26, ఫిబ్రవరి 2026, గురువారం

తపస్సు కాల రెండవ ఆదివారం

తపస్సు కాల రెండవ ఆదివారం 

మత్తయి 17: 1-9 

ఆరు దినములు గడిచిన పిమ్మట  యేసు  పేతురును, యాకోబును, అతని సహోదరుడగు యోహానును తనవెంట తీసుకొని, ఒక ఉన్నత పర్వతముపైకి  ఏకాంతముగా వెళ్లెను. అచట వారి యెదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. అయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యెను. ఆయనతో మోషే, ఏలీయాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు "ప్రభూ !మనము ఇచటనుండుట మంచిది. నీకు అనుమతియైనచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఎలియాకు మూడు శిబిరములను నిర్మింతును" అని పలికెను. అంతలో ఓక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి "ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైనవాడు. ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఈయనను ఆలకింపుడు", అను వాని వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకువచ్చి, వారిని తట్టి , "లెండు , భయపడకుడు"అని పలికెను. అంతట వారు కనులెత్తిచూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు. వారు ఆ పర్వతమునుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో " మనుష్య కుమారుడు మృతులనుండి లేపబడువరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదు" అని ఆజ్ఞాపించెను. 

యేసు ప్రభువు రూపాంతరికరణ  ప్రభువుని జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. రూపాంతరికరణకు   మెటమోర్పో  అనే గ్రీకు పదంని  వాడటం జరిగినది. రూపంతరీకరణ  అంటే ఒక రూపం నుండి మరియొక రూపం లోనికి మారటం. పేతరు గారు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నాను అని తన లేఖలో కూడా చెప్పారు. రూపంతరీకరణను పేతురుగారు యేసు ప్రభువు మహిమాన్విత రూపం అని చెబుతున్నారు. అంటే  ప్రభువు తన దైవ రూపంలో ఉండటం . 1పేతురు 5:1 2 పేతురు 1:15-21.

యేసు ప్రభువు పునరుత్థానము తరువాత,  అందరు ఆయన మహిమ పరుపబడిన  శరీరం కలవాడు అని తెలుసుకున్నారు. ఆయన మానవునిగా జీవించి ఉండగానే ఆయనకు ఆప్తులుగా ఉన్న కొంత మంది  శిష్యులు  ఆయన ఏవిధంగా ఈ మహిమాన్వితమైన శరీరంలో ఉండారో తెలుసుకున్నారు వారు పేతురు ,యాకోబు మరియు యోహానులు. 

యేసు ప్రభువు ఈ ముగ్గురు శిష్యులను తీసుకొని పర్వతం మీదకు ప్రార్ధన చేయుటకు వెళ్లారు. అక్కడ ఆయన ప్రార్ధన చేయుచుండగా   ఆయన ముఖం కాంతివంతమైంది. మనం ప్రార్ధన చేయుటవలన దేవుని    మహిమను చూడగలుగుతాం. 

ఈ దివ్య రూపధారణకు ముందుగానే యేసు ప్రభువు తన శిష్యులకు తన శ్రమలు, మరణం మరియు పునరుత్థానం గురించి చెప్పారు. కాని  అది శిష్యులకు రుచించలేదు. దాని తరువాత యేసు ప్రభుని  రక్షణ కార్య చివరి ఘట్ట సమయంలో, తన   తండ్రి యొక్క ఆమోదం కోసం, ప్రార్ధన చేసుకోవాలని పర్వతం మీదకు వెళ్లారు. 

శిష్యులను వెంటబెట్టుకొని తీసుకెళ్లుట 

తనతో యేసు ప్రభువు ముగ్గురుశిష్యులను తీసుకొని వెళ్లారు. వీళ్ళు ఎవరు? మొదటిగా  పేతురు గారు శ్రమలు పొందడం ఇష్టం లేని వ్యక్తి. తరువాత యోహను, యాకోబులు వీరు యేసు ప్రభువు, కుడి ఎడమ స్థానాల కోసం అడిగిన వారు. ఎందుకు వీరిని యేసు ప్రభువు తీసుకొని వెళుతున్నారు? యేసు ప్రభువుని రక్షకునిగా గుర్తించిన తరువాతనే ఆయన తన మరణం గురించి మాటలాడారు.ఎందుకు ఈ రూపాంతరికరణ అనేది ముఖ్యం అంటే తన శిష్యులకు యేసు ప్రభువు ఎవరో? ఆయన చేసే పని ఏమిటో  ముందుగా తెలియాలి. దాని ద్వారా వారిలో ఉన్న కొన్ని చెడు అభిప్రాయాలు మారిపోవాలి. ఆయన శ్రమలు, సిలువ మరణం వారు అంగీకరించి దానిని  అర్ధం చేసుకొని, శ్రమలు ఉండకూడదు అనే మనస్తత్వం పోయి, గొప్ప  ఆసనాలు కోరుకునే స్థితి పోయి దైవ ఇష్ట జీవితానికి వారు ప్రాముఖ్యత ఇవ్వడం నేర్చుకోవాలి. 

యేసు ప్రభువు  కేవలం ఒక గొప్ప వ్యక్తి మాత్రమే అయితే ఆయన మరణానికి అంత ప్రాముఖ్యత వుండదు. ఆయన దేవుని మెస్సీయ్య, రక్షకుడు, సజీవుడైన దేవుని కుమారుడు అని వారు తెలుసుకున్న తరువాత ఆయన తన మహిమను చూపుతున్నాడు. తన సహజమైన స్వరూపాన్నిరూపాంతరికరణ ద్వారా వారికి చూపుతున్నారు.

 పేతురు గారు ఆయనను దేవుని రక్షకుడు అని ప్రకటించిన తరువాత మీలో కొందరు దేవుని రాజ్యం చూసేవరకుమరణించరని యేసుప్రభువు చెప్పారు. నిజానికి అది ఇక్కడ జరుగుతుంది.  యేసుప్రభువుని మహిమ  సాక్షాత్కారం అవుతుంది ఇక్కడ. రూపాంతరికరణ ఏదో ఒక దర్శనం కాదు. వారు చూసిన యేసు ప్రభుని మహిమ. తన ముఖము  సూర్యుని వలె వెలిగిపోతుంది. తన దైవత్వం వారికి చూపించబడింది. ఆయన దేవుని వెలుగు. హెబ్రీ 1:3.

శిష్యుల సాక్ష్యం 

యేసు ప్రభుని  రూపాంతరికరణ  చాలా సమయం పట్టింది. యోహను గారు తన సువిశేషంలో దీనిని రాస్తున్నారు. యోహను 1:14 . మేము ఆయన మహిమను చూసాము. పేతరు గారు కూడా దీని గురించి చెప్పారు. 1పేతరు 1:16-17. యేసు పునరుత్థానం తరువాతనే వారు దీని ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు. 

యేసు ప్రభువు రూపాంతరికరణ జరుగుతున్న సమయంలో శిష్యులు నిశబ్దంగా ఉన్నారు. నిశబ్దంగా ఉన్నారు అంటే మాటలాడకుండా ఉండటం కాదు, దేవుని సాన్నిద్ధ్యంలో మాటలకు అంతుపట్టని అనుభూతిని అనుభవించడం. లూకా 2:9 వ వచనంలో మరియ మాత కూడా  ఈ సంగతులనెళ్ళా తన హృదయంలో మననం చేసుకుంటూ జీవించింది అని చూస్తాం. ఇక్కడ కూడా జరుగుతుంది ఇదే, వారు దైవనుభూతిలో నిమగ్నమైఉన్నారు.   కైసరియా పిలిప్పీ ప్రాంతం లో  యేసు ప్రభువు,  మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చే వరకు మీలో కొంత మంది చనిపోరు అని చెప్పారు, ఆమహిమ ఇదే కావచ్చు. 

మోషే మరియు  ఏలియా  కనబడుట

మోషే మరియు  ఏలియా, యేసు ప్రభువుతో పాటు మహిమలో కనబడుతున్నారు. వారు యేసు ప్రభువుతో మాట్లాడుతున్నారు. వారు ఎందుకు ఇక్కడ ఉన్నారు? దీనికి కారణం, పాత నిబంధన  యొక్క సారాంశం  యేసు క్రీస్తు మాటలకు అనుకూలంగా జీవించుటలోనే  వుంది. యేసు ప్రభువు అనేక సార్లు  ప్రవక్తల ప్రభోదం మరియు ధర్మ శాస్త్రం యొక్క  సారంశం గురించి భోదంచి, వాటికి విలువ వివ్వడమే కాకుండ  వాటిని వివరిస్తున్నారు. 

ఈనాటి సువిశేషం లో ధర్మ శాస్త్ర మరియు ప్రవక్తల ప్రతినిధులుగా మోషే ఏలియాలు  క్రీస్తు నాధుని మహిమాలో  కనబడ్డారు. అంటే ధర్మ శాస్త్రానికి మరియు ప్రవక్తల ప్రభోదానికి  విలువ, అర్దం వచ్చేది  యేసు క్రీస్తులోనే, అంతే కాదు వాటికి పరిపూర్ణత చేకూరేది క్రీస్తు ద్వారానే.  

ఇది ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల కలియక అని,  లేక దేవుని రాజ్యం, చనిపోయిన పునీతులు మరియు చనిపోని  పునీతులతో కలిసి ఉంటుంది అని చెబుతుంటారు, అక్కడ వారు ఆయన నిర్గమం  గురించి మాటలాడుతున్నారు. వీరే ఎందుకు అంటే ? మోషే మరియు ఏలియా,  యేసు ప్రభువు చేసే పనిమీద  పూర్తిగా అవగాహన ఉన్న వారు.  మోషే ద్వార నిర్గమ కాండం లో మనం చూస్తాము , నిర్గమ కాండం ప్రయాణం ద్వారా ఐగుప్తు నుండి వారికి విముక్తి లభించింది. అలానే క్రీస్తు ప్రభుని  శిలువ శ్రమల ద్వార మానవాళికి రక్షణ వస్తుంది. ఏలియా ప్రవక్త అక్కడ ఉండటం, క్రీస్తు ప్రభువు  రక్షకునిగా వచ్చు, విషయాన్ని సూచిస్తుంది. పాత నిబంధనలో చివరి ప్రవచనంలో ఇది మనం చూస్తున్నాం. మాలకి 4:5-6 . ఏలియా క్రీస్తు  ప్రభుని రాకకు ముందు రావాలి అని మనం ఇక్కడ చూస్తాం.

 ఏలియా దేవుని సన్నీది లో ఉన్నటువంటి వాడు.  మోషే దేవున్ని  సినాయి పర్వతం మీద చూసిన వాడు. వీరిద్దరూ ఒకరకంగా దేవున్ని చూసిన వారు. దేవుని మీద అత్యంత ప్రేమ కలిగిన వారు, దేవుని గురించి తప్పుగా మాటలాడితే తట్టుకోలేని వారు, బాలు దేవత పూజారులతో గొడవ పడ్డారు ఏలియా ప్రవక్త.  అదే విధంగా దేవుని గురించి అందరు గొప్పగా చెప్పుకోవాలని కోరుకునే వారు మోషేగారు. దేవునికి ప్రజలు వ్యతిరేఖంగా జీవిస్తున్నపుడు, ఎడారిలో దేవుని మీద తిరుగబడినప్పడు దేవుడు వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు ఆయన దేవునితో మీరు అలా చేస్తే, ఇతర ప్రజలు మీ గురించి వీరిని దేవుడు తమ సొంత ప్రాంతానికి తీసుకెళ్లలేక పోయాడు అనుకుంటారు, అలా చేయవద్దు అని అడుగుతున్నారు.  వీరు  పవిత్రం గ్రంధం లో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలకు  ప్రతినిధులు మోషే ధర్మ శాస్త్రం పొందారు దేవుని నుండి , ఏలియా ప్రవక్తల ప్రతినిది. మరియు దైవ సాన్నిద్యంలో జీవించేవాడు. 

 పరలోక స్వరం 

పేతరు గారు, మనం మూడు గూడారాలను నిర్మించి  ఇక్కడే  ఉందాము అని చేప్పిన సందర్బంలో అక్కడ  పరలోకం నుండి తండ్రి స్వరం వినబడుతుంది. మేఘం వారిని కప్పి వేస్తుంది. ఇది  పాత నిబంధంలో ఉన్న దైవ సాన్నిధ్యంను గుర్తు చేస్తుంది. ద్వితీ 18:18. నిర్గ 24:15-18.  అలానే ఇక్కడ కూడా మనకు దేవుని స్వరం వినబడుతుంది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను మిగుల ఆనందించితిని, ఈయనను ఆలకింపుడు అని ఆ స్వరం వినబడుతుంది.  ఇక్కడ దేవుని వాక్కు శిష్యుల కొరకు వస్తుంది. వారు ఆయన మాట  వినాలి. వారు అక్కడ ఆయనను ఆరాధించారు తెలియకుండానే. వారు కళ్ళు తెరచి చూడగా అక్కడ  వారికి ఏమి కనబడలేదు.

 దేవుని మాట "ఈయన నా ప్రియమైన కుమారుడు , ఈయనను ఆలకించండి". సువార్తలో ఇది మాత్రమే తండ్రి యొక్క స్వరం, చాలా అరుదుగా మనం తండ్రి మాట వింటాం. అదికూడా ఒకే ఒక మాట చెబుతుంది. తండ్రి స్వరం చెప్పేది ఈయనను వినండి అని. పేతరు, యోహను యాకోబులు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారు, ఎవరైతే శ్రమలు వద్దు అనే వారో, కుడి ఎడమలు ఆసనాలు అడిగేవారో , వింటున్నారు. శ్రమలు, మరణం  

ఏమి వినాలి యేసు ప్రభువు దగ్గర నుండి, ఆయన మాటలు మొత్తం దేని గురించి? ఆయన మాటలు వింటే ఏమి ఉంటుంది ? అని ఒక సారి మనం ఆలోచిస్తే మన జీవితం ఎలా ఉండాలి అని ఆయన భోధిస్తున్నారు. ఆయన మాట విని జీవిస్తే దానిలో జీవం ఉంటుంది, వారికి నిత్య జీవం ఉంటుంది. ధర్మ శాస్త్రం మొత్తం ఇక్కడ పరి పూర్ణత సంతరించుకుంటుంది. ప్రవక్తల ప్రభోదంకు అర్ధం సమకూరుతుంది. 

రూపాంతరికరణ ఏమి తెలియ జేస్తుంది 

రూపాంతరికరణ యొక్క ఆవశ్యకత చాలా గొప్పది. మొదటిగా అది పన్నెండు మంది శిష్యులకు యేసు ప్రభువు ఇచ్చిన వాగ్దానం. మీలో కొంతమంది దేవుని రాజ్యం చూసినంత వరకు చనిపోరు అని వాగ్ధానం ఇచ్చారు. రూపాంతరికరణ దేవుని రాజ్యనికి ఒక చిన్న నమూనా లాంటిది. యేసు ప్రభువు తన మహిమలో వచ్చిన సమయంలో ఈ విధంగా ఉంటుంది.

 ఈ విషయం రోమియులకు రాసిన 11 వ అధ్యాయంలో 25 వచనం పౌలు గారు దీనిని వెల్లడి చేస్తున్నారు. యేసు రూపాంతరికరణ యేసు ప్రభువు మెస్సీయ్య అని తెలియచేస్తుంది. ధర్మ శాస్త్రం మరియు ప్రవక్తలు ఈయన గురించి ముందుగా  తెలియ చేస్తారు. రూపాంతరికరణ  యేసు ప్రభువు శ్రమలు, సిలువ మరణం పొంది అటుతరువాత మహిమ పొందుతాడు అని తెలియ చేస్తుంది. ఈ రూపాంతరికరణ మరణం తరువాత జీవితం ఉంది అని తెలియ చేసుంది. ఎందుకంటే మోషే మరియు ఏలియా ఇద్దరు జీవిస్తున్నారు. వారు యేసు ప్రభువు తో మాటలాడుతున్నారు.

ఈ రూపాంతరికరణ నిజంగా  యేసు ప్రభువు ఎవరో,ఆయన నిజ స్వరూపం ఏమిటో  , ఆయన ఏమి చేస్తారో అర్ధం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆయన దైవత్వం, మహిమ మరియు ఆయన రక్షణకుడు అని తెలుపుతుంది. ఇది అంతా ఒక ఎత్తు అయితే తండ్రి యొక్క స్వరం మరియొక ఎత్తు. తండ్రి స్వరం ఆయన్ను వినండి అని చెపుతుంది. ఆయనను వినడం వలన మన జీవితాలు పరిపూర్ణత సంతరించుకుంటాయి. కనుక ఎల్లప్పుడు మనం ఆయన మాటలను వింటూ పాటిద్దాం.   

తపస్సు కాల మూడవ ఆదివారం

 తపస్సు కాల మూడవ ఆదివారం 

యోహాను 4:5-42

యేసు సమరియాలోని సిఖారు పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే  ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరీయ స్త్రీ  నీటికొరకు  అక్కడకు వచ్చెను. యేసు ఆమెను "నాకు త్రాగుటకు నీరు ఇమ్ము" అని అడిగెను. అయన శిష్యులు  ఆహార పదార్ధములు కొనితెచ్చుటకు పట్టణమునకు వెళ్లియుండిరి. ఆ సమరీయ స్త్రీ యేసుతో, "యూదుడవైన నీవు సమరీయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు?" అని అనెను. ఏలయన, యూదులకు సమరీయులతో ఎట్టి పొత్తునులేదు. అప్పుడు యేసు "దేవుని వరమును గ్రహించియున్న యెడల, 'త్రాగుటకు నీరు ఇమ్ము, అని అడుగుచున్నది ఎవరు అని తెలిసికొని  ఉన్నయెడల, నీవే ఆయనను అడిగి ఉండెడిదానవు. అపుడు అయన నీకు జీవజలమును ఇచ్చి ఉండెడివాడు" అని సమాధాన మిచ్చెను. అపుడు ఆ స్త్రీ "అయ్యా! ఈ బావి లోతైనది. నీరు చెదుటకు నీయొద్ద ఏమియు లేదు. జీవ జలమును నీవు ఎక్కడినుండి  తెచ్చెదవు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతనికంటే గొప్పవాడవా? అని అడుగగా , యేసు సమాధానముగా ఆమెతో "ఈ నీటిని త్రాగువాడు మరల దప్పికగొనును. కాని నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వానియందు  నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును" అని చెప్పెను. అపుడు ఆమె "అయ్యా! నేను మరల దప్పికగొనకుండునట్లును,నీటికై ఇక్కడకు రాకుండునట్లును, నాకు ఆ నీటిని ఇమ్ము" అని అడిగెను. అప్పుడు యేసు "నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము" అనెను. అందుకు ఆమె "నాకు భర్త లేడు" అని చెప్పెను. నాకు భర్త లేడు  అని నీవు యధార్ధముగా చెప్పితివి. నీకు ఐదుగురు భర్తలుండిరి. ఇప్పుడు  నీతో ఉన్నవాడు నీ భర్తకాడు నీవు యధార్ధము చెప్పితివి అని యేసు పలికెను. ఆ స్త్రీ ఆయనతో అయ్యా! నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించిరి. కాని , దేవుని ఆరాధించవలసిన స్ధలము యెరుషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు" అని పలికెను. స్త్రీ నామాట నమ్ముము. సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతము మీదకాని, యెరూషలేములో కాని తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతురు. మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏలయన రక్షణ యూదులనుండియే వచ్చును.  కాని  నిజమైన ఆరాధకులు ఆత్మ యందును, సత్యమందును  తండ్రిని  ఆరాధించు సమయమిప్పుడే వచ్చి యున్నది. అది ఇపుడే వచ్చియున్నది. నిజముగ  తండ్రి ఆశించునది ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూపి  కనుక, ఆయనను ఆరాధించువారు ఆత్మయందును, సత్యమునందును ఆరాధింపవలయును" అని యేసు చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ "క్రీస్తు అనబడు మెస్సయా రానున్నాడని నేను ఎరుగుదును. అయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియజేయును" అని పలికెను. "నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను!" అని యేసు చెప్పెను. అంతలో శిష్యులు వచ్చి, అయన ఒక స్త్రీతో సంభాషించుట చూచి ఆశ్చర్యపడిరి. కాని, ఎవడును నీకేమి కావలయును" అని గాని "నీవు ఎందుకు ఈమెతో మాటాడుచున్నావు " అనిగాని అడుగలేదు. ఆమె తన కడవను అక్కడే వదలి పెట్టి పట్టణములోనికి వెళ్లి ప్రజలతో, "ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నియు చెప్పెను. వచ్చి చూడుడు. ఆయన క్రీస్తు ఏమో! అని చెప్పెను. ప్రజలు పట్టణమునుండి బయలుదేరి ఆయనవద్దకు వెళ్లిరి. ఈలోగా అయన శిష్యులు "బోధకుడా! భోజనము చేయుడు" అని బ్రతిమాలిరి. యేసు వారితో "భుజించుటకు మీరు ఎరుగని ఆహారము నాకు కలదు" అని చెప్పెను. ఎవరైన ఈయనకు భోజనము తెచ్చిపెట్టిరా?అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగిరి. యేసు వారితో, నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటయు, అయన పనిని పూర్తి చేయుటయే నా ఆహారము. నాలుగు మాసముల పిమ్మట కోతలు వచ్చునని మీరు చెప్పుదురుకదా! పొలములవైపు కన్నులెత్తి చూడుడు.  అవి పండి, కోతకు సిద్ధముగా ఉన్నవి. కోత కోయువాడు కూలి తీసుకొని నిత్య జీవమునకై ఫలము సేకరించుకొనుచున్నాడు. ఇందువలన విత్తువాడు, కోయువాడు ఇద్దరును సంతసింతురు. విత్తువాడు ఒకడు, కోయువాడు మరొకడు అని లోకోక్తి ఇక్కడ సార్ధకమైనది. మీరు శ్రమింపదానిని కోయుటకు మిమ్ము పంపితిని. ఇతరులు శ్రమించితిరి. వారి ఫలితము మీకు లభించినది అని చెప్పెను. "నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను" అని ఆ స్త్రీ చెప్పినదానిని బట్టి ఆ పట్టణములోని సమరీయులు అనేకులు ఆయనను విశ్వసించిరి. ఆ సమరీయవాసులు వచ్చి ఆయనను తమయొద్ద ఉండమని వేడుకొనగా, అయన అచట రెండు రోజులు ఉండెను. అయన ఉపదేశమును ఆలకించి ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు. మేము స్వయముగా అయన ఉపదేశమును వింటిమి. వాస్తవముగ ఆయన లోక రక్షకుడని మాకు తెలియును అని వారు ఆమెతో చెప్పిరి.  

సమరియా స్త్రీతోటి యేసు ప్రభువు జరిపిన సంభాషణ సువిశేషలలో యేసు ప్రభువు జరిపిన సంభాషణలలోముఖ్యముగా  స్త్రీలతో ఇది  అతి పెద్ద సంభాషణ.  ఈ స్త్రీ యేసు ప్రభువును ఎవరు అడగనటువంటి ప్రశ్నలు అడుగుతుంది. ఆమె అడిగిన ప్రశ్నలు అన్ని విశ్వాసము గురించి మరియు ఆరాధన గురించియే. ఆమెను ఒక ఆధ్యాత్మిక వేత్తగా , అపోస్తురాలిగా, నాయకురాలిగా, సాక్షిగా మరియు భోదకురాలిగా చూడవచ్చు. ఆమెకు పాత నిబంధన మీద మరియు వారి సంప్రాదాయాల మీద ఉన్న అవగాహన అమోఘం. అందుకే యేసు ప్రభువును ఆమె ఒక ప్రవక్త వలె గుర్తించింది. యేసు ప్రభువు ఒక గొప్ప గురువు. ప్రపంచం ఎన్నడు చూడనటువంటి ఒక గురువు. ఆయన ప్రతి వ్యక్తికి గుర్తింపు ఇచ్చారు మరియు గౌరవం ఇచ్చారు.

 యాకోబు బావి వద్ద సమరియా స్త్రీతో యేసు ప్రభువు జరిపిన  సంభాషణ కొన్ని గొప్ప విషయాలను మనకు తెలియచేస్తుంది. ఇక్కడ ఆమెకు ఒక పేరు ఏమి ఇవ్వలేదు. సమరియా  స్త్రీకి పేరు లేదు. యోహాను సువార్తలో ఇది సర్వసాధారణం.  చాలా మంది పేరులేని వ్యక్తులు ఉన్నారు. పేరు లేకపోతే అప్పుడు ఆ వ్యక్తి ప్రతి వ్యక్తిని పోలి ఉన్నట్లు, ప్రతి వ్యక్తి లోని భావాలకు ప్రతీక అని అర్ధం వస్తుంది.  ఆమె కథ ప్రారంభ క్రైస్తవ సమాజాలలో మహిళల ప్రాముఖ్యత గురించి స్పష్టమైన భావాన్ని తెలియచేస్తుంది.  స్త్రీ మౌనంగా లేదు, స్త్రీలు కేవలం పురుషులకు సహాయం చేయుటకే పరిమితం కాలేదు. ఆమె తన మాటల ద్వారా   యేసు ప్రభువుతో  ఆసక్తి  కలిగించే కొన్ని  ఆధ్యాత్మిక విషయాలు  మరియు ప్రశ్నల గురించి సంభాషింది.  ఆమె యేసు ప్రభువుతో  మాట్లాడటానికి అనుమతి కోసం వేచి చూడలేదు,  కానీ చొరవ తీసుకుంది. ఆమెకు  యేసు ప్రభువు పై ఉన్న  విశ్వాసం దశల వారీగా పెరుగుతూ వచ్చింది. ఎలా అంటే మొదట అయన  దగ్గర నీరు తోడుటకు ఏమి లేదు అనే స్థితి నుండి అయన రక్షకుడు అని గుర్తించే స్థాయికి ఆమె ఎదుగుతుంది, యేసు ప్రభువుతో మనకు ఉన్న సాన్నిహిత్యం , అయనతో గడిపే కొద్దీ పెరుగుతుంది అని ఇది మనకు తెలియజేస్తుంది. 

క్లుప్తంగా ఆమె యొక్క జీవితం ఏమిటి అంటే, యేసు ప్రభువును  కలుసుకొని; ఆయన గురించి తెలుసుకొని, అయనను విశ్వసించి ఎలా ఆ విశ్వసాన్ని వెల్లడించింది అనేది ఆమె జీవితం.  ఆమె వెళ్లి అతని గురించి ఇతరులకు చెప్పింది. మనము చేయవలసినది కూడా ఇదే. నిజానికి ఇది యేసు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం. ఆమె ఇచ్చిన సాక్షం ద్వారా అనేక మంది యేసు ప్రభువును రక్షకుడు అని తెలుసుకోవడమే కాదు అనుభవపూర్వకంగా సాక్షం ఇస్తున్నారు. 

 సమరియా  స్త్రీని యేసు  సమీపించుట 

 ఒక స్త్రీ నీళ్ళు తోడుటకు మధ్యాహ్నపు వేళ నీరు తోడుటకు వచ్చింది. (యోహాను 4:7). యేసు ప్రభువు కూడా ఆ బావి వద్దకు వచ్చాడు. ప్రయాణ బడలికచే అలసిపోయి వున్నాడు. అటువంటి పరిస్థితిలో ఆమెను యేసు ప్రభువు త్రాగుటకు నీరు ఇవ్వమని అడుగుతున్నారు.  యూదయ పురుషులు సాధారణంగా స్త్రీలతో బహిరంగంగా మాట్లాడరు (యోహాను 4:27).   వారు   ఉదయాన్నే ప్రార్థన చేస్తూ,  ఆరోజు వారు అన్యులును, స్త్రీలను, సమరియులను కుష్టువారిని చూడకూడకుండా ఉండాలని కోరుకుంటారు.  అటువంటి ఒక యూదయ వ్యక్తి అయిన యేసు ప్రభువు, ఒక సమరియా స్త్రీని త్రాగుటకు నీరు ఇవ్వమని అడుగుతున్నాడు. దేవుని కుమారునిగా యేసు ప్రభువు ఇక్కడ ఆ సమాజంలో ఉన్న కొన్ని రకాల అసాంఘిక అసమానతలను తీసివేస్తున్నాడు.  ఒకరిని దేవునికి దూరం చేసే అసాంఘిక కార్యక్రమాన్ని తొలగిస్తున్నారు. ఎందుకంటే సమరియులు దేవునికి దూరంగా ఉన్నారు అని వారితో ఎటువంటి సాన్నిహిత్యం ఉండకూడదు అని యూదులు అనుకునేవారు. కానీ యేసు ప్రభువు  ఈ స్త్రీతో మాటలాడి రెండు రకాలుగా స్త్రీని తక్కువ చేసి చూడటాన్ని మరియు సమరియులు దేవునికి దూరంగా ఉన్నారు, వారితో ఎటువంటి బంధం ఉండకూడదు అనే రెండు సాంఘిక అసమానతలు తొలగిస్తున్నారు. 

యేసు ప్రభువు ఆ స్త్రీని నీరు అడిగిన వెంటనే ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది.  అతనితో యూదుడవైన నీవు సమరియా స్త్రీ అయిన నన్ను త్రాగుటకు నీరు అడుగుటయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.  యేసు ప్రభువు చెప్పిన సమాధానము అంతకంటే ఎక్కువ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అది ఏమిటి అంటే నిన్ను అడిగినది ఎవరో నీవు తెలుసుకొని ఉంటే ఆయననే నీవు అడిగేదానవు అని అంటున్నాడు. ఆయన నీకు జీవ జలం ఇచ్చేవాడు అని చెబుతున్నాడు. 

ప్రభువు మాటలు ఆమెకు వింతగా అనిపించాయి. అందుకే  ఆమె  తన స్వరం మార్చి  గౌరవపూర్వకంగా, అయిన నీరు తోడుటకు నీ దగ్గర ఏమిలేదు, నీవు ఎలా జీవ జలం ఇవ్వగలవు అని  అంటుంది. ఈమెకు అయన మాటలు చాలా కుతూహలానికి గురిచేసాయి. ఆమె ఈ జీవ జలం ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటుంది.  ఆ జీవజలం ఎక్కడ లభిస్తుంది? అనేక ప్రశ్నలు ఆమెలో వస్తున్నాయి. 

అందుకే  మీరు మా తండ్రి యాకోబు కంటే గొప్పవారా ? అని అడుగుతుంది.  సమరియుల దృష్టిలో ఆ బావి , దానిలోని నీరు చాలా గొప్పవి. ఎందుకంటే తమ పూర్వీకుడు యాకోబు ఇచ్చిన బావి నీటి నుండి అనేక తరాల వారు, వారి పశువులు మొత్తం, ఆ నీటిని త్రాగి బ్రతుకుతున్నారు. ఇది ఒకరకంగా వారికి జీవ జలం లాంటిది. కాని ఆమెలో యేసు ప్రభువు చెప్పిన మాటలు ఆసక్తిని రేపుతున్నాయి. అవి ఏమిటి అంటే నేను ఇచ్చే నీటిని త్రాగితే మరల దప్పిక గొనరు అని. కాని ఈ బావి నుండి త్రాగిన వారికి మరల దప్పిక కలుగుతుంది. ఈ మాటలు ఆమెను నూతన ఆశను నెలకొల్పాయి, ఆ జీవ జలం కావలనిపించింది. అందుకే ఆ నీటిని నాకు ఇవ్వండి అని అడుగుతుంది.  

జీవజలం కోసం  ఆమెలో ఉన్న ఆసక్తిని గమనించిన యేసు ప్రభువు  ఆ నీటిని ఇవ్వడానికి ఒక షరతును పెడుతున్నారు. నీ భర్తను తీసుకొని రమ్మని అడుగుతున్నారు. ఆమెకు భర్త లేడు  అని ఆమె చెబుతుంది.  

పాపం  బహిర్గతమవుతుంది

యేసు ప్రభువు ఆమెతో మాటాలాడుతున్నప్పుడు, ఆమె వ్యక్తిగత జీవితం ఎంత ముఖ్యమో వివరిస్తున్నాడు. ఆమె జీవ జలం కోసం అడుగుతున్నప్పుడు నీ భర్తను తీసుకురమ్మని చెబుతున్నాడు. అలా చేయడం ద్వారా, ఆమె  మనస్సాక్షిని  మేలుకొలుపుతున్నాడు. ఆమె ఎటువంటి జీవితం జీవిస్తుందో తెలియజేస్తున్నాడు. ఆమె వినయముగా అయ్యా! నాకు భర్త లేడు అని చెబుతుంది.  దానికి యేసు ప్రభువు ఆమెను అభినందిస్తున్నారు. అమ్మా, నీవు నిజం చెప్పావు. కాని  నిజానికి నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు, మరియు ఇప్పుడు నితో ఉన్న వ్యక్తి ని  భర్త కాదు. (యోహాను 4:18) యేసు ప్రభువు చెప్పిన మాటలు ఆమెను భయానికి మరియు ఆశ్చర్యానికి గురిచేసాయి. ఎందుకంటే యేసు ప్రభువు ఆమెకు  అపరిచితుడు, కాని  తన జీవితానికి సంబంధించిన అన్ని వివరాలను బయటపెట్టాడు. ఆ స్త్రీ తెలివైనది కాబట్టి, ఆ స్త్రీ అయ్యా మీరు ఒక ప్రవక్త అని నాకు తోచుచున్నది అని చెప్పింది. ( యోహాను 4:19 ). 

నిజమైన ఆరాధన

 ఆయన ప్రవక్త అని తెలుసుకున్న ఆమె వెంటనే, సమరీయుల మరియు యూదుల ఆరాధన మరియు అర్చన సంబంధించిన విషయాలు గురించి అడుగుతుంది. యూదుల దేవాలయం యెరుషలేములో ఉన్నట్లే, సమరియుల దేవాలయం గెరిజీము పర్వతము మీద ఉంది.  సమరియులు మరియు యూదులు ఎల్లప్పుడూ ఈ రెండు దేవాలయాలలో ఏది నిజమైన ఆరాధన స్థలం అని వాదించుకునేవారు. అందుకే నిజముగా ఎక్కడ దేవునికి  ఆరాధన చేయాలి యెరుషలేములోనా? లేక గెరిజీములోనా? ఇటువంటి ప్రశ్నలు యేసు ప్రభువును ఈమె మాత్రమే అడుగుతుంది. యూదులు, సమరియులు ఇద్దరి వాదనలు ఏవి ముఖ్యమైనవి కాదు. మెస్సియ్య ఇవి అన్ని మారుస్తాడు. ఏమిటి ఆ మార్పు అంటే నిజమైన ఆరాధకులు దేవున్ని సత్యమందును మరియు ఆత్మయందును ఆరాధించాలి. అంటే స్ధలం కాదు ముఖ్యం మరి ఏమిటి అంటే మన స్థితి. ఆమె ఇంకా అనేక ప్రశ్నలు ప్రభువును అడుగుతుంది. ఆరాధన ఏదో ఒక బాహ్య స్థలానికి సంబంధించినది కాదు.   (అపొస్తలుల కార్యములు 17:24).  అది ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉంటుంది. దేవునికి ఆమోదయోగ్యమైన ఆరాధన సత్యానికి అనుగుణంగా ఉంటుంది, ఇది  ఒక వ్యక్తి భావించే  సత్యం కాదు, పవిత్రాత్మతో కూడిన సత్యము.

  మెస్సియా వస్తున్నాడు

ఈ మహిళ యేసు ప్రవక్త అని నిర్ధారించింది. మెస్సీయ వస్తున్నాడని నాకు తెలుసు: ఆయన  వచ్చినప్పుడు, మాకు   అన్ని విషయాలు తెలియజేస్తాడు, అని చెబుతుంది. ఇవే ప్రశ్నలు ఈమె యేసు ప్రభువును అడిగి తన ఇంటికి వెళ్లిన తరువాత, అయన నాకు అన్ని విషయాలు తెలియజేశాడు అని గ్రహించి ఈయన మెస్సియ్య ఏమో అని  తన పట్టణ ప్రజలకు తెలియచేస్తుంది. (యోహాను 4:25).స్త్రీ ఇంటికి తిరిగి వస్తుంది, అంతటితో ఆమె దేవునితో చేసిన సంభాషణ, దేవున్ని కలుసుకోవడం, ఆమెను  పాత సాధారణ జీవితంలోనే ఉండనివ్వలేదు. తన ఊరి ప్రజలందరికి చెబుతుంది.  నేను చేసినదంతా నాకు ఒక వ్యక్తి చెప్పాడు, అతను మెస్సియా ఏమో చుడండి అని  చెబుతుంది. ఆ నగర ప్రజలు తమ పనులను వదలి ఆయనను చూడటానికి వచ్చారు.  

ఆ స్త్రీ తన నీటి కుండను విడిచిపెట్టి నగరంలోకి ప్రవేశించింది. నేను చేసినదంతా నాకు చెప్పిన వ్యక్తిని కలిసినట్లు ఆమె వారికి చెప్పింది.  ఇది యేసు యొక్క అతీంద్రియ స్వభావాన్నీ తెలియజేస్తుంది. ఓక స్త్రీ సాక్షం వారు ఒప్పుకోరు అని ఆమెకు తెలుసు. కాని తన సాక్షం చెప్పాలి, అందరికి యేసు ప్రభువు గురించి ఆమె వారికి చెప్పాలి అని అనుకున్నది. అందుకే అతను క్రీస్తు ఏమో ఒకసారి చుడండి అని ఆమె చెబుతుంది. క్రీస్తును చూసి, ఆయనతో మాట్లాడి, ఆయన్ను తెలుసుకొని ఆయనే ఎవరో మీరే నిర్ణయించండి అని తెలియజేస్తుంది. 

సమరియా ప్రజలు యేసు ప్రభువును నమ్మట 

చాలా మంది సమరియులు యేసు ప్రభువును  విశ్వసించారు, అని  వింటున్నాం. సమరియులు మొదట్లో ఆ  స్త్రీ చెప్పిన మాటల ఆధారంగా విశ్వసించారు. ఈ స్త్రీ యొక్క సాక్ష్యం చాలా శక్తివంతమైనది.  ఆమె యేసు ప్రభువు  మెస్సీయ కావచ్చునని సూచిస్తూ, యేసు గురించి అందరికీ చెప్పింది. యేసు మరణం మరియు పునరుత్థానం తర్వాత, యేసు ప్రభువు శిష్యులు వచ్చి యేసు గురించి ప్రజలకు చెప్పారు. సమరియా  స్త్రీ కూడా అదే చేసింది,  ఆమె తన  సొంత  చొరవతో యేసు ప్రభువు గురించి అందరికి తెలియచేస్తుంది. 

సమరియా  స్త్రీ: ఒక అపొస్తురాలు 

ఆ స్త్రీ యేసుప్రభువుతో ఉన్నది. మరల అయన గురించి ఇతరులకు చెపుతుంది. అపోస్తులు అంటే ప్రభువుతో ఉంది అయన చేత పంపబడి అయన గూర్చి చెప్పేవాడు.  ఇక్కడ  ఆమె అపొస్తలురాలిగా ప్రవర్తించింది. యేసు ప్రభువు  గురించి ప్రజలకు చెప్పడానికి వెళ్లి, వారిని ఆయన వద్దకు నడిపించింది. "నేను చేసినదంతా అతడు నాతో చెప్పాడు" అనే స్త్రీ సాక్ష్యాన్ని బట్టి ఆ పట్టణంలోని చాలా మంది సమరియులు అతనిని విశ్వసించారు, కాబట్టి సమరియులు అతని వద్దకు వచ్చినప్పుడు, వారు అతనిని తమతో ఉండమని అడిగారు మరియు అతను రెండు రోజులు అక్కడ ఉన్నాడు. యోహాను  4: 39-42. చాలా మంది ప్రజలు యేసును నమ్మారు, కేవలం స్త్రీ వల్ల మాత్రమే కాదు, యేసు రక్షకుడని వారు స్వయంగా చూశారు. ఇది వారి యొక్క అనుభవం కూడా అయినది.  

ఆమె  సందేశం ఏమిటి? "నేను చేసినదంతా అతను నాకు చెప్పాడు."  యేసుతో సంభాషణలో, రాబోయే మెస్సీయ "మాకు ప్రతిదీ చెబుతాడు" అని ఆమె చెప్పింది. తరువాత నేను చేసినదంతా అయన నాకు చెప్పాడు,  కనుక అయన రక్షకుడు ఏమో  వచ్చి చుడండి అని చెబుతుంది. ఇదే మాటలను ఆమెకు యేసు ప్రభువు చెప్పాడు. రానున్న రక్షకుడను నేనే అని ఆమెతో మాత్రమే యేసు ప్రభువు చెప్పినది. యేసు ప్రభువు తాను రక్షకుడను అని బహిర్గతం చేసినది ఇక్కడ మాత్రమే. 

 సమరియా  స్త్రీ తనమాటల ద్వారా యేసుతో ఆమెకు ఉన్న అనుభవం ద్వారా సిఖారు పట్టణంలోని ప్రజలను  ప్రేరేపించి, వారు యేసు వద్దకు వెళ్లేలా చేసింది. ఆమె ఇతను క్రీస్తు , రక్షకుడు అయి ఉంటాడు ఏమో అని ఆ ప్రజలకు చెబుతుంది. వారిని బలవంతంగా నిమ్మించ ప్రయత్నం చేయలేదు.  ఆమె తన జీవితం గురించి యేసు చెప్పిన మాటలను బయట చెప్పుటకు సిగ్గుపడలేదు. 

సమరియా స్త్రీ ఇతరులను యేసు ప్రభువు దగ్గరకు తీసుకురావడానికి కృషి చేస్తుంది. తాను యేసు ప్రభువు వద్ద పొందిన , తెలుసుకున్న విషయాలను ఇతరులతో పంచుకొనుట ద్వారా యేసు ప్రభువును ఇతరులకు తెలియజేస్తుంది. ఆమె చెప్పిన దానిని బట్టి ఆయనను చూడాలి అని అయన దగ్గరకు వచ్చారు.  

ముగింపు

సమరియా స్త్రీ జీవితంను పరిశీలించినయితే   ఆమె అపొస్తల కర్తవ్యాన్ని చేస్తుంది, ఎందుకంటే అపొస్తలుడు అంటే  క్రీస్తుతో ఉన్నవాడు మరియు క్రీస్తుని సువిశేషం ప్రకటించినవాడు. ఈ రెండు పనులు ఆమె చేస్తుంది.  ఆమె క్రీస్తుతో ఉండి , విశ్వాసం మరియు ఆరాధన గురించి క్రీస్తుతో మాట్లాడింది. పాత నిబంధనలో యేసే మెస్సీయ అని గ్రహించగలిగే అనేక మంది దీర్ఘదర్శలు మరియు ప్రవక్తలను మనం చూస్తాము. చాలా మంది ప్రజలు యేసును వేర్వేరు ప్రశ్నలు అడిగారు, కానీ ఈ స్త్రీ మాత్రమే విశ్వాసానికి మరియు ఆరాధనకు సంబంధిచిన ప్రశ్నలను అడిగి, వాటికీ సంబంధించిన సమాధానాలను పొందింది.  ఆమె సిఖారు  ప్రజలను ప్రేరేపించడంద్వారా వారు యేసు ప్రభువును చూస్తున్నారు.  ఆమె నిష్ణాతులైన అపొస్తలురాలు మరియు బోధకురాలు. పవిత్ర గ్రంధంలో ఈమె వలె  విశ్వాసం, ఆరాధన మరియు ప్రార్ధన విశ్వాసం అనే  విషయాలపై యేసు ప్రభువుతో ఇంత  గొప్ప సంభాషణ ఎవరు చేయలేదు.  ఆమె క్రీస్తు గురించి ప్రకటించింది. క్రీస్తును  కలుసుకోవడం ఆమెను మార్చింది  ఆమెను బలపరిచింది. మనము కూడా ఆయన్ను కలుసుకొని ఆయనతో మనము గడిపితే మన జీవితాలలో కూడా ఇదే జరుగుతుంది. 


లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...