26, ఫిబ్రవరి 2026, గురువారం

29 వ సామాన్య ఆదివారం

 29 వ సామాన్య ఆదివారం

 గొప్పతనానికి మార్గం

(యెషయా 53:10-11, హెబ్రీ 4:14-16, మార్కు 10:35-45 )

ప్రియ సహోదరులారా ఈనాటి సువిశేషము మరియు పఠనాలు ఒక వ్యక్తి గొప్ప వానిగా ఎదగాలంటే ఏమీ చేయాలి అని చెబుతున్నాయి .  లోక పోకడలను బట్టి కాక దేవుని దృష్టిలో గొప్పతనం ఏమిటని మనం తెలుసుకుంటున్నాంమొదటి పఠనం యెషయా ప్రవక్త బాధామయ సేవకుడు ఏవిధంగా అనేక కష్టాలను  అనుభవించి తన జీవితాన్ని అనేక మంది రక్షణకు కారకుడు అవుతాడు అని  తెలియచేస్తుంది.

ప్రవక్తలు ఎందుకు  కష్టాలను అనుభవించారు

  ప్రవక్తల జీవితాలు  విధముగా  యిస్రాయేలు  ప్రజలను దేవుని వైపు నడుపాయొ మనకు  తెలుసుమోషే ఎన్నో  కష్టాలు అనుభవించారు దేవుని ప్రజలను నాయకునిగా నడపడానికి,అయినకానీ, ప్రజలు ఆయన మీద తిరగబడుతున్నారుయెషయా  ప్రవక్త అనేక కష్టాలు  పడుతున్నారు. యిర్మీయా ప్రవక్త  నేను నా ముఖమును  చెకుముకి రాయి వలె చేసుకుంటిని అని అంటున్నాడు కష్టాలు పడటము ద్వార వారికి వచ్చే లాభం ఏమి లేదుమరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు పడుతున్నారుమొదటిగా దేవుని మీద వారికి గల ప్రేమ వలన,  మరల తమ  ప్రజలు ఆనందమైన జీవితం జీవించాలనిఆమోసు ప్రవక్త  నేను పొట్ట కూటి కోసం  దేవుని వాక్కు  ప్రకటించుట లేదు అని అమాస్య తో చెప్పారుఎందుకంటే వారు  దేవునికి తగిన విధముగా  జీవించకుండా వారికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు. ప్రవక్తల జీవితాల ద్వారా వారు తమ ప్రజలకోసం అన్నీ కష్టాలు అనుభవించడానికైనా సిద్దంగా ఉన్నారు అని మనం తెలుసుకుంటున్నాంవీరు కష్టాలుబాదలు వేరే వారిని ఆనందమైన జీవితం జీవించేలా చేస్తున్నాయిప్రజలు అంత తెలివి గల వారు కారుచాలా సార్లు అనేక మోసాలకుస్వల్ప ఆనందాలకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారువారిని కాపాడటానికి ప్రవక్తలు బాదలు అనుభవించారుఇది ప్రవక్తల గొప్పతనంవారు దీని ద్వార ఎటువంటి లాభాన్ని ఆశించలేదుపొందనూ లేదు.

గొప్పవారు ఎలా ఉంటారు

 లోకములో గొప్పవారికి,  దేవుని దృష్టిలో గొప్పవారికి గల వ్యత్యాసం గురించి  యేసు ప్రభువు  విధంగా అంటున్నారు.  అన్య జనుల రాజులు  వారిపై అధికారం చెలాయింతురువారి అధికారులు ఉపకారులు అని పిలవబడుతున్నారుకానీ మీరు అటుల చేయవలదుమీలో గొప్పవాడు చిన్న వానివలెనునాయకుడు సేవకునివలె ఉండాలి అని చెబుతున్నారులూకా 22:25,26. యేసు ప్రభువుమనుష్య కుమారుడు సేవించడానికే కానీ సేవించబడటానికి రాలేదు అని చెబుతున్నారు. మార్కు 10:45. గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులకు, అల్పులకు  ప్రాముఖ్యతను ఇస్తారుమనకు ఉన్న బహుమానాలుఅవార్డులుడబ్బులుఆస్తుల ద్వార మనం గొప్పవాళ్లు కాము దేవుని దృష్టి లో  గొప్పతనం మన ప్రవర్తన మీద  ఆధారపడి ఉంటుందిమనము ఎంత  సేవ చేయడానికి సిద్ధముగా ఉన్నాము, అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.

శిష్యులు ఎందుకు ప్రత్యేక స్థానాలు అడుగుతున్నారు

యాకోబు యోహనులు యేసు ప్రభువుని ఒక కోరిక కోరుతున్నారు, మార్కు 10:37 మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడిఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని అడుగుతున్నారు యేసు ప్రభువు రూపాంతరీకరణ జరిగినప్పుడు ఆయనతో పేతురు,యోహను ,యాకోబులు ఉన్నారువారికి తెలుసు అది ఎంత గొప్పగా ఉన్నది అనిమత్తయి 19 అధ్యాయము 28 వచనములో మనము చూస్తాము మనుష్య  కుమారుడు తన సింహాసనము మీద కూర్చుండినప్పుడు మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చుంటారు అని చెప్పారుకానీ శిష్యులు దానిని  లోక అధికారములాంటిది అని అనుకుంటున్నారుఅందుకే ప్రభువు  పరలోక భూలోక అధికార వ్యత్యాసం గురించి చెబుతున్నారు లోకములో ఉన్న  పాలకులువేరే వారి మీద అధికారం చూపించడానికి , పెత్తనం చేయించడానికి చూస్తారు, కానీ మీరు అలా కాకుండా సేవ చేయటానికి ముందు ఉండాలి అని చెబుతున్నారుఅది అర్దము కానీ శిష్యులు పరలోకం  కూడా ఈ లోక సింహాసనం లాంటిది అనుకుంటున్నారువారికి కావలసినది లోక  సింహాసనాలుఅంతే కానీ పరలోక విధానము తెలిసి కాదు వారు అడిగేదిత్వరగా వారు అందరి చేత గొప్ప వారిగా పరిగణించబడాలి అని మాత్రమే అనుకుంటున్నారు.

యేసు ప్రభువు ఎటువంటి బలి అవుతున్నారు

 యోహను యాకోబులు అడిగిన దానికిమీరు ఏమి కోరుతున్నారో మీరు ఎరుగరునేను పానము చేయు పాత్రమునుండి  మీరు పానము చేయగలరానేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరాఅంటున్నారుఏమిటి  పాన పాత్ర ? పాన పాత్ర అంటే చాలా శ్రమలుతో కూడిన జీవితముయెషయా 51:17  నీవు ప్రభువు కోపము అను పాత్రము నుండి  పానీయము త్రాగి పడిపోతివి అంటున్నారుకొన్ని సార్లు దీనిని ప్రవక్తల పాత్రము అంటారు. పాత్ర ఒక సంజ్ఞ గా ఉండేది ప్రవక్తలకు వారి గమ్యం తెలియ చేస్తూ ఉంటుంది పాన పాత్రంవారి గమ్యం  కష్టాలతో కూడుకొని ఉంటుంది ఇది  వారు పొందిన బాధలు  తెలియచేస్తుందిదేవుని కోపాన్ని తెలియచేస్తుందిఅంటే దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికి పూనుకోవాలిప్రవక్తలు పొందిన కష్టాలు దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికే  యేసు ప్రభువుమత్తయి  26 లో  పాత్రనునానుండి తీసి వేయమని అడుగుతున్నారు, అంటే అది చాలా  కష్టాలతో కుడినదిదానికి భరించడానికి మనము చాలా కష్ట పడాలియేసు ప్రభువు  బాప్తిస్మము  గురించి  చెప్పుతున్నారుఇక్కడ మనము తీసుకునే బాప్తిస్మము  గురించి కాదు కానీ చాలా కష్టముతో కూడిన శ్రమలలో  తీసుకునే బాప్తిస్మము  గురించి చెప్పుతున్నారుయేసు ప్రభువు జ్ఞానస్నానం  యొర్ధాను నదిలో మొదలై  గెత్సమని తోటలో ముగుస్తుంది.  తన తండ్రి చిత్తానికి తలవంచి శ్రమల పాన పాత్రను అంగీకరించాడు యేసు ప్రభువు.

క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని వదలి  తనను తాను రిక్తుని  చేసుకొని మనలను కాపాడటానికి వచ్చాడుఅన్నీ వదులుకోవడానికి ఆయన సిద్దపడ్డారుదేవునితో తన సమానత్వాన్ని వదలి , మర్త్య మానవ రూపాన్ని స్వీకరించాడు.

మనము  విధముగా ఉన్నాం

మనము ఎలా ఉన్నాముకేవలము పాపం చేయకుండా ఉండటానికే ప్రాముఖ్యత ఇస్తూ మంచి చేయటము పట్టించుకోవము ?  ఈనాటి సువిశేషము మార్కు 10: 34,35 వచనాలు కేవలము మిమ్మల్ని మీరు కీర్తించుకోకుండాక్రీస్తు వలె జీవించమని చెబుతున్నాయిఇతరులను రక్షించడానికి మనము ప్రవక్త లె  క్రీస్తు వలె ష్టపడటానికి సిద్దముగా ఉన్నమా మిగిలిన పది మంది  శిష్యులు   మాటలను విన్నప్పుడు   ఇద్దరు శిష్యులు మీద అసూయ పడుతున్నారువారికి కూడా మొదటి స్థానాలు  కావాలి అనుకున్నారు యేసు ప్రభువు   ఇటువంటి  వారితో దేవుని రాజ్యాన్ని స్థాపించాలనుకొన్నారుఅందుకే వారికి ముందుగానే చెబుతున్నారుతన రాజ్యంలో ఎలా ఉంటుంది అని లోక పాలకుల వలె ఉండకూడదు అని అంటున్నారుఆ ఇద్దరి శిష్యుల మీద మిగిలిన శిష్యులు అసూయతో ఉన్నారుఎందుకంటే శిష్యులకు వారి వారి  స్వలాభాలు కోరికలు ఉన్నాయి.  యేసు ప్రభువు చేసే పనులు చూస్తున్నప్పుడు వారు ఆయన ఆదికారంలో పాలు పంచుకోవచ్చు అనుకుంటున్నారుమన ఆలోచనలు  విధంగానే ఉన్నాయి.

క్రీస్తు వలె  జీవించాలి

శిష్యులకి యేసు ప్రభువు మాటలు పూర్తిగా అర్దము కాలేదుమార్కు 10:43  వచనములో యేసు ప్రభువు చెబుతున్నారుశిష్యులు ఎంచుకోవాల్సిన  మార్గం , సేవా మార్గంతనను తాను త్యజించుకోవాల్సిన మార్గంయోహను 18: 36  లో యేసు ప్రభువు అంటున్నారు ,  తన రాజ్యం  లోక సంబంధమైనది కాదు అని చెప్పారుఎవరైతే   గొప్ప వారు కావాలనుకుంటారో వారు సేవకులుగా ఉండాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు పిలిప్పీయులకు రాసిన లేఖలో 2; 3-9.  విధముగా ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నారు అని తెలుసుకుంటున్నాం. మార్కు

గొప్పతనానికి మార్గం

(యెషయా 53:10-11, హెబ్రీ 4:14-16, మార్కు 10:35-45 )

ప్రియ సహోదరులారా ఈనాటి సువిశేషము మరియు పఠనాలు ఒక వ్యక్తి గొప్ప వానిగా ఎదగాలంటే ఏమీ చేయాలి అని చెబుతున్నాయి .  లోక పోకడలను బట్టి కాక దేవుని దృష్టిలో గొప్పతనం ఏమిటని మనం తెలుసుకుంటున్నాంమొదటి పఠనం యెషయా ప్రవక్త బాధామయ సేవకుడు ఏవిధంగా అనేక కష్టాలను  అనుభవించి తన జీవితాన్ని అనేక మంది రక్షణకు కారకుడు అవుతాడు అని  తెలియచేస్తుంది.

ప్రవక్తలు ఎందుకు  కష్టాలను అనుభవించారు

  ప్రవక్తల జీవితాలు  విధముగా  యిస్రాయేలు  ప్రజలను దేవుని వైపు నడుపాయొ మనకు  తెలుసుమోషే ఎన్నో  కష్టాలు అనుభవించారు దేవుని ప్రజలను నాయకునిగా నడపడానికి,అయినకానీ, ప్రజలు ఆయన మీద తిరగబడుతున్నారుయెషయా  ప్రవక్త అనేక కష్టాలు  పడుతున్నారు. యిర్మీయా ప్రవక్త  నేను నా ముఖమును  చెకుముకి రాయి వలె చేసుకుంటిని అని అంటున్నాడు కష్టాలు పడటము ద్వార వారికి వచ్చే లాభం ఏమి లేదుమరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు పడుతున్నారుమొదటిగా దేవుని మీద వారికి గల ప్రేమ వలన,  మరల తమ  ప్రజలు ఆనందమైన జీవితం జీవించాలనిఆమోసు ప్రవక్త  నేను పొట్ట కూటి కోసం  దేవుని వాక్కు  ప్రకటించుట లేదు అని అమాస్య తో చెప్పారుఎందుకంటే వారు  దేవునికి తగిన విధముగా  జీవించకుండా వారికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు. ప్రవక్తల జీవితాల ద్వారా వారు తమ ప్రజలకోసం అన్నీ కష్టాలు అనుభవించడానికైనా సిద్దంగా ఉన్నారు అని మనం తెలుసుకుంటున్నాంవీరు కష్టాలుబాదలు వేరే వారిని ఆనందమైన జీవితం జీవించేలా చేస్తున్నాయిప్రజలు అంత తెలివి గల వారు కారుచాలా సార్లు అనేక మోసాలకుస్వల్ప ఆనందాలకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారువారిని కాపాడటానికి ప్రవక్తలు బాదలు అనుభవించారుఇది ప్రవక్తల గొప్పతనంవారు దీని ద్వార ఎటువంటి లాభాన్ని ఆశించలేదుపొందనూ లేదు.

గొప్పవారు ఎలా ఉంటారు

 లోకములో గొప్పవారికి,  దేవుని దృష్టిలో గొప్పవారికి గల వ్యత్యాసం గురించి  యేసు ప్రభువు  విధంగా అంటున్నారు.  అన్య జనుల రాజులు  వారిపై అధికారం చెలాయింతురువారి అధికారులు ఉపకారులు అని పిలవబడుతున్నారుకానీ మీరు అటుల చేయవలదుమీలో గొప్పవాడు చిన్న వానివలెనునాయకుడు సేవకునివలె ఉండాలి అని చెబుతున్నారులూకా 22:25,26. యేసు ప్రభువుమనుష్య కుమారుడు సేవించడానికే కానీ సేవించబడటానికి రాలేదు అని చెబుతున్నారు. మార్కు 10:45. గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులకు, అల్పులకు  ప్రాముఖ్యతను ఇస్తారుమనకు ఉన్న బహుమానాలుఅవార్డులుడబ్బులుఆస్తుల ద్వార మనం గొప్పవాళ్లు కాము దేవుని దృష్టి లో  గొప్పతనం మన ప్రవర్తన మీద  ఆధారపడి ఉంటుందిమనము ఎంత  సేవ చేయడానికి సిద్ధముగా ఉన్నాము, అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.

శిష్యులు ఎందుకు ప్రత్యేక స్థానాలు అడుగుతున్నారు

యాకోబు యోహనులు యేసు ప్రభువుని ఒక కోరిక కోరుతున్నారు, మార్కు 10:37 మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడిఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని అడుగుతున్నారు యేసు ప్రభువు రూపాంతరీకరణ జరిగినప్పుడు ఆయనతో పేతురు,యోహను ,యాకోబులు ఉన్నారువారికి తెలుసు అది ఎంత గొప్పగా ఉన్నది అనిమత్తయి 19 అధ్యాయము 28 వచనములో మనము చూస్తాము మనుష్య  కుమారుడు తన సింహాసనము మీద కూర్చుండినప్పుడు మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చుంటారు అని చెప్పారుకానీ శిష్యులు దానిని  లోక అధికారములాంటిది అని అనుకుంటున్నారుఅందుకే ప్రభువు  పరలోక భూలోక అధికార వ్యత్యాసం గురించి చెబుతున్నారు లోకములో ఉన్న  పాలకులువేరే వారి మీద అధికారం చూపించడానికి , పెత్తనం చేయించడానికి చూస్తారు, కానీ మీరు అలా కాకుండా సేవ చేయటానికి ముందు ఉండాలి అని చెబుతున్నారుఅది అర్దము కానీ శిష్యులు పరలోకం  కూడా ఈ లోక సింహాసనం లాంటిది అనుకుంటున్నారువారికి కావలసినది లోక  సింహాసనాలుఅంతే కానీ పరలోక విధానము తెలిసి కాదు వారు అడిగేదిత్వరగా వారు అందరి చేత గొప్ప వారిగా పరిగణించబడాలి అని మాత్రమే అనుకుంటున్నారు.

యేసు ప్రభువు ఎటువంటి బలి అవుతున్నారు

 యోహను యాకోబులు అడిగిన దానికిమీరు ఏమి కోరుతున్నారో మీరు ఎరుగరునేను పానము చేయు పాత్రమునుండి  మీరు పానము చేయగలరానేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరాఅంటున్నారుఏమిటి  పాన పాత్ర ? పాన పాత్ర అంటే చాలా శ్రమలుతో కూడిన జీవితముయెషయా 51:17  నీవు ప్రభువు కోపము అను పాత్రము నుండి  పానీయము త్రాగి పడిపోతివి అంటున్నారుకొన్ని సార్లు దీనిని ప్రవక్తల పాత్రము అంటారు. పాత్ర ఒక సంజ్ఞ గా ఉండేది ప్రవక్తలకు వారి గమ్యం తెలియ చేస్తూ ఉంటుంది పాన పాత్రంవారి గమ్యం  కష్టాలతో కూడుకొని ఉంటుంది ఇది  వారు పొందిన బాధలు  తెలియచేస్తుందిదేవుని కోపాన్ని తెలియచేస్తుందిఅంటే దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికి పూనుకోవాలిప్రవక్తలు పొందిన కష్టాలు దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికే  యేసు ప్రభువుమత్తయి  26 లో  పాత్రనునానుండి తీసి వేయమని అడుగుతున్నారు, అంటే అది చాలా  కష్టాలతో కుడినదిదానికి భరించడానికి మనము చాలా కష్ట పడాలియేసు ప్రభువు  బాప్తిస్మము  గురించి  చెప్పుతున్నారుఇక్కడ మనము తీసుకునే బాప్తిస్మము  గురించి కాదు కానీ చాలా కష్టముతో కూడిన శ్రమలలో  తీసుకునే బాప్తిస్మము  గురించి చెప్పుతున్నారుయేసు ప్రభువు జ్ఞానస్నానం  యొర్ధాను నదిలో మొదలై  గెత్సమని తోటలో ముగుస్తుంది.  తన తండ్రి చిత్తానికి తలవంచి శ్రమల పాన పాత్రను అంగీకరించాడు యేసు ప్రభువు.

క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని వదలి  తనను తాను రిక్తుని  చేసుకొని మనలను కాపాడటానికి వచ్చాడుఅన్నీ వదులుకోవడానికి ఆయన సిద్దపడ్డారుదేవునితో తన సమానత్వాన్ని వదలి , మర్త్య మానవ రూపాన్ని స్వీకరించాడు.

మనము  విధముగా ఉన్నాం

మనము ఎలా ఉన్నాముకేవలము పాపం చేయకుండా ఉండటానికే ప్రాముఖ్యత ఇస్తూ మంచి చేయటము పట్టించుకోవము ?  ఈనాటి సువిశేషము మార్కు 10: 34,35 వచనాలు కేవలము మిమ్మల్ని మీరు కీర్తించుకోకుండాక్రీస్తు వలె జీవించమని చెబుతున్నాయిఇతరులను రక్షించడానికి మనము ప్రవక్త లె  క్రీస్తు వలె ష్టపడటానికి సిద్దముగా ఉన్నమా మిగిలిన పది మంది  శిష్యులు   మాటలను విన్నప్పుడు   ఇద్దరు శిష్యులు మీద అసూయ పడుతున్నారువారికి కూడా మొదటి స్థానాలు  కావాలి అనుకున్నారు యేసు ప్రభువు   ఇటువంటి  వారితో దేవుని రాజ్యాన్ని స్థాపించాలనుకొన్నారుఅందుకే వారికి ముందుగానే చెబుతున్నారుతన రాజ్యంలో ఎలా ఉంటుంది అని లోక పాలకుల వలె ఉండకూడదు అని అంటున్నారుఆ ఇద్దరి శిష్యుల మీద మిగిలిన శిష్యులు అసూయతో ఉన్నారుఎందుకంటే శిష్యులకు వారి వారి  స్వలాభాలు కోరికలు ఉన్నాయి.  యేసు ప్రభువు చేసే పనులు చూస్తున్నప్పుడు వారు ఆయన ఆదికారంలో పాలు పంచుకోవచ్చు అనుకుంటున్నారుమన ఆలోచనలు  విధంగానే ఉన్నాయి.

క్రీస్తు వలె  జీవించాలి

శిష్యులకి యేసు ప్రభువు మాటలు పూర్తిగా అర్దము కాలేదుమార్కు 10:43  వచనములో యేసు ప్రభువు చెబుతున్నారుశిష్యులు ఎంచుకోవాల్సిన  మార్గం , సేవా మార్గంతనను తాను త్యజించుకోవాల్సిన మార్గంయోహను 18: 36  లో యేసు ప్రభువు అంటున్నారు ,  తన రాజ్యం  లోక సంబంధమైనది కాదు అని చెప్పారుఎవరైతే   గొప్ప వారు కావాలనుకుంటారో వారు సేవకులుగా ఉండాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు పిలిప్పీయులకు రాసిన లేఖలో 2; 3-9.  విధముగా ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నారు అని తెలుసుకుంటున్నాం. మార్కు 10: 45  వచనంలో దేవుని కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు అని మనం వింటున్నాం.

యేసు ప్రభువు మన పాపములకు ప్రాయశ్చిత్త  వెల గా వచ్చాడుమన పాపాలను తీసివేయడానికి ఆయన చనిపోవడానికి కూడా సిద్దపడ్డారుమనలను మనం సేవకునిగా చేసుకోవటంక్రీస్తుని మన సుమాతృకగా తీసుకోవడం మనం చేయవలసిన పని 

యేసు ప్రభువు యొక్క సందేశం చాలా స్పష్టంగా  ఉంది.  యెషయా  ప్రవక్త  బాదామయ సేవకుని ద్వార ప్రభువు ఎటువంటివారు  అని చెప్పారు . ప్రభువు  తన కష్టాల ద్వార   లోకాన్ని రక్షించాలి అని నిర్ణయించుకున్నారు మానవుడు  శ్రమలను  ప్రేమ కోసం భరించినప్పుడు వాటికి  రక్షణ విలువ  ఉంటుందిదేవుని అధికారం వేరే  వారి మీద ఆధిపత్యం చెలాయించడం కాదు.  అది ప్రేమ చూపించడం, అంగీకరించడం, రక్షించడము మరియుసేవించడము. ఆవిధముగా జీవించుదాం.

 

 

10: 45  వచనంలో దేవుని కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు అని మనం వింటున్నాం.

యేసు ప్రభువు మన పాపములకు ప్రాయశ్చిత్త  వెల గా వచ్చాడుమన పాపాలను తీసివేయడానికి ఆయన చనిపోవడానికి కూడా సిద్దపడ్డారుమనలను మనం సేవకునిగా చేసుకోవటంక్రీస్తుని మన సుమాతృకగా తీసుకోవడం మనం చేయవలసిన పని 

యేసు ప్రభువు యొక్క సందేశం చాలా స్పష్టంగా  ఉంది.  యెషయా  ప్రవక్త  బాదామయ సేవకుని ద్వార ప్రభువు ఎటువంటివారు  అని చెప్పారు . ప్రభువు  తన కష్టాల ద్వార   లోకాన్ని రక్షించాలి అని నిర్ణయించుకున్నారు మానవుడు  శ్రమలను  ప్రేమ కోసం భరించినప్పుడు వాటికి  రక్షణ విలువ  ఉంటుందిదేవుని అధికారం వేరే  వారి మీద ఆధిపత్యం చెలాయించడం కాదు.  అది ప్రేమ చూపించడం, అంగీకరించడం, రక్షించడము మరియుసేవించడము. ఆవిధముగా జీవించుదాం.

 

 


28 వ సామాన్య ఆదివారం

 28 వ సామాన్య ఆదివారం 

సిరా 7:7-11, హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30

ప్రియ మిత్రులారా గత ఆదివారం పరిసయ్యులు యేసు ప్రభువును విడాకుల గురించి ప్రశ్నించారు. ఈ రోజు ఒక యువకుడు యేసు ప్రభువును నిత్య జీవం పొందుటకు ఏమీ చేయాలి అని అడుగుతున్నాడు. యేసు ప్రభువు దైవ ఆజ్ఞలు పాటించమని చెప్పారు. ఆ యువకుడు నేను చిన్నప్పటి నుండి వాటిని పాటిస్తున్నానని   చెప్పుతున్నాడు. యేసు ప్రభువు దానికి నీవు చేయవలసి నది ఇంకొక్కటి ఉంది, నీకు ఉన్నదంతా అమ్మి,  పేదలకు  ఇచ్చి వచ్చి నన్ను అనుసరించు అని చెప్పారు. దానికి ఆ  యువకుడు నిరాశతో వెళ్ళిపోతున్నారు.  ఎందుకంటే అతనికి చాలా  సంపద, ఆస్తులు ఉన్నాయి వాటిని కోల్పోవడానికి సిద్దముగా లేడు. 

ఎందుకు ఆ యువకుడు యేసు ప్రభువును అనుసరించడానికి రాలేదు

పునరుత్థానము మీద ఆనాటి రోజులలో చాలా తక్కువ మందిలో  నమ్మకము ఉండేది.  పరిసయ్యులు పునరుత్థానము ఉంది అని భోదించేవారు. కానీ సద్దుకయ్యులు నమ్మేవారు కాదు.  యేసు ప్రభువు అందరికీ అంతిమ తీర్పు ఉందని విశ్వాసులకు నిత్య జీవం ఉందని బోధించారు. యేసు ప్రభువు బోధనలు  వారిలో నిత్య జీవానికి ఒక ఆశను రేకెత్తించాయి. ఆ కాలములో అందరూ దీనిని నమ్మలేదు, నిత్య జీవం ఉంటే మంచిది , నాకు దేవుడు ఇస్తే దానిని తీసుకోవడానికి సిద్దమే కాని దాని కోసము ఇప్పుడు ఉన్న ఏ ఆనందాన్ని  వదులుకోవడానికి సిద్దముగా లేను.

నిత్య జీవము పొందడానికి నేను ఏమీ చేయాలి అడిగినప్పుడు నీకు ఉన్నదంతయు  వదలి వేయాలనే  సవాలు తీసుకోవడానికి వెనకాడుతున్నాడు. ఈ యువకునికి నిత్య జీవము కావాలని ఉంది కాని  తన ఆస్తిని విడిచి వుండటానికి అతనికి ఇష్టం లేదు, తనకు ఉన్న ఆస్తి ఒక ఆశ్రయం అవుతుంది, బలం అవుతుంది, అనుకుంటున్నాడు.   తనకున్న ఆధారాన్ని వదలివేయడానికి అతనికి ఇష్టం లేదు.

ధర్మ శాస్త్ర బోధనలకు  అనుకూలముగా జీవించిన ఒక యువకుడు యేసు ప్రభువును అనుసరించలేక పోతున్నాడు. ఎందుకు  అంటే మనము పరిశుద్ద గ్రంధములో వినినట్లు , దేవుడే నా ఆశ్రయ  దుర్గము, నా కోట , లేక నా కొండయు ఆయనే అనే మాటలు, అన్నీ ఆపదలనుండి నన్ను కాపాడు వాడు దేవుడే అని మనము చెప్పుతుంటాము.  కానీ నిజానికి మన ఆధారం , ఆశ్రయము అన్నీ డబ్బే అని మనము జీవిస్తున్నాము.  అదే ఈ యువకుడు కూడా చేస్తున్నాడు. నేను అన్నీ చిన్నప్పటి నుండి చేస్తున్నాను అని చెప్పుతున్నప్పటికీ తన ఆశ్రయం, ఆధారం , అన్నీ డబ్బే అన్నట్లుగా జీవిస్తున్నాడు.  

ప్రపంచంలో ప్రజలు   సంపదను వారికి ఆసరా అనుకుంటారు. వారి ముఖ్యమైన పని ఆది సంపాదించడం అదే వారిని రక్షిస్తుంది అని వారు నమ్ముతారు. మనకు తెలుసు ఎంత సంపద ఉన్న మనలను అది కాపాడలేదు అని మనం ఈరోజుల్లో ఎక్కువగా దానిని చూస్తున్నాము. కరోనా సమయములో సంపదలు కాపాడలేకపోయాయి. కానీ ఇంకా దానికోసమే పరుగెడుతుంటాము. నీ ఆశ్రయం, నీ అండ , నీ ఆసరా దేవుడు అయితే యేసు ప్రభువును అనుసరించటము తేలికవుతుంది. లేక పోతే యువకునిలా వెనక్కు వెళ్లిపోతాము.

నిత్య జీవం పొందటము ఎందుకు కష్టము

యేసు ప్రభువు ధనిక యువకుడిని నిత్య జీవం పొందడానికి ఆ యువకుని లో ఉన్న లోపం గుర్తిస్తూ   రెండు షరతులను పెడుతున్నారు, మొదటగా తన ఆస్తులను తనకున్నదంత వదిలివేయాలని అంటున్నారు,  అనేకమంది క్రైస్తవులు ఈ పని చేసి వారికి యేసు మీద ఉన్న ప్రేమ చూపించారు.  రెండవ షరతు నన్ను అనుసరించు అని అంటున్నారు. యేసు ప్రభువు ఆ యువకుడిని  తన శిష్యుడుగా కావాలనుకున్నాడు.  కానీ  ఆ యువకుడు బాధతో, నిరాశతో వెళ్లిపోతున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మొత్తము వదలి యేసును అనుసరిస్తారో అప్పుడు అతడు యేసు శిష్యునిగా ఉండటానికి తగిన వాడు  అవుతాడు, తనకు తెలియకుండానే యేసు క్రీస్తు పనిలో పాలుపంచుకుంటాడు.  శిష్యులకు యేసు ప్రభువు దీని గురించి వివరిస్తూ ధనవంతులకు దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి ఎదురయ్యే సవాళ్లు గురించి చెప్పారు.  ధనవంతునికి పరలోక రాజ్యములో ప్రవేశించుట ఎంత కష్టము? అని యేసు ప్రభువు అనగానే శిష్యులు అంటున్నారు ఇంకా ఎవరు ప్రవేశించగలరు? అందుకే యేసు ప్రభువు చెప్పుతున్నారు మానవులకు   అది అసాధ్యము కానీ దేవునికి సాధ్యము ఎందుకంటే అది ఇచ్చేది  దేవుడు. నీ సంపదలతో దానిని నీవు కొనలేవు. మానవుని ప్రయత్నాలు ఏవి కూడా ఆయనకు నిత్య జీవాన్ని  తీసుకురాలేవు. కేవలము  అది దేవుని వరమే. ఎందుకు పర లోక రాజ్యములో ప్రవేశించుట కష్టము అంటే ధనవంతుడు తన సంపద తనకు అన్నీ సమకూరుస్తుంది అని దేవుని ఆజ్ఞలను పాటించక సంపద లోనే తన సర్వాన్ని చూసుకుంటాడు, వాటిని తన ప్రాణా ప్రాయంగా చూసుకుంటాడు, కొన్ని సార్లు వాటి వలనే తనకు విలువ ఉంటుంది అనుకుంటాడు, సంపదల వలన కొన్ని సార్లు ఎవరిని లెక్క చేయడు , దేవునికి దూరమవుతాడు, మనము పవిత్ర గ్రంధములో చూసే, నాబాలు, ధనవంతుడు లాజరు, కథలో ధనవంతుడు  ఈ కోవకు చెందినవారే. కానీ కొంతమంది తనకు దేవుడు ఇచ్చిన సంపదను మంచిగా వాడుకొని దేవుని మీద ఆధారపడి జీవించేవారు ఉన్నారు.

ఆదిమ క్రైస్తవులు ఏ విధముగా సంపదలను ఆస్తులను పరిగణించారు

 ఆదిమ క్రైస్తవులు  సంపదలను ఏ విధముగా చూసేవారో మనము కూడా అలానే సంపదలను చూడగలిగామా ?  ఒకసారి ఆలోచించండి. వారు ఆస్తులు పెంచుకోవాలి అనుకోకుండా పంచుకోవాలి అని అనుకున్నారు అపోస్తుల కార్యాలలో మనము ఇది చూస్తున్నాము. మనము కూడా దీనిని ఆదర్శము గా తీసుకోవాలి.  వారిలో ఒకరు పెద్ద ఒకరు చిన్న ఏమీ లేరు, వారిలో బలహీనులను వారు ఆదరముతో చూసేవారు.

 ఎందుకు మనం సంపదలను కోరుకుంటున్నాము - మానవుని కి ఏమీ కావాలి

ఈనాటి మొదటి పఠనములో సోలోమోను జ్ఞానము కోసము అడుగుతున్నాడు. దేవుడు చాలా సంతోషించాడు, సోలోమోనును చూసి  ఎందుకంటే ఆయన ఆస్తులకోసం అడగక ప్రజలను పాలించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు.  విచక్షణ,  జ్ఞానం అనే వరాలను మనము అడగాలి, అంతేకానీ డబ్బు ,సంపద ,పేరు, అధికారం లౌకిక అందలాలను మనము అడగకూడదు, మనకు కావాల్సిన వాటి కోసము మనము దేవుడని అడుగవచ్చు. కానీ ముఖ్యమైనది ఏమిటి అంటే జ్ఞానము, దానిని అడగాలి.


మనసు ఏ విధముగా ఉంది ఎంత నిర్మలముగా ఉంది


రెండవ పఠనములో హెబ్రీయులకి రాయబడిన లేఖలో ఇటువంటి ఒక వాదనను మనము చూస్తున్నాము. దేవుని వాక్కు మన హృదయాంతరంగాలు తెలుసుకోగలదని చెప్పుతుంది. అంటే మన హృదయంలో ఉన్న వాటిని శుద్ది చేసి  మంచి ఆలోచనలు కలిగేలా ఆయన చేయగలడు. ఈనాటి సువిశేషము నిజమైన ధనవంతుడు ఎవడూ అంటే కేవలము దైవ జ్ఞానము కల వాడు అని నేర్పుతుంది, ఈలోక సంపదలు ఈ జ్ఞానాన్ని పొందటానికి అవి  ఆటంకముగా ఉన్నాయి. 


సంపదల మీద గల ప్రేమ వలన ఏమి కోల్పోతున్నాము

ఆ యువకుడు తన సంపదల మీదే ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు. అతనికి ఉన్న సమస్య మొత్తము కూడా ఒకటే తన సంపదలు. ఈ లౌకిక  విషయాలు లేక వస్తువులు మనల్ని నిత్య జీవితం నుండి దూరం చేయడాన్ని మనము అంగీకరించకూడదు. ఈ ప్రాపంచక వస్తువులు, ఆస్తులు సంపదల మీద మనకు ఉన్న ప్రేమ మనము యేసు  ప్రభువుని అనుసరించడానికి అనేక సార్లు ఆటంకముగా  ఉంటున్నాయి. సంపదల మీద అమితమైన  ప్రేమ కలిగి ఉంటే అప్పుడు దేవుని నుండి  దూరం కావడానికి మనము సిద్దపడుతున్నాము అని గుర్తుంచుకోవాలి.

యేసు ప్రభువు తన ప్రాణాన్ని అడగలేదు, కేవలము తన ఆస్తిని కోల్పోవడానికి సిద్దపడమన్నాడు. కానీ నేను అమితముగా అభిమానించే ఆస్తిని నేను కోల్పోవడానికి సిద్దముగా లేను. చివరికి అది నాకు నిత్య జీవితమును ఇచ్చినా కానీ, అంటే సంపదల మీద ప్రేమ వలన నిత్య జీవితాన్ని కూడా వదులుకుంటున్నాం. ఇటు వంటి ఆలోచనలు మనలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఆస్తి , సంపద  అనేది ప్రశ్న కాదు. నీవు  క్రీస్తుని అనుసరించడానికి ఏమీ నీకు  అడ్డముగా ఉన్నదో దానిని వదలిపెట్టడానికి  నీవు  సిద్దముగా ఉన్నావా  లేదా అనేది  ముఖ్యం. మనకు కూడా అనేక సార్లు ఈ నిత్య  జీవం కావాలి అని ఉంది కానీ నాకు ఇష్టమైన దానిని ఈ నిత్య  జీవము కోసము కోల్పోవడానికి నేను సిద్దం కావడము లేదు. నిత్య జీవితం కావాలనే కోరిక సన్నగిల్లి పోతుంది.  ప్రయోజనము లేని సంపదను ఉంచుకుంటున్నాము క్రీస్తుని పోగొట్టుకుంటున్నాము మనకు ఇష్టమయిన దాని కోసము. నిరాశ లో బాధలో కుమిలిపోతున్నాము.

సంపద అనేది మానవుని కి ఉన్న ఒక బలహీనత. ఇక్కడ  యేసు ప్రభువు మనలను పేద వారిగా ఉండటానికి పిలవటము లేదు ఆయన అనుచరులుగా ఉండటానికి పిలుస్తున్నాడు, ఆయన శిష్యులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. వచ్చి నన్ను అనుసరించు అంటున్నారు. యువకుడు సంపద యేసు  ప్రభువు కన్నా  గొప్పది కాదు  అనే సత్యాన్ని తెలుసుకోవాలి. పునీత శిలువ యోహను గారు యేసు ప్రభువుని  పొందటం కోసం సమస్తాన్ని నేను కోల్పోవాలి అంటారు. నీవు క్రీస్తుని కలిగి ఉంటే సమస్తం నీకు ఉన్నట్లే కనుక క్రీస్తు కోసము ఏమైనా  ఆనందముగా చేయడానికి సిద్దంగా ఉండాలి. ఆమెన్   

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...