26, ఫిబ్రవరి 2026, గురువారం

యోహాను 6:1-15

 యోహాను 6:1-15 

ఆ పిదప యేసు తిబేరియా అనెడి గలీలియ సరస్సు దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అధ్బుత కార్యములను చూచి గొప్ప జనసముహము ఆయనను వెంబడించేను. యేసు పర్వతమునెక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యూదుల పాస్క పండుగ సమీపించినది. యేసు కనులేత్తి గొప్ప జనసముహము తన యొద్దకు వచ్చుట చూచి, పిలిప్పుతో వీరు భుజింపవలసిన అహర పదార్ధములను మనమెక్కడ నుండి కొని తెచ్చెదము? అనెను. పిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలన, తానేమి చేయబోవుచున్నది ఆయనకు తెలియును. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైన రెండువందల వరహాల రొట్టెలు కూడ చాలవు అని పిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు  సీమోను పేతురు సోదరుడు, అంద్రెయ : ఇక్కడ ఒక బాలుని యొద్ద ఐదు యవ (గోదుమ) రొట్టెలు, రెండు చేపలు కలవు. కాని, ఇంత మందికి ఇవి ఏమాత్రము? అని పలికెను. యేసు "అందరను భోజనమునకు కూర్చుండబెట్టుడు" అనెను. అచట ఇంచుమించు  ఐదు వేల మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అపుడు యేసు రొట్టెను తీసికొని, ధన్యవాదములు అర్పించి, కూర్చున్న వారికి వడ్డించేను. అట్లే చేపలను కూడ వారికి తృప్తి కలుగునంతగ వడ్డించేను. వారు తృప్తిగా భుజించిన పిదప, యేసు శిష్యులతో "ఏమి వ్యర్ధము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు" అని చెప్పెను. వారు భుజించిన పిదప ఐదు యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను పండ్రెండు గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అధ్భుతమును చూచి, వాస్తవముగ ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే" అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగ రాజును చేయనున్నారని తెలిసికొని, యేసు మరల ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. 

ధ్యానము: యేసు ప్రభువు రోగుల పట్ల చేసిన అనేక అద్భుత కార్యములు చూసిన వారు, ఆయనను అనుసరిస్తూ వచ్చారు. ఈ ప్రజలు ఆయన దగ్గరకు అనేక కారణాలతో వచ్చారు. కొంత మంది ఆయన చేసిన అద్భుతాలు చూసి వారు జీవితాలలో కూడా స్వస్థత జరుగుతుంది అని వచ్చి ఉంటారు, కొంతమంది దేవుని వాక్కు వినాలి అని కోరికతో వచ్చి ఉంటారు. కొంత మంది ఈ అధ్బుతాలు చేసే ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి వచ్చి ఉండవచ్చు. వారు ఎటువంటి కారణాలతో వచ్చిన యేసు ప్రభువు వారిని అదరిస్తున్నారు. అది ఎలాగంటే వారు తినుటకు ఏమి అయిన దొరుకుతుందా అని అడుగుతున్నారు. ప్రభువు ఎప్పుడు కూడా మన అవసరాలు చూసి, వాటిని తీర్చడానికి ఎంతో సహాయపడుతారు. ఇక్కడ యేసు ప్రభువు ప్రజలను చూసి వారు తినుటకు ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారు. 

పిలిప్పుతో వారు భుజించుటకు కావలసిన ఆహార పదార్ధాలు మనము ఎక్కడ నుండి తీసుకొనిరావాలి అని అడుగుతున్నారు. వారికి సమృద్దిగా ఇవ్వక పోయిన, కొద్ది కొద్దిగా భుజించుటకు అయిన సుమారు రెండు వందల వరహాల రొట్టెలు  అయిన సరిపోవు అని చెబుతున్నారు. పురుషులు మాత్రమే సుమారు ఐదువేల మంది అక్కడ ఉన్నారు. కాని మిగిలిన వారు స్త్రీలు మరియు పిల్లలు కూడా ఉన్నారు, వారిని సహజముగా లెక్క పెట్టారు. విరందరికి సరిపడిన ఆహారం ఇవ్వడం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే వారు ఉన్న ప్రదేశం మరియు సమయం కూడా అనుకూలముగా లేదు. కాని యేసు ప్రభువు వారి ఆకలిని చూస్తున్నారు. వారు సమృద్దిగా భుజించాలి అని కోరుకుంటున్నారు. ఎందుకు యేసు ప్రభువు వారి ఆకలి తీర్చాలి అని అనుకుంటున్నారు. యేసు ప్రభువు చేసిన ఏ అధ్భుతము కూడా తన మహిమను తెలియ పరుచుకోవడానికి చేయలేదు. ప్రజల అవసరం గ్రహించి, వారికి అప్పటి అవసరం తీర్చడానికి మాత్రమే చేశారు. ఇక్కడ కూడా ప్రజలు ఎంతో ఆకలితో ఉన్నారు. వారి ఆకలి తీర్చడం చాల అవసరం అక్కడ అందుకే వారి ఆకలి తీర్చడానికి సిద్దపడ్డారు. 

అంద్రేయ ఒక పిల్లవాని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు కలవు అని చెబుతున్నారు.  అవి ఇంతమండికి ఏ మాత్రము అని చెబుతున్నాడు. అంటే మనము వీరి ఆకలి తీర్చలేము అనే భావనలో ఉన్నాడు.  అక్కడ వేల మంది ప్రజలు  మంది ఉన్నారు. వీరి ఆకలి మాత్రమే యేసు ప్రభువు చూస్తున్నారు.  వారి ఆకలి తీర్చడానికి ప్రభువు ఏమి చేయాలో ఆయనకి తెలుసు అందుకే అందరికీ భోజనానికి కూర్చోమని చెబుతున్నారు. ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను దీవించి యేసు ప్రభువు అందరు తృప్తి పడునంతగ వారికి వడ్డించారు. ఇది కేవలం ఒక అద్భుతము మాత్రమే కాదు. యేసు ప్రభువు మన జీవితాలలో ఉంటే మనకు ఎలా సమృద్ది దొరుకుతుందో మనము తెలుసుకోవచ్చు.  మెస్సీయ్యా వచ్చినప్పుడు అందరూ సమృద్దిగా ఉంటారు మరియు  తృప్తి చెందుతారు అనే ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. సమృద్ది మరియు తృప్తి అనెది యేసు ప్రభువుతోనే సాధ్యం అవుతుంది. 

యేసు ప్రభువు చేసిన ఈ అద్భుతము ఆయనకు తన తండ్రికి ఉన్న సంబంధమును తెలియజేస్తుంది. యేసు ప్రభువు రొట్టెలను పైకెత్తి దీవించిన వాటిని పంచిన అవి అయిపోలేదు ఇంకా పన్నెండు గంపలు మిగిలినవి. అంటే అందరూ భుజించిన ఇంకా రానివారికి, అక్కడ లేని వారికి కూడా మిగిలినవి. యేసు ప్రభువు వద్ద ప్రతిఒక్కరికి స్థానం ఉంటుంది, కేవలం కొంతమందికి లేక ఎన్నుకొన బడినవారికి అంటూ ఏమి ఉండదు. ప్రతి ఒక్కరూ ఆయన వద్ద స్థానం పొందవచ్చు ఆయన నుండి అన్నీ పొందవచ్చు.  ఇక్కడ యేసు ప్రభువు చేసిన ఈ అద్భుతం మన నుండి కూడా సహకారము కావాలి అని అడుగుతుంది. ఏవిధంగా అయితే ఒక చిన్న పిల్లవాడు తన వద్ద ఉన్న ఐదు రొట్టెలను రెండు చేపలను ప్రభువుకు ఇస్తున్నాడో మన వద్ద ఉన్న వాటిని ప్రభువుకు సమర్పించగలిగితే ఆయన మన ద్వారా ఎన్నో అద్బుతములను చేస్తారు. క్రీస్తు అనుచరులుగ మనం ఆయనకు ఎప్పుడు సహకరించాలి. 

యేసు ప్రభువు తన చేసిన స్వస్థతలు లేక అధ్బుతాలు ఏవి కూడా తన మహిమను చూపించడానికి చేయలేదు కేవలం ప్రజలు శ్రేయస్సు , మంచి కోసమే చేయడం జరిగినది. యేసు ప్రభువును ప్రజలు బలవంతముగ రాజును చేస్తున్నారని ఆయన అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. ప్రజలలో రానున్న మెస్సీయ్యా , యేసు ప్రభువే అని అనుకున్న ఆయన గడియ వరకు ఆయన వేచి ఉన్నాడు గాని తన మహిమను చూపించాలి అనుకోలేదు, యేసు ప్రభువు నుండి మనం ఈ మాతృకను నేర్చుకోవాలి, ఆయన చేయవలసిన మంచి చేసి ఏమి ఆశించకుండా అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. మనం కూడా అలానే ఎప్పుడు మంచి చేస్తూ ఇతరుల నుండి ఏమి ఆశించకుండా ఉండుటకు ప్రయత్నించాలి. 

ప్రార్ధన : ప్రభువా! మీరు మీ జీవితంలో అన్నీ అధ్భుతాలు మానవుని మంచికి, స్వస్థతకు, ఆకలి తీర్చుటకు మాత్రమే చేశారు. మా జీవితములలో కూడా మేము మా గొప్ప తనమును లేక మా ఆధిపత్యం చూపించుటకు కాక ఇతరులకు మంచి చేయడం కోసం పని చేసే మంచి మనసును మాకు ఇవ్వండి. ప్రభువా ! మీరు ఒక చిన్న బాలుడు ఇచ్చిన ఐదు రొట్టెలు రెండు చేపలను అక్కడ ఉన్న వారికి అందరు  సంతృప్తిగా భుజించునట్లు చేశారు. మా దగ్గర ఉన్న కొద్ది కొద్ది మంచి గుణాలను పరిపూర్ణంగా అయ్యేలా దీవించండి. మా జీవితాలలో ఉన్న లేమినంతటిని తీసివేసి సమృద్దిని దయచేయండి. ఆమెన్. 



యోహాను 6:22-29

 యోహాను 6:22-29 

మరునాడు, సరస్సు ఆవలి తీరమున ఉండిపోయిన జనసమూహము, అచటనున్న ఒకే ఒక పడవను చూసిరి. ఆ పడవలో  శిష్యులతోపాటు యేసు వెళ్లలేదని శిష్యులు మాత్రమే వెళ్ళుట చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా  నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసు గాని, శిష్యులుగాని లేకుండుట చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివి?" అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసిఉన్నాడు." అని యేసు సమాధానమిచ్ఛెను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను? అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది." అని చెప్పెను.

ధ్యానము : యేసు ప్రభువును వెదకుచు తిబేరియా నుండి ప్రజలు వస్తున్నారు. వారు, అక్కడ యేసు ప్రభువు లేరని గ్రహించి, అక్కడ నుండి యేసు ప్రభువును వెదకుచు కఫర్నాము  వెళ్లారు. వారు ఎందుకు యేసు ప్రభువును వేదకుచు వచ్చారు? వీరు అనేక కారణాలతో యేసు ప్రభువును వెదకుచు వచ్చి వుంటారు. కాని అన్ని  కారణాలు కూడా తాత్కాలికమైనవే. వారు యేసు ప్రభువును చూసి "బోధకుడా! నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివి? అని అడిగిరి." అందుకు ప్రభువు మీరు నా అధ్భుతములు చూసి కాదు, మీరు సంతృప్తిగా భుజించినందుకు నన్ను వెదకుచున్నారు అని వారితో చెబుతున్నారు. ఆనాటి ప్రజలు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినది కూడా వారి యొక్క అవసరాలు తీరుస్తారని, లేక వారి కడుపు నింపుతారని లేక వారి తాత్కాలిక భాదల నుండి వారికి ఉపశమనం కలుగచేస్తారని వారు యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నారు. అంతేకాని ఆయన వారికి శాశ్వతమైనవి ఇస్తారు అనే ఆలోచన వారికి లేదు. 

యేసు ప్రభువు నందు వారందరు కేవలం వారికి కావలసిన, తాత్కాలిక ఉపశమనం ఇచ్చే వ్యక్తిని మాత్రమే చూశారు. వారికి అంతకంటే ఎక్కువుగా ఏమి ఉంటుంది అని తెలియదు. ఎందుకంటే వారి  ఆలోచనలు ఎప్పుడు ఇహలోక విషయముల గురించి మాత్రమే.  నేను కూడా ఈరోజు ఇటువంటి ఆలోచనలు మాత్రమే కలిగిఉన్నానా? అని ఒక సారి ఆలోచిస్తే ఈరోజు ఎక్కువగా దేవాలయము వచ్చేది మరియు ప్రార్ధించేది కూడా ఇటువంటి ఆలోచనలతోనే, తాత్కాలికమైన వాటికోసమే మనం దేవున్ని కోరుకుంటున్నాము. యేసు ప్రభువు స్వస్థ పరచిన అనేక మంది తరువాత ఆయన వెంట ఏమి లేరు, దాని తరువాత వారి పనులలో వారు నిమగ్నమైపోతున్నారు. కాని యేసు ప్రభువు ఎవరు ? ఆయన కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చేవాడేనా? లేక ఆకలి తీర్చే వాడు మాత్రమేనా? ఆయనను పూర్తిగా అర్ధం చేసుకోలేక పోతున్నాము. అయినప్పటికీ యేసు ప్రభువు అనేక సార్లు ఆయన ఎవరు ఆయన మనకు ఏమి ఇవ్వగలడు అని  తెలియజేస్తూనే ఉన్నారు, కాని అది మనం అర్ధం చేసుకోలేకపోతున్నాము. 

నా అధ్భుత కార్యములు చూసికాదు మీరు వచ్చినది అని యేసు ప్రభువు చెబుతున్నారు. యోహాను సువిశేషంలో యేసు ప్రభువు చేసిన ప్రతి అద్భుతం కేవలం ఆయన దేవుడు అని తెలియజేస్తుంది. ఆ అద్భుతాలలో ఇది ఏ మానవు మాతృడు చేయలేడు అనే అర్ధం వస్తుంది. యేసు ప్రభువు ప్రతి అధ్బుతం కూడా ఆయన దేవుడు అని తెలుపుతుంది. అటువంటి ప్రభువును మనము అర్ధం చేసుకోక ఆయన నుండి కేవలం ఇహలోక విషయములను మాత్రమే ఆర్ధిస్తున్నాం. ఆయన మనకు ఏమి ఇవ్వ గలడో మనం పూర్తిగా తెలుసుకోలేక పోతున్నాము. ఇహలోక సంబంధమైనవాటిని కాకుండా ఆయన మనకు ఏమి ఇవ్వగలడు? అని ఒక సారి పరిశీలించనట్లయితే యోహాను సువిశేషం మొత్తం కూడా అదే మనకు ఆయన చెబుతున్నాడు. 

"అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును." యేసు ప్రభువు మనకు ఏమేమి ఇవ్వగలడు మరియు మనము దేనికి శ్రమించాలి అనే విషయాలను ఇక్కడ యేసు ప్రభువు వెల్లడి చేస్తున్నారు. ఏమిటి శాశ్వతమైన భోజనం? ఆ భోజనము ఏమి ఇస్తుంది? యేసు ప్రభువు దీని గురించి తరువాత చెబుతారు , మోషే మీకు పరలోకము నుండి మన్న ఇవ్వలేదు. మనుష్య కుమారుడు మాత్రమే మీకు శాశ్వత భోజనము ఇస్తారు అని. ఆ శాశ్వత భోజనము ఏమి చేస్తుంది? అంటే నిత్య జీవనము ఇస్తుంది. యేసు ప్రభువు ప్రసాధించగలిగి మరలా ఎవరు ప్రసాదించలేనిది ఇదే. అదే నిత్య జీవము. ప్రభువు మనలను తన నుండి దానిని కోరుకోమని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన మాత్రమే అది ప్రసాదించగలడు. అంతే కాదు తండ్రి దేవుడు ఆయనకు ఆ అధికారమును ఇచ్చిఉన్నారు.

దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడిగినప్పుడు యేసు ప్రభువు వారికి తనను విశ్వసించమని చెబుతున్నారు. ఇక్కడ యోహాను సువిశేషం మనకు యేసు ప్రభువును విశ్వసించడం గురించి మనకు అనేక సార్లు గుర్తుచేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువును విశ్వసించే వారు ఎలా నిత్య జీవం పొందుతారో ఈ సువిశేషం మనకు వివరిస్తుంది. యేసు ప్రభువును విశ్వసించే వారు, విశ్వసించుట వలన నిత్య జీవం పొందుతారు, వారికి దేవుని బిడ్డలగు భాగ్యమును ఆయన ప్రసాదించారు. తండ్రి దేవుడు మన నుండి ఆశించేది ఏమిటి అంటే మనం తన కుమారుడయిన యేసు ప్రభువును విశ్వసించాలి అని, ఆ విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందాలి దేవుడు ఆశిస్తున్నారు. 

ప్రార్దన : ప్రభువా ! మీరు మా మీద ఎంతో ప్రేమతో మమ్ములను ఎల్లప్పడు మీతో ఉండేలా, నిత్య జీవితాన్ని మాకు ఇవ్వాలి అని మా దగ్గరకు వచ్చి , మీరు అనేక అధ్బుతలు చేసి మీరు మాకు ఏమి ఇవ్వగలరో చూపించన కాని మేము మిమ్ములను అర్ధం చేసుకోవడంలో విఫలం చెందాము, మా తాత్కాలిక భాదలు నుండి సమస్యల నుండి ఉపశమనాన్ని మాత్రమే మిమ్ము కోరుతూ ఉన్నాము. మా అజ్ఞానం మీకు తెలుసు ప్రభువా మేము ఏమి కోరుకోవాలో కూడా తెలుసుకోలేని పరిస్థితులలో మేము ఉన్నాము అటువంటి సమయాలలో మమ్ము క్షమించండి. మేము ఏమి అడగాలో , ఏది శాశ్వతమో అది అశాశ్వతమొ మాకు తెలియజేయండి. మేము ఎల్లప్పుడూ  అశాశ్వతమైన వాటి కోసం పని చేసే వారిగా మమ్ములను మలచండి. మీరు మాత్రమే ఇచ్చే ఆ నిత్యం జీవం కోసం పని చేసే వారిగా , మిమ్ము ఎప్పుడు విశ్వసించే వారిగా మమ్ము చేయండి. తండ్రి మా నుండి ఆశించే పనిని చెసేలా మమ్ము ఆశీర్వదించండి. ఆమెన్ 


లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...