26, ఫిబ్రవరి 2026, గురువారం

మత్తయి 18:12-14

 మత్తయి  18:12-14

ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబదితొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా? అది దొరికినపుడు తప్పిపోని తక్కిన తొంబది తొమ్మిదింటికంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయమముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒకడైనను నాశమగుట పరలోకమదుండు మీ తండ్రి చిత్తము కాదని తెలిసికొనుడు. 

ధ్యానము:  యిస్రాయేలు ప్రజలు దేవున్ని వారి కాపరిగా చూస్తున్నారు. ప్రవక్తలు ముఖ్యంగా ఏహెజ్కెల్, యోషయా మరియు యిర్మీయా ప్రవక్తలు అనేక పర్యాయాలు దేవున్ని కాపరి అని సంబోధిస్తున్నారు. కాపరి తప్పిపోయిన గొర్రెలను వెదకి  మరల తన మందలోనికి  తీసుకొని వస్తాడు. మెస్సయ్యా తప్పిపోయిన వారిని మరల దేవుని దగ్గరకు తీసుకొని వస్తాడు అని వారు నమ్మేవారు. యేసు ప్రభువు కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువు మాత్రమే కాపరి కాదు, తప్పి పోయిన వారిని తిరిగి యేసు ప్రభువు వద్దకు తీసుకువచ్చే వారు అందరు కాపరిగా ఉంటారు. యేసు ప్రభువు తప్పిపోయిన వారిని వెదకి వారి, సమస్యలను తీర్చి మరల వారిని తండ్రి దగ్గరకు తీసుకురావడానికి, ఒకరి వద్దకు కాదు ప్రతి వ్యక్తి వద్దకు వస్తున్నారు. అందరినీ తండ్రి దగ్గరకు తీసుకురావడానికి చేయవలసినవి అన్ని కూడా చేస్తున్నారు. 

ఎవరు తప్పి పోయారు? నీతిని తప్పిన ప్రతి వ్యక్తి , పరలోక రాజ్యానికి దూరంగానే ఉన్నారు వారు అందరు తప్పి పోయిన వారే.  అటువంటి వారి అందరినీ ప్రభువు తన వద్దకు తీసుకు వస్తున్నారు, పరలోక రాజ్యంలో స్థానం కలిపిస్తున్నారు. వీరు నీతిని తప్పుటకు అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ సార్లు ఇలా జరుగుటకు యిస్రాయేలు నాయకులే కారణం అయ్యారు. ఎందుకు వారు తప్పి పోయారు అని ప్రశ్నించినప్పుడు అనేక సమాధానాలు మనకు వస్తాయి. వాటిలో ముఖ్యమైనవి అనేక మంది అవకాశం లేని వారు వున్నారు.  వారని దేవునికి సంబంధించిన అన్ని విషయాలలో దూరంగా పెట్టడం జరిగినది. కొంతమంది వారి స్వల్ప ఆనందం కోసం వెళ్ళి తిరిగి రాలేక తప్పి పోయిన వారు ఉన్నారు. ఎటువంటి కారణాలతో వారు దూరంగా ఉన్న,  వారిని యేసు ప్రభువు మరల దేవుని దగ్గరకు తీసుకొని వస్తున్నారు. ఎవరిని కోల్పోవడం ప్రభువుకు ఇష్టం లేదు. అందుకె యేసు ప్రభువే తండ్రితో నీవు నాకు ఇచ్చిన వారిని, ఎవరిని కొల్పోననీ అంటున్నారు. వారి కోసం ప్రార్ధన చేస్తున్నారు. 

యోషయ 40: 11 లో "ఆయన కాపరివలె తన మందను మేపును. గొర్రె పిల్లలను తన బాహువులతో కూర్చి, రొమ్మునయనించుకొని మోసికొనిపోవును."కాపరి వలె ఆయన తన మందను మెపును, ఆయన తన గొర్రె పిల్లనను తన వడిలో ఆడించును. యెహెజ్కెల్ 34:1 "యిస్రాయేలు కాపరులారా మీకు అనర్ధము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారేగాని గొర్రెలమందలను మేపుటలేదు…  తప్పిపోయిన వానిని వెదకి తొలుకొని వచ్చుట లేదు పైగా వారి పట్ల క్రూరముగా , కఠినముగా ప్రవర్తించుచున్నారు." నా గొర్రెల కోసం వెదుకుదును.   ప్రభువే నా కాపరి అనే కీర్తన అందరికీ ఇష్టం ఎందుకంటే ప్రభువు మనలను ఎంత కాపాడుతాడో ఎటువంటి బయళ్ళు దగ్గరకు తీసుకుపోతారో చూస్తాము. ప్రభువు మనకు కాపరి అయితే మనలను ఆయన ఏ బాటలో తీసుకుపోతున్న చింత లేకుండా ఉండవచ్చు. కాని యిస్రాయేలు కాపరులు అలా లేరు అనే విషయం యెహెజ్కెల్ గ్రంధంలో చూస్తాము. తప్పిపోయిన వారి పట్ల ఈ కాపరులు కఠినముగా వ్యవహరించారు. వారిని సమాజంలో తక్కువగా చూడటం మొదలపెట్టారు, అగౌరపరిచారు. వారిని అపవిత్రులుగా చేశారు. ఇటువంటి కారణాలే యేసు ప్రభువు సమయంలో కూడా ఉన్నాయి. 

ఒక వ్యక్తిని కోల్పోవడం  కూడా యేసు ప్రభువుకి  ఇష్టం లేదు. అనేకమంది కాపరులు వారి గౌరవం గురించి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు. కాపరిగా ఉండటాన్ని అంత గొప్ప పనిగా చూసేవారు కాదు. కాని యేసు ప్రభువు మంచి కాపరిhttps://amruthavellaturi.blogspot.com/2023/03/blog-post_48.html. ఒక గొర్రె మంద నుండి బయటకు పోతే మంద మొత్తము పోయినట్లుగా ఆయన బాధపడుతారు. అది దొరికినంత వరకు ఆయన దాని కోసం వెదకుతారు. దొరికినంత వరకు వేదకుతానే ఉంటారు. ఎందుకు ప్రభువు అంతగా వెదకుతున్నారు? ఒక వ్యక్తి  తప్పిపోయిన సమాజం మొత్తం దాని బాధను అనుభవిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా దేవుని సృష్టే. దేవుని బిడ్డే. కొన్ని సార్లు ఒక వ్యక్తి తప్పు చేయడం వలన సమాజం మొత్తం పర్యవసానం అనుభవిస్తుంది.  యిస్రాయేలు నాయకులు తప్పు చేసినప్పుడళ్ల అనేక బాధలు ప్రజలు అనుభవించారు. 

  యేసు ప్రభువు చెప్పిన ఈ  ఉపమానం చిన్న పిల్లల మీద, బలహీనులుగా ఉన్న మీద ప్రభువు కరుణ ఎలా ఉన్నదో మనం తెలుసుకోవచ్చు.   అధికారులు, నాయకులు  ఎవరు కూడా ఈ చిన్న బిడ్డలను కోల్పోవడానికి కారణం కాకూడదు అని ప్రభువు కోరుతున్నారు.  ఈ తప్పిపోయిన వారిని ఎలా మరలా సంఘం లోనికి తీసుకొని రావాలి. వారిని మరల తీసుకొనివచ్చినప్పుడు  ఎవరు అడ్డుకోవలదు అని ప్రభువు  చెబుతున్నారు. అందుకే యేసు ప్రభువు తప్పి పోయిన వారి వద్దకే వెళుతున్నారు, పాపులు, సుంకరులు మొదలగువారితో మాటలడుతున్నారు. వారిని అడ్డుకోవాలనుకున్న వారిని ముఖ్యముగా పరిసయ్యులను, ధర్మ శాస్త్ర బోధకులను  వారిస్తున్నారు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా ! మీరు మంచి కాపరి. మీరు తప్పి పోయిన మమ్ములను వెదకి మరలా తండ్రి వద్దకు చేర్చుటకు చాలా కృషి చేశారు. ప్రభువా నేను తప్పి పోవుట మీకు ఇష్టం లేదు అని తెలుసుకొని ఎంతో ఆనందంగా ఉన్నాము. ప్రభువా మీరు ఎలా అయితే ఎటువంటి కారణాలతో తప్పిపోయిన మమ్ము చీదరించుకోకుండా మేము మీతో ఉండాలిన కోరుకుంటున్నారు. కొన్ని సార్లు మా స్వార్ధం కోసం, అవసరాల కోసం కూడా మేము దూరంగా వెళ్ళి పోతున్నాము, అటువంటి సమయాలలో మీ ప్రేమను గురించే అనుగ్రహం మాకు దయచేయండి. మీ ప్రేమను గుర్తించి, మీ వద్దకు తిరిగి వచ్చే వారిని మేము ఎప్పుడు అడ్డుతగలకుండా ఉండే మంచి మనసు మాకు దయచేయండి. ఎవరు మీ నుండి తప్పి పోవుటకు మేము కారణం కాకుండా మా జీవితాలను మలచండి. ప్రభువా తప్పి పోయిన వారిని తిరిగి పొందినప్పుడు మీకు ఉండే ఆనందంలో మమ్ములను కూడా భాగస్వాములను చేయండి. ఆమెన్ 

మత్తయి 11:28-30

 మత్తయి  11:28-30

భారముచే అలసిసొలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు  విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాదుశీలుడనియు, వినమ్రహృదయుడననియు మీరు నా నుండి మీరు నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలన, నా కాడి  సులువైనది, నా బరువు తెలికైనది. 

ధ్యానం : "భారముచే అలసిసోలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను" యేసు ప్రభువు చెబుతున్న ఈ భారము ఏమిటి ? నా యొద్దకు రండు అని ప్రభువు చెబుతున్నాడు. యేసు ప్రభువు ప్రజలకు ఒక ఆహ్వానం ఇస్తున్నారు. ఆ ఆహ్వానం ఎందుకు? ఎందుకు ప్రభువు తన యొద్దకు  రమ్మంటున్నారు? ఆయన ఏమి ఇస్తాను అంటున్నారు? ప్రజలు ఎందుకు అలసిసోలసియున్నారు? నా కాడి మీరు ఎత్తుకొనుడు అని ప్రభువు చెబుతున్నారు. ఆయన కాడి అంటే ఏమిటి? నేను సాదుశీలుడననియు, వినమ్రహృదయుడననియు అని నా నుండి నేర్చుకోండి అని ప్రభువు చెబుతున్నారు. ఆయన నుండి ఏమి నేర్చుకోమని ప్రభువు చెబుతున్నారు? నా కాడి సులువైనది, నా బరువు తెలికైనది అని ప్రభువు చెబుతున్నారు. ఏమిటి  ఆయన కాడి? ఆయన బరువు ఎలా తేలికగా ఉంటుంది? ఈ సువిశేష భాగం చాలా చిన్నది అయిన మనకు చాలా  ప్రశ్నలు, జవాబులు ఇక్కడ దొరుకుతాయి. 

ప్రజలు భారముచే అలసిసొలసి ఉన్నారు. ఏమిటి ఈ భారము? పరిసయ్యులు , ధర్మ శాస్త్ర భోదకులు ఎలా ప్రజల మీద మోయలేని భారమును మోపుతున్నరో మనం పరిశుద్ద గ్రంధంలో చూస్తాము. మోయలేని భారం వారు ప్రజల మీద మోపుతున్నారే కాని, వారికి సహాయ పడుటకు వారి చిటికిన ఏలును కూడా వారు కదపరు అని ప్రభువు పలుకుతున్నారు. ఇక్కడ భారము అంటే వారి సాంప్రదాయాలు, నియమాలు మాత్రమే కాదు. వారి జీవితములో వారు అనుభవిస్తున్న అనేక మైన జీవిత బాధలు కూడా ఉన్నవి. ఇక్కడ ఇంకొక అర్ధం కూడా ఉన్నది, వారు అవలంభిస్తున్న తోరా , పవిత్ర గ్రంధం లోని మొదటి ఐదు గ్రంధాలు. వీటిని పాటిస్తున్నాము అనే అపోహలో, వారికి ఉన్న నియమాలను, అలివికాని విధంగా  అనేక రేట్లు పెంచుకుంటూ పోయారు. ఈ భారము కూడా ఈ ప్రజల మీద ఉంది. ఈ భారములతో ప్రజలు అలసి పోయారు. అందుకే ప్రభువు భారముచే అలసిసోలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకి రండి అంటున్నారు. 

"నా యొద్దకు రండు నేను మీకు విశ్రాంతి నొసగెదను" ఇది ఒక గొప్ప ఆహ్వానము, ఎవరికో ఒకరికి కాదు, ప్రతి ఒక్కరికి ఈ ఆహ్వానం ఇస్తున్నారు. ఇది సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంధంలో, వివేకవంతురాలైన స్త్రీ ఇచ్చిన, విందుకు ఆహ్వానం ఇచ్చినట్లుగా ఉన్నది. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన వారు, ఇప్పటివరకు పొందిన భారాన్ని వారు తొలగించుకోవచ్చు. అది ఎటువంటి భారం అయిన కావచ్చు. పాపం భారంతో ఉన్నవారు, ఆయన వద్దకు వస్తే వారి పాపముల భారం తొలగిస్తారు. ధర్మ శాస్త్ర భోదకుల నియమాలతో వారి చెప్పిన వాటిని చేయలేక నిరాశ, నిస్పృహలో ఉన్న వారు  ఆయన వద్దకు వచ్చి సేదతీరవచ్చు. దేవుని అనుగ్రహం కోసం వెదకి వేసారిన వారికి ఇది ప్రభువును కనుకగొని ఆయనతో ఉండుటకు ఇది గొప్ప అవకాశం. 

నా కాడిని మీరు ఎత్తుకొనుడు అని ప్రభువు చెబుతున్నారు. కాడి అంటే రెండు ఎద్దులను లేక పశువులను పొలం దున్నటకు లేక ఏమైనా మోయుటకు జత చేస్తూ ఉపయోగించేది. బండి బరువు మొత్తం కూడా కాడి మీదనే ఉంటుంది. యేసు ప్రభువు నాకాడి  మీరు ఎత్తుకొనుడు అని అంటున్నప్పుడు, వారు ఎటువంటి కాడిని మోస్తున్నారో ఆయనకు తెసులు. కాడి దించేది కేవలం వారి గమ్యం చెరినప్పుడే. ఈ ప్రజలు సాంప్రదాయాలు, నియమాలు, బలులు అన్ని  పాటిస్తున్నప్పటికి వారి గమ్యం అయిన దేవున్ని చేరడం లేదు. ఈ కాడి చాలా భారంగా ఉన్నది. ఇటువంటి కాడి కంటే యేసు ప్రభువుని కాడిని ఎత్తుకొనమని ప్రభువు చెబుతున్నారు.  నా కాడి  సులువైనది, నా బరువు తెలికైనది. అని ప్రభువు చెబుతున్నారు. ఎందుకు ప్రభువు కాడి సులువైనది? ఎందుకంటే ప్రభువు దేవుని ఆజ్ఞలను పెంచి ప్రజలకు ఇవ్వడంలేదు. వారిని కఠిన విధానాలు పాటించమని చెప్పడంలేదు. ప్రభువుని విధానం చాలా సులువైనది. సాంప్రదాయాలు, నియమాలు, బలులు, వీటి అన్నింటి కంటే సులువైనది. ఎందుకంటే ఆయన విధానం ప్రేమ, కరుణ, క్షమాపణ, మారు మనసు. ఈ కాడిని ఎత్తుకుంటే గమ్యం చేరడం సులభం. గమ్యం వారి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఆయనే ప్రతిఒక్కరి చివరి గమ్యం. 

 సాదుశీలుడనియు, వినమ్రహృదయుడననియు మీరు నా నుండి మీరు నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. యేసు ప్రభువు దగ్గరకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి  ఆయన ఎంత కరుణామయుడు అనే విషయం తెలుస్తుంది. యేసు ప్రభువు ఉపమానాలు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన వద్దకు వచ్చిన వారిని, ఆయనను కాదు అన్నవారిని, ఆయనను కొట్టిన వారిని, ఆయనతో తిరిగి ఆయన ఎవరో తెలియదు అనిన వారిని, ఆయన క్షమించిన విధానం, వారికి ఆయన చూపించిన ప్రేమ, ఆయన సాదుశీలుడని, వినమ్రహృదయుడని తెలియజేస్తుంది. యేసు ప్రభువు మనలను ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోమంటున్నారు. తెలుసుకోవడమే కాక నేర్చుకోమంటున్నారు.  ఇది మనం యేసు ప్రభువు వద్దకు వెళ్ళితే జరుగుతుంది. అపుడు మన ఆత్మల యందు విశ్రాంతి పొందుతాము అని చెబుతున్నారు. అంటే ఆయన దగ్గరకి వెళితే మనం నిశ్చింతగా ఉండవచ్చు.                       

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు ఎంత కరుణామాయులు, అనేకమంది మిమ్ములను అవమానించిన కాని, వారిని క్షమించారు. మీ కారుణ్యం ఎంతో గొప్పది. మేము అనేక సమస్యలతో, బాధలతో ఉన్నాము. వాటి నుండి సేదతీరాలని ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. సేద తీరాలని, విశ్రాంతి పొందాలని మేము చేసిన అనేక ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నిజమైన విశ్రాంతి మేము పొందలేకపోతున్నాము. ప్రభువా! నేను మీ ఆహ్వానాన్ని స్వీకరించి మీ వద్దకు వస్తున్నాను. మీ నుండి వినమ్రతను, సాదుశీలతను నేర్చుకొనే ఆవకాశం ఇవ్వండి. ప్రేమ, కరుణ, క్షమాపణ అనే మీ కాడిని మేము కూడా నేర్చుకొని అనుకరించేలా చేయండి. ప్రభువా మీరు చెబుతున్న ఆత్మ యందు విశ్రాంతిని మాకు చేయండి. ఆమెన్ 

1 కొరింతి 2:1-5, లూకా 4:16-30

 1 కొరింతి 2:1-5, లూకా 4:16-30 తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్ధనామందిరమునకు వెళ్లె...