26, ఫిబ్రవరి 2026, గురువారం

లూకా 1:39-45

 లూకా 1:39-45

ఆ దినములలో మరియమ్మ   యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు  త్వరితముగా  ప్రయానమైపోయెను. ఆమె జెకర్యా ఇంటిలో  ప్రవేశించి ఎలిశబేతమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిశబేతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిశబేతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను: "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను? నీ వందనవచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు!" 

ధ్యానము: ఆ దినములలో మరియమ్మ   యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు  త్వరితముగా  ప్రయానమైపోయెను.  గాబ్రియేలు దేవదూత, ఎలిశబేతమ్మ గర్భము ధరించినదని చెప్పిన మాటలను విశ్వసించి, ఎలిశబేతమ్మను చూచి ఆమెకు తోడుగా ఉండుటకు, మరియమాత అక్కడకు వెళుతుంది. మరియమాత చేసిన ఈ ప్రయాణం చాలా కష్టమైనది. ఆమె నజరేతు నుండి ఒక పర్వత ప్రాంతం వైపు వెళుతుంది. ఈ ప్రయాణం, మరియమాత మరియు యోసేపులు జనాభా లెక్కలకు వెళ్లినంతటి కష్టమైనటువంటిది. ఎందుకంటే ఆమె పర్వతప్రాతంవైపు వెళ్ళాలి. అది ఒక రోజు కంటే ఎక్కువ ప్రయాణమే.  ఆ రోజులలోఅటువంటి  ప్రాతమునకు ఆ ప్రయాణం ఒక సాహసం లాంటిదే. ఎందుకు మరియమాత అటువంటి నిర్ణయం తీసుకుంటుందంటే ఎలిశబేతమ్మ గర్భవతి అయిన విషయం అప్పటికి మరియమాతకు, జెకర్యాకు మాత్రమే తెలుసు. ఎలిశబేతమ్మ వారి చుట్టము, వయసు మళ్లిన వ్యక్తి. గర్భవతిగా ఉన్న ఆమెకు సహయం చేయుటకు వెళుతుంది. మరియమాత అవసరంలో ఉన్నవారిని ఆదుకోనుటకు ఎటువంటి కష్టము అయిన భరిస్తుంది. మరియమాతలో ఉన్న ఈ సుగుణం మనం ఇతర సమయాలలో కూడా చూస్తాము. కానా అనే ఊరిలో పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి సహాయం చేయుటకు ప్రభువుకు విన్నవిస్తుంది. శిష్యులందరు యూదుల భయంతో పై గదిలో ఉన్నప్పుడు వారితో కలిసి, వారికోసం ప్రార్ధన చేస్తుంది.  

మరియమాత మరియు ఎలిశబేతమ్మ మధ్య సంభాషణ ఇక్కడ యేసు ప్రభువు ఎవరు అనే విషయం తెలియజేస్తుంది. ఇక్కడ బాప్తిస్మ యోహను యేసు ప్రభువు సాన్నిధ్యాన్ని గాంచి ఎంత ఆనందించాడో మనకు తెలుస్తుంది. యోహాను తన తల్లి గర్భమున ఉండి కూడా, యేసు ప్రభువును గుర్తిస్తున్నాడు. గాబ్రియేలు దేవ దూత చెప్పినట్లుగా ఆయన తన తల్లి గర్భమున ఉండగానే పవిత్రాత్మతో నింపబడ్డాడు. అందుకే ఆయన తల్లి గర్భమున ఉన్న గాని, యేసు ప్రభువును గుర్తించగలుగుతున్నాడు. గుర్తించడమే కాదు, యేసు ప్రభువు సాన్నిధ్యం ఎంత మధురమైనది అనె అనుభూతిని అనుభవించి  తల్లి గర్భములో ఉండి గంతులు వేయడం వలన తెలియజేస్తున్నాడు. ఎలిశబేతమ్మకూడా,  యేసు ప్రభువును గురించి తెలియ చేస్తుంది. ఆయన ప్రభువు అని గుర్తిస్తుంది. 

"స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను"  మరియ మాత స్త్రీలందరిలో ఆశీర్వదించబడినదని, ఆమెను గురించి ఎలిశబేతమ్మ పవిత్రాత్మ ప్రేరణతో చెబుతున్నదిమనలో ప్రతి ఒక్కరినీ దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. మరియమాతను ఎందుకు అంతా గొప్పగా ఆశీర్వదించారంటే, ఆమె దేవుని చిత్తమునకు తన జీవితాన్ని అంకితం చేసిన విధానం అంత గొప్పది. అందుకే తన కుమారున్నీ ఆమె ద్వారా ఈ లోకానికి తీసుకువస్తున్నాడు. ఎలిశబేతమ్మకూడా దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఆమెకు ప్రభువును ఇతరులకు తెలియజేసే, ప్రభువును గుర్తుపట్టకలిగే, ఆయన సాన్నిధ్య మాధుర్యాన్ని అనుభవించ కలిగే కుమారున్నీ ఇస్తున్నాడు. ఆమెకు ఉన్న పేరును పోగొడుతున్నారు. వీరి ఇద్దరి కలయిక దేవుని శక్తిని శంకించని ఇద్దరి కలయిక. ఇక్కడ పరమ పవిత్రుడైన దేవుని సాన్నిధ్యాన్ని, పాప కళంకం లేని యోహాను ఆనందిస్తున్నాడు. 

ఎలిశబేతమ్మ ఒక ప్రవక్త వలె  పవిత్రాత్మతో ప్రేరేపించబడి, మరియమాత గర్భముతో ఉన్నానని చెప్పకపోయిన కాని మరియమాత గురించి నా ప్రభువుని తల్లి నా దగ్గరకు రావడం నాకు ఎలా ప్రాప్తించేను అని చెబుతుంది. ఆమె రావడం తనకు దేవుని అనుగ్రహంగా ఆమె చెబుతుంది. మరియమాత మరియు ఆమె గర్భ ఫలమగు యేసు ప్రభువును ఆశీర్వదింపబడినవారు అని చెబుతుంది. మరియమాత గర్భమున ఉన్న శిశువు తన ప్రభువు అని చెప్పడం వలన ఎలిశబేతమ్మ పవిత్రత కూడా మనకు తెలుస్తుంది.   మరియమాత  దేవుని కుమారుని తన గర్భమున మోసినందుకు మాత్రమే ధన్యురాలు కాదు, ఎలిశబేతమ్మ చెప్పిన విధముగా ప్రభువు వాక్కులు నెరవేరునని నమ్మినందుకు ఆమె ధన్యురాలు. ఎందరో గొప్పవారు కొన్ని దేవుని నుండి వచ్చిన ప్రవచనములను నమ్ముట లేదు. కాని దేవునికి వ్యతిరేకముగా మాటలాడకుండా వుండవచ్చు. కాని మరియమాత  ఒక సాధారణ యువతి దేవుని నుండి వచ్చిన ప్రతి మాట  నెరవేరుతుంది అని నమ్ముతుంది.  గాబ్రియేలు దూత ఎలిశబేతమ్మ గర్భం గురించి చెప్పగానే ఆమెకు సపర్యాలు చేయడానికి వెళుతుంది. మరియమాత విశ్వాసులందరికి తల్లి. ఎలా దేవుని విశ్వాసించాలో ఆమెను చూసి నేర్చుకోవాలి. దేవుని మీద ఆమె వలె నమ్మకం కలిగిఉండాలి. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా! మీ ప్రేమ ఎంత ఉన్నతము. మీ ప్రణాళికకు తన జీవితమును అంకితం చేసిన మరియమాతను ఎంతో మిన్నగా ఆశీర్వదించారు. మీరు చెప్పిన ప్రతి మాట జరుగుతుంది అని నమ్మిన మరియమాత జీవితం మాకు ఆదర్శం. మేము కూడా మీ ప్రణాళికకు మా జీవితాలను అంకితం చేసేలా చేయండి. మరియ మాతను ఆశీర్వదించిన విధముగా మమ్ము కూడా ఆశీర్వదించండి. ప్రభువా! మీ  సాన్నిధ్యాన్ని యోహాను ఎంతగానో ఆనందిస్తున్నాడు. మీ పవిత్రతను యోహాను తెలుసుకున్నట్లు మేము కూడా పవిత్రత కలిగి మీ సాన్నిధ్యా మాధుర్యం అనుభవంచే అనుగ్రహం దయచేయండి. ప్రభువా! మీ అనుగ్రహాలు, ఆశీర్వాదాలు తెలుసుకొని వాటిని ఎప్పుడు మర్చిపోకుండా ఉండేలా మమ్ము దీవించండి. ప్రభువా! మరియమాత వలె మీ యడల ఎప్పటికీ సన్నగిళ్ళని విశ్వాసాన్ని ఇవ్వండి.   ఆమెన్. 


పునీత స్తేఫాను

 పునీత స్తేఫాను 

స్తేఫాను అంటే కిరీటం అని అర్ధం. ఈయన అపోస్తులులు ఎన్నుకొన్న ఏడుగురు డీకనులలో ఒకరు. డీకనుగా స్తెఫాను అక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయుటకు ఎన్నుకొనబడ్డాడు. స్తెఫాను జ్ఞానము కలిగి, పవిత్రాత్మతో నింపబడి, మంచి ప్రవర్తన కలవాడిగా అందరికీ తెలిసిన వ్యక్తి.  తన జ్ఞానం ద్వార దేవుని గురించి బోధించి, హింసించబడి చంపబడ్డాడు.  ఈయన భోదన యూదులను కోపమునకు గురిచేసింది. యూదులు ఆయన మీద చూపిన క్రోదాన్ని, ఆయనకు కీర్తిని తీసుకువచ్చేలా చేశాడు. 

స్తేఫాను విశ్వాసం చాలా గొప్పది. ఆయన యూదుల చేత హింసించబడుతున్న అటువంటి అపనమ్మకం లేకుండా దేవుని  ఘనతను గురించి వారికి బోధించాడు.   ఎటువంటి పరిస్థితిలో కూడా దేవుని గురించి వివరిస్తూ ఎలా యూదులు తప్పుగా ఆలోచిస్తున్నారో వారికి తెలియజేయడంలో పూర్తిగా సఫలికృతం అయ్యారు. కాని ఆయనను వారు తప్పుగా అర్ధం చేసుకున్నారు. యేసు ప్రభువు బోధనలు ఈయన పాటించిన తీరు అందరు నేర్చుకోవాలి. తనను చంపుతున్న వారి కొరకు ప్రార్ధిస్తూ, ఆ పాపాన్ని వారి మీద వేయకండి అని వేడుకున్నాడు. మరణించే ముందు దేవుని ఇంత కష్టానికి గురిచేశాడని నిందించక, దేవునికి తన ఆత్మను అప్పగించాడు. 

స్తెఫానును బంధించుట 

స్తేఫాను దైవనుగ్రహం, శక్తి కలిగినవాడై గొప్ప అద్భుతములు, సూచక క్రియలు చేసెడివాడు. కొంత మంది స్తెఫానుతో వాదించెవారు. అతను చూపిన జ్ఞానమును,  ఆత్మతో  ప్రేరేపించబడి వాదించుటను  వారు ఎదుర్కోలేకపోయారు. ఆయనను ఎలా అయిన శిక్షించాలి అని వారు  పన్నాగం పన్నారు. అబద్ద సాక్ష్యం చెప్పుటకు కొందరిన కూర్చుకొని వారిచేత స్తెఫాను మోషేమీద దేవుని మీద దూషణ వాక్యాలు పలికినట్లుగా చెప్పుటకు కొందరిని కుదుర్చుకున్నారు. స్తెఫానుకు వ్యతిరేకముగా ప్రజలను, పెద్దలను ధర్మ శాస్త్రబోధకులను వారు స్తెఫానుకు వ్యతిరేకముగా పురికోల్పోరు. వారు స్తెఫానును బంధించి న్యాయసభ ఎదుటకు  తీసుకొని వచ్చారు. వారు తీసుకొనివచ్చిన అబద్దసాక్షులు స్తెఫాను పవిత్ర దేవాలయమునకు, మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాటలాడుచున్నాడాని, యేసు దేవాలయమును కూల గోడుతాడని, మోషే నుండి వచ్చిన  పారంపర్యమును   మార్పుచేస్తాడని చెబుతున్నాడని, వారు న్యాయ సభముందు చెప్పారు. అది వినిన వారు స్తెఫాను వైపు చూడగా ఆయన ముఖం వారికి దేవదూత వలె కనిపించినది. ఆయన పవిత్రత అది వారికి గుర్తు చేస్తుంది. ఆయన ముఖంలో  భయం, అందోళన వంటికి కాకుండా ప్రశాంతత, దేవదూతలా  కనబడుటకు కారణం ఏమిటి అంటే ఆయనకు దేవుని మీద ఉన్న ప్రేమ, దేవునికి తన జీవితమును అర్పించిన విధానం, ఆత్మతో నింపబడిఉండటం, విశ్వాసంతో నిండి ఉండటం వలన ఆయన  అటువంటి విపత్కర పరిస్థితిలో కూడా ఆయన తన ప్రశాంతతను కోల్పోకుండా ఉన్నాడు. 

స్తెఫాను వాదన 
ప్రధానార్చకుడు స్తెఫానును వారు చెప్పేది నిజమేనా? అని అడిగాడు అందుకు స్తెఫాను వారితో తన వాదనను ఇలా వినిపించాడు. మహిమగల దేవుడు మనం పూర్వీకుడగు అబ్రహాముకు కనపడి నీవు నీ దేశమును, నీ బంధువులను వీడి నేను చూపింపబోవు దేశమునకు వెళ్ళమని చెప్పగా ఆయన అట్లే చేశాడు, దేవుడు అబ్రహామునకు సొంత భూమిగా ఒక అడుగైనను ఇవ్వలేదు. కాని ఆయన సంతానానికి ఇస్తాను అని వాగ్ధానం చేశాడు. అలానే నీ సంతతి వారు 400 సంవత్సరాలు విదేశములో బానిసలుగా బాదలకు గురవుతారని, వారిని బాధలకు గురిచేసిన వారిని  తీర్పుకు గురిచేస్తాను అని చెప్పాడు. అటుల అబ్రహాము నుండి మోషే వరకు, ఎలా దేవుడు వీరికి తోడై ఉన్నది చెప్పాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నప్పటికీ ఎలా వారు దేవుని మాటలను వీడి జీవించినది కూడా వారికి తెలియజేశాడు. ఎలా వారు మోషేను దేవుడు పంపిన కాని తనని నాయకునిగా గౌరవించకుండా ఉన్నది వారికి తెలియజేశాడు.  మోషే నుండి దేవాలయం కట్టినప్పటి వరకు చెప్పి, ఎలా దైవ సమక్షము  గుడారములో ఉన్న విషయం చెప్పి, ప్రవక్త మాటలను వారికి చెబుతూ ఆకాశము దేవుని సింహాసనమని భూమి ఆయన పాదపీఠమని, సమస్తము దేవునిది అని చెప్పి దేవుని సందేశమును తిరస్కరించి, వారు హృదయమందు, చెవులయందు సున్నతి లేని వారి వలె ఉన్న విషయాన్ని వారికి తెలియజేశాడు. వారి పూర్వుల వలె పవిత్రాత్మను ఎదురించుచున్న విషయాన్ని వారికి తెలియజేశాడు. ఎలా వారు ప్రవక్తలను హింసించింది వారికి చెప్పాడు.
 
ఆలయము యొక ప్రాముఖ్యత - పెద్దలకు, న్యాయ సభకు ఆలయం గొప్పది. వారి జీవితం మొత్తం దాని మీదనే ఆదరపడి ఉన్నది. కాని ఆ కట్టడానికి కాదు ప్రాముఖ్యత దానిలో ఉన్న దేవునిది. ఎందుకంటే దైవ సమక్షము ఆ కట్టడములో ఉన్నది. ఈ ఆలయమును కట్టకమునుపు వారికి దైవ సమక్షపు గూడారము ఉండేది. దావీదు కాలము వరకు ఈ దైవ సమక్షపు గుడారము ఉన్నది. అప్పుడు దావీదు ఒక దేవాలయము కట్టుటకు దేవుని అనుమతి అడిగాడు కాని సోలోమోనే దానిని కట్టించాడు. దేవునికి ఈ ఆలయము మాత్రమే ముఖ్యం ఆనుకొనుట సమంజసము కాదు. ఈ విషయములను వారికి వివరిస్తూ, వారి పితరులు ఎలా ఈ విషయములను చెప్పిన ప్రవక్తలను హింసించిన విషయం వారితో చెబుతూ వీరు కూడా పవిత్రాత్మను ఎదురించుచున్నారని, మెస్సీయ్యాను గురించి చెప్పిన, చూపిన వారిని చంపివేశారు అని , మరియు యేసు ప్రభువును వారు శత్రువులకుఅప్పగించిన విషయం చెప్పి, దేవదూతల ద్వారా పొందిన చట్టమును వారే పాటించుటలేదు అని వారి తప్పును బయట పెట్టడం జరిగింది. 

స్తెఫానుపై రాళ్ళ వర్షం 

ఆ న్యాయ సభలోని వారు వారందరు ఆయన మాటలకు కోపముతో మండిపడ్డారు. స్తెఫాను పవిత్రాత్మతో నిండి, పరలోకం వైపు చూడగా ఆయనకు దేవుని మహిమ ఆయన కూడప్రక్కన యేసు ప్రభువు నిలబడి ఉండటం చూశాడు. ఆ విషయం వారికి తెలియజేస్తుండగా వారు కేకలు వేస్తూ, చెవులు మూసుకొన్నారు. అందరు ముకుమ్మడిగా విరుచుకుపడి, నగరము బయటకు తీసుకుపోయి రాళ్ళతో కొట్టారు. వారు రాళ్ళతో కొట్టుచుండగా స్తెఫాను "యేసు ప్రభూ! నా ఆత్మను గైకొనుము" అని ప్రార్ధించాడు. తరువాత మోకరిల్లి "ప్రభూ ! ఈ పాపము  వీరిపై  మోపకుము" అని మరణించాడు. 

యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16

 యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16 "పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది: ఒక  యజమానుడు తన ద్రాక్షతోటలో పని  చేయుటకు పని వారలకై ప్రాతః...