26, ఫిబ్రవరి 2026, గురువారం

హృదయ పరివర్తనా ? లేక నాశనమా? లూకా 13:1-9

 హృదయ పరివర్తనా ? లేక నాశనమా? లూకా 13:1-9

మన రక్షణకు అవసరమైనది హృదయ పరి వర్తన. ఈనాటి సువిశేషం ద్వార దీనిని ప్రభువు వెల్లడి చేస్తున్నారు.  మనం  మారు మనస్సు పొందక పోతే మనం నాశనం అవుతాము అని యేసు ప్రభువు వెల్లడిచేస్తున్నారు. నేను చాలా పాపములు చేసెను ఇంకా నన్ను దేవుడు నన్ను క్షమించడులే అని మనం బాధకు గురికానవసరం లేదు. కాని మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనలను శిక్షించకుండా మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం ఉపయోగించుకుంటే నీవు శిక్షకు గురికావు. నివివే ప్రజలు పాపం చేసిన వారు మారు మనసు పొందినందుకు వారిని శిక్షించడం లేదు. 

దేవుని యందు నీకు అభయం ఉంది అది ఏమిటి అంటే నీకు ఒక అవకాశం ఇవ్వడానికి సిద్దాముగా ఉన్నాడు. సాతాను నీకు  రక్షణ లేదు అని చెబుతుంది, కానీ యేసు ప్రభువు కోసం ఆ అవకాశం తీసుకొస్తాడు. మొదటి తిమోతి రెండవ అధ్యాయం 5 వ వచనం మనకు ఇది చెపుతుంది. "దేవుడు ఒక్కడే,దేవుని ,మనుజులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు  ఒక్కడే ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రయ ధనముగా ఆయన తనను తాను అర్పించుకొనేను."

"ఆ సమయమున కొందరు, గలీలియ దేశీయులు బలులు సమర్పించునప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి." యేసు ప్రభువు దీని గురించి ఏమి చెప్పడం లేదు వారికి, అక్కడ పిలాతు తప్పు చేశాడు అని కానీ వారు అలా చేసి ఉండకూడదు అని కానీ ఏమి మాటలాడటం లేదు. ఆ విషాదాన్ని గురించి మాటలాడటం లేదు. ఎందుకు పిలాతు వారిని చంపించి ఉండవచ్చు అంటే ఆనాటి రోజులలో ఎక్కువగా గలీలియ నుండే రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు ఎక్కువగా వస్తుండేది. రోమా సామ్రాజ్యం ఎటువంటి విప్లవాలను సహించదు అని చెప్పడానికి చేసి ఉండవచ్చు. ఇక్కడ వారు ఘోరంగా అవమానింప బడ్డారు ఎందుకంటే వారు బలులను అర్పించుచున్నప్పుడు వారిని చంపిస్తున్నాడు పిలాతు. ఇది మనిషి కావాలని చేసిన మారణహోమం. 


అందుకు యేసు, "అటుల చంపబడిన ఈ గలీలియ వాసులు తక్కిన గలీలియ వాసులకంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? అని అడుగుతున్నారు? ఇటువంటి సమయంలో మనం చనిపోయిన వారు ఎవరు? వారు ఏమి చేశారు? అని చర్చించుకుంటాం. కానీ యేసు ప్రభువు దాని గురించి మాటలాడటంలేదు.  నీకు ఇటువంటిది జరిగితే అన్నట్లు మాటలాడుతున్నారు?
దేవాలయానికి ఇద్దరు ప్రార్ధన చేసుకోవడానికి ఇద్దరు వచ్చారు. ఒకడు సుంకరి మరియొకడు పరిసయ్యుడు, పరిసయ్యుడు తాను చేసే పనుల బట్టి నేను మంచి వాడిని అని అనుకుంటున్నాడు. నిజానికి కాదు ఎంతో కపటం అతనిలో ఉంది. నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి పోతున్నది సుంకరియే. నీ జీవితం ఎలా ఉంది ఇక సారు ఆలోచించు.  నా జీవితంలో కొన్ని సార్లు ఇతరుల కంటే నేను మంచి వాడిని అనుకుంటాము. కానీ దాని గురించి నీవు ఆలోచించనవసరం లేదు. 

యేసు ప్రభువు అడిగిన ప్రశ్నకు ఆయనే జవాబు ఇస్తున్నాడు. కాదు అని. మరల  "హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను."  హృదయ పరివర్తనం అనేది  నీవు రక్షణ పొందడానికి దేవుడు పెట్టిన షరతు ఇది. నేను ఏమి చేయాలి ఈ హృదయ పరివర్తన పొందడానికి. పునీత పౌలు గారి జీవితం మనకు నేర్పుతుంది, హృదయ పరివర్తన ఎలా ఉంటుంది అని. ఆయన క్రీస్తుని తెలుసుకున్న తరువాత ఆయన జీవితం మొత్తం యేసుతోనే. అందుకే ఆయన అంటున్నాడు.ఇక క్రీస్తే నాకు జీవము.  


యేసు ప్రభువు వారితో  శిలోయము  అను బురుజు కూలి, దాని క్రిందపడి మరణించిన  పదునెనిమిదిమంది,తక్కినయెరుషలేము నివాసులకంటే ఎక్కువ అపరాధులు ఎంచుచున్నారా? ఇక్కడ మరల యేసు ప్రభువు మరియొక ప్రశ్న అడుగుతున్నారు. ఇంతకు ముందు అడిగినటువంటి ప్రశ్న మరల జవాబు ఆయనే ఇస్తున్నారు. కానీ అక్కడ మనిషి చేసిన మరణ హోమం ఇక్కడ ప్రకృతి ద్వార జరిగిన విషాదం. కానీ ప్రశ్న మాత్రం ఒకటే. ఎందుకంటే అనేక సార్లు మన ఇటువంటి విషయాలే వింటువుంటాం. అది ప్రకృతి వల్ల జరిగిన మనిషి వల్ల జరిగిన కొంత మంది నాశనం అయ్యారు. ఇది కేవలం వారి భౌతిక నాశనమే. వారు మంచి వారు అయితే వారికి రక్షణ ఉంటుంది. కానీ యేసు ప్రభువు అడిగేది, నీవు వీటి గురించి కాక నీ గురించి ఆలోచించమని అడుగుతున్నారు. 

ఈ ప్రశ్నకు కూడా కాదు అని యేసు ప్రభువే సమాదధానం ఇస్తున్నాడు. అంటే కాదు  హృదయ పరివర్తన చెందనిచో మీరందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలుకుతున్నారు. అంటే మరలా మరలా యేసు ప్రభువు హృదయ పరివర్తన గురించి చెబుతున్నారు. ఒక వేళ  హృదయ పరివర్తన చెందక పోతే నాశనం కొని తెచ్చుకున్నవారి వలె మనం మారిపోతాం. దేవుడు హెచ్చరించిన సమయంలో కొంత మంది హృదయ పరివర్తన చెందారు వారు ఎవరు అంటే  నినీవే ప్రజలు, యేస్సీయారాజు,  అదే హెచ్చరిక నోవా కాలంలో వచ్చింది. సొదొమో గోమొర్రోకు వచ్చింది కానీ వారు దేవుని మాట వినలేదు. పర్యవసానం మనం చూస్తున్నాం. మన రక్షణకు పూజలు, బలులు ముఖ్యం  కాదు. ఏమిటి అంటేహృదయ పరివర్తన. హృదయ పరివర్తన లేక నాశనమా ? నిర్ణయం మనదే. 

 యేసుప్రభువు వారికి   అంజూరపు చెట్టు ఉపమానం చెప్పారు. . దేవుడు మన నుండి ఎప్పుడు కూడా పండ్లను కోరుకుంటున్నారు. ఈ చెట్టు తన యొక్క ప్రజలు. యాజమాని  దేవుడు, తోటమాలి, యేసు ప్రభువు.  
  
తోటమాలితో  ఇదిగో! నేను మూడేండ్లనుండి ఈ అంజూరపు చెట్టు పండ్లకోరకు వచ్చుచున్నాను. కానీ నాకు ఏమియు దొరకలేదు. దీనిని నరికి వేయుము. ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు?అనెను. ఇక్కడ దేవుడు అన్నీ ఇచ్చాడు. మొత్తం ఇచ్చిన తరువాత మన నుండి దేవుడు ఫలాన్ని ఆశిస్తున్నాడు. ఏమి ఇవ్వకుండా కాదు. నాకు ఏమి ఇచ్చాడు దేవుడు అని నీవు  ఎప్పుడైనా అనుకున్నావా? కానీ దేవుడు ఇచ్చిన అనుగ్రహాలు ఒకసారి లెక్కించుకో?

అందులకు తోట మాలి అయ్యా ! ఇంకొక యేడు ఓపిక పట్టుడు. నేను దీని చుట్టు పాదుచేసి ఎరువు వేసేదను. ఎవరు ఈ తోటమాలి? యేసు క్రీస్తు నీకోసం నాకోసం దేవుని ముందు మొరపెట్టుచున్నారు. అబ్రహాము అడిగినప్పుడు దేవుడు క్షమిస్తున్నారు. మోషే అడిగినప్పుడు క్షమిస్తున్నారు. ఖచ్ఛితముగా మనం ప్రధాన యాజకుడు, తన కుమారుడు  మన కోసం అడిగినప్పుడు దేవుడు ఓర్పు తో ఒప్పుకుంటున్నారు. దేవుడు మన మీద ఉన్న ప్రేమతో ఒప్పు కుంటున్నారు. న్యాయముగా అయితే ఇది జరుగకూడదు. ఎందుకు అంటే న్యాయముగా మనం శిక్షకు గురి కావాలి. కానీ కలకాలం ఇలానే ఉండదు. మనకు ఇచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. 

ముందుకు ఫలించిన సరి. లేనిచో కొట్టి పారవేయుడు, అని పలికెను. యేసు ప్రభువు ద్వారా మనకు మరియొక అవకాశం వచ్చింది. ఇది చివరిది ఎందుకంటే అంతకు ముందు మనకు చాలా అవకాశాలు వచ్చినవి. మోషే ద్వార ధర్మ శాస్త్రం ఇచ్చి నీవు ఈ విధంగా జీవించమని దేవుడు చెప్పాడు. అప్పుడే మోషే చెప్పారు, యొహ్ో షువా చెప్పారు , మీరు దేవుని ఆజ్ఞల ప్రకారముగా జీవించిన జీవిస్తారు లేదా మరణిస్తారు అని చెప్పారు. న్యాయాధిపతులు ద్వారా ప్రభువు వారికి మంచి జీవితం జీవించమని చెప్పారు, ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించారు. యేసు ప్రభువుతో వచ్చినది చవరి అవకాశం కనుక హృదయ పరివర్తన పొంది మంచి ఫలాలను ఇవ్వడానికి ఎప్పుడు సిద్దాముగా ఉందాం. 

సామాన్య 6 వ ఆదివారం

 సామాన్య 6 వ ఆదివారం

 లోకమును కాక  దేవున్ని నమ్ముము 

యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26 

ఈనాటి మొదటి పఠనంలో యిర్మియా ప్రవక్త ద్వార మనం ఎవరిని నమ్మలో చెపుతున్నారు. నీవు ఈ లోకం కానీ దానిలోని వ్యక్తులను లేక వస్తువులను , ఆస్తులను నమ్మితే ఏమి జరుగుతుంది. నీవు మోసపోతావు. ఒకసారి యోసేపును గుర్తుకు చేసుకోండి. ఆయన తన అన్నలను నమ్మాడు, నా అన్నలే కాదా! నన్నుఏమిచెయ్యరు అనుకున్నాడు.తనఅన్నలుఆయననుఅమ్ముకున్నారు. సాంసోను ను చూడండి. తన ప్రేయసి తనను మోసం చేయదు అనుకున్నాడు. తన ప్రేయసి తనను పట్టించిది. అది తన మరణానికి దారితీసింది. ఏసావును తన తమ్ముడు మోసం చేశాడు. యేసు ప్రభువును తన శిష్యుడే డబ్బులు కోసం అమ్ముకున్నాడు. నాబాలు తన సంపదను నమ్ముకున్నాడు అది ఆయనను కాపాడలేక పోయింది. నీవు ఈలోకాన్ని కానీ దానిలో ఉన్న వాటిని కాని  వ్యక్తులనుకానీనమ్మితే నీవు మోసానికి గురి అవుతావు. మరి దేనిని నమ్మాలి? నీ నమ్మకమును దేవుని యందు ఉంచినట్లయితే నీవు అవమానమునకు గురికావు, ఎవరు నిన్ను ఏమి చేయలేరు. 

ఎందుకు యిర్మియా ప్రవక్త వారికి ఈ మాటలను చెపుతున్నారు. కారణం ఏమిటిఅంటే వారికి చాలా సంపదలు వస్తున్నాయి.   వీరు ఆనందంగానే వున్నారు. వారికి కష్టలు ,బాధలు ఏమి లేవు.  ఇంకా సమస్య ఏమిటి అంటే వారు దేవునిని మరిచిపోయారు. ఎప్పుడైతే బాబిలోనియా దేశము వారి మీదకు దండెత్తి వస్తున్నారో అప్పుడు వారు ఈజిప్టు వారిని కాపాడుతుంది అని దానితో ఒక కూటమిలా ఏర్పడాలి అని, వారి దగ్గరకు వెళుతున్నారు. వీరు ఎంత అమాయకులు అంటే, వీరి పూర్వీకులను ఈజిప్టు వారు ఎంత ఇబ్బంది పెట్టింది, బానిసలుగా చేసింది ఇవన్నీ  మర్చి పోయారు.  రాజకీయ, సామాజిక కూటముల మీద, అక్కడ ఉన్న వేరె వారి విశ్వాసాల మీద ఆధారపడుతున్నారు. వారిని  కాపాడిన దేవుని దగ్గరకు రావడం మర్చిపోయారు. అందుకే యిర్మియా చెపుతున్నారు. ఇతర దేవుళ్ళను, మనుషులను, లోకాన్ని, వస్తువులను, ఆస్తులను నమ్మి మోసపోవద్దు. వారు అందరు మిమ్ములను మోసం చేసారు, మీ బిడ్డలను మీరు వారికి బలిగా ఇచ్చారు, వారు మిమ్మలను కాపాడారా? మీ నాయకులు ఈజిప్ట్ మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, వారు మిమ్ములను బానిసలుగా చేయలేదా? మొదట మిమ్ములను ఆదరించారు, కానీ మీకు ఎల్లప్పుడు మంచి చేయారు వారు. దేవుడిని నమ్మండి. ఆయన తప్ప ఎవరిమీద నమ్మకం ఉంచిన మీరు అవమానమునకు గురి అవుతారు అని చెబుతున్నారు.  

దేవుడు ఎందుకు వీరిని కాపాడుతారు? ఎందుకంటే వీరు ఒప్పందపు ప్రజలు. నేను మీ దేవుడను మీరు నా ప్రజలు అని దేవుడు వారికీ చెప్పారు. దేవుడు వారికి దగ్గర ఉన్నప్పడు వారికి ఉన్న స్వార్ధ , ద్వేష , అసూయ, పగలుతో ఉండటం కుదరడం లేదు కనుక వారి స్వార్ధ ప్రయోజనాల కోసం వారు దేవుడిని నుండి దూరంగా వెళ్ళి పోతున్నారు. ఎప్పుడైతే వారు ఇతర వ్యక్తులను, దేవరలను, రాజులను ఆశ్రయిస్తున్నారో ఇది మొదట సంతోషంగా ఉంటుంది. కానీ తరువాత కొంత కాలానికి వారిని మరల బానిసలుగా చూస్తారు. ఇది వారికి తరచుగా జరుగుతూనే ఉంది.  ఇవన్నీ మీకు తెలిసి ఇంకా ఎందుకు మీరు దేవుడి దగ్గరకు కాకుండా ఇతరుల వద్దకు వెళుతున్నారు? అని  యిర్మియా ప్రవక్త వారిని అడుగుతున్నారు. నిజానికి వీరు ఇతరుల దగ్గరకు సహాయం కోసం వెళ్ళేది, తెలియక కాదు,  వీరు అంత తెలిసే చేస్తున్నారు. అంతకు ముందుకగానే దేవుడు వీరిని హెచ్చరించారు. మీరు మీ మనసున అన్య దైవతములను ఆరాధించి ప్రభువు నుండి వైదొలుగుతారేమో జగ్రత్త" అని ద్వితీయోపదేశ కాండము 11 వ అధ్యాయం 16 వ వచనంలో చూస్తున్నాం, ఇది ఒక విధమైన తిరుగుబాటు దేవుని మీద కనుకనే వారు బానిసలుగా మారుతున్నారు. మనం ఎలా ఉన్నామో?ఒక సారి ఆలోచించుకోవాలి. ఆయనను ఆపదలో సహాయం చేయమని అర్ధించాలి. 

దేవుడిని వీరు నమ్మి , నిభందన ప్రకారం వీరు జీవిస్తే ఏమి జరుగుతుంది?  దానిని గురించి ఈనాటి మొదటి యిర్మియా 17: 8 వ వచనం మనకు తెలియచేస్తుంది. దేవుని మీద నమ్మకం ఉంచి , ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే వారిని దీవిస్తాను అని చెపుతున్నారు. అంతేకాదు దేవునిమీద నమ్మకము ఉంచిన వారు "ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలెనుండును. అది ఎదుగుచు వ్రేళ్ళు జోన్పించును. అది బెట్టుకు భయపడదు. అంతే కాదు 

 దానిఆకులు పచ్చగా నుండును, వానలు కురవకున్నను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడు పండ్లు కాయుచుండును." ఒక సారి ఈ మాటలను మనం అర్దం చేసుకుంటే దేవుడు ఆయన మీద నమ్మకం కలిగి జీవించినట్లయితే నీకు ఏ చింత అవసరం లేదు అని చెపుతున్నారు. వారు ఎటువంటి సమస్యలకు కానీ, హింసలకు గాని బెణకరు. వారికి ఇంకా ఎవరి తోడ్పాటు అవసరం లేదు. వానలు కురియకున్న వారి ఎదుగుదల లోపించదు. అందుకే యిర్మియా వారితో ఎందుకు మీరు ఇతరుల వద్దకు సహాయం కోరుతూ పోతున్నారు.  ఆ పరిస్థితి   మీకు దేవుని విడచి ఇతరుల దగ్గరకు పోయినందుకే కదా ? అని తెలియ చేస్తున్నారు. ద్వితీయోపదేశకాండము 28-29 ఆధ్యాయాలలో దేవుని నిభందనకు అనుకూలంగా జీవిస్తే ఏమి జరుగుతుందో దేవుడు తెలియచేస్తున్నారు. కానీ కొన్నాళ్ళ తరువాత ఆశీర్వాదం పొందిన తరువాత వీరు మారిపోతున్నారు. 

ఈనాటి  సువిశేషంలో యేసు ప్రభువు  పేదలు , ఆకలిగొన్నవారు , హింసలకు గురి అయిన వారు ధన్యులు అని తెలియ చేస్తున్నారు. పేద వానికి తెలుసు లేమితనం ఏమిటో, నీకు ఎప్పుడు పేదరికం లేక పోతే నీకు కలిమితో ఉన్నప్పుడు దాని గొప్పతనం తెలియదు. కష్టం లేకుండా మనం ఏమి నేర్చుకోలేము. కష్టం మనకు చాలా నేర్పుతుంది. 

పేదరికం ఇక్కడవారి సాంఘిక,సమాజక జీవితం గురించి తెలియచేస్తుంది.వారి పేదరికం, ఆకలి , విలాపం, ద్వేషంనికి సంభందించినవి. ఎందుకంటే వీరు వీటన్నటికి గురవుతున్నారు. లూకా 6:20-22. మీరు ఆనందించండి  అని చెపుతున్నారు. ఆనందం భౌతిక కారణాల వలన వచ్చేది కాదు. అది ఆంతరంగికమైనది.  వీరు వేరె వారిని ఎట్టి పరిస్థితులలో కూడా ఇబ్బందికి గురి చెయ్యరు ఎందుకంటే వీరికి అంత శక్తి లేదు, కానీ ఇతరులు వీరిని ఇబ్బందులు  కలిగించారు.  ఇక్కడ మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1. పేదరికం 2. ఆకలి 3. దుఃఖితులు వీరు ముగ్గురు ధన్యులు. యేసు ప్రభువు ఈ మాటలు వీరికి ఊరట ఇవ్వడానికి చెప్పడంలేదు.  మనం ఎప్పుడు తినడనికి కొరత లేక పోయినట్లయితే, మనకు ఉన్న సమృద్దిని లెక్క చేయం, అది ఇచ్చిన దేవునికి  కృతజ్ఞత చూపం. మనకు పేదరికం తెలియకపోతే మనకు ఉన్న కలిమికి విలువఇవ్వం, అది ఇచ్చిన దేవుని లెక్క చేయం. మనకు ఎప్పుడు బాధలు లేకపోతే సంతోషం విలువ తెలియదు ఆ సంతోషంకు  విలువఇవ్వం అదే ఈనాటి సువిశేషంలో జరుగుతుంది. 

ఆకలిగొనియున్న మీరు ధన్యులు మీరు సంత్రుప్తి పరుపబడుదురు యేసుప్రభువును నమ్మినవారు తెలుసుకున్నవారు జీవితాలను మార్చుకుంటున్నారు,ఇతరులకు విలువ ఇస్తున్నారు. పేదలను అభాగ్యులను అక్కున చేర్చుకుంటున్నారు. వారు జీవితంలో ఎన్నడూ పొందని శాంతి సమాదానం పొందుతున్నారు.  యేసును నమ్మిన వారు ఆశీర్వదించబడి, రక్షణపొందుతారు. యేసును నమ్మిన వెంటనే అన్నీ మార్పులు జరుగవు. యెరుషలేము లో ఉన్న క్రైస్తవులు పేదవారు అందుకే పౌలు గారు వేరె వారి దగ్గర నుండి వారికి సహాయం ఇప్పించాడు. అంత ఒకేసారి మారిపొదు. ముందుగా ఒకరి మనస్సు,వారివిధానం, వారి నమ్మకం మారుతుంది.తదుపరి సమృద్ది సమకూరుతుంది.   

మనుష్య కుమారుని నిమిత్తం, మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి నిందించి, మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభువును అనుసరించినట్లయితే ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. మత్తయి 5:10-11. ఇది మిగిలిన వాటి కంటే  వేరు ఎందుకంటే  దానిలో వీరు అనేక  విధాలుగా  హింసించ బడతారు. అ.కా 14:22.  ఇవి జరుగుతున్నప్పుడు మీరు ఆనందముగా ఉండమని చెపుతున్నారు. దేవుని నమ్ముకున్న వారిని హింసించడం కొత్త కాదు.  ఈ విధంగా చేయడాన్ని దేవునికి సేవ చేస్తున్నాం అని  కూడా అనుకుంటారు. యోహను 16:2. యూదులు చాలా మందిని ఇలా హింసించారు. హెబ్రీ 11:36-40. ప్రవక్తలను ఇలనే చంపారు. క్రీస్తు అనుచరులు నూతన ప్రవక్తలు లేక దేవుని వాక్కుని బోధించువారు. లూకా  సువిశేషం మాత్రమే అక్కడ  జరిగే అనర్థాలు గురించి వివరిస్తుంది.6:24-26. ధనవంతులు వారికి ఉన్న ధనం వలన వారు అనేకమైన మయాలలో విహరిస్తూ వుంటారు. ఇది కేవలం తాత్కలితమైనది అని గుర్తింపకపోతే అనర్ధమే.1తిమోతి3:7.ధనం కానీ ఇంకా ఏది కూడా మనలను ఆ ప్రభువు నుండి వేరు చేయకుండె విధంగా మనం ఆయనను నమ్మి, పేద సాదలను గుర్తిస్తూ జీవిస్తే ఎప్పుడు ఆయనతోనే సంతోషంగా జీవిస్తాము.

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...