26, ఫిబ్రవరి 2026, గురువారం

నిష్కళంక మాత మహోత్సవం

 నిష్కళంక మాత మహోత్సవం

లూకా  1:26-38

తదుపరి ఆరవమాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక  యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికివచ్చి, ఆమెతో "అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఎలినవారు నీతో ఉన్నారు" అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలతచెంది ఆ శుభవచనము ఏమిటొ అని ఆలోచించుచుండగా దేవదూత "మరియమ్మా !భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" అనెను. అంతట మరియమ్మ " నేను పురుషుని ఎరుగను కదా! ఈద్ ఎట్లు జరుగును?"  ఆ దూతను ప్రశ్నించేను. అందుకు ఆ దూత ఇట్లనెను: "పవిత్రాత్మ నీవపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను అవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు  దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిశబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు  మళ్ళినది గదా! గొడ్రాలైన  ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము. ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు" అంతట మరియమ్మ "ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!" అనెను. అంతట  ఆ దూత వెళ్ళి పోయెను.

ఈరోజు నిష్కళంక మాత మహోత్సవం జరుపుకుంటున్నాము. ఏమిటి ఈ పండుగ అంటే మరియ మాత తన తల్లి గర్భంలో పడినప్పటి నుండి ఎటువంటి పాపం లేకుండ పుట్టింది. మరియమాతలో ఎటువంటి మలినం అనేది లేదు. మరియ మాతను  పాపంలో పడకుండా తన వరప్రసాదాలు ముందుగానే ఇచ్చి తల్లి గర్భంలో పడినప్పటి నుండి పాప రహితురాలుగా ఆమెను చేశాడు అని అర్ధం. 

ఈ ఆలోచన రెండవ శతాబ్దం నుండి తిరిసభలో ఉన్నది. కాని 4 శతాబ్దంలోనే ఒక పండుగలా చేయడం జరుగుతుంది. 1854 9 వ భక్తినాధ పోపు గారు ఈ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. ఈ పండుగ మనకు  మరియమాతకు  తల్లి గర్భంలో పడతున్నప్పుడే, యేసు ప్రభువు శిలువ    శ్రమలు ,  మరణం, పునరుత్థానల ఫలితాన్ని ముందుగానే  ఇచ్చి ఆమెలో   జన్మ పాపం లేకుండా ఆమెను రక్షించారు అని భోదిస్తుంది. ఇది ఎలా సాధ్యము అంటే దేవుడు కాలనికి అతీతుడు. ఆయన అలా చేయగలడు. దీని అర్ధం మరియ మాతకు మెస్సీయ్యా అవసరం లేదు అని కాదు. ఆమెకు ఆయన రక్షణ ముందుగానే ఇవ్వబడింది.

పాపం లేకుండా ఎవరైన సృష్టించబడ్డారా? మొదట మానవుడు పాపం లేకుండానే సృష్టించబడ్డాడు. కాని తరువాత సాతాను మాటను స్త్రీ విని పాపం అంతకట్టుకున్నది.  మొదటి స్త్రీ ఏవను,  పడిపోయిన దేవదూత పాపం చేయడానికి ప్రోత్సహించినది. దేవుడు చేయవద్దని చెప్పిన పనిని చేపించి, పాపము చేసేలా చేసింది.  మరియ మాత దగ్గరకు వచ్చిన దేవదూత పడిపోయిన దేవదూత కాదు, గాబ్రియేలు దేవ దూత , ఈ దూత ప దేవున్ని  పూర్తిగా విధేయించిన దేవదూత. పడిపోయిన దేవ దూత వచ్చినప్పుడు దేవున్ని  విధేయించ వద్దు అని ఏవకు చెప్పింది. కాని , గాబ్రియేలు దేవదూత  వచ్చినప్పుడు దేవున్ని నమ్మమని. ఆయన ప్రణాళికకు సహకరించమని చెబుతుంది. మరియ మాత   తన జీవితం మొత్తం అలానే , ఆ ప్రణాళికకు సహకరిస్తూ జీవించినది. అందుకే తిరుసభ పితరులు ఆమెను రెండవ ఏవ అని పిలుస్తారు. దేవుడు మన  తల్లి తండ్రులను గౌరవించమని చెబుతున్నారు. ఇది దేవుని పది ఆజ్ఞలలో నలుగవది. యేసు ప్రభువు తన తల్లిని గౌరవించారు. మనం కూడా ఆమెను అలానే గౌరవించాలి. 

మరియమాతకు ఈ అనుగ్రహం ఇవ్వవలసి అవసరం చాలా ఉంది,  ఎందుకంటే ఈ లోకం రక్షించబడాలి అనేది దేవుని సంకల్పం.  అందుకు దేవుని  కుమారుడు ఈ లోకానికి రావాలి.   ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ లోకానికి వస్తారో, ఆ పవిత్రుడను ఎవరు ఆహ్వానించగలరు. కేవలం ఎవరు అయితే  ఏ పాపం లేకుండా ఉంటారో వారు మాత్రమే.  అప్పుడే  ఆయనకు ఏ మలినం అంటకుండా ఉంటుంది.  అంటే ఆయన తల్లిలో ఏ పాపం ఉండకూడదు, ఆమె పవిత్రంగా ఉండాలి.    అప్పుడే అది జరుగుతుంది. కనుక ముందుగానే మరియమాతను , తండ్రి దేవుడు  తన కుమారున్ని  ఈ లోకానికి తీసుకురావడానికి ఆమెలో ఎటువంటి పాపము లేకుండా ఆమెను  సిద్దపరుస్తున్నారు. 

ఆదికాండం 3: 15 లో దేవుడు సర్పముతో " నీకును, స్త్రీకిని, నీ సంతతికిని, ఆమె సంతటికిని మధ్య వైరము కలుగ చేయుదును. ఆమె సంతతి నీ తల చితుకగొట్టును. నీవేమో వాని మడమ కరిచేదవు." అని చెబుతున్నారు. ఇక్కడ సాతానుతో ఈ వైరం ఎప్పుడు ఉంటుంది.  ఒక వేళ మరియ మాతలో  పాపముకాని, లేక  చిన్న మలినం ఉన్న , సాతానుతో సహకరించినది అవుతుంది.  కనుక ఆమెలో ఏ పాపము ఉండకూడదు అందుకే ఆమెను దేవుడు జన్మ పాపము లేకుండా చేస్తున్నాడు. ఇవి అన్ని కూడా ఆమె కొరకు కాదు,  ఆమె ద్వారా ఈ లోకానికి వస్తున్నటువంటి తన కుమారుడు , పవిత్రుడు.  ఆ పవిత్రుడు ఈ లోకములోనికి రావాలి అంటే,  ఆయనను తీసుకు వచ్చే స్త్రీ కూడా పవిత్రురాలుగానే ఉండాలి. అపవిత్రతో ఈ ప్రభువును ముట్టుకొనుట అసాధ్యము. అపవిత్రంగా  దివ్య మందసాన్ని తాకుతున్న వారు చనిపోతున్నారు. ప్రభువును ఈ లోకానికి తీసుకువచ్చే తల్లి పవిత్రంగా ఉండాలి కనుక ప్రభువు ఆమెను ఎటువంటి మలినం అంటకుండా చేస్తున్నారు. 

మరియమాత జన్మపాపం లేకుండా జన్మించడం. ఆమె గొప్పతనం ఏమికాదు . ఆమె ఔన్నత్యము తరువాత ఆమె జీవించిన విధానం తెలుపుతుంది. తన జీవితాన్ని మొత్తాన్ని దేవునికి అర్పించినది. దేవుని దాసురాలిగా జీవించింది. ప్రభువును ధ్యానిస్తూ జీవించింది. తరువాత కూడా ఏ పాపము లేకుండ జీవించింది ఇక్కడ ఆమె ఔన్నత్యం తెలుస్తుంది. 


మత్తయి 9:35-10:1,6-8

 మత్తయి 9:35-10:1,6-8

యేసు అన్ని పట్టణములను, గ్రామములను తిరిగి, ప్రార్ధనామందిరములలో బోధించుచు, పరలోకరాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధిబాధలనెల్ల పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొర్రెలవలే చెదరియున్న జనసమూహమును చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు" అని పలికెను. యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు, వారికి అధికారమును ఇచ్చెను. కాని, చెదరిపోయిన గొర్రెలవలెనున్న యిస్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి, పరలోకరాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్టురోగులను శుద్దులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు. 

ధ్యానం: నిన్ననే మనం నిష్కలంక మాత పండుగను జరుపుకున్నాం. ఈ పండుగ సందర్భంగా  ఈ లోకానికి దేవుడు చెప్పిన  మొదటి సువార్తను గురించి ధ్యానిస్తుంటాము. ఏమిటి ఈ మొదటి సువార్త అంటే స్త్రీ కి పుట్టబోయే మెస్సీయా. ఈ మెస్సీయ్యా ద్వారా మనం రక్షించబడుతాము. యేసు ప్రభువు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రకటించేది ఆయన గురించే. ఆయన గురించి ఆయన చెప్పే మాటలు వట్టి మాటలు కాదు, ఎందుకంటే ఆయన ద్వారా అందరు స్వస్థత పొందుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నారు. ఏమిటి ఈ పరలోక రాజ్యమును గురించిన సువార్త అంటే? అప్పటివరకు  యిస్రాయేలు ప్రజలు మెస్సీయాను గురించి ఎదురుచూస్తున్నారు , ఇప్పుడు మెస్సీయా వారి దగ్గరకు వస్తున్నారు. యేసు ప్రభువు చేస్తున్న స్వస్థతలు, ఆయనే మెస్సీయా అని  నిరూపిస్తున్నవి. అవి ఆయన మెస్సీయ్యా అనుటకు గుర్తుగా ఉన్నాయి. 

యేసు ప్రభువుకు, ఆయన పనిలో పాలుపంచుకొనే వారు కావలి. ఆయనను అనుసరిస్తూ ఆయన వలె జీవించేవారు కావలి. వారు ప్రజల బాధలను చూసి , యేసు ప్రభువు ఎలా స్పందిచారో అలానే స్పందించే మనస్సు కలిగిన వారు అయిఉండాలి. ఇది కేవలం యేసు ప్రభువు శిష్యులు మాత్రమే కాదు, ఆయన అనుచరులు అందరు చేయవలసిన పని. ఎవరు అయితే ప్రభువుచేత అనుగ్రహాలు పొందుతున్నారో, స్వస్థతలు పొందుతున్నారో, వారు ఇతరులకు  యేసు ప్రభువు చూపించిన ప్రేమను చూపించాలి. మనము ప్రభువు నుండి పొందిన దానికి ఇతరులతో పంచుకోవడానికి వెనుకడుగువేయకూడదు. 

ప్రజలను చూచినప్పుడు యేసు ప్రభువు చాలా బాధ పడ్డారు. ఆ కారుణమయుని కడుపు తరుక్కు పోయింది అని చదువుతున్నాము.  ప్రజలకు సరైన కాపరులు లేరు అని ప్రభువు చెబుతున్నారు. అందుకే ప్రభువు తన శిష్యులను ఎలా బ్రతకాలో చెబుతున్నారు. ఎలా కాపరులుగా ఉండాలో నేర్పుతున్నారు. ఏహెజ్కెలు ప్రవక్త కూడా యిస్రాయేలు ప్రజలు కాపరి లేని వారి వలె ఉన్నారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు కేవలం కాపరిగా మాత్రమే రాలేదు. ప్రభువు మంచి కాపరి. ప్రభువే "నేను నా మంద కోసం నా ప్రాణామును కూడా ధారపోయుదును" అని చెబుతున్నారు. ఆయన ఎటువంటి కాపరి అనేది మనం ఈ సువిశేష భాగంలో చూస్తున్నాము. ప్రభువు కేవలం వారి అనారోగ్యాన్ని మాత్రమే చూడటం లేదు. వారి  సమస్యలను చూసి, ప్రభుని కడుపు తరుక్కు పోయింది. అంటే ప్రభువు ప్రజల అన్ని సమస్యలను చూస్తున్నారు. వారి వ్యక్తిత్వాలు, వారి సంబంధాలు, వారి సమస్యలు అన్నింటినీ ప్రభువు చూస్తున్నారు. వాటి ద్వారా  వారు పొందే అనేక బాధల నుండి వారిని కాపాడాలని ప్రభువు కోరిక. ఒక మంచి కాపరి మాత్రమే వారిని ఈ సమస్యల నుండి బయటకు తీసుకురాగలరు. ఆ కాపరి ప్రభువు వలె ఉండాలి. ప్రభువు వలె చూడాలి. ప్రభువు వలె వినాలి. ప్రభువు వలె వారి జీవితాలలో పాలుపంచుకోవాలి. 

ప్రభువు చెప్పినట్లుగా నడుచుకోవడానికి అనేక మంది సిద్దముగా ఉన్నారు. కాని వారికి ప్రభువు మాటలను ఎవరు చెబుతారు. ఎవరు ప్రజలను తన సొంత వారినిగా చూస్తారు. ప్రభువు వలే ఎవరు తన మందను కాపాడుతారు. అందుకే యేసు ప్రభువు కోతగాండ్ర కోసం పార్థన చేయమని అడుగుతున్నారు. దేవున్ని, కోతగాండ్రును పంపించమని ప్రార్ధించమంటున్నారు. అంటే కోతగాండ్ర పని యేసు ప్రభువు వలె ఉండటం. ఇది ఈ లోకంలో ప్రతి కైస్తవుని పని. అప్పుడె లోకం నిజమైన కాపరులు కలిగి ఉంటుంది. అందుకె యేసు ప్రభువు తన శిష్యులను పిలుస్తున్నారు. వారికి అన్ని అధికారాలు ప్రభువు ఇస్తున్నారు. వారు చేయవల్సిన అన్ని పనుల గురించి ప్రభువు వారికి చెబుతున్నారు. వారికి  ప్రజలను , అన్ని రకాలైన సమస్యలనుండి కాపాడే శక్తి ఇస్తున్నారు. . 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన : ప్రభువా! మీరు  మా పరలోక రాజ్యమని మేము తెలుసుకున్నాము. మీరు ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ, వారి వ్యాధులను, తీసివేస్తూ, స్వస్థతనుఇవ్వడం వలన మీరు మెస్సీయ్యా అని మేము గుర్తిస్తున్నాము. ప్రభువా! ప్రజల బాధలు తట్టుకోలేక మీ కడుపు తరుక్కుపోయింది, ప్రభువా , ఆ ప్రజలను చూసినట్లు మమ్ములను కూడా ఒకసారి చూడండి. మాలో ఉన్న అన్ని సమస్యలను తొలగించండి. ప్రభువా మీ మాటలను పాటించుచు ఎల్లప్పుడు, మీమ్ము అనుసరించే అనుగ్రహం దయచేయండి. ప్రభువా! మీ అనుచరునిగా, మీ వలె జీవిస్తూ , ఉండుటకు సిద్దంగా ఉన్న మమ్ము , మీ శిష్యుల పంపినట్లుగా  మీ సందేశాన్ని ఇస్తూ, ప్రజల అవసరాలలో బాధలలో పాలుపంచుకొంటూ, ఎప్పుడు ప్రజలను మీ వైపు తీసుకువచ్చే కాపరులుగా మమ్ము మలచండి. ప్రభువా! ప్రజల సమస్యలు మీ సొంతవి అన్నట్లు  మీరు భావించారు అందుకే , మీ కడుపు తరుక్కు పోయింది, తండ్రిని కాపరుల కోసం ప్రార్ధించమని చెబుతున్నారు.  ఇతరుల పట్ల , మీరు కనపరచిన  మనస్తత్వం, మాకు దయచేయండి. ఆమెన్.  

తోబియా జీవిత కథ

 తోబియా జీవిత కథ మనము రక్షణ గ్రంధంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు తన సేవ కొరకై మరియు తన ప్రజలను రక్షించడానికి ఎ...