26, ఫిబ్రవరి 2026, గురువారం

పరాగ్వే లిల్లీ పుష్పం – మరియ ఫెలిసియా (చికితుంగ )

 పరాగ్వే లిల్లీ పుష్పం – మరియ ఫెలిసియా (చికితుంగ )


మరియ ఫెలిసియా గుగ్గియారి  ఎచేవెరియా  అనే కార్మెల్ సభ పునీతురాలు జనవరి 12 వ తేదీన , 1925 వ సంవత్సరంలో పరాగ్వే  లోని వియారీక దె స్పిరితూ సంతోలో జన్మించింది.   ఈమె కేవలం 34 సంవత్సరాలు మాత్రమే జీవించింది. ఈ 34 సంవత్సరాలలో కేవలం 4 సంవత్సరాలు మాత్రమే కార్మెల్ లో జీవించింది.  ఆమెను తన తండ్రి చికితుంగ అనే ముద్దు పేరుతో పిలుచుకునేవాడు. ఆమె తండ్రి పేరు రామోన్ గుగ్గుయారీ మరియు తల్లి పేరు మరియ అర్మీండా ఎచేవెరియా . ఈమె ఏడుగురు సంతానంలో మొదటిగా బిడ్డగా  జన్మించింది.  1929 వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీన అంటే నాలుగు సంవత్సరాల ప్రాయంలో జ్ఞానం స్నానం పొందింది. 1937 వ సంవత్సరం డిసెంబర్ 8 వ తేదీన ప్రధమ దివ్య సత్ప్రసాదం స్వీకరించింది.  ఈమె పరాగ్వే నుండి మొదటి పునీతురాలు.

ఈమె బాల్యం  నుండి కూడా పేదలకు సహాయం చేయుటకు ఎంతో శ్రద్ద చూపిస్తూ ఉండేది. వారి ఇంటిలో ఈమె ఆహారం కోసం లేక సహాయం కోసం వచ్చే వారికి కావలసిన వాటిని ఇచ్ఛే బాధ్యతను తీసుకొని ఎవరైనా సహాయం కోసం లేక ఆకలితో వచ్చిన వారికి తగిన వాటిని ఇస్తూ ఉండేది. ఆమె మూడు సంవత్సరాల వయసులో జ్ఞాన స్నానం పొందింది, అది 1928 , ఫెబ్రవరి 8 వ తేదీన. మరియు 1937 లో డిసెంబర్ 8 న మొదటి సారి దివ్య సత్ప్రసాదం స్వీకరించింది. అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలు. దీని గురించి ఈమె అనేక సంవత్సరాల తరువాత “నా జీవితపు  అత్యంత సంతోషకరమైన రోజు యొక్క జ్ఞాపకం ఎప్పటికి నా మనసు నుండి చెరిగిపోదు, నేను మొదటి సారి నా దేవునితో ఐక్యం అయిన రోజు, ఆ రోజు నుండి రోజు రోజుకి మంచిగా ఉండాలని నిశ్చయించుకున్నాను”  అని చెప్పింది. 1993 లో ఆమె తన ప్రాధమిక విద్యను  ప్రారంభించింది. ఆమె ఒక సాధారణ విద్యార్థి.  ఎప్పుడు సంతోషంగా ఉండేది. ఎప్పుడు ఉల్లాసంగా అందరితో స్నేహ పూర్వంగా ఉండేది. తన  ప్రాధమిక విద్యను అభ్యసించిన తరువాత 1939-1940 వరకు రెండు సంవత్సరాలు ఆమె తన తల్లికి ఇంటి వద్ద సహాయ పడటానికి చదువును ఆపివేసింది.

1941 వ సంవత్సరం 16 సంవత్సరాల ప్రాయంలో కతొలిక  యాక్షన్ ర్యాంకు లో  సభ్యురాలు అయ్యింది.  ఇది తన జీవితంలో చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఈ సంఘం మీద తన ప్రేమ అనేక సమయాలలో తన లేఖలలో వ్యక్త పరిచింది. ఆమె ఉత్సాహం , అభిరుచి , ప్రేమ తన ఆశయం ఈ సంఘం ద్వారా  వ్యక్త పరుస్తూనే వుంది.   తన జీవిత విధానం ఒక మాటలో చెప్పాలి అంటే నీకు నా సమస్తాన్ని  అర్పిస్తాను. నిజముగా తన జీవితం మొత్తం అలానే జీవించింది.

తన చదువును ఆమె 1941 లో కొనసాగిస్తూ 1945 లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. ఈ సమయంలో ఆమె  తన సమయాన్ని ప్రత్యక్ష సేవకు కేటాయించింది. ఆమెను ధన్యురాలుగా ప్రకటించిన సందర్భంలో ఆమె యొక్క సేవను పొందిన వారు కూడా దానికి సాక్షులుగా ఉన్నారు. తాను ఏ విధంగా పేద వారి పట్ల  అంకిత భావంతో పని చేసింది అందరికి విదితమే. ఆమెను వారు విధులలో చిరునవ్వుతో చూసేవారు. ఆమె జాలితో అలసిపోయిన ఆత్మల కోసం వెతికే  దేవ దూతలా కనపడేది అని , నలిగి విరిగిన శరీరంతో ఉన్న వారికి సానుభూతి చూపే దేవ దూతల ఉండేదని, వారిని ఆమె ప్రేమిస్తున్నానని ఆమె చెప్పేది అని ఆమె గురించి వారు చెప్పేవారు.

తన భక్తి యుత జీవితం దివ్య సత్ప్రసాదం కేంద్రంగా సాగింది. ప్రతి రోజు యేసు ప్రభువును స్వీకరించడం మరియు దివ్య సత్ప్రసాదం ముందు గంటల తరబడి గడిపేది. తాను చేసే సహాయ కార్యక్రమాలకు కావలసిన  శక్తిని మొత్తం దివ్య సత్ప్రసాదం నుండి పొందుతుండేది. తన సహోదరులు ఆమెను గుర్తు చేసుకుంటూ, ఆమెను వారు కొన్ని సార్లు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఆమె మోకాళ్ల మీద ఉండి ప్రార్థించడం వారు చూసేవారు, అని చెప్పారు. మరియ మాత యెడల ఆమెకు గల భక్తి కూడా ఆమె రచనలలో మనకు తెలుస్తుంది.  అందుకే కాబోలు ఆమె మరణించే సమయంలో మరియ మాతతో కలవటం గురించి చెప్పింది.

1950 వ సంవత్సరంలో ఆమె తన కుటుంబంతో పాటు అసూన్సన్ వెళ్లారు. పరాగ్వేలో రాజకీయ అనిశ్చితి కారణంగా అది చాలా ఇబ్బందికర సమయం. వియారీక చాలా సున్నితమైన ప్రదేశం కనుక వారు అక్కడ నుండి వెళ్ళడం ఒక మంచి నిర్ణయం. అక్కడ మరల ఆమె కాథలిక్ యాక్షన్ ర్యాంక్ లో తన పేరు నమోదు చేసుకుంది. అంతే కాదు తను  అంతకు ముందు వలె పని చేయడం  మొదలుపెట్టింది. తన చదువును కూడా కొనసాగించింది.

1952 లో ఇక్కడ ఆమె ఏంజల్ సౌవ యణేస్ అనే  కాథలిక్ యాక్షన్ గ్రూపు యువ నాయకుడైన వైద్య విద్యార్ధిని కలిసింది. అతనితో ఆమెకు మంచి స్నేహం కుదిరింది. ఈ సమయంలో చికితుంగ  ఎంతో ఆధ్యాత్మిక మరియు మానవీయ సంపద కలిగి ఉంది. ఆమె ఆయనను ప్రేమించింది. ఆమె ఈ సమయంలో ఏమి చెప్పింది అంటే ప్రేమలో పడటం చాలా గొప్ప అనేది నిజమైన దైవ కృప,  అనేక సార్లు నేను దానిని గ్రహించాను. ప్రభువా ఇది ఒక అద్బుతమైన నిజం. ప్రేమించడం  మరియు  కలసి ఆ ప్రేమను  గొప్ప ఆశయం కోసం ప్రభువుకు త్యాగం చేయడం ఎంత మనోహరం. దైవ చిత్తానికి తనను తాను పూర్తిగా సమర్పించుకోవాలనే కోరికతో ఆ యువకుడు ఐరోపా వెళ్ళి సమీనారీలో చేరాడు.  మన చికితుంగ  కూడా దైవ స్వరం విని కార్మెల్లో  చేరాలి అనే కోరికతో ఆమెకు తెలిసిన నిష్పాదుకా కార్మెల్ మఠ పెద్ద దగ్గరకు వెళ్ళింది. కానీ తన కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. తరువాత కుటుంబ చాలా వ్యతిరేకంగా ఉన్నా, కాని ఆమె ఫెబ్రవరి 2న , 1955 లో తన 30 సంవత్సరాల వయసులో కార్మెల్లో చేరింది.  

కార్మెల్లో ఆమె వ్యక్తిగత జీవితం,  ఆనందం మరియు ఇతరులకు సహాయం చేయడంతో గడిపింది. ఆమెను చూసి ఒక సన్యాసిని దేవుడు మనకు మరియ ఫెలిసియాను ఒక ప్రత్యేక ఆనందంకు,  సరదాగా ఉండుటకు పంపాడు అని అన్నది. నిజానికి ఆమె నవ్వు ఒక పుష్పం వలె ఉంటుంది. అందరు ఆమె నవ్వును చూడటానికి  ఇష్టపడేవారు .

కార్మెల్లో తన మొదటి రోజులు చాలా ఆనందంగా గడిచాయి. దేవుడు ఆమెను కార్మెల్కు పిలిచినందుకు చాలా ధన్యవాదాలు చెబుతూ గడిపింది. తరువాత కొంత కాలానికి తను  కార్మెల్కు పిలవబడటానికి అర్హులను కాను ఏమో? అని అనుకునేది.

మొదటి కొన్ని నెలలు ఆమెకు స్వర్గంలో ఉన్నట్లు ఉన్నది. కాని తరువాత ఆమె ఆధ్యాత్మిక జీవితం పునీత సిలువ యోహను చెప్పిన విధంగా చీకటి రాత్రి లోనికి ప్రవేశించడం జరిగింది. ఈ సమయంలోనే ఆమె తన పిలుపును శంకించడం జరిగింది. తాను వెనక్కి వెళ్ళవలసి వస్తుంది అనుకున్నది. మదర్ తెరెసా మార్గరీటా అప్పుడు కార్మెల్ సుపీరియర్గా ఉన్నారు. ఆగస్ట్ 14 న , 1955 లో తాను కార్మెల్ సభ పవిత్ర వస్త్రాన్ని స్వీకరించడం జరిగింది.  తన ఆధ్యాత్మిక చీకటి రాత్రి అయిపోయింది. అప్పటి నుండి తాను చనిపోయే వరకు నిజమైన సంతోషాన్ని అనుభవించింది. తన మొదటి మాట పట్టు ఆగస్టు 15, 1956 లో తీసుకుంది.

కార్మెల్ స్వర్గానికి

అనేక మంది కార్మెల్ సభ సభ్యులు, వారు కార్మెల్లో ప్రవేశించడం అంటే ఈ లోకంలో ఇది  స్వర్గం ఏమో అన్నట్లుగా కార్మెల్ గురించి  చెప్పేవారు. అటువంటి వారిలో  పునీత మరియ ఫెలిసియా కూడా ఒకరు.  ఈమె కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే కార్మెల్ లో జీవించింది. ఆమె ఇక్కడ నేర్చుకున్నది, పాటించినది  ఏమిటి అంటే తన అనారోగ్యంలో ఓర్పు కలిగి ఉండటం. ఆమె ఎప్పుడు  చాలా చలాకీగా ఉండేది. తనకు అనారోగ్యం దరిచేరదు  అని ఆమె గట్టిగా విశ్వసించేది. కాని భౌతికంగా చాలా నీరసంగా ఉండటం మొదలయింది. ఆమె కాలేయ వ్యాధికి గురయింది. ఇదే వ్యాధితో ఆమె తన ఒక తోబుట్టువును కోల్పోయింది. 1959 జనవరిలో ఆమెను ఒక ప్రత్యేక ఆసుపత్రిలో ఉంచడం జరిగింది. తన చివరి రోజులలో  ఆమె తన జీవితాన్ని పూర్తిగా దైవ చిత్తానికి వదలిపెట్టింది. చివరిగా ఆమె ఆవిలా పురి తెరేసమ్మ గారి యొక్క “నేను మరణిస్తున్నాను ఏలన  నేను మరణించటం లేదు” పధ్యం చదవమని అడిగింది. దాని తరువాత  ఆమె హఠాత్తుగా తన మంచం లో నిలుచొని యేసువా !నేను నిన్ను ప్రేమిస్తున్నాను , ఆ మధుర కలయిక , కన్య మరియ అని చెప్పింది. దాని తరువాత ఆమెను యేసు ప్రభువు తనతో తీసుకుపోవడం జరిగింది. ఆమె మరణ వార్తా త్వరగా అంతటా వ్యాపించింది.  ఎందుకంటే ఆమె కతొలిక్ యాక్షన్ గ్రూప్ లో చేసిన సేవ అందరికి తెలుసు కనుక అందరు చాలా బాధ పడ్డారు. ఎలా ప్రజలు దేశ నలుమూలల నుండి వచ్చారు అనే విషయాన్ని అక్కడి సన్యాసినులు గుర్తు చేసుకున్నారు, అలా ఎప్పుడు జరుగలేదు అని.  అక్కడకు వచ్చిన వారు అందరు ఒక పునీతురాలు చనిపోయింది అని చెప్పారు.

పునీత రెండవ జాన్ పౌలు పోపుగారు ఆమెను 1997 లో దైవ సేవకురాలిగా ప్రకటించారు. 16 వ బెనెడిక్ట్ పోపుగారు ఆమెను 2010 మార్చి 27 న వెనరబుల్ గా ప్రకటించారు. 2018 జూన్ 23న  ధన్యురాలుగా ప్రకటించబడింది.  

 

క్రీస్తు రాజు మహోత్సవం

 క్రీస్తు రాజు మహోత్సవం 

 మత్తయి 25:31-46 

 "మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చునప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై  ఆసీనుడగును. అపుడు సకలజాతులవారు అయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెలకాపరి మేకలను, గొర్రెలను వేరు పరుచునట్లు అయన వారిని వేరుపరచును. అయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అపుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడిప్రక్కన ఉన్న వారితో 'నా తండ్రిచే దీవింప బడిన  వారలారా! రండు. ప్రపంచ ప్రారంభమునుండి మీకై సిద్దపరుపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలయన నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పికగొనినపుడు దాహము తీర్చితిరి, పరదేశినై యున్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనైయున్నపుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నపుడు నన్ను దర్శింపవచ్చితిరి' అని పలుకును. అపుడు ఆ నీతిమంతులు 'ప్రభూ!నీవు  ఎపుడు ఆకలిగొనియుండుట చూచి, భోజనము పెట్టితిమి? దప్పికగొని యుండుట చూచి దాహము తీర్చితిమి?ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి ?వస్త్ర హీనుడవై యుండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి?ఎప్పుడు రోగివైయుండుట చూచి, పరామర్శించితిమి? చెరసాలలో ఉండగా దర్శింప వచ్చితిమి?' అని అడుగుదురు. అందుకు రాజు 'ఈ నా సోదరులలో అత్యఅల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి. అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను' అని వారితో చెప్పును. అపుడు అయన తన ఎడమ ప్రక్కనున్న వారితో శాపగ్రస్తులారా!నా నుండి  తొలగి, పిశాచమునకు, దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యనరకాగ్నిలోనికి పొండు. ఏలయన నేను ఆకలిగొనియుంటిని, మీరు అన్నము పెట్టలేదు. దప్పికగొని యుంటిని, దాహము తీర్చలేదు. పరదేశినై యుంటిని, నన్ను ఆదరింపలేదు. వస్త్రహీనుడనై యుంటిని, నాకు వస్త్రములను ఈయలేదు. రోగినై యుంటిని నన్ను పరామశింపలేదు. చెరసాలలో  ఉంటిని, నన్ను దర్శింప రాలేదు' అనును. అపుడు వారు కూడ'ప్రభూ! నీవు ఆకలి గొనియుండుట, దప్పికగొనియుండుట, పరదేశివై యుండుట, వస్త్రహీనుడవై యుండుట, రోగివై యుండుట, చెరసాలలో నుండుట,, మేము ఏనాడు చూచి పరిచర్యచేయకపోతిమి ?'అని ప్రశ్నింతురు. అందుకు అయన, ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయనట్లే' అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకులు వెడలిపోవుదురు. నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు" అని పలుకెను. 

ఈ రోజు మనం యేసు క్రీస్తు రాజు  పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగను 1925 సంవత్సరంలో 11 వ భక్తినాధ పాపు గారు  స్థాపించారు. ఇది నిజమైన శాంతిని పొందడానికి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును అన్వేశించాలి మరియు ఆయన మాత్రమే శాంతి సమాధానం ఇవ్వగలరు అని తెలియజేసే ఒక పండుగ ఇది.   1918 వ సంవత్సరంలో లో మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత 1920 లో ఎవరు నిజమైన శాంతిని ఇవ్వగలరు అని ఆలోచిస్తూ నిజముగా క్రీస్తు మాత్రమే నిజమైన శాంతి ఇస్తాడు అని చెపుతూ స్థాపించిన పండుగ ఇది. 

ఇదే సమయంలో ఐరోపా మరియు ఇతర ప్రాంతాలలో ప్రజలు లౌకిక వాదం వైపు మొగ్గుచూపుతూ దేవుని యొక్క అవసరం మాకు లేదు అనే  ఆలోచన విధానం పెరిగిపోతున్న సమయం. దేవుని యొక్క అవసరం మాకు లేదు కాని మాకు మేము జీవించగలం, ఆనందంగా ఉండగలం అని మనం అనుకోవచ్చు కాని అది సాధ్యపడదు. యిస్రాయేలు ప్రజలు మనకన్నా ముందుగా ఇలా ఆలోచించి ఇది సాధ్య పడదు అని తెలుసుకున్నారు. 

 యిస్రాయేలీయుల రాజు 

మొదటిగా యిస్రాయేలు ప్రజలకు రాజు లేడు. దేవుడు  వారికి ఒక రాజు ఉండాలి అనిఅనుకోలేదు. ఎందుకు అంటే యిస్రాయేలు ప్రజలకు దేవుడే రాజుగా ఉండేవాడు. రాజు చేసేటువంటి పనులు మొత్తం దేవుడు వారికి చేస్తూనే ఉన్నాడు. వారిని అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తున్నాడు. ప్రభువైన దేవుడు ఆయన అన్నీ జాతులకు రాజు.  యిర్మియా 10,7. యిస్రాయేలును పవిత్ర ప్రజగా ఆయన ఎన్నుకున్నారు. వారి మధ్యలో నివసించారు. కీర్తన 134,3. యోషయా 52:7. నీ ప్రభువు నీ మధ్య నున్నాడు. నీవు సంతసింపుము అని జేపన్యా గ్రంధంలో మనం వింటాం. జఫన్యా 3:14-15.

ఇతర దేశాల రాజులు మరియు రాచరికం 

 పూర్వ కాలంలో రాచరికం, రాజ్యాధికారం దేవునికి సంభందించినవి అని అనుకునేవారు. ఈ ఆలోచన అప్పటి ప్రజల సంస్కృతి , సంప్రదాయాలలో కూడా కనిపించేది.  ఐగుప్తు దేశంలో  ఫరో రాజును హ్ోరోస్ అవతారంలా భావించేవారు.  ఆయన చేసే పనులన్నీ కూడా దేవునికి సంబంధించినవిగా అనుకునేవారు. బాబిలోనియా ప్రజలు తమ రాజును మదురుక్ ప్రతినిధిగా భావించేవారు. రాజును దేవుడు  భూమి, ప్రజలు, సైన్యం, దైవబలి మొదలగు వాటికి  అధిపతిగా చేశాడు అని భావించేవారు. బాబిలోనియా, ఐగుప్తు దేశాల రాజులు, వారి రాచరికం గురించి మనం తెలుసుకున్నప్పుడు, రాజు దేవుని ప్రతినిధి అనే భావన కలుగుతుంది. ఇదే ఆలోచనను తరువాత గ్రీకు మరియు రోమా రాజ్యాలలోనూ ఉంది. ఇది ఇంకా కొంచెం పరిధి దాటి రాజును దేవునిగా చూడటం వారు మొదలు పెట్టారు. 

యిస్రాయేలు ప్రజలు రాచరికం 

యిస్రాయేలు ప్రజలకు మానవ రాజు అనే ఆలోచన అసలు లేదు. కాని వారు ఎప్పుడైతే ఐగుప్తు , బాబిలోనియా దేశాలలో బానిసలుగా ఉన్నారో అప్పుడు వారికి ఈ ఆలోచన కలిగింది. మనకు ఒక రాజు కావాలి అనుకున్నారు. వారు అక్కడ నుండి వచ్చిన తరువాత మిధ్యానియుల నుండి కాపాడిన తరువాత వారు గిద్యొనును తమ మీద రాజుగా వుండమని కోరారు. కాని ఆయన ఒక విషయం స్పష్టం చేశాడు. నేను కాని నా కుమారుడు కాని మిమ్ము పరిపాలింపము. ప్రభువే మిమ్ము పాలించును. దేవుడే మిమ్ములను పాలించును అని వారికి తెలియజేశాడు.  న్యాయాధిపతులు 8:23.  దేవుడు ఒడంబడిక ద్వారా వారిని ఎన్నుకొని వారిని పాలించాడు. కాని తరువాత  అబిమలేకు రాజును కావాలనే ఆశతో  షెకెము వద్ద  కానా తరహా రాచరికాన్ని  స్థాపించాలని  చుసాడు. కాని అది నాశనం అయ్యింది. తరువాత సమూవేలు ప్రవక్త  కూడా మానవ రాచరికానికి వ్యతిరేకముగా ఉన్నాడు. ప్రజలు పదే పదే అడుగుట వలన సమూవేలు ప్రవక్త  వారికి దేవుని ఆజ్ఞ ప్రకారం  సౌలును రాజుగా అభిషేకించారు. సౌలును దేవుడు తన ఆత్మతో నడిపించాడు. కాని సౌలు తరువాత తనకు ఇష్టమైన విధముగా జీవించడం వలన దేవుడు అతన్ని తిరస్కరిస్తున్నాడు. దాని తరువాత దేవుడు దావీదును రాజుగా ఎన్నుకుంటున్నాడు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు నీ కుటుంబము, రాజ్యము కలకాలము  నా కనుసన్నులలో మన్నును , నీ సింహాసనం నిత్యం, నెలకొని యుండును, అని  వాగ్ధానం చేసాడు. కాని యిస్రాయేలులో చెడు రాజులు ఎక్కువయ్యారు. వారు పొరుగు దేశాలను చూసి వారి వలె విగ్రహారాధన చేశారు. ప్రవక్తలను వ్యతిరేకించారు. హొషేయా ప్రవక్త రాజరికాన్ని ఖండించాడు. కాని  యేషయా ప్రవక్త  భవిష్యరాజు పుట్టుక గురించి చెప్పాడు. దేవుడు వారికి రాజుగా ఉండటం మరియు దావీదు వంశం నుండి రాజు రావడం సాధ్య అవుతుంది యేసు ప్రభువుతోటి. 

దేవుడు ఎందుకు వారికి రాజును ఇవ్వాలనుకోలేదు. 

దేవుడు యిస్రాయేలు ప్రజలకు ఒక రాజును ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకు అంటే సమూవేలు ప్రవక్త చెప్పిన ప్రకారం ఈ లోక  రాజులు ఈ ప్రజలను బానిసలుగా వాడుకుంటున్నారు, దేవుడు వారిని స్వతంత్రులుగా ఉంచాలి అని అనుకున్నారు, రాజుగా ప్రజల బాగోగులను దేవుడు ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నాడు. వారిని ఇతర రాజ్యాలనుండి  కాపాడాడు, వారికి కావలసిన అన్నీ వారికి సమకుర్చాడు.  అన్నీ విధాలుగా వారి మధ్యనే దేవుడు ఉన్నాడు. అందుకే వారిలో ఒక ఆలోచన ఉండేది. మెలెక్  యాహ్వె అని . మెలెక్ అంటే రాజు అని, యాహ్వె అంటే ఉన్నవాడు అని అర్ధం. మెలెక్ యాహ్వె అంటే నిత్యం ఉండువాడు మనకు రాజు  అని, లేక దేవుడు మనకు రాజు అని అర్ధం. అప్పటి నుండి ప్రజలలో దేవుడు మాకు రాజు అనే భావన ఉండేది.  

 యిస్రాయేలు ప్రజలలో  దేవుడు వారి రాజు అనె  భావనలో పూర్తిగా వ్యక్తం కాకపోయినా  ప్రవక్తలు దీని గురించి చాలా నిశ్చితమైన అభిప్రాయంతో ఉండేవారు. వారు దేవున్ని తమ రాజు అని ప్రకటించుకున్నారు. దేవుడు తమ రాజు అని గర్వంగా చెప్పుకునేవారు. మిగిలిన రాజులు కేవలం మానవ మాత్రులు అని ఎగతాళి కూడా చేసేవారు. 

తరువాత కాలంలో యిస్రాయేలు ప్రజలు  మెస్సీయా వారి రాజుగా ఉండాలి అని వారు కోరుకున్నారు. యేసు ప్రభువు యెరుషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలు ఈ కోరికను వ్యక్త పరిచారు. ఇక్కడ యేసు ప్రభువు విజయోత్సవ రాజు వలె యెరుషలేముకు వస్తున్నాడు. వారు ఆయనను తమ మెస్సీయాగా వారు ఒప్పుకుంటున్నారు. యోహను 6 వ అధ్యాయంలో మనం ప్రజలు ఆయనను బలవంతంగా రాజును చేయబోతున్నారు అని తెలిసి అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. మనం  యేసు ప్రభువు సిలువ వేయబడిన సిలువ మీద ఈసూస్ నజారెనుస్  రెక్స్ ఇదయరేయుమ్. నజరతు నివాసి అయిన యేసు యూదుల రాజు అని చదువుతాం.ఇది పూర్తిగా వారి కావాలని కోరుకున్న లేకున్నా దేవుడు వారి రాజుగా ఆయననను అంగీకరిస్తున్నారు. 

 యేసు ప్రభువు ఎటువంటి రాజు ? యేసు ప్రభువును వారు ఏమి కోరుకుంటున్నారు, యేసు ప్రభువునుగురించి  సువిశేషంలో మనం ఏమి తెలుసుకుంటున్నాము?  అంటే వారు యేసు ప్రభువు నందు వారి అవసరాలను తీర్చే రాజును, వారిని పీడించే వారి నుండి  విడిపించేలా చేసే రాజును వారు చూస్తున్నారు. వారి అనారోగ్యాలను తొలగించే వైద్యుడిని వారు చూస్తున్నారు. వారికి స్వేచ్ఛను ఇచ్చే రాజును వారు చూస్తున్నారు. విటన్నింటికంటే వారు స్వతంత్రులుగా ఉండాలి అని అనుకున్నారు.

ఇవి అన్నీ కూడా కేవలం యేసు ప్రభువు ద్వారా మాత్రమే సాధ్యం అవుతాయి అంతే కాదు మనకు నిజమైన శాంతిని ఇచ్చేది  కూడా ప్రభువు మాత్రమే. జీవాన్ని మరియు స్వాతంత్రంను ఇచ్చి మనలను బానిసత్వం నుండి నడిపించే రాజు కనుక ఎల్లప్పుడు ఆ ప్రభువు పాలనలో ఉండాలి అని కోరుకుందాం.

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

 తపస్సుకాలపు రెండొవ ఆదివారము ఆదికాండము 15:5-12, 17-18 ఫిలిప్పీయులు 3:17-4:1 లూకా 9:28-36           క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని...