26, ఫిబ్రవరి 2026, గురువారం

సువార్త కారుడైన యోహాను - ప్రియమైన శిష్యుడు

 సువార్త కారుడైన యోహాను - ప్రియమైన శిష్యుడు 

 యోహాను 20: 2-8 

అంతట ఆమె సీమోను పేతురువద్దకు, యేసు ప్రేమించిన  మరియొక  శిష్యుని  యొద్దకు పరుగెత్తుకొని పోయి,  "వారు ప్రభువును  సమాధినుండి  ఎత్తుకొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము"అని చెప్పెను. అపుడు పేతురు, ఆ శిష్యుడు సమాధివైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తుచుండిరి. కాని, ఆ శిష్యుడు పేతరుకంటే వేగముగా పరుగెత్తి ముందుగ సమాధియొద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచట పడియుండుటను చూచెను. కాని, లోనికి వెళ్లలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి,  సమాధిలో ప్రవేశించి, అచట పడియున్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతోపాటు కాక, విడిగచుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడ లోనికి వెళ్ళి చూచి నమ్మెను

ధ్యానం:  ఈ రోజు సువార్తకారుడు పునీత యోహాను గారి పండుగను కొనియాడుతున్నాము. ఈ పునీతుని గొప్పతనం, యోహాను సువార్తను చదివినప్పుడు మనకు తెలుస్తుంది. సువార్తను నలుగరు సువిశేషకారులు రాసినప్పటికి యోహాను సువిశేషం ఒక ప్రత్యేకత కలిగిఉన్నాది. యోహాను గారు యేసు ప్రభువు శిష్యులలో ఒకరుగా ఉన్నారు. ప్రతి సువిశేషమునకు ఒక గుర్తు ఉన్నది. యోహాను సువిషమునకు ఉన్న గ్రద్ద గుర్తుగా ఉన్నది. ఎందుకు గ్రద్ద గుర్తుగా ఉన్నది అని ఒక సారి మనం పరిశీలించినట్లయితే, ఒక విషయం మనకు తెలుస్తుంది. అది గ్రద్ద ఆకాశంలో ఎక్కడో విహరిస్తున్నప్పటికి భూమిమీద ఉన్న కీటకాన్ని కాని లేక అది ఏమి పట్టుకోవాలనుకున్నదో దానిని ఖచ్ఛితముగా ఎటువంటి పొరపాటు లేకుండా అది దానిని పట్టుకోగలదు. గ్రద్దకు ఖచ్చితమైన గురి ఉన్నది. యోహాను  సువిశేషంలో మొదటి నుండి యేసు ప్రభువు దేవుడు అనే విషయమును వెల్లడి చెస్తున్నారు. మిగిలిన సువిశేష కారులు యేసు ప్రభువు పుట్టుకతోటి, లేక ఆయన జ్ఞానస్నానంతో మొదలు పెడుతున్నారు. కాని యోహాను మాత్రం తన సువిశేషాన్ని యేసు ప్రభువు ఎలా తండ్రితో కలిసి ఉన్నాడని మరియు ఏవిధముగా ఆయన దేవుడు అనే విషయాన్ని సువిశేషం మొదటి నుండి చెబుతున్నారు. 

యోహాను సువిశేషం, ఎందుకు యోహాను ఈ సువిశేషాన్ని రాశారో తెలియజేస్తుంది.   యోహాను మూడు సార్లు తన సువిశేష ఉద్దేశ్యం ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సువిశేష మొదటిలో , మధ్యలో మరియు చివరిలో ఎందుకు ఆయన సువిశేషం రాసినది తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ ఉద్దేశ్యం అంటే, యేసు ప్రభువును అందరు విశ్వసించాలి, ఆయనను విశ్వాసించిన వారికి నిత్యజీవం ఇవ్వబడుతుంది అనే విషయాన్ని తెలియజేయడమే ఈ సువిశేష ఉద్దేశ్యం. ఈ సువిశేషం రెండు భాగాలుగా చేసిన మొదటి భాగం 7 అద్భుతాలు యేసు ప్రభువు చేస్తున్నారు. ఈ ఏడు అద్భుతాలు కూడా దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి అద్భుతాలు. ఎంతటి గొప్ప వారు అయినప్పటికీ  దేవుడు కాకపోతే ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేరు. యేసు ప్రభువు ఎవరు అనే విషయాన్ని యోహాను సువిశేషకారుడు యేసు ప్రభువు ఇచ్చే అనుగ్రహమును బట్టి తెలియజేస్తున్నాడు.  అవి ఏమిటి అంటే, యేసు ప్రభువు జీవ జలం, యేసు ప్రభువే జగజ్యోతి, యేసు ప్రభువే జీవహారం. యేసు ప్రభువే జీవ వాక్కు.యేసు ప్రభువే తండ్రి వద్దకు మార్గము.  ఈ సువిశేష రెండవ భాగాన్ని మహిమ పుస్తకం అంటారు. ఈ భాగంలో ఎలా యేసు ప్రభువు తండ్రి పవిత్రాత్మలతో కలసి ఉన్నది. మనం ఎలా దేవునితో కలసి ఉండవచ్చు అనే విషయములు కూడా తెలుసుకుంటాము. శిష్యులతో యేసు ప్రభువు ఎటువంటి సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. ఎలా దానిని శిష్యులు పొందవచ్చు అనే విషయం మనం తెలుసుకుంటాము. శిష్యులను ప్రభువు ఎంతలా ప్రేమిస్తున్నారు అనే విషయము కూడా ఈ సువిశేషం ద్వారానే మనం నేర్చుకుంటాము. 

ఎవరు ఈ యోహాను? యేసు ప్రభువు శిష్యులలో ఒకడు. జబదాయి కుమారుడు. ఈయన కడరా భోజన సమయమున యేసు ప్రభువు హృదయమునకు దగ్గరగా ఉన్నాడు. ఆయన  యేసు ప్రభువుకు అంతా దగ్గరగా ఉన్నాడు కనుక దేవుని గురించి ఇతర సువిశేషకారులు తెలుపని విషయాలను వివరిస్తున్నారు. హృదయము దగ్గరగా ఉన్నాడు అంటే ప్రభువు చేత కూడా ఈ శిష్యుడు ప్రేమించబడ్డాడు. అంతేకాదు శిష్యులు అందరు యేసు ప్రభువును బంధించినప్పుడు వెళ్ళి పోయినను ఈ శిష్యుడు మాత్రము ఆయనను ఎవరికి తెలియకుండా అనుసరిస్తున్నాడు. సిలువ క్రింద మరియమాతతో పాటు ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు తన తల్లిని తన ప్రియయమైన శిష్యునకు అప్పగించాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా మీరు ప్రేమించిన మీ శిష్యున్ని జ్ఞానంతో నింపారు. కేవలం జ్ఞానంతో నింపటమే కాకుండా దేవుని గురించితెలుకొని నేర్పే వానిగా తీర్చిదిద్దారు. మీ మీరు చేసిన ప్రతి పని మీరు  దేవుడు అని తెలియజేస్తున్నది అని తెలుసుకోలేకపోయాము. మీ శిష్యుడు మిమ్ములను మాత్రమే పరిలించే విధంగా మీరు చేశారు కనుక మిమ్ములను మాత్రమే ధ్యానిస్తూ.మీగురించి నిగూడ సత్యాలను తెలుసకొనుటకు అవకాశం ఇస్తున్నారు. ప్రభువా మీరు చేసిన అధ్భుతాల ద్వారా మీరు దేవుడు అనే విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. అంతె కాక మేము ఏ విధంగా మీతో కలసి ఉండాలో చెబుతున్నారు. మీరు లేకుండా మేము ఏమి చేయలేము అని చెబుతున్నారు. మేము మీతో కలసి ఉండాలి అని కోరుతున్నారు. ప్రభువా! మమ్ములను కూడా మీ ప్రియమైన శిష్యున్ని ప్రేమించినట్లుగానే ప్రేమించండి. మమ్ములను కూడా మీ హృదయమునకు  దగ్గరగా ఉండనివ్వండి. దాని ద్వారా యోహాను వలె మేము కూడా మీ గురించి ఎక్కువగా తెలుసుకొని మీతో ఐక్యం అయ్యేలా మమ్ము దీవించండి. ఆమెన్. 

హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు

 హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు 

మత్తయి 2:13-18 

వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత  యోసేపునకు కలలో కనిపించి, "శిశువును చంపుటకు హెరోదు వెదకబోవుచున్నాడు. కావున నీవు లేచి, బిడ్డను తల్లిని తీసుకొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పు వరకు అచటనేయుండుము" అని  ఆదేశించెను. అంతట యేసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసుకొని, ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి, హెరోదు మరణించునంత వరకు అచటనే  ఉండెను. " ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని" అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ఆ జ్ఞానులు  తనను మోసగించిరని హెరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహామందును, ఆ పరిసరములందును ఉన్న రెండేండ్లును, అంతకంటే తక్కువ ప్రాయముగల మగశిశువులందరిని చంపుడని అతను ఆజ్ఞాపించెను.  

ధ్యానము: "ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి శిశువునకు చంపుటకు హెరోదు వేదకబోవుచున్నాడు" అని చెప్పాడు.  ఎందుకు హెరోదు యేసు ప్రభువును చంపుటకు  వేదకబోవుచున్నాడు? హెరోదు రాజుతొ  తూర్పునుండి వచ్చిన జ్ఞానులు, యూదుల రాజుగా  పుట్టిన శిశువు నక్షత్రం  చూచి, ఆయనను మేము  ఆరాధించుటకు వచ్చాము, ఆయన ఎక్కడ జన్మించారు అని  వారు  అడిగారు. హెరోదు రాజు తన అధికార వ్యామోహం కలిగినవాడు. తన సొంత కుమారులను కూడా అధికారం కోసం చంపించినవాడు, అందుకే ఆరోజులలో హెరోదు కుమారునిగా కంటే హెరోదు దొడ్డిలో పందిగా పుట్టటం మేలు అనే నానుడి ఉండేది.  తన అధికారమునకు అడ్డుగా ఎవరు వచ్చిన, దానిని సహించని వ్యక్తి హెరోదు. మరియొక రాజు పుట్టాడు అని తెలువగానే ఆ శిశువును, ఎలా అయిన చంపాలి అనే ఆలోచన హెరోదుకు వస్తుంది. మనుషుల అంతరంగాలు పూర్తిగా తెలిసిన దేవుడు హెరోదు చేయబోయే ఘోరాన్ని యోసేపుకు తెలియజేసాడు.

 "నీవు లేచి, బిడ్డను తల్లిని తీసుకొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పు వరకు అచటనేయుండుము" అని యోసేపును దేవదూత   ఆదేశించెను. "అంతట యేసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసుకొని, ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి, హెరోదు మరణించునంత వరకు అచటనే  ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని" అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ప్రభువు దూత చెప్పినట్లుగా యోసేపు మరియమ్మను, బాల యేసును తీసుకొని ఐగుప్తుకు వెళుతున్నారు.  హెరోదు మరణించినంతవరకు పవిత్ర కుటుంబం  ఐగుప్తు లోనే ఉంటుంది.  ఈ ఇద్దరు కూడా తమ బిడ్డ కోసము పడిన కష్టం చాలా గొప్పది. వీరు ఇద్దరు కూడా తమ కుమారుని కొరకు జీవిస్తున్నారు. మనతో పాటు ఉన్న వారు అపాయములో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో వీరు చెబుతున్నారు. దేవుడు ఎందుకు ఐగుప్తుకు వెళ్ళమని చెబుతున్నారు? కారణం ఏమి అయి ఉండవచ్చు అంటే, ఐగుప్తు  హెరోదు పరిదిలో లేదు,  అక్కడ చాలా మంది యూదులు ఉన్నారు. మరల  హొషయ ప్రవక్త చెబుతున్నట్లుగా నేను నా కుమారున్నీ ఐగుప్తు నుండి పిలిచాను అనే ప్రవచనం వెరవేరుతుంది. 

యేసు ప్రభువును హెరోదు చంపించలేకపోయాడు. కాని తన అధికారమునకు ఎవరు ఆటంకంగా ఉండకూడదు అనుకునే హెరోదు, ఆ శిశువును ఎలాగైన చంపాలి అని బేత్లెహేము మరియు ఆ పరిసర ప్రాంతములో ఉన్న రెండేండ్లు మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్న చిన్న బిడ్డలను చంపిస్తున్నాడు. ఎవరు ఈ చిన్న బిడ్డలు ? ఈ చిన్న బిడ్డలు అందరు కూడా ఎవరు కాపాడుటకు లేనివారు, ఏ మాలిన్యం లేని వారు. పవిత్రంగా ఉన్నవారు. యోసేపు, మరియమ్మ లాంటి వారు తోడు లేని వారు.

 అంతమంది చిన్న బిడ్డలను హెరోదు చంపనవసరం లేదు. కాని పదవి వ్యామోహం, అధికార దాహం అనేవి  మనలను ఎటువంటి హత్యలను, ఘోరాలను కూడా చేయుటకు ప్రేరేపిస్తుంది. వివేకము కోల్పోయేవిధంగా చేస్తుంది. ఆ చిన్న బిడ్డలు పెరిగి, అధికారానికి  రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది, అంత కాలం హెరోదు బ్రతకడు అనే విషయం కూడా ఆలోచించలేక పోయాడు. మన ఆలోచనలను కూడా అధికారం వ్యామోహం చంపివేస్తుంది. 

 "రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది ఒక మహారోదనము. రాహెలు తన బిడ్డలకొరకై విలపించుచుండెను. వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను" అని యిర్మీయా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను." ఎందుకు రాహెలు ఏడుస్తుంది అంటే,  రాయహేలును యాకోబు ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. తన అక్కకు పిల్లలు పుట్టారు. పిల్లలు లేరు అనే బాధను ఆమె చాలా ఎక్కువగా పొందింది. పిల్లల కోసం చాల ఆశ పడింది.  ఆమె చనిపోయిన తరువాత రామా వద్ద సమాది చేశారు. ఇంత మంది చిన్న బిడ్డలను చంపినప్పుడు ఆ తల్లి బిడ్డలకోసము విలపిస్తుంది.ఆమెనుఓదార్చుటఅలవికానటువంటిది. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా!  మీరు జన్మించినప్పుడు ఎంతో ఆనందపడిన యోసేపు, మరియ తల్లి మిమ్ములను అధికార దాహం, పదవి కాంక్ష కలిగిన వారి నుండి కాపాడుటకు ఎంతో కష్టపడ్డారు. మీరు మీ పరిచర్య మొదలు పెట్టిన తరువాత కూడా ఇటువంటి ఆలోచనలు ఉన్న వారు, మిమ్ములను అనేక విధాలుగా కష్ట పెట్టుటకు ప్రయత్నించారు. ప్రభువా! మేము కూడా కొన్ని పర్యాయాలు ఇటువంటి పదవి, అధికారం వంటి కోరికలకు, ఆశలకు లోనవుతాము. అటువంటి సమయాలలో నిజమైన జ్ఞానంతో ప్రవర్తిస్తూ, మిమ్ములను అనుసరించెలా చేయండి. యోసేపు మరియతల్లి మిమ్ములను కాపాడినట్లు  ఇటువంటి అపాయములకు లోనయె వారికి సహాయం చేసేలా మమ్ము దీవించండి. చనిపోయిన చిన్న బిడ్డలలో, వారి ఆలోచనలలోకాని, మాటల్లో కాని, పనులలో కాని ఎటువంటి చెడు లేకుండా, నిర్మలముగా ఉన్నారో అటువంటి మనసును మాకు దయచేయండి. అటువంటి బిడ్డలను రక్షించు అవకాశము మాకు అనుగ్రహించండి. ఆమెన్ 

యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16

 యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16 "పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది: ఒక  యజమానుడు తన ద్రాక్షతోటలో పని  చేయుటకు పని వారలకై ప్రాతః...