26, ఫిబ్రవరి 2026, గురువారం

ఆగమన కాలపు మొదటి ఆదివారం

 ఆగమన కాలపు మొదటి ఆదివారం 

మార్కు 13:33-37 

ఆ సమయము ఎపుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు. ఆ గడియ ఇట్లుండును: ఒకానొకడు దేశాటనము వెళ్లుచు, తన సేవకులను, ఆయాకార్యములందు నియమించి, మెలకువతో ఉండమని ద్వారపాలకుని హెచ్చరించెను. యజమానుడు సంధ్యాసమయముననో, అర్ధరాత్రముననో, కోడికూయు వేళనో , ప్రాత:కాలముననో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక మేలుకొని ఉండుడు. ఒక వేళ అతడూ అకస్మాత్తుగా వచ్చి మీరు నిదురించుచుండుట చూడవచ్చును. మీకు చెప్పునే అందరికి చెప్పుచున్నాను. జాగరూకులై ఉండుడు. 

పునీత సిలువ  యోహను గారు, "మరియమాత దైవ వాక్కును మోసుకుంటూ   ప్రయాణిస్తుంది. ఆమెను మీ ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నవా? అని అడుగుతారు?" ఈ ఆగమాన కాలంలో మనలో ఉండవలసిన ఒక ఆలోచన ఇదే. నేను యేసు ప్రభువును నా ఇంటిలోనికి ఆహ్వానిస్తున్ననా ? లేదా? ఒక వేళ నేను ఆహ్వానించినట్లయితే నా జీవితం ఏ విధంగా ఉండాలి అని ఈనాటి సువిశేషం చెబుతుంది. 

ఈనాటి సువిశేషంలో మనకు ముఖ్యమైన మాటలుగా స్పురించే, జాగరుకులై యుండుడు, మేల్కొని యుండుడు, సిద్ధముగా ఉండుడు అనే మూడు మాటలను   ప్రత్యేకంగా ధ్యానించాలి. ఎందుకు జాగరుకులై ఉండాలి? దేనికి మేలుకొని ఉండాలి? ఎవరి కోసం మనం సిద్ధంగా ఉండాలి. జాగరుకులై ఎందుకు ఉండాలి అంటే మన దగ్గరకు వచ్చేది  స్వయంగా దేవుని కుమారుడు. ఆయన కోసం మనం చూడకపోతే ఆయన తన దారిన తాను వెళ్ళిపోతాడు. దైవ సాన్నిధ్యం ఎల్లప్పుడు అలానే ఉంటుంది. యేసు ప్రభువు తన బోధనలో కూడా ఈ విషయం వెల్లడి చేస్తున్నారు. మీరు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు మిమ్ము ఆహ్వానించకపోయినచో మీరు మీ కాలి దూలిని అక్కడనె విదిల్చి వెళ్ళండి అని చెబుతున్నారు. ఆయన నీ దగ్గరకు వస్తారు, నీ తలుపు తట్టుచున్నాడు. ఖచ్ఛితముగా నీవు జాగరూకత కలిగి ఉంటేనే ఆయనను ఆహ్వానించగలవు. 

 ఎవరి కోసం మనం ఎదురుచూస్తున్నాము.  నీవు క్రీస్తు కోసము ఎదురు చూసినటులయితే నీవు ఎటువంటి జీవితం జీవించాలి అని మనం ఆలోచించాలి. నీవు ఎల్లప్పుడు సిద్దముగా ఉండాలి అని ఈనాటి సువిశేషం తెలియజేస్తుంది. ఆయన ఏ ఘడియలో వచ్చునో నీకు తెలియదు కనుక ఎల్లప్పుడు సిద్ధముగానే ఉండాలి.  ఎవరు ఈయన నీవు ఎదురు చూడటానికి ? ఈయన రక్షకుడు, రాజు, ప్రభువు, దేవుడు నీ నిజ స్థితిని తెలియజేసేవాడు. నిన్ను మరల ఈ నిజ స్థితిని కలిగి జీవించేలా చేసేవాడు.  కనుక నీవు ఎదురు చూడాలి. ఆయన అవసరం అవసరం నీకు  ఉంది కనుక ఎదురు చూడాలి. నీవు నిజముగా రక్షణ పొందాలి అని కోరుకున్నట్లయితే నీవు ఎదురు చూడాలి.  నీ జీవితములో ఆయన లేకుంటే  జీవితం పరిపూర్ణం కాదు. ఆయన నీతో ఉన్నట్లయితే నీ జీవితం  పరిపూర్ణత సంతరించుకుంటుంది.   

 ప్రతి సంవత్సరం ఆగమనకాలం వస్తుంది. కాని నిజానికి ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక సాదారణ ప్రక్రియ కాదు. ప్రతి సారి  దీనికి ఒక గొప్ప అర్ధం వుంది, ప్రతి ఆగమానం మనలను యేసు ప్రభువును ఆహ్వానించడానికి, స్వీకరించడానికి ఇది నాంది పలుకుతుంది. ఎల్లప్పుడు  ఆయనతో ఉండటానికి అది ఉపయోగ పడుతుంది. అది మన జీవితాన్ని ప్రతి నిత్యం మార్చుకుంటూ ఉండటానికి ఉపయోగ పడుతుంది.  

దేవుని రాకడ లేక ఆగమానం  - ఆయన మరల వస్తారు అని మనం ఎదురు చూస్తున్నాము.  ఆయన కోసం మనం ఎదురు చూడటం మాత్రమే కాదు,  ఆయనను ఆహ్వానించాలి. యేసు ప్రభువును నీ జీవితం లోనికి ఆహ్వానించాలి. ఆయన నిన్ను ఆహ్వానించాలి అని అనుకోకూడదు. మన కోసం తన మొత్తాన్ని వదులుకొని మనతో ఉండాలి అని మన దగ్గరకు వస్తున్నారు.  దేవుడు తీసుకొచ్చే సంతోషం: ఆగమనకాలం ఏదో బాధలతోనో లేక ప్రాయశ్చితంతోనో గడిపేది కాదు, ఇది ఆనందించే సమయం ఎందుకంటే మన దగ్గరకు రాబోతున్నది స్వయానా దేవుడే. ఆయన మన దగ్గరకు వస్తున్నాడు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఆనందించాలి. మన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధముగా ఉండాలి. అది కేవలము ఆయనను ఆహ్వానించడమే కాదు ఆయనతో నడవడం అని మనం గ్రహిస్తాం.  

  తీరు సభ మొదటి నుండి కూడా ఆగమన కాలం జరుపుకోలేదు. ఇది నాలుగవ శతాబ్ధం నుండి మనం జరుపుకుంటున్నాం. చాలా విషయాలు మీరు ఈ పండుగ పూర్వాపరాలు గురించి విని వుంటారు. కాని యూదయ పండుగలలో హనుక్క అనే పండుగ వస్తుంది. అది కిస్లేం అనె నెల 25 వ రోజున వస్తుంది, క్రిస్టమస్ కూడా డిసంబర్ 25 న వస్తుంది. ఏమిటి ఈ హనుక్క పండుగ అంటే అది యెరుషలేము దేవాలమును అంటియొకస్ ఎఫిఫనుస్ ద్వంసం చేసిన తరువాత,  మక్కబియుల గ్రంధంలో  వారు మరల దానిని కట్టి దేవునికి పునఃరంకితం చేసిన రోజునే హనుక్క అనే పండుగ జరుపుకుంటారు. ఈ పండుగకు ఎనిమిది రోజుల ముందు నుండి సిద్ధపడుతూ ప్రతి రోజు ఎనిమిది రోజులు కూడా ఒక్కో క్రొవత్తిని వెలిగించేవారు. ఇక్కడ ఆగమన కాలంలో మనం ప్రతి వారం, వారానికి ఒక క్రొవత్తిని వెలిగించే దానికి మూలం. ఇక్కడ నుండే వస్తుంది. ఇది ఒక రకముగా మనం సిద్ధ పడటం. లేక పునఃరంకితం చేసుకోవడం. మన జీవితం చెడు మార్గమున ఉండి ఉండవచ్చు, లేక మనం పాడుచేసుకొని ఉండవచ్చు అయిన కాని దానిని మరల దేవునికి పునఃరకితం చేయవచ్చు అని అది తెలుపుతుంది హనుక్క అనే పండుగ. ఈ ఆగమానకాలం మరియు క్రిస్మస్ దీన్ని పరిపూర్తి చేస్తుంది. 

ఆగమన కాలం ఆనందించే కాలం, ఇది దేవుడు మన వద్దకు వచ్చే రోజును  తెలుసుకొని దానికి ఆనందంతో ఎదురు చూసేకాలం. ఈ సిద్దపాటు కూడా మనము ఎవరము? మనము ఎవరి వలె ఉండటానికి పిలవబడ్డాము అని తెలుసుకొనుటకు మరియు మరల దేవుని అలయముగా మారిపోవుటకు, మనము ఈ ఆగమన కాలాన్ని ఉపయోగించుకోవాలి, ధ్యానించుకోవాలి. '

 యేసు ప్రభువు ప్రధమ ఆగమమున దిన మానవ రూపం ధరించి తండ్రి ప్రణాళికా నెరవేర్చి  నిత్య రక్షణ ద్వారము మరల  తెరిచారు. ఆయన మరల వచ్చినప్పుడు ఆయన  వాగ్ధానం చేసిన రక్షణ బాహుమనం మనం పొందుతాము అనే ఆశతో , మేలుకువతో ఉత్సాహముతో నిరీక్షించించె మనం ఆయన అపారమైన  ప్రేమను పొందుటకు ఎల్లప్పుడు సిద్దంగా ఉండాలి. 

 క్రీస్తు ప్రభువు తన జనమునకు సిద్ధ పడుచున్న  మనలను ఆనందంతో నింపుతున్నాడు.  అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మనం, మెళుకువ కలిగి ప్రార్ధించుటలోను అతని స్తుతులను పాడుటలోనూ నిమజ్ఞులమై యేసు ప్రభువును స్వీకరించడానికి సిద్ధం కావాలి.  అంటే మనం  దేవుని వాక్కు అవతరంగా  మారిపోగలగాలి.

లూకా 10:21-24

  లూకా 10:21-24

ఆ గడియలోనే యేసు పవిత్రాత్మ యందు ఆనందించి, "ఓ తండ్రీ! పరలోక భూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి, పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు  నీకు ధన్యవాదములు. అవును తండ్రీ! ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి  నాకు సమస్తము అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మారెవ్వరును   తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికీ ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు" అనెను. అపుడు యేసు శిష్యులవైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి: "మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి! ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి. కాని చూడలేకపోయిరి. మీరు వినుచున్నవినగొరిరి, కాని  వినజాలకపోయిరి" అని పలికెను.  

ధ్యానం: యేసు ప్రభువు ఈ సువిశేష భాగంలో తండ్రికి కృతజ్ఞతలు  తెలియజేస్తున్నారు. యేసు  ప్రభువు కృతజ్ఞతలు తెలియజేయడానికి గల  కారణం ఏమిట అంటే? ఆధ్యాత్మిక విషయాలు  దైవ రాజ్యం  కేవలం తెలివిగలవారికో, జ్ఞానులకో, పండితులకొ  కాకుండా చిన్న పిల్లలకు , సాధారణ ప్రజలకు తెలియజేస్తున్నారు. అందుకు తండ్రికి, ప్రభువు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యూదయా మత నాయకులు కాని, ఈ లోకంలోని ఆధ్యాత్మిక వేత్తలుకాని  దేవుడు వారి సొత్తు అన్నట్లు మాటలాడటం సర్వసాధారణం. కాని యేసు ప్రభువు,  దేవున్ని, దైవ జ్ఞానాన్ని   సాధారణ మనుషులకు తెలియజేస్తున్నారు. అందుకె యేసు ప్రభువు  దైవ జ్ఞానాన్ని అందరికి పంచి దేవునికి ప్రతి వ్యక్తి ముఖ్యమే అని తెలియజేస్తున్నాడు. 

ఈ విషయాల యేసు ప్రభువు పుట్టుకలో కూడా  జరుగుతున్నాయి. యేసు ప్రభువుని జననం మొదటిగా తెలుసుకున్నది గొర్రెల కాపరులు, ఎవరు ఈ గొర్రెల కాపరులు అంటే వీరు ఒక ప్రదేశం నుండి మరియొక ప్రదేశంకు గొర్రెలను మేపుకుంటూ , పొలాలలోనే తిరుగుతూ ఉండే ప్రజలు. సహజంగా ఊరికి చివర పొలాల్లో ఉండేవారు. వీరిని దొంగలుగా భావించి ఎటువంటి శుభకార్యములకు ప్రజలు వీరిని పిలిచేవారు కాదు. ఇటువంటి వారికి రక్షకుని జనన విషయము మొదటిగా తెలియయజేయడం జరిగినది. యేసు ప్రభువు శిష్యులు కూడా ఎవరు పండితులు కాదు. సాధారణం వ్యక్తులు, జాలరులు, సుంకరులు. ఇటువంటి సాధారణ వ్యక్తులను యేసు ప్రభువు తన శిష్యులుగా ఎన్నుకుంటున్నారు. ప్రభువుతో కలిసి జీవించే అవకాశం ఇటువంటి సాధారణ వ్యక్తులకు ఇవ్వడము దైవ జ్ఞానాన్ని పామరులకు ఇవ్వడం ఇవ్వన్నీ కూడా మనకు ఇవ్వబడ్డ గొప్ప వరాలే.  ఎవరు కూడా ఇది కేవలం పండితులు మాత్రమే పొందుతారు అని అనుకొనవసరం లేదు. 

యేసు ప్రభువు తండ్రి గురించి తెలియపరచిన తరువాత మనం ఎవరుకూడా పరిసయ్యుల వలె దైవ జ్ఞానం, లేక దైవ రాజ్యం , ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం మనకు మాత్రమే ఉంటుంది. ఇతరులు దానిని పొందలేరు అనే గర్వం, అజ్ఞానం ఉండకూడదు అని తెలుసుకోవాలి. యేసు ప్రభువుతో కలిసి జీవించే గొప్ప అనుభూతి శిష్యులకు, చిన్న పిల్లకు ప్రభువు ఇస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది ఇవి అన్ని సాధారణ ప్రజలకు తెలియజేయడం తండ్రి సంకల్పం అని  ప్రభువు తెలియ జేస్తున్నాడు. ఇది తండ్రి సంకల్పం అయితే తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని అర్ధమవుతుంది. 

నా తండ్రి నాకు సమస్తము అప్పగించి యున్నాడు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఈ మాట మరియొక చోట కూడా ప్రభువు చెబుతున్నారు. తండ్రి సమస్తం ఆయన కోసమే చేశాడు, ఆయనకే సమస్తాన్ని  అప్పగించి యున్నాడు. సమస్తము మీద ప్రభువుకే అధికారము కలదు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, కుమారుడికి మాత్రమే తండ్రి తెలుసు మరియు తండ్రికి మాత్రమే కుమారుడు తెలుసు. తండ్రి గురించి మనకు అనేక మంది చెప్పారు కాని వాస్తవంగా ఈ లోకంలో ఎవరికి పూర్తిగా తెలియదు. అనేక మంది తండ్రి గురించి చెప్పారు. వారిలో ప్రవక్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కాని ఎవరు కూడా తండ్రిని పూర్తిగా ఎరుకపరుచలేదు. యేసు ప్రభువు మాత్రమే తండ్రిని, ఆయన యొక్క ప్రేమను, కరుణను, తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువు తండ్రిని అందరికీ తెలియజేస్తున్నాడు. లోక మత పెద్దలు వలె కేవలం కొద్ది మందికి మాత్రమే దైవజ్ఞానం అని కొంతమందిని వేరుచేయడం లేదు. యేసు ప్రభువు శిష్యులకు వారు అనుభవిస్తున్న గొప్ప భాగ్యం గురించి తెలియజేస్తున్నాడు. అది ఏమిటి అంటే ప్రవక్తలు, రాజులు అనేక గొప్ప వ్యక్తులు క్రీస్తును చూడాలి అని అనుకున్నారు, కాని శిష్యులకు మాత్రమే ఇది ఇవ్వబడింది.   అదేవిధంగా తండ్రికి మాత్రమే కుమారుడు తెలుసు అందుకే తండ్రి , యేసు ప్రభువును గురించి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను సంతసించుచున్నాను అని తెలియజేస్తున్నాడు. అంతేకాక ఈయన చెప్పినట్లు చేయుడు అని చెబుతున్నాడు. ఆదే  విధంగా  కుమారుని జననం గురించి కూడా తండ్రి తన దేవదూతల ద్వారా తెలియజేస్తున్నాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు దైవ జ్ఞానాన్ని సాధారణమైన వ్యక్తులకు తెలియజేయటను మీరు ఎంతగానో ఆనందించారు. మీరు ఈవిషయమై  పవిత్రాత్మ యందు కూడా ఆనందిస్తున్నారు. మాకు దైవ జ్ఞానాన్ని  ఇచ్చి , మా మీద ఉన్న ప్రేమతో తండ్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభువా! మీరు తండ్రిని మాకు అందరికీ తెలియపరుస్తున్నారు. ప్రభువా ఎవరికి తెలియని విషయాలు ,గొప్ప వారు అందరు తెలుసుకోవాలనుకున్న విషయాలు మాకు తెలియ పరస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. తండ్రి గురించి మాకు తెలియజేయడం తండ్రి అభీష్టం అని తెలియజేస్తున్నారు,  అందుకు కృతజ్ఞతలు. ప్రభువా ,మీ అనుచరులుగా ఉన్న మేము, ఎప్పుడు కూడా  మీ గురించి మాకే తెలుసు ఇతరులకు తెలియదు, తెలియకూడదు అనే గర్వం మాలో ఉండకుండా మమ్ములను శుద్దిచెయ్యండి. ప్రభువా! అందరికీ దైవ జ్ఞానం ఉండాలనే కోరిక మీ వలె మేము కూడా ఉండేలా చేయండి. ప్రభువా ఎల్లప్పుడు మేము మీతో ఉండే భాగ్యం దయచేయండి. ఆమెన్ 

తోబియా జీవిత కథ

 తోబియా జీవిత కథ మనము రక్షణ గ్రంధంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు తన సేవ కొరకై మరియు తన ప్రజలను రక్షించడానికి ఎ...