26, ఫిబ్రవరి 2026, గురువారం

పాస్క కాల 6 వ ఆదివారం

 పాస్క కాల 6 వ ఆదివారం 

యోహను 14:23-29 

 అపో 15:1-2,22-29 దర్శన 21:10-14,22-23 లేక దర్శన 22:12-14,16-17,20 యోహను 14:23-29 
సువిశేషం:అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చేను: "నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కాని నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు. నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగనే నేను ఈ మాటలు మీతో చెప్పితిని. కాని నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడుఅనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించినేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని  మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను యిచ్చుట లేదు. మీ హృదయములు కలవర పడవలదు. భయపడవలదు. నేను వెళ్ళి మరల మీ వద్దకు మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు  వినియున్నారుగదా!తండ్రి నా కంటే గొప్ప వాడు. కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెల్లుచున్నందుకు మీరు సంతోషించేదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంబవింపక పూర్వమే ఇపుడు మీతో చెప్పుచున్నాను. 

యేసు ప్రభువు మూడు బహుమతులు గురించి వింటున్నాం. 1. ఆయన మనతో కలిసి జీవించడం. 2. ఆయన తన శిష్యులకు ఇచ్చే శాంతి 3. పవిత్రాత్మను పంపుట ఈ మూడు బహుమతులు యేసు ప్రభువు తన శిష్యులకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. 
 ఆదాము పాపము చేయక ముందు దేవుడు మానవునితో కలిసి జీవించాడు. కానిపాప కారణముగా  దేవునితో ఉన్న సామీప్యాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు.  మరల అది సాధ్యం కావాలి అంటే మనం ఆయన  ఆజ్ఞను పాటించాలి. 

యెషయా ప్రవక్త , మీ పాపములు దేవుని నుండి మిమ్ములను  వేరు చేస్తున్నాయి  అని చెబుతున్నారు. యేసు ప్రభువు,  ఈ మాటలను చివరి తీర్పు సమయంలో చెప్తున్నారు? గొర్రెలను, మేకలను వేరు చేస్తాను అని చెబుతున్నారు.  యేసు ప్రభువు తనను ప్రేమించె వారి వద్దకు తండ్రితో  వచ్చి వారితో ఉంటానని చెపుతున్నారు.
యేసు ప్రభువును ప్రేమించడం అంటే ఏమిటి ? వారి వద్దకు ఎందుకు యేసు ప్రభువు వస్తాను అని అంటున్నారు. మనం ఆయన ఇచ్చిన ఈ ఆజ్ఞను తిరస్కరించి నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్లయితే, మనం అబద్ధం ఆడిన వారము అవుతాము. ఒక వ్యక్తి యొక్క వ్యవహారం శైలి , వారి క్రియలు వారు యేసు ప్రభువును ప్రేమిస్తున్నారా, లేదా   తెలుపుతాయి. 

ఆయన్ను ప్రేమించే కుటుంబంలో ఆయన సభ్యుడని అవుతానని అని ప్రభువే చెబుతున్నారు. ఆయనను ప్రేమించడం అంటే  ఆయన ఆజ్ఞలను పాటించడమే అని యేసు ప్రభువు చెబుతున్నారు.

యేసు ప్రభువు నేను వారి వద్దకు వస్తాను అంటున్నారు అంటే ఏమిటి? మనలను ఆయనతో పాటు జీవించడానికి, యేసు ప్రభువు ఆహ్వానిస్తున్నారు. అంటే మనలను ఆయన వలె జీవించడానికి ఆహ్వానం, మరియు ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలని చెబుతున్నారు.  ఒక వ్యక్తి ఆయనను అనుసరించక పోతే వారు తండ్రిను అనుసరించడం లేదు, అని యేసు ప్రభువు చెబుతున్నారు. యేసు ప్రభువు మాటలు తండ్రి మాటలు అని మనకు ఇక్కడ తేటతెల్లం అవుతుంది.
ఇక్కడ మనకు ఒక విషయం అర్ధం కావాలి అది ఏమిటి అంటే ఆయన మనతో ఎలా ఉంటారు. ఇవి  కేవలం మాటలు మాత్రమేనా? లేక ఏమైనా ఇతర అర్ధం ఉన్నదా? నిజానికి యేసు ప్రభువును ప్రేమించిన కొంత మంది పునీతులు ఈ మాటలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి వారి జీవితాలలో ఆయనను అనుభవించారు, వారు ఈలోకంలో ఉండగానే. 

వారిలో కొంతమంది పునీత ఆవిల పురి తెరేసమ్మ, ఎలిజబెత్ ఆఫ్ థ ట్రినిటీ వంటి వారు. అందుకే ఆమె నా పరలోకాన్ని భూమి మీద కనుగొన్నాను అని చెబుతుంది. ఎందుకంటే ఆమె హృదయం లో ఉన్న దేవున్ని ఆమె ప్రతి నిత్యం అనుభవించింది. అదే విధంగా తెరేసమ్మ గారు, దేవున్ని చూడాలంటే మనకు పరలోకం పోవడానికి రెక్కలు అవసరం లేదు, నీ హృదయంలోనికి వెళితే సరిపోతుంది అని చెబుతుంది.
 వీరు ప్రార్ధనలో మన హృదయంలో ఉన్న దేవున్ని కనుగొన వచ్చో చెబుతున్నారు. పునీత ఫ్రాన్సిస్ గారు ఏ విధంగా జీవిస్తే ఆయన మనతో ఉంటారో తన జీవితం ద్వారా చెబుతున్నారు. వారందరూ యేసు ప్రభువును అనుభవించిన వారే.

ఇక్కడ యేసు ప్రభువు నేను మీకు శాంతిని ఇస్తాను అని చెప్పారు. లోకం ఇచ్చేలా కాదు. మీరు భయ పడవలదు  అని చెపుతున్నారు. ఇది ఆయన తన శిష్యులకు ఇచ్చే ఒక బహుమతిశాంతి కోసం మనం ఎక్కడకు ఎల్లాలి? ఈలోకం  ఈ శాంతి ఇవ్వలేదు అది కేవలం యేసు ప్రభువులో మాత్రమే దొరుకుతుంది.

నేను మీకు శాంతిని ఇస్తాను నా శాంతి మీకు ఇస్తాను అని చెపుతున్నారు ఆయన శాంతి అంటే ఏమిటి?  ఆయనను ప్రేమించే వారు భయ పడరు, ఎందుకంటే ఆయనను ప్రేమించే వారికి ఆ శాంతి ఉంటుంది. ఈరోజు అందరు శాంతి కోసం అందరు  వెదుకుతున్నారు కాని వెదకవలసిన చోట వెదుకట లేదు. 

ఆయన ప్రేమ మరియు క్షమ మనలను సమాధానంతో ఉండేలా చేస్తుంది.  యేసు ప్రభువు, నేను నన్ను ప్రేమిచ్చే వారి వద్దకు వచ్చి వారితో నివాస ముందును అంటున్నారు. దాని ద్వారా మనకు శాంతి వస్తుంది. 

లోకం నిజమైన శాంతిని ఎరుగదు. ఎందుకంటే లోకానికి శాంతి అంటే ఎటువంటి అలజడి లేకుండా ఉండటం, గొడవలు, యుద్దాలు  లేక పోవడం మాత్రమే. కానీ యేసు ప్రభువు ఇచ్చే శాంతి ఇటువంటిది కాదు ఆయన ఇచ్చే శాంతి ,అంతరంగీకమైనది.
 
ఆయన మన  వద్ద ఉండటం. ఎందుకు అంటే ఆయన  శిష్యుల వద్ద ఉంటే వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ సమాధానంతో వెళుతుంది, ఎందుకంటే ఆమెను ఆయన క్షమిస్తున్నారు.  యేసు ప్రభువు మన వద్దకు వచ్చి మనతోనే ఉంటాను అంటున్నారు. 

ఎలా ఆయన మనతో ఉండేలా చేయాలి. యేసు ప్రభువే మనకు ఒక జవాబు ఇస్తున్నాడు, ఎలాగా అంటే ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా ఆయన మనతో ఉంటారు. ఎందుకు ఆయన మనతో ఉండాలి ? ఆ అవసరం ఏమి ఉంది అంటే, ఆయన మనతో ఉంటే మనం ఎక్కువ ఫలవంతం అవుతాము. సమృద్దిగా ఫలమిస్తాము.

యేసు ప్రభువు శిష్యులకు పవిత్రాత్మను లేక ఆదరణ కర్తను పంపు తాను అని వాగ్ధానం చేస్తున్నారు. ఇక్కడ పవిత్రాత్మ ఏమి చేస్తుందో కూడా యేసు ప్రభువు చెపుతున్నారు. పవిత్రాత్మ వారికి యేసు ప్రభువు చెప్పిన అన్నీం టిని గుర్తు చేస్తుంది. పవిత్రాత్మ శక్తి శిష్యులకు ఉత్సాహం ఇచ్చి సువార్తను ప్రకటించడానికి ఉపయోగపడుతుంది.

 మీకు ఆధరణ కర్తను పంపుతాను అని యేసు ప్రభువు చెపుతున్నారు. పరక్లీత అని అరమయిక్ బాషలో అంటారు పరక్  అంటే రక్షించు , లేక కాపాడు, లేత అంటే శపించబడిన వారిని , లేక దేవుని మార్గమునకు దూరముగా ఉన్నవారిని  కాపాడువారు అని అర్ధం. 

అంటే పవిత్రాత్మ ఈ శిష్యులను ప్రోత్సహించి వారు సువార్తను ప్రకటించే విధంగా చేస్తుంది. పవిత్రాత్మ శిష్యులకు యేసు ప్రభువును అనుసరించడం అంటే ఏమిటో తెలుపుతుంది. మరియు సువార్తను ఏ విధంగా ప్రకటించాలో తెలుపుతుంది. పవిత్రాత్మ వారికి ఏ విధంగా ఉండాలో నేర్పుతుంది.వారికి శాంతిని తీసుకువస్తుంది. వారికి నిజమైన శాంతి ఇస్తుంది.

 యేసు ప్రభువు తన శిష్యులను వదలి తండ్రి వద్దకు వెల్లుచు,  తన శిష్యులను ఆయన  వదలి పెట్టుటకు ఆయన ఇష్ట పడుటలేదు. యేసు ప్రభువు లేని సమయంలో శిష్యులు ఎలా ఉండాలో యేసు ప్రభువు ముందుగానే నిశ్చయించారు. వారికి అంతకు ముందుగానే అనేక సార్లు దాని గురించి  వివరించారు. ఆయన వారి నుండి వెళ్ళే సమయంలో వారికి ఆయన  నామమున తండ్రి పవిత్రాత్మను పంపుతున్నారు. 

ఈ పవిత్రాత్మ  వారికి అవసరం ఎందుకంటే  యేసు ప్రభువు ప్రేమించిన విధంగా వారికి  ప్రేమను నేర్పాలి.మీ హృదయములను కలవర పడనియకుము , భయ పడవలదు. 

యేసు ప్రభువు ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమిటి? ఈ సమయంలో శిష్యులు శ్రమలుకు గురి కావడం లేదు. పరిసయ్యులు , సద్దుకయ్యులు యేసు ప్రభువును అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాని యేసు ప్రభువు వారి వద్ద నుండి వెడలి పోయిన తరువాత వీరు అనేక కష్టాలకు గురి అవుతారు, దానికోసం వారిని సిద్ధం చేస్తున్నారు. 

మరల వారికి దేవుని ప్రేమను తెలియచేస్తున్నాడు.  దేవుడు మనలను ప్రేమిస్తున్నారు, మనతో ఉంటాను అన్నారు. కాని దానికి మనం సిద్ధంగా ఉన్నమా? ఆయన అజ్ఞాలను పాటిస్తున్నమా?

 దేవునికి మనకు ఏమి కావాలో తెలుసు కానీ అంత కన్నా మనకు ఏమి అవసరమో ప్రభువుకు తెలుసు.  ఆయనను ప్రేమించి , ఆయన ఆజ్ఞలకు పాటించి, ఆయనతో కలసి జీవించి, ఆయన పంపే ఆదరణ కర్తను ఆహ్వానించి, పవిత్రాత్మ ఫలాలను పొంది మన జీవితాలను ఫలవంతం చేసుకొని నిజమైన క్రీస్తు అనుచరులగా జీవించడానికి సిద్ధ పడుదాం. ఆమెన్
 

గుడ్ ఫ్రైడే ( పవిత్ర శుక్రవారం)

 గుడ్ ఫ్రైడే  ( పవిత్ర శుక్రవారం)

ప్రియ మిత్రులారా! ఈ రోజు యేసు ప్రభువు శిలువ మీద శ్రమలు పొంది మరణించారు. యేసు ప్రభువు ఎందుకు మరణించాలి? అని మనం అడిగినట్లయితే మన పాపములను క్షమించడానికి అని మనం నేర్చుకున్నాం.  ఆయన మన పాపములను తన  మీద వేసుకొని మనలను పాప విముక్తులను చేశాడు. ఒక సాధారణ మనిషికి ఇది చేయడం అసంభవం. యేసు ప్రభువు కేవలం మానవుడు మాత్రమే కాదు ఆయన దేవుడు కూడా కాబట్టి ఇది సాధ్యమవుతుంది. ఆయన బలి వస్తువుగా తనను తాను శిలువ పీఠం మీద అర్పించారు. ఆ విధంగా ఆయన బలి వస్తువు అయ్యాడు. మరియు ఈ శుక్రవారం మన రక్షణ కార్యన్ని    సాధ్యం చేశారు. 

పునీత మార్కు గారు యేసు ప్రభువు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య శిలువ వేయబడ్డాడు అని అంటున్నాడు. బందిపోటు దొంగలు అంటే వారు  రోమా సామ్రాజ్య అధికారంను అంగీకరించలేదు. వారి మధ్య యేసు ప్రభువును సిలువ వేయడమంటే ఆయను కూడా ఒక విప్లవ కారునిగా వారు చూసారు. ఇది మనం ఆయనకు తీర్పు ఇచ్చినప్పుడు చూస్తాము. కానీ  రోమా సైన్యాధిపతి ఇతను నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మార్కు 15:30. ఇతను దేవుని కుమారుడు అని మొట్ట మొదటిగా ఒక  అన్యుడు తెలుపుచున్నాడు. యేసు ప్రభువుని యొక్క శిష్యులుకూడా  ఈ విధంగా ఆయన గురించి చెప్పలేదు. వీరు రోమా చక్రవర్తి దేవుని కుమారుడు అని అనుకునేవారు. కానీ యేసు ప్రభువుని దేవుని కుమారునిగా తెలియ చేస్తున్నాడు. వారికి తెలియకుండానే ఆయన తమ అధిపతి అని చెబుతున్నారు. 

పునీత మార్కుగారు యేసు ప్రభువు మరణాన్ని అధికార వ్యవస్థ మీద తీరుగుబాటుకు కారణంగా  జరుగుతుంది అని తెలియచేస్తున్నారు. యేసు ప్రభువు మీద దేవాలయ అధికారులు చాలా ద్వేషంతో ఉన్నారు. ఆయన వారి అధికారాన్ని  ప్రశ్నించాడు. వారి తప్పులను ఎత్తి చూపాడు. అందుకే ఆయన మీద కక్షకట్టారు. 

యేసు ప్రభువు మీద జరిగిన విచారణను ఒకసారి మనం పరిశీలిస్తే యేసు ప్రభువు ఎవరు అని మనం తెలుసుకోవచ్చు. విచారణ మొత్తంలో కూడా అక్కడ ఎటువంటి కలవరపాటు లేకుండా ప్రశాంతంగా ఉంది యేసు ప్రభువు మాత్రమే. పిలాతు లోపలకు బయటకు తీరుగుతున్నాడు, హెరోదు నాకు సంభందం లేదు అంటున్నాడు, పిలాతు బయపడుతూ చేతులు కడిగారు. ప్రధాన అర్చకులు, పరిసయ్యులు గొడవ చేస్తున్నారు, నిందిస్తున్నారు. కానీ యేసు ప్రభువు ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఎందుకు వచ్చినది, ఏమి చేస్తున్నది, ఏమి జరుగబోతున్నది. అందుకే అంత ప్రశాంతత కలిగి ఉన్నాడు. 

మొదటి పేతురు 3: 18వ వచనం మనకు యేసు ప్రభువు మరణానికి ఒక కారణం చెబుతుంది. "ఆయన ఒకే సారి పాపములకై మరణించేను. దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అట్లు చేసెను." ఇది దేవుడు చేసిన ప్రణాళికా అని మనకు తెలుస్తుంది. కాని  ఇక్కడ యేసు ప్రభువుని పట్టిస్తున్న యూద తప్పు చేస్తున్నాడు. తన గురువును అమ్ముకుంటున్నాడు, తన స్వార్ధ బుద్ది చూపిస్తున్నాడు. చాలా సార్లు మనం పేతురు , యుదాలను పోల్చుతాం.  కానీ వారు ఇద్దరు రెండు వేర్వేరు స్వభావాలు కలవారు. పేతురు గురువును అమ్ముకోలేదు, ఆయన భయంతో అబద్ధం ఆడుతున్నారు. కానీ యూద వేరు. తన మనస్సు మొత్తం ధనం మీదనే ఉంది. మనం ధనం  దేవుని కంటే ఏమి గొప్పది కాదు అని తెలుసుకోవాలి. 

యూద ఇస్కారియోతు యేసు ప్రభువును పట్టిస్తే నాకు ఏమి ఇస్తారు అని ప్రధాన అర్చకుడును  అడుగుతున్నాడు. వారు ఆయనకు 30 వెండి నాణెములను ఇస్తున్నారు. యేసు ప్రభువును పట్టించడం వలన  ఒక స్త్రీ  యేసు ప్రభువు సిమియోను అనే వ్య్తకి ఇంటిలో విందుకు వెళ్ళినప్పుడు ప్రభువు  కాళ్ళకు అభ్యంగనం చేస్తుంది.  యేసు ప్రభువుని కాళ్ళకు అభ్యంగనం  చేసిన తైలం విలువ తనకు తిరిగి వచ్చిందని  యూదా ఆనందపడి ఉండవచ్చు. యేసు ప్రభువుని శిష్యుడై ఉండికూడా ఆయన ధననికి బానిస, అందుకే ఆయన తన గురువును పట్టిస్తున్నాడు. అంతకు ముందు తన గురువును వీడను అని ఇప్పుడు ఆయనను ఇతరులకు ఇస్తున్నాడు. 

అంత సమాప్తమైనది అని తలవంచి ప్రాణము విడిచెను. యోహను 19:30 

అది మధ్యాహ్నం 3గంటల సమయం, యేసు ప్రభువు నీటి కోసం అడిగారు వారు చేదు ద్రాక్ష రసాన్ని ఆయనకు ఇచ్చారు. అప్పడు అంతా సమాప్తమైనది అని యేసు ప్రభువు తల వంచి ప్రాణం విడిచాడు. 

యేసు ప్రభువు ఏమి సమాప్తం చేశాడు? ఏమి సమాప్తమైనది? యేసు ప్రభువు అంత సమాప్తమైనది అని అన్నప్పుడు ఆయన తన ప్రాణం గురించి కాదు మాటలాడింది. ఆయన అంటున్నది తనకు తన తండ్రి ఇచ్చిన మానవ రక్షణ కార్యం అంత సంపూర్తి చేశాను అని అంటున్నారు. 

దేవునితో మానవుని సఖ్యత అనేది పూర్తి అయ్యింది. దేవునితో మానవునికి వున్న అగాధం పూడ్చ బడింది. మన పాపం వలన,  ప్రేమ గల దేవునికి దూరంగా ఉన్నాము, ఆ దూరం తీసివేయబడింది. 

యేసు ప్రభువు చెప్పిన  అంత సమాప్తమైనది అనే  ఈ మాట, ఒక విజయ నినాదం. ఎందుకంటే యేసు ప్రభువు చివరి వరకు కూడా తన తండ్రి ఇచ్చిన ఈ కార్యాన్ని నిర్వర్తించాడు. యేసు ప్రభువుని కర్తవ్యం కేవలం రక్షించడం మాత్రమే కాదు, ప్రజల మీద తండ్రికి ఉన్న  ప్రేమను  చూపించడం కూడా. ఈ పనిని కూడా పరిపూర్ణంగా యేసు ప్రభువు చేశాడు. 

వీటన్నింటిని చేయడానికి యేసు ప్రభువు మరణిస్తున్నారు. దానిని మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం, నిజముగా అది గుడ్ ఫైడేనే. 

సిలువ మీద యేసు ప్రభువు దాహం అంటున్నారు, ఆయన దాహం నీటి కొరకు కాదు. నీటి కోసం కానప్పుడు మరి ఎందుకు దాహం కలిగి ఉన్నారు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నా ఆహారం అని యేసు ప్రభువు  అంటున్నారు. ఆయన దాహం కూడా నీటి కోసం కాదు, భౌతికమైనది కాదు,  ఆయన ఆహారం లాంటిది. ఆయన దాహం కూడా  తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. ఆయన దాహం తండ్రి చిత్తాన్ని పూర్తి చేయడం. 

ఆయన ఈ లోకానికి వచ్చినది తండ్రి దేవునకు  మన మీద అపారమైన ప్రేమ కలిగిన తండ్రి అని తెలియజేయడానికి. ఈ పనిని తన మరణంతో పూర్తి జేస్తున్నాడు. యేసు ప్రభువు  అంత సమాప్తం అయినది అని అనడం విజయ నినాదం. ఏందుకంటే తండ్రి తనకు ఇచ్చిన ఈ కర్తవ్యాన్ని పూర్తి చేసిన విజయ నినాదం. తన జీవితం మొత్తం ఈ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే. తాను పూర్తిగా అంటే తన చివరి శ్వాస వరకు ఈ పని చేస్తున్నాడు. చివరిగా అంత పూర్తి అయ్యింది అని చెపుతున్నాడు. 

యేసు ప్రభువు తన ఆత్మను వదలివేశాడు. అంటే ఆయన చనిపొతు తన ఆత్మను మన మీదకు వదిలాడు. ఇక్కడ మనం  హిస్సోపు  గురించి వింటున్నాము.   ఐగుప్తు లో  గొర్రె పిల్ల రక్తాన్ని  హిస్సపో కొలనుతో చిమ్మేవారు. యేసు ప్రభువు పాస్క గొర్రె పిల్ల వలె చనిపోతున్నారు. ఇదే సమయంలో పాస్క గొర్రె పిల్లలను వధించేవారు. యేసు ప్రభువు లోక పాపములను మోసేటువంటి గొర్రె పిల్ల వలె చనిపోతున్నారు. 

ఇంకా ఆయన ఏమి సంపూర్తి చేశారు? దైవ ప్రేమను పూర్తిగా చూపించారు,  తెగిపోయిన దైవ - మానవ సంభందంను సరి  చేశారు. ఆయన్ను నమ్మి, ఆయన్ను అనుసరించి దేవునితో కలసి  జీవించుదాం. 

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...