26, ఫిబ్రవరి 2026, గురువారం

క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము

   క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము

క్రిస్తునాదునియందు ప్రియ సహోదరులారా ఈ రోజు మనం క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము జరుపుకుంటున్నాం . ఇది   దివ్యసత్ప్రసాధ  దైవ సంస్కారానికి సంభందిచ్చినది . ఈ పండుగ  యేసు ప్రభువుని దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించాలి, ఆయనను నేను నా లోనికి ఆహ్వానించి, నాలో ఉండేలా  చేయాలనే కోరికతో  ఈ పండుగను చేసుకోవడము  జరిగినది.
ఈ పండుగలో మనము  ముఖ్య ఉద్దేశం  క్రీస్తుని  అనుభవ పూర్వకంగా దివ్య సంస్కరము ద్వారా అనుభవించుడమే. కడర భోజన సమ యాన యేసు ప్రభువు రొట్టెను తీసుకోని  ఇది నా శరీరము  మీరందరు దీనిని తీసుకోని  భుజించండీ అని చెపుతున్నారు. ఒకరకంగా ఆయన తన శిష్యులను దేవుని స్వీకరించడానికి అర్హులుగా చేసున్నాడు.  కేవలము వారిని అర్హులుగా మాత్రమే కాక వారిని దేవున్నీ ఇతరులకు ఆందిచేవారిగా కూడా చేస్తున్నాడు. యేసు ప్రభువు వారి మద్య ఉండవలసీన  అవసరం ఉంది,  ఎందుకంటే  వారు ఎక్కువ తెలివి గలవారో , ఇతరులను ప్రభావితం చేయగలవారో అని కాదు కానీ వారు చాలా బలహీనులు అని మాత్రమే. ఆయన వారితో ఉన్నట్లైయితే వారు మంచి వారీగా , చేడుకు దూరముగా అదే విధముగా దైవ నిబంధనలకు అనుకూలమైన వారీగా జీవిస్తారు. ఎప్పుడైతే  యేసు ప్రభువు వారి  మద్య లేకపోతారో ,అప్పుడు  వారు ఎలా ఉంటారో ఆయనకి తెలుసు. వారు అందరు భయ భ్రాంతులకీ గురి అవుతున్నారు.  పారిపోతున్నారు. అందుకే ఆయన వారి మద్యనే ఉండాలి. తన మరణము పునరుత్తనము తరువాత కూడా ఆయన వారి మద్యనే ఉండాలి దానిని సాద్యం చేస్తున్నారు. యేసు ప్రభువు దివ్య పూజ బలి ద్వారా, దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించడము ద్వారా ఈ పనిచేస్తున్నారు. అందుకే తన శిష్యులు ఇప్పటికి తన సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారు . ఎమ్మావు  మార్గాన పోయే శిష్యుల అనుభవం మనకు ఒక ఉదాహరణ యేసు ప్రభువు సాన్నిధ్యము  వారి మధ్యనే ఉంది అని  ఆయన రొట్టె విరిచినప్పుడు వారు ఆయనను కనుగొన్నారు.
 క్రీస్తు పునరుత్తాణము తరువాత దైవ వాక్కు బొదిస్తూ,  శిష్యులు  కలిసి రొట్టె విరవడం మొదలు పెట్టారు, కనుకనే మొదటి క్రైస్తవులు ఒకే హృదయము మనసు కలిగి కలిసి ప్రార్దన చేసి ,భుజించి ఒకరిని  ఒకరు మంచి మనసు కలిగి, వారిలోని పెదవారిని అనారోగ్యులును ,అనాథలను విదవరాళ్లను    ఆదరణతో చూసేరు. 
శిష్యులు అనేక ప్రదేశాలకు వెళ్ళి వారు క్రొత్త క్రైస్తవ సమూహాలను ఏర్పాటు చేసేరు. వారు ఒంటరిగా వెళ్ళక వారితోపాటు  యేసు ప్రభువును తీసుకొనివేళ్లారు. వారు ఆదిమ క్రైస్తవుల వలె చేశారు. ఎందుకు అంటే వారు యేసు ప్రభువు లేకుండా ఏమి చేయలేరు అని. యేసు ప్రభువును తీసుకెళ్ళడమూ అంటే ఈ కలిసి రొట్టెను విరుస్తూ ప్రార్థించటమే. 
 తీరుసభ పెరిగేకొద్ది దానితోపాటు దివ్యసత్ప్రసాధమునకు  ప్రాముఖ్యత పెరుగుతూనే ఉన్నది . దివ్యసత్రపసాదము యేసు క్రీస్తుతోటి మనము ఏర్పాటుచేసుకునే  వ్యక్తిగత సంబంధానికి పునాది.  అంతే కాదు తిరుసభ కూడా యేసు క్రీస్తు శరీరం మనము తిరుసభ సభ్యులం . తిరుసభ సభ్యులుగా క్రీస్తు శరీర అంగాలుగా మనము జీవించాలి అంటే మనము ఈ దివ్యసత్ప్రసాధము  లో ఉన్న యేసు ప్రభువుతో సంభదము  కలిగి జీవించాలి.  ఎందుకు యేసు ప్రభువు ఇక్కడ ఈ అప్పము ద్రాక్ష రసములో ఆయన ఉండాలి అని  అంటే ఆయన నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను అని వాగ్దానము చేశాడు.  అందుకే మనతో ఉండాలి అని మన కష్టాలు బాదలు అన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. అంటే మనవునితో కలిసి ఉండాలి అని దేవుడు ఈ అప్ప ద్రాక్ష రూపములో యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన ఎందుకు మనతో ఉండాలి కేవలము మనతో వసించి మన బాదలు కష్టలు తెలుసుకోవడానికి మాత్రమే కాదు వాటినుండి మనలను బయటకు తీసుకురావడానికి .ఎందుకు ఆయన మన దగ్గరకు వచ్చి మన బాదాలను తెలుసుకొని మనలను వాటినుండి  బయటకు తీసుకువచ్చేది అంటే ఆయన మనలను  ప్రేమిస్తున్నాడు. ఎవరైతే నా శరీర రక్తాలను స్వీకరిస్తారో వారితో నేను జీవిస్తాను అని చెపుతున్నాడు. 
      కథోలిక దేవాలయాలలో మనము దివ్యసత్ప్రసాధ  ఆరాధనా , సహజముగా మనకు తెలిసినది. దానికి కారణము ఈ పండుగ. అక్కడ మనకు ఒక వెలుగుతున్న ఒక లైట్ ఉంటుంది. అది యేసు ప్రభువుని సాన్నిధ్యానికి గుర్తు గా ఉంది. 
   సు విశేషములో ఈ రోజు ఇది నా శరీరము దీనిని తీసుకోని  భుజించండి అని చెపుతున్నారు.  అంటే నేను ఆయనను  స్వీకరించే వాడిని. అంటే నేను ఆయనను స్వకరించడానికి ఆర్హుడను.   మనము ఎవరో తెలియ చేస్తుంది.  అంటే మనము  దేవుని  మనలోకి ఆహ్యానించడానికి ,శక్తి కలిగి ఉన్నాము. 
  ఇక్కడ ముఖ్యమైన విషయము ఏమిటి అంటే  దేవుణ్ణి స్వీకరించడము.     దేవుని  స్వీకరించే శక్తి నాకు  ఉంది, ఆ శక్తిని నేను వాడుకోకపోతే నేను ఆయనను కోల్పోతాను అని పునీత అవిలా తెరాజమ్మ చెపుతారు. ఒకవేళ నేను ఆయనను స్వీకరించడానికి సిద్దపడకపోతే నేను ఆయనను కోల్పోతాను. ఆయన్ను ఎప్పుడు కోల్పోకుండా ఉండడానికి నేను సాధన చేయాలి. ఆ సాధన ఆయనను కోరుకోవడము.   దేవుడు నన్ను కోరుకున్నాడు, నేను కూడా ఆయనను కోరుకోవాలి.  నేను  ఆయనను కోరుకోకపోతే నాకు ఆయనలో స్థానము లేదు. ఈ  పండుగ మనము ఎవరో చెపుతుంది. కనుక ఆయనను స్వీకరించి ఆయన వలే జీవిద్దాము.  ఆమెన్ 

పవిత్ర గురువారం

పవిత్ర గురువారం 

ప్రియ మిత్రులారా  పవిత్ర వారంలోని 5 వ రోజు పవిత్ర గురువారం. ఈ రోజుకు అనేక పేర్లు ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభువు నూతన ఆజ్ఞ ఇస్తున్నారు. ఈరోజు దివ్య సత్ప్రసాద స్థాపన జరుగుతుంది. మరల ఈరోజు గురుత్వ స్థాపన జరుగుతుంది.  ఇవి మూడు కూడా యేసు ప్రభువు మరణ పునరుత్థానముల తరువాత యేసు ప్రభువును ఈలోకంలో మనం కలుసుకోవడానినికి, ఆయన సన్నీది పొందడానికి ఇవి మూడు కూడా సాధనాలు.  దీనిని పవిత్ర ఆజ్ఞ గురువారం అని అంటారు. ఈ రోజు యేసు ప్రభువు శిష్యులకు ప్రేమ ఆజ్ఞ ఇస్తున్నారు.   నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి . దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు యేసు ప్రభువు ఇలా చెప్తున్నారు. ఇది యేసు ప్రభుని చివరి భోధ. దీని తరువాత ఆయన భోదించలేదు. 

నూతన ఆజ్ఞ - ప్రేమ ఆజ్ఞ  

దీనిని నుండి మనము ఏమి నేర్చుకోవాలని యేసు ప్రభువు కోరుతున్నారు?   యేసు ప్రభువు తన  శిష్యుల కాళ్ళు కడగడం ద్వారా మనం ఏ విధంగా ఉండాలో  ఒక సంకేతం ఇస్తున్నారు.  ఇది యేసు ప్రభువుని ప్రేమను వ్యక్త పరచిన సంఘటన. ఈ సంఘటన వినయంతో కూడిన ఒక పని. ఎందుకంటే ఇది శిష్యుల అపవిత్రతను పోగొట్టి ప్రవిత్రతను వారికి ప్రసాదించే ఒక పని. ఇది ఇంకొక విషయాన్ని తెలియ జేస్తుంది. అది ఏమిటి అంటే  యేసు ప్రభువుని మరణం మరియు పునరుత్థానం మానవుని పాపం మరియు దాని పర్యావసానలను అనగా మరణంను తొలగిస్తుంది. మనలను దేవునితో కలిసి జీవించే అర్హతను తెస్తుంది. 

ప్రేమ ఆజ్ఞను పాటించడం అంటే   యేసు ప్రభుని సాన్నిధ్యాన్ని ఈ లోకంలో కొనసాగించాడం, ఇది  శిష్యుల యొక్క బాధ్యత. ఇది ఈ ప్రేమ ఆజ్ఞను పాటించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. క్రైస్తవ ప్రేమ అనేది ఈ లోకంలో ఉన్నంత కాలం యేసు ప్రభువును ఈ లోకం చూడవచ్చు. ఈ ప్రేమ ఆజ్ఞ క్రొత్తది, ఎందుకంటే శిష్యులను యేసు ప్రభువు ఒకరిని ఒకరు తాను వారిని ప్రేమించిన విధమున  ప్రేమించమని అన్నారు.  అంటే యేసు ప్రభువులానే వారు ప్రేమించాలి. రూపాతంతరికరణ చెందాలి ప్రభువులా. 

 కానీ కోరింథీలో ఉన్న క్రైస్తవులు ఒకరిని ఒకరు ప్రేమించుటలో విఫలం అయ్యారు. కనుక పునీత పౌలుగారు  ప్రభుని కడరా భోజనం గురించి, ఏ విధంగా ప్రభువు మన అందరికి ఒక మాతృక ఇచ్చాడో అని  మాటలాడుతున్నారు. కోరింథీలో క్రైస్తవులు వారి ప్రార్ధన తరువాత వారు కలిసి తినడం లేదు. వారు విడిపోయి పేదవారు ఒక చోట , ధనికులు ఒక చోట భుజిస్తున్నారు. వారిలో ఐక్యత లేదు.  ఏసు ప్రభువు   ప్రేమఆజ్ఞ ఇచ్చిన ఈరోజు , యేసు ప్రభువు శిష్యులకోసం ప్రార్దన చేయడం  మనం చూస్తాము.

శిష్యుల ఐక్యత 

 యేసు ప్రభువు చేసిన ఈ ప్రార్ధనను ప్రధాన యాజకుని ప్రార్దన. ఇక్కడ యేసు ప్రభువు లోకం కోసం ప్రార్ధన చేయలేదు. కానీ తన శిష్యుల కోసం మరియు ఈ శిష్యుల ద్వార శిష్యులు అయ్యే వారి కోసం ప్రార్ధన చేస్తున్నారు. యేసు ప్రభువు ఇక్కడ తన శిష్యుల ఐక్యత కోసం ప్రార్దన చేస్తున్నాడు. యేసు ప్రభువు తండ్రి దేవుడు ఏ విధంగా ఐక్యంగా ఉన్నారో, ఆ విధంగా ఐక్యంగా ఉండాలి అని ప్రార్ధిస్తున్నారు. ఈ ఐక్యత ఒక సాక్షీలా ఉంది. ఎందుకంటే శిష్యులు తమ ఐక్యత ద్వారా యేసు ప్రభువును ప్రపంచానికి తెలియచేయాలి. యోహను 17: 9-19 లో యేసు ప్రభువు తన శిష్యుల కోసం ప్రార్ధన చేయడం మనం చూస్తున్నాం. శిష్యులు ఈ లోకానికి సంభందించిన వారు కాదు.  యేసు ప్రభువును తిరస్కరించినట్లుగా ఈలోకం ఆయన శిష్యులను కూడా తీరస్కరిస్తుంది. ఆయన వారిని లోకము లోనికి పంపిస్తున్నారు, ఆయనకు సాక్షులుగా ఉండటానికి కనుక ఆయన వలె జీవించవలసిన బాధ్యత వీరి మీద ఉంది. అంతే కాదు శిష్యుల ద్వార యేసు ప్రభువును నమ్మే వారికోసం కూడా యేసు ప్రభువు ప్రార్ధిస్తున్నారు. యోహను 17:20-26. 

కడరా భోజనానికి మత పరమైన మరియు రాజకీయ పరమైన ప్రాముఖ్యత ఉంది. మత పరమైన ప్రాముఖ్యత ఎందుకంటే అది పాస్క ను గుర్తు చేసేటువంటిది, దేవుని మహిమను చాటె ఒక విందు. రాజకీయ ప్రాముఖ్యత ఎందుకంటే ఇక్కడ ఒక నూతన సమాజాన్ని చూసిస్తుంది. ఎందుకంటే ఇక్కడ యూదయ ప్రజలు పిలువని వారిని ఇక్కడ మనం చూస్తున్నాం. వారే సుంకరులు. అంటే నూతన సమాజానికి ఇది నాంది పలుకుతుంది. 

దివ్య సత్ప్రసాద మరియు గురుత్వ స్థాపన 

ఈరోజు మనం దివ్య సత్ప్రసాద స్థాపనను  మహోత్సవాన్ని మరియు గురుత్వ స్థాపన  జరుపుకుంటున్నాం. ఇది  ప్రజల మీద దేవుని ప్రేమను తెలియజేస్తుంది. యేసు ప్రభువుకు తన ప్రజలతో ఉండాలి అనే కోరికను ఇది తెలియ జేస్తుంది.  కడరా భోజన సమయంలో ప్రభువు దీనిని   నా జ్ఞాపకార్దముగా చేయుడి అని అంటున్నారు. ఇది దేవుని ప్రేమను గుర్తుచేసుకునే రోజు. గురువుల ద్వార, దివ్య బలి ద్వార మరల యేసు ప్రభువుతో ఉండుట లేక ఆయన సాన్నిధ్యం పొందటం జరుగుతుంది. ప్రభువు మనతో లేడు అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే గురువుల ద్వారా వారు అందించే దివ్య సంస్కారముల ద్వారా ప్రభువును పొందటం, అయన సాన్నిధ్యం పొందడం జరుగుతుంది.  గురుత్వ మరియు దివ్య సత్ప్రసాదం యేసు ప్రభువును మనం కలిసే విధంగా చేస్తున్నయి. కనుక ఇది కూడా దేవుని ప్రేమను సూచిస్తుంది. 

ఈరోజు మనం మనలను ఒక ప్రశ్న అడగాలి అది ఏమిటి అంటే నా ప్రవర్తన ద్వార, నా ప్రేమ చూపించడం ద్వారా, ఇతరులు యేసుక్రీస్తును చూసే విధంగా, వినే విధంగా చేయగలుగుతున్నానా? లేక నేను కోరింథీ సంఘంలోని శిష్యుల వలె, లేక యేసు క్రీస్తును తెలియదు అని చెప్పిన శిష్యుల వలె, లేక ఆయనను పట్టించిన శిష్యుల వలె విఫలం అవుతున్నామా ?

ఈ ప్రశ్నకు జవాబు  యేసు ప్రభువుతో ఒక వ్యక్తికి  ఉన్న వ్యక్తిగత  సంభందం మీద ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభువు అన్ని  భరించ గలిగాడు, ఎందుకంటే  తండ్రి తోటి ఆయనకు ఉన్నటువంటి బంధం  అంత గొప్పది. ఆయన కోసం ఏమి చేయడానికైనా సిద్ధమైన బంధం. అందరు నిద్ర పోతున్నా యేసు ప్రభువు మాత్రం ప్రార్ధన చేస్తున్నారు. ఈ రోజు యేసు ప్రభువు వలె మనం కూడా ఆయనతో మన సంభందం అంతే ధృడంగా ఉండాలని ప్రార్ధన చేద్దాం. 



లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...