస్తుంది. యేసు ప్రభువు మనలను ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోమంటున్నారు. తెలుసుకోవడమే కాక నేర్చుకోమంటున్నారు.  ఇది మనం యేసు ప్రభువు వద్దకు వెళ్ళితే జరుగుతుంది. అపుడు మన ఆత్మల యందు విశ్రాంతి పొందుతాము అని చెబుతున్నారు. అంటే ఆయన దగ్గరకి వెళితే మనం నిశ్చింతగా ఉండవచ్చు.                       

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు ఎంత కరుణామాయులు, అనేకమంది మిమ్ములను అవమానించిన కాని, వారిని క్షమించారు. మీ కారుణ్యం ఎంతో గొప్పది. మేము అనేక సమస్యలతో, బాధలతో ఉన్నాము. వాటి నుండి సేదతీరాలని ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. సేద తీరాలని, విశ్రాంతి పొందాలని మేము చేసిన అనేక ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నిజమైన విశ్రాంతి మేము పొందలేకపోతున్నాము. ప్రభువా! నేను మీ ఆహ్వానాన్ని స్వీకరించి మీ వద్దకు వస్తున్నాను. మీ నుండి వినమ్రతను, సాదుశీలతను నేర్చుకొనే ఆవకాశం ఇవ్వండి. ప్రేమ, కరుణ, క్షమాపణ అనే మీ కాడిని మేము కూడా నేర్చుకొని అనుకరించేలా చేయండి. ప్రభువా మీరు చెబుతున్న ఆత్మ యందు విశ్రాంతిని మాకు చేయండి. ఆమెన్ 

మత్తయి 11:11-15

 మత్తయి  11:11-15

"మానవులందరిలో స్నాపకుడగు  యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున అత్యల్పుపుడు అతనికంటే గొప్పవాడు. స్నాపకుడగు యోహాను కాలమునుండి నేటివరకును పరలోక రాజ్యము హింసకు గురియగుచున్నది. మరియు దుష్టులు దౌర్జన్యముతో కబలింప యత్నించుచున్నారు. యోహాను కాలమువరకు ప్రవక్తలందరు దీనినే ప్రవచించిరి. ధర్మ శాస్త్రము దీనినే బోధించెను. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో, రాబోవు ఏలియా ఇతడే. వినులున్నవాడు వినునుగాక!

ధ్యానం :"మానవులందరిలో స్నాపకుడగు  యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." యేసు ప్రభువు బాప్తిస్త యోహాను గురించి మాటలాడుతున్నారు. కాని ఆయనను అప్పటికే అక్కడ లేరు, ఆయనను హెరోదు బంధించి చెరసాలలో ఉంచారు. ఆయన చేసిన నేరం ఏమి లేదు, కేవలం హెరోదు తన సోదరుని భార్యను పెళ్లి చేసుకోవడాన్ని ప్రశ్నించడమే, ఆయనను బంధించబడేలా చేసింది. మానవుని గొప్పతనాన్ని దేవుడు గణించినప్పుడు యోహాను కంటే గొప్ప వారు ఎవరు లేరు,  ఆయన ప్రభువుని ముందుగా వచ్చి ప్రభువును ప్రజలకు చూపించాడు. ప్రవక్తలు, పితరులు నాయకులు, న్యాయాదిపతులు వీరి అందరి కంటే యోహాను గొప్పవాడు. మానవులందిరిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు. ఆయన ప్రభువును ఈ లోకానికి ఆహ్వానించడానికి, ఎంతో కఠినమైన నిష్టతో జీవించాడు. అతను తాను హింసించబడతాడని, తెలిసికూడా న్యాయానికి కట్టుబడ్డాడు. అబ్రహాము కూడా ప్రాణానికి భయపడి భార్యను సోదరి అని చెప్పాడు. యోహాను యొక్క జీవితం ఎంత గొప్పది అంటే మెస్సీయ్యా ఎవరో ఆయనికి మాత్రమే తెలుసు. ఆయన ఎక్కడ ఉన్నాకాని గుర్తు పట్టగలరు. ఆయన పవిత్రత అందుకు దోహద పడింది. ప్రభువే పవిత్రత కాబట్టి, యోహాను పవిత్రత ప్రభువును కనుకొనడానికి దోహదపడింది.  ఆయనలో ఉన్న వినయం ఎంత గొప్పది అంటే తన కంటే చిన్నవాడు, తన చుట్టమైన యేసు ప్రభువును ఈ లోకానికి రానున్న మెస్సీయ్యాగా ప్రకటించడానికి సందేహించలేదు. తన పవిత్రత గురించి  కాని, తన కఠినమైన నిష్టతో జీవించిన  జీవితం గురించి కాని, గర్వం ఏ కోశన లేని వాడు.

అయినను పరలోక రాజ్యమున అత్యల్పుపుడు అతనికంటే గొప్పవాడు. స్నాపకుడగు యోహాను కాలమునుండి నేటివరకును పరలోక రాజ్యము హింసకు గురియగుచున్నది. మరియు దుష్టులు దౌర్జన్యముతో కబలింప యత్నించుచున్నారు. ఇంత గొప్ప వాడు అయిన యోహాను కూడా పరలోక రాజ్యంలో అత్యల్పుడు. పరలోక రాజ్యం లోని పవిత్రత, ఆ ఆనందం, ఆ అనుగ్రహం ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు. మలాకి ప్రవక్త 4 వ అధ్యాయం 5 వ వచనంలో "ఆ దినము రాక మునుపే ఏలియా ప్రవక్తను మీ వద్దకు పంపుదును" అని ప్రవచిస్తున్నాడు. అందుకే యిస్రాయేలు ప్రజలు వారి అన్ని ముఖ్యమైన  పండుగలకు, వారితో పాటు ఒక ఆసనాన్ని ఖాళీగా ఏలియా కోసం అంటిపెడుతారు. మలాకి మాటల అర్ధం లూకా సువార్త మొదటి అధ్యాయం 17 వ వచనంలో చూస్తాము. "అతడు ఏలియా ఆత్మయును, శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడచును. తల్లి దండ్రులను, బిడ్డలను సమాధానపరచును. ఆవిధేయులనౌ నీతిమంతుల  మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్దులైన  ప్రజలను సమాయత్త పరచును"

స్నాపకుడగు యోహాను కాలమునుండి నేటివరకును పరలోక రాజ్యము హింసకు గురియగుచున్నది. మరియు దుష్టులు దౌర్జన్యముతో కబలింప యత్నించుచున్నారు. పరలోక రాజ్యం హింసకు గురి అవడం యోహాను దాని గురించి భోదస్తున్నప్పటి  నుండి మొదలయింది. కొంత మంది దానిని బలవంతముగా లాక్కోవాలని చూస్తున్నారు. ఈ మాటల అర్ధం యోహాను ఈ దేవుని రాజ్యం గురించి మాటలాడుతున్నందుకు ఆయనను బంధించారు. యోహానుద్వారా  జ్ఞానస్నానం పొంది, ఈ దేవుని రాజ్యంలో చేరాలని యూదాయ, గలీలియ ప్రజలు అందరు, తండోపతండాలుగా ఆయన వద్దకు వచ్చి, జ్ఞానస్నానం పొందాలని ఆయనకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారు, కాని ఇలా చేయడం వలన వారు పరలోక రాజ్యంలో చేరరు, వారు మారు మనసు పొందాలి. ప్రవక్తలు, ధర్మ శాస్త్రం మొత్తం కూడా ఈ ప్రభువును ఎలా స్వీకరించాలో చెబుతున్నారు. కాని ప్రజలు త్వరగా దానిని అనుభవించాలి అని ఆయనను ఇబ్బంది పెట్టారు. యేసు ప్రభువు ఈ మాటల ద్వారా తాను రాబోయే రక్షకుడునని, ఏలియా యోహాను రూపంలో వీరి మధ్యకు వచ్చి , ప్రభువును వారికి చూపించిన విషయం తేటతెల్లం చేస్తూ, ఆయనను వారి వారి జీవితలలోనికి ఆహ్వానించవలసిన అవసరం ఏమిటో చెప్పినట్లయింది. యోహానే ఏలియా అని గ్రహించిప్రభువునుమనజీవితాలలోనికి ఆహ్వానిద్దాం. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు  మానవునిగా పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు అని పలుకుతున్నారు. యోహన అంతటి ఘనతను కేవలం మిమ్ములను కనుకొనుట ద్వారానే మాకు తెలుస్తుంది, మీరు మరియ తల్లి గర్భంలో ఉండగా మీ రాకను చూసి, తన తల్లి గర్భంలో ఉండి ఆనందంతో గంతులు వేశాడు. ఈ యొక్క రాకను అందంతో ఆహ్వానించాడు. ప్రభువా మేము కూడా యోహాను వలె మీరు ఎక్కడ ఉన్న తెలుసుకొనే అనుగ్రహం దయచేయండి. అలానే యోహాను వలె మేము కూడా మిమ్ము నిష్టతో, పవిత్రతతో మా జీవితాలలోనికి ఆహ్వానించే విధంగా చేయండి. ప్రభువా! యోహాను, ఏలియా అని మీరు ప్రకటించుచున్నారు. మెస్సీయా వచ్చే ముందు ఏలియా వస్తారు అని పవిత్ర వాక్యం ప్రకటిస్తుంది, ఆ ఏలియా యోహాను అని మీరు ప్రకటిస్తున్నారు. యోహాను మిమ్ములను మెస్సీయా  అని యోహాను గుర్తించారు. మేము కూడా మీరు రక్షకుడు అని గ్రహించి, యోహాను మిమ్ములను ఇతరులకు చూపిన విధముగా, మేము మిమ్ములను అందరికీ తెలియజేసే అనుగ్రహం చేయండి. 

లూకా 1:26-38

 లూకా  1:26-38

తదుపరి ఆరవమాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రధానము చేయబడిన  కన్యక యొద్దకు  పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి, ఆమెతో "అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు"అనెను. మరియమ్మ ఆ పలుకులకు  కలతచెంది ఆ శుభవచనము ఏమిటొ అని ఆలోచించుచుండగా దేవ దూత "మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని  అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" అనెను. అంతట మరియమ్మ "నేను పురుషుని ఎరుగను కదా! ఇది ఎట్లు జరుగును?" అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను: "పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్రశిశువు 'దేవుని కుమారుడు' అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిశబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినదిగదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవమాసము. ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును  లేదు" అంతట మరియమ్మ "ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!" అనెను. అంతట ఆ దూత వెళ్ళి పోయెను

ధ్యానము:   పవిత్ర గ్రంధంలో గాబ్రియేలు దేవదూత, జెకర్యా, మరియమ్మ మరియు పాత నిబంధనలో దానియేలుకు దర్శనం ఇస్తున్నాడు. ఆయన దర్శనమిచ్చిన ప్రతిసారీ ఒక ముఖ్యమైన సందేశమును తీసుకొని వస్తున్నాడు. ఈ సువిశేషభాగంలో నజరేతునగరంలో ఉన్న మరియమాత వద్దకు వస్తుంది. నజరేతు ఒక వ్యాపార నగరం, రోమా సామ్రాజ్యం నుండి వర్తకానికి అనుకూలంగా ఉండే   నగరం.  ఇది మరియమ్మ, యోసేపుల నగరం. అక్కడ మరియ తల్లికి దేవదూత దర్శనం ఇస్తున్నాడు. మరియమ్మ కన్య మరియు యవనప్రాయంలో  ఉన్నది, పెళ్లి కాలేదు. నిశ్చితార్ధం జరిగినది.  దేవుడు ఒక గొప్ప కార్యనికి ఆమెను ఉపయోగించుకొనుటకు, ఆమెలో వున్న ప్రత్యేకత ఏమిటో ఆమె దేవదూతతో మాటలాడిన మాటలు తెలియజేస్తాయి. ఆమెకు ఉన్న పేదరికం, చిన్న వయస్సు ఇవి అన్ని కూడా దేవుని కార్యములో పాలుపంచుకొనుటకు ఆటంకం కాలేదు. దానికి ఆమె వ్యక్తిత్వం ఎంతగానో ఉపయోగపడింది. దేవున్ని మనం విశ్వసిస్తె మనకు ఉన్న బలహీనతలు ఏమి కూడ, దేవుని అనుగ్రహం పొందుటకు ఆటంకం కావు అని తెలుస్తున్నది. దేవుని అనుగ్రహం మనకు వెంటనే కీర్తిని తీసుకురాకపోవచ్చు. మరియమాత దేవునికి ఇచ్చిన మాట ఆమెకు వెంటనే కీర్తిని తీసుకురాలేదు. ఆమెకు అవమానాలు, తిరస్కారాలు కూడా తీసుకువచ్చింది. దేవుని ప్రణాళికకు ఆమే సహకారం, దేవునికి ఆమె విధేయత, దేవుని చిత్తమె ఆమె జీవితంలో జరగాలి అనే ఆమె కోరిక అన్ని కూడా ఆమె గొప్ప తనాన్ని చాటుతున్నవి. నేను దేవుని దాసురాలను అనే ఆమె మాట, ఆమెకు వ్యతిరేక  పరిస్థితిలో కూడా దేవుని ప్రణాళికా జరగాలి అనే ఆమె నిశ్చయించుకుంది. దేవుని ప్రణాళికకు ఆమె విధేయించడం వలన యేసు ప్రభువు ద్వారా రక్షకుడు ఈ లోకానికి మనలను రక్షించుటకు వస్తున్నారు. 

 యేసు అంటే దేవుడు రక్షించును అని అర్ధం. యేసు ప్రభువు తన ప్రజలను పాపముల నుండి రక్షిస్తారు. యోహోషువా యిస్రాయేలు ప్రజలను వాగ్ధాన భూమికి తీసుకుపోతున్నాడు. యేసు ప్రభువు నిత్య జీవానికి తీసుకెళుతారు. అందుకే యేసు ప్రభువు పేరు మీద ప్రజలు స్వస్థత పొందుతున్నారు. ఒక కన్యకకు  యేసు ప్రభువు పుట్టుక ప్రజలకు నమ్ముటకు కష్టముగా ఉండవచ్చు. విశ్వాసము మనకు ఈ విషయముల మీద వెలుగును ఇస్తుంది. గాబ్రియేలు దేవదూత ఈ విషయం వివరిస్తుంది. అది ఏమిటి అంటే దేవునికి అసాధ్యం అనేది ఏమి లేదు. యేసు ప్రభువు, మరియతల్లి కన్య గర్భము ద్వారా,  పాపమలినం సోకకుండా ఈ లోకమునకు వస్తున్నాడు.

మరియమాత ఔన్నత్యం ఏమిటి?  మరియమాత దేవుని ప్రణాళిక జరుగుటకు ఏమి చేసినదో ఆలోచిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, అని పలికిన మరియమాత చేసిన సాహసం చాలా గొప్పది. ఆమె పురుషుని ప్రమేయం లేకుండ బిడ్డను కన్నది అంటే, ఎవరు నమ్మక పోవచ్చు. తన భర్త తనను అర్ధం చేసుకోక, తనను విడిచిపెట్టిన, తను  ఘోరమైన  అవమానం పొందవచ్చు. తన తండ్రి, తల్లి పట్టించుకోక పోవచ్చు. అప్పుడు ఆమె ఒక అనాధలా మారిపోవచ్చు. యోసేపు ఈ విషయమును మత పెద్దల వద్దకు తీసుకువెళితే, ఆమెకు మరణ శిక్ష విధించె అవకాశం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులు తన జీవితంలో వచ్చే అవకాశం ఉన్న కూడా దేవుని చిత్తము నా జీవితంలో జరగాలి అని ఆమె నిర్ణయించుకున్నది. 

దేవునికి అసాధ్యం అయ్యేది, ఏది లేదు అని గాబ్రియేలు దేవదూత చెప్పిన మాటలు మరియమాత నమ్మింది. సారా పెద్దావిడ అయినప్పటికీ ఆ వయసులో ఆమె గర్భం దాల్చబడుతుంది అన్ని చెప్పినప్పుడు, ఆమె దేవుని నమ్మక నవుతుంది. జెకర్యా దేవుని మాటను నమ్మక,  ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నాడు.మరియమాత మాత్రం, పురుషుని ప్రమేయం లేకుండా ఎలా సాధ్యం అనే  సందేహం వెల్లడిచేసిన, దేవునికి అసాధ్యం అయ్యేది ఏమి లేదని, ఎటువంటి అపనమ్మకం లేకుండా, నీవు చెప్పినట్లు నాకు జరుగునుగాక అని, నేను దేవుని దాసురాలనని, తాను దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏమి చేయడానికైనా సిద్ధం అని తెలియజేస్తుంది. దేవుని నమ్మే ప్రతి వ్యక్తి కూడా  ఇలా చేసినట్లయితె వారు గొప్ప వారిగా మిగిలిపోతారు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు ఎంత ప్రేమమయులు, మీరు మమ్ములను రక్షించుటకు, మీ దూతను, మీ దాసురాలీ  దగ్గరకు పంపి, మీ ప్రణాళికను తెలుపుతున్నారు. మీరు ఎప్పుడు మానవుడు రక్షించబడాలి, ఉన్నత జీవతం జీవించాలని కోరుకుంటున్నారు. ప్రభువా! మీరు ఎప్పుడు మరియమాతతో ఉన్నారు. ఆమెతో ప్రతిక్షణం మీరు ఉన్నారు. ఆమెతో మీరు ఉండుట వలన ఎటువంటి తప్పు లేకుండా జీవించకలిగి, మీకు ఇష్టమైన జీవితం జీవించినది. ప్రభువా! మరియమాతతో ఉన్నట్లు మాతో కూడా ఎల్లప్పుడు ఉండండి. మేము కూడా మీకు ఇష్టమైన జీవితం జీవించేలా చేయండి. ప్రభువా! దేవదూత మరియమాత దగ్గరకు వచ్చి అనుగ్రహపరిపూర్ణురాల అని చెబుతుంది. ఆమె ఎలా అనుగ్రహ పరిపూర్ణురాలు అయ్యిందో, మమ్ములను కూడా మీ అనుగ్రహములతో నింపండి. ప్రభువా! మరియమాత,  గాబ్రియేలు దేవదూతతో, "నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక" అని చెబుతుంది. ఆ తల్లి దేవుని చిత్తము తన జీవితంలో జరుగుటకు తనను తాను, దేవుని దాసురాలుగ మార్చుకుంది. మీ చిత్తం చేయడమే తన జీవితంలా అనుకున్నది. మేము కూడా మీ చిత్తం నెరవేర్చడానికి, మమ్ములను మేము మీ దాసులుగా చేసుకునేలా చేయండి. ఆమెన్.  

లూకా 1:39-45

 లూకా 1:39-45

ఆ దినములలో మరియమ్మ   యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు  త్వరితముగా  ప్రయానమైపోయెను. ఆమె జెకర్యా ఇంటిలో  ప్రవేశించి ఎలిశబేతమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిశబేతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిశబేతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను: "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను? నీ వందనవచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు!" 

ధ్యానము: ఆ దినములలో మరియమ్మ   యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు  త్వరితముగా  ప్రయానమైపోయెను.  గాబ్రియేలు దేవదూత, ఎలిశబేతమ్మ గర్భము ధరించినదని చెప్పిన మాటలను విశ్వసించి, ఎలిశబేతమ్మను చూచి ఆమెకు తోడుగా ఉండుటకు, మరియమాత అక్కడకు వెళుతుంది. మరియమాత చేసిన ఈ ప్రయాణం చాలా కష్టమైనది. ఆమె నజరేతు నుండి ఒక పర్వత ప్రాంతం వైపు వెళుతుంది. ఈ ప్రయాణం, మరియమాత మరియు యోసేపులు జనాభా లెక్కలకు వెళ్లినంతటి కష్టమైనటువంటిది. ఎందుకంటే ఆమె పర్వతప్రాతంవైపు వెళ్ళాలి. అది ఒక రోజు కంటే ఎక్కువ ప్రయాణమే.  ఆ రోజులలోఅటువంటి  ప్రాతమునకు ఆ ప్రయాణం ఒక సాహసం లాంటిదే. ఎందుకు మరియమాత అటువంటి నిర్ణయం తీసుకుంటుందంటే ఎలిశబేతమ్మ గర్భవతి అయిన విషయం అప్పటికి మరియమాతకు, జెకర్యాకు మాత్రమే తెలుసు. ఎలిశబేతమ్మ వారి చుట్టము, వయసు మళ్లిన వ్యక్తి. గర్భవతిగా ఉన్న ఆమెకు సహయం చేయుటకు వెళుతుంది. మరియమాత అవసరంలో ఉన్నవారిని ఆదుకోనుటకు ఎటువంటి కష్టము అయిన భరిస్తుంది. మరియమాతలో ఉన్న ఈ సుగుణం మనం ఇతర సమయాలలో కూడా చూస్తాము. కానా అనే ఊరిలో పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి సహాయం చేయుటకు ప్రభువుకు విన్నవిస్తుంది. శిష్యులందరు యూదుల భయంతో పై గదిలో ఉన్నప్పుడు వారితో కలిసి, వారికోసం ప్రార్ధన చేస్తుంది.  

మరియమాత మరియు ఎలిశబేతమ్మ మధ్య సంభాషణ ఇక్కడ యేసు ప్రభువు ఎవరు అనే విషయం తెలియజేస్తుంది. ఇక్కడ బాప్తిస్మ యోహను యేసు ప్రభువు సాన్నిధ్యాన్ని గాంచి ఎంత ఆనందించాడో మనకు తెలుస్తుంది. యోహాను తన తల్లి గర్భమున ఉండి కూడా, యేసు ప్రభువును గుర్తిస్తున్నాడు. గాబ్రియేలు దేవ దూత చెప్పినట్లుగా ఆయన తన తల్లి గర్భమున ఉండగానే పవిత్రాత్మతో నింపబడ్డాడు. అందుకే ఆయన తల్లి గర్భమున ఉన్న గాని, యేసు ప్రభువును గుర్తించగలుగుతున్నాడు. గుర్తించడమే కాదు, యేసు ప్రభువు సాన్నిధ్యం ఎంత మధురమైనది అనె అనుభూతిని అనుభవించి  తల్లి గర్భములో ఉండి గంతులు వేయడం వలన తెలియజేస్తున్నాడు. ఎలిశబేతమ్మకూడా,  యేసు ప్రభువును గురించి తెలియ చేస్తుంది. ఆయన ప్రభువు అని గుర్తిస్తుంది. 

"స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను"  మరియ మాత స్త్రీలందరిలో ఆశీర్వదించబడినదని, ఆమెను గురించి ఎలిశబేతమ్మ పవిత్రాత్మ ప్రేరణతో చెబుతున్నదిమనలో ప్రతి ఒక్కరినీ దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. మరియమాతను ఎందుకు అంతా గొప్పగా ఆశీర్వదించారంటే, ఆమె దేవుని చిత్తమునకు తన జీవితాన్ని అంకితం చేసిన విధానం అంత గొప్పది. అందుకే తన కుమారున్నీ ఆమె ద్వారా ఈ లోకానికి తీసుకువస్తున్నాడు. ఎలిశబేతమ్మకూడా దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఆమెకు ప్రభువును ఇతరులకు తెలియజేసే, ప్రభువును గుర్తుపట్టకలిగే, ఆయన సాన్నిధ్య మాధుర్యాన్ని అనుభవించ కలిగే కుమారున్నీ ఇస్తున్నాడు. ఆమెకు ఉన్న పేరును పోగొడుతున్నారు. వీరి ఇద్దరి కలయిక దేవుని శక్తిని శంకించని ఇద్దరి కలయిక. ఇక్కడ పరమ పవిత్రుడైన దేవుని సాన్నిధ్యాన్ని, పాప కళంకం లేని యోహాను ఆనందిస్తున్నాడు. 

ఎలిశబేతమ్మ ఒక ప్రవక్త వలె  పవిత్రాత్మతో ప్రేరేపించబడి, మరియమాత గర్భముతో ఉన్నానని చెప్పకపోయిన కాని మరియమాత గురించి నా ప్రభువుని తల్లి నా దగ్గరకు రావడం నాకు ఎలా ప్రాప్తించేను అని చెబుతుంది. ఆమె రావడం తనకు దేవుని అనుగ్రహంగా ఆమె చెబుతుంది. మరియమాత మరియు ఆమె గర్భ ఫలమగు యేసు ప్రభువును ఆశీర్వదింపబడినవారు అని చెబుతుంది. మరియమాత గర్భమున ఉన్న శిశువు తన ప్రభువు అని చెప్పడం వలన ఎలిశబేతమ్మ పవిత్రత కూడా మనకు తెలుస్తుంది.   మరియమాత  దేవుని కుమారుని తన గర్భమున మోసినందుకు మాత్రమే ధన్యురాలు కాదు, ఎలిశబేతమ్మ చెప్పిన విధముగా ప్రభువు వాక్కులు నెరవేరునని నమ్మినందుకు ఆమె ధన్యురాలు. ఎందరో గొప్పవారు కొన్ని దేవుని నుండి వచ్చిన ప్రవచనములను నమ్ముట లేదు. కాని దేవునికి వ్యతిరేకముగా మాటలాడకుండా వుండవచ్చు. కాని మరియమాత  ఒక సాధారణ యువతి దేవుని నుండి వచ్చిన ప్రతి మాట  నెరవేరుతుంది అని నమ్ముతుంది.  గాబ్రియేలు దూత ఎలిశబేతమ్మ గర్భం గురించి చెప్పగానే ఆమెకు సపర్యాలు చేయడానికి వెళుతుంది. మరియమాత విశ్వాసులందరికి తల్లి. ఎలా దేవుని విశ్వాసించాలో ఆమెను చూసి నేర్చుకోవాలి. దేవుని మీద ఆమె వలె నమ్మకం కలిగిఉండాలి. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా! మీ ప్రేమ ఎంత ఉన్నతము. మీ ప్రణాళికకు తన జీవితమును అంకితం చేసిన మరియమాతను ఎంతో మిన్నగా ఆశీర్వదించారు. మీరు చెప్పిన ప్రతి మాట జరుగుతుంది అని నమ్మిన మరియమాత జీవితం మాకు ఆదర్శం. మేము కూడా మీ ప్రణాళికకు మా జీవితాలను అంకితం చేసేలా చేయండి. మరియ మాతను ఆశీర్వదించిన విధముగా మమ్ము కూడా ఆశీర్వదించండి. ప్రభువా! మీ  సాన్నిధ్యాన్ని యోహాను ఎంతగానో ఆనందిస్తున్నాడు. మీ పవిత్రతను యోహాను తెలుసుకున్నట్లు మేము కూడా పవిత్రత కలిగి మీ సాన్నిధ్యా మాధుర్యం అనుభవంచే అనుగ్రహం దయచేయండి. ప్రభువా! మీ అనుగ్రహాలు, ఆశీర్వాదాలు తెలుసుకొని వాటిని ఎప్పుడు మర్చిపోకుండా ఉండేలా మమ్ము దీవించండి. ప్రభువా! మరియమాత వలె మీ యడల ఎప్పటికీ సన్నగిళ్ళని విశ్వాసాన్ని ఇవ్వండి.   ఆమెన్. 


పునీత స్తేఫాను

 పునీత స్తేఫాను 

స్తేఫాను అంటే కిరీటం అని అర్ధం. ఈయన అపోస్తులులు ఎన్నుకొన్న ఏడుగురు డీకనులలో ఒకరు. డీకనుగా స్తెఫాను అక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయుటకు ఎన్నుకొనబడ్డాడు. స్తెఫాను జ్ఞానము కలిగి, పవిత్రాత్మతో నింపబడి, మంచి ప్రవర్తన కలవాడిగా అందరికీ తెలిసిన వ్యక్తి.  తన జ్ఞానం ద్వార దేవుని గురించి బోధించి, హింసించబడి చంపబడ్డాడు.  ఈయన భోదన యూదులను కోపమునకు గురిచేసింది. యూదులు ఆయన మీద చూపిన క్రోదాన్ని, ఆయనకు కీర్తిని తీసుకువచ్చేలా చేశాడు. 

స్తేఫాను విశ్వాసం చాలా గొప్పది. ఆయన యూదుల చేత హింసించబడుతున్న అటువంటి అపనమ్మకం లేకుండా దేవుని  ఘనతను గురించి వారికి బోధించాడు.   ఎటువంటి పరిస్థితిలో కూడా దేవుని గురించి వివరిస్తూ ఎలా యూదులు తప్పుగా ఆలోచిస్తున్నారో వారికి తెలియజేయడంలో పూర్తిగా సఫలికృతం అయ్యారు. కాని ఆయనను వారు తప్పుగా అర్ధం చేసుకున్నారు. యేసు ప్రభువు బోధనలు ఈయన పాటించిన తీరు అందరు నేర్చుకోవాలి. తనను చంపుతున్న వారి కొరకు ప్రార్ధిస్తూ, ఆ పాపాన్ని వారి మీద వేయకండి అని వేడుకున్నాడు. మరణించే ముందు దేవుని ఇంత కష్టానికి గురిచేశాడని నిందించక, దేవునికి తన ఆత్మను అప్పగించాడు. 

స్తెఫానును బంధించుట 

స్తేఫాను దైవనుగ్రహం, శక్తి కలిగినవాడై గొప్ప అద్భుతములు, సూచక క్రియలు చేసెడివాడు. కొంత మంది స్తెఫానుతో వాదించెవారు. అతను చూపిన జ్ఞానమును,  ఆత్మతో  ప్రేరేపించబడి వాదించుటను  వారు ఎదుర్కోలేకపోయారు. ఆయనను ఎలా అయిన శిక్షించాలి అని వారు  పన్నాగం పన్నారు. అబద్ద సాక్ష్యం చెప్పుటకు కొందరిన కూర్చుకొని వారిచేత స్తెఫాను మోషేమీద దేవుని మీద దూషణ వాక్యాలు పలికినట్లుగా చెప్పుటకు కొందరిని కుదుర్చుకున్నారు. స్తెఫానుకు వ్యతిరేకముగా ప్రజలను, పెద్దలను ధర్మ శాస్త్రబోధకులను వారు స్తెఫానుకు వ్యతిరేకముగా పురికోల్పోరు. వారు స్తెఫానును బంధించి న్యాయసభ ఎదుటకు  తీసుకొని వచ్చారు. వారు తీసుకొనివచ్చిన అబద్దసాక్షులు స్తెఫాను పవిత్ర దేవాలయమునకు, మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాటలాడుచున్నాడాని, యేసు దేవాలయమును కూల గోడుతాడని, మోషే నుండి వచ్చిన  పారంపర్యమును   మార్పుచేస్తాడని చెబుతున్నాడని, వారు న్యాయ సభముందు చెప్పారు. అది వినిన వారు స్తెఫాను వైపు చూడగా ఆయన ముఖం వారికి దేవదూత వలె కనిపించినది. ఆయన పవిత్రత అది వారికి గుర్తు చేస్తుంది. ఆయన ముఖంలో  భయం, అందోళన వంటికి కాకుండా ప్రశాంతత, దేవదూతలా  కనబడుటకు కారణం ఏమిటి అంటే ఆయనకు దేవుని మీద ఉన్న ప్రేమ, దేవునికి తన జీవితమును అర్పించిన విధానం, ఆత్మతో నింపబడిఉండటం, విశ్వాసంతో నిండి ఉండటం వలన ఆయన  అటువంటి విపత్కర పరిస్థితిలో కూడా ఆయన తన ప్రశాంతతను కోల్పోకుండా ఉన్నాడు. 

స్తెఫాను వాదన 
ప్రధానార్చకుడు స్తెఫానును వారు చెప్పేది నిజమేనా? అని అడిగాడు అందుకు స్తెఫాను వారితో తన వాదనను ఇలా వినిపించాడు. మహిమగల దేవుడు మనం పూర్వీకుడగు అబ్రహాముకు కనపడి నీవు నీ దేశమును, నీ బంధువులను వీడి నేను చూపింపబోవు దేశమునకు వెళ్ళమని చెప్పగా ఆయన అట్లే చేశాడు, దేవుడు అబ్రహామునకు సొంత భూమిగా ఒక అడుగైనను ఇవ్వలేదు. కాని ఆయన సంతానానికి ఇస్తాను అని వాగ్ధానం చేశాడు. అలానే నీ సంతతి వారు 400 సంవత్సరాలు విదేశములో బానిసలుగా బాదలకు గురవుతారని, వారిని బాధలకు గురిచేసిన వారిని  తీర్పుకు గురిచేస్తాను అని చెప్పాడు. అటుల అబ్రహాము నుండి మోషే వరకు, ఎలా దేవుడు వీరికి తోడై ఉన్నది చెప్పాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నప్పటికీ ఎలా వారు దేవుని మాటలను వీడి జీవించినది కూడా వారికి తెలియజేశాడు. ఎలా వారు మోషేను దేవుడు పంపిన కాని తనని నాయకునిగా గౌరవించకుండా ఉన్నది వారికి తెలియజేశాడు.  మోషే నుండి దేవాలయం కట్టినప్పటి వరకు చెప్పి, ఎలా దైవ సమక్షము  గుడారములో ఉన్న విషయం చెప్పి, ప్రవక్త మాటలను వారికి చెబుతూ ఆకాశము దేవుని సింహాసనమని భూమి ఆయన పాదపీఠమని, సమస్తము దేవునిది అని చెప్పి దేవుని సందేశమును తిరస్కరించి, వారు హృదయమందు, చెవులయందు సున్నతి లేని వారి వలె ఉన్న విషయాన్ని వారికి తెలియజేశాడు. వారి పూర్వుల వలె పవిత్రాత్మను ఎదురించుచున్న విషయాన్ని వారికి తెలియజేశాడు. ఎలా వారు ప్రవక్తలను హింసించింది వారికి చెప్పాడు.
 
ఆలయము యొక ప్రాముఖ్యత - పెద్దలకు, న్యాయ సభకు ఆలయం గొప్పది. వారి జీవితం మొత్తం దాని మీదనే ఆదరపడి ఉన్నది. కాని ఆ కట్టడానికి కాదు ప్రాముఖ్యత దానిలో ఉన్న దేవునిది. ఎందుకంటే దైవ సమక్షము ఆ కట్టడములో ఉన్నది. ఈ ఆలయమును కట్టకమునుపు వారికి దైవ సమక్షపు గూడారము ఉండేది. దావీదు కాలము వరకు ఈ దైవ సమక్షపు గుడారము ఉన్నది. అప్పుడు దావీదు ఒక దేవాలయము కట్టుటకు దేవుని అనుమతి అడిగాడు కాని సోలోమోనే దానిని కట్టించాడు. దేవునికి ఈ ఆలయము మాత్రమే ముఖ్యం ఆనుకొనుట సమంజసము కాదు. ఈ విషయములను వారికి వివరిస్తూ, వారి పితరులు ఎలా ఈ విషయములను చెప్పిన ప్రవక్తలను హింసించిన విషయం వారితో చెబుతూ వీరు కూడా పవిత్రాత్మను ఎదురించుచున్నారని, మెస్సీయ్యాను గురించి చెప్పిన, చూపిన వారిని చంపివేశారు అని , మరియు యేసు ప్రభువును వారు శత్రువులకుఅప్పగించిన విషయం చెప్పి, దేవదూతల ద్వారా పొందిన చట్టమును వారే పాటించుటలేదు అని వారి తప్పును బయట పెట్టడం జరిగింది. 

స్తెఫానుపై రాళ్ళ వర్షం 

ఆ న్యాయ సభలోని వారు వారందరు ఆయన మాటలకు కోపముతో మండిపడ్డారు. స్తెఫాను పవిత్రాత్మతో నిండి, పరలోకం వైపు చూడగా ఆయనకు దేవుని మహిమ ఆయన కూడప్రక్కన యేసు ప్రభువు నిలబడి ఉండటం చూశాడు. ఆ విషయం వారికి తెలియజేస్తుండగా వారు కేకలు వేస్తూ, చెవులు మూసుకొన్నారు. అందరు ముకుమ్మడిగా విరుచుకుపడి, నగరము బయటకు తీసుకుపోయి రాళ్ళతో కొట్టారు. వారు రాళ్ళతో కొట్టుచుండగా స్తెఫాను "యేసు ప్రభూ! నా ఆత్మను గైకొనుము" అని ప్రార్ధించాడు. తరువాత మోకరిల్లి "ప్రభూ ! ఈ పాపము  వీరిపై  మోపకుము" అని మరణించాడు. 

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...