మరణాన్ని జయించిన మృత్యుంజయుడు: ఈస్టర్ పండుగ ధ్యానం | కార్మెల్ శోభ
క్రీస్తు పునరుత్థాన మహోత్సవం ప్రియమైన మిత్రులారా!అందరికి క్రీస్తు పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు. మానవ రక్షణ చరిత్రలో అంత్యంత ముఖ్యమైన పండుగ ఇది. ఇది మరణం మీద యేసు ప్రభువు యొక్క విజయం. సృష్టి ఆరంభం నుండి ఒకే ఒక సమాధి తెరువబడి ఖాళీగా ఉండి, అక్కడ సమాధి చేయబడిన వ్యక్తిని ఆ సమాధి బందించి అక్కడ ఉంచలేక పోయింది అని తెలుపుతుంది . ఆ సమాధి ఆయనను భందించలేక పోయింది. అందుకే పునీత పౌలు గారు మరణాన్ని అడుగుతున్నారు, మరణమా నీ విజయం ఎక్కడ ? భాదించగల నీ ముల్లు ఎక్కడ ? 1 కోరింథీ15 :55 అందరు నీకు దాసులే అని విర్ర వీగినా నీ గర్వం ఎక్కడ? అని అడుగుతున్నారు. ఈ రోజు మనందరికీ ఆనందించే రోజు? ఎందుకంటే యేసు ప్రభువు మరణాన్ని జయించాడు. మరణానికి ఆయన మీద ఎటువంటి అధికారం లేదు, అని నిరూపించాడు. అంతే కాదు ఆయన వలె మనం కూడా, ఒక రోజు మరణం నుండి లేవవచ్చు అని నిరూపించాడు. తన శ్రమలు, మరియు మరణం యొక్క ఫలితం ఈ రోజు మనకు చూపించాడు. ఈ పునరుత్థానం ఆయన కొరకు కాదు మన కొరకు ఆయన దేవుడై ఇన్ని బాధలు , కష్టలు ఎందుకు అనుభవిస్తున్నారు? దాని ఉపయోగం ఏమిటి ? అని మనం ప్రశ్నిస్తే ? మనకు ...