పోస్ట్‌లు

పితరుడైన యాకోబు చరిత్ర | Life Story of Jacob in Telugu

చిత్రం
 యాకోబు సంపూర్ణ  జీవిత చరిత్ర    పరిచయం  ఈసాకు,రెబ్కాల  రెండవ కుమారుడు యాకోబు,  ఏసావుని   కవల సోదరుడు. యాకోబు రక్షణ చరిత్రలో చాల ప్రముఖమైన వ్యక్తి. తాను సాధించాలి అనుకున్నదానిని, ఎంత కష్టించి అయిన సాధించుకోవుటలో, పట్టు విడువకుండ ఉండుటలో , నిరాశ దరిచేరనివ్వని ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.   యాకోబు స్వభావం  యాకోబులో  రెండు రకాల స్వభావాలు మనం చూస్తాము. ఇతనిలో మంచి మరియు చెడు రెండు స్వభావాలు మనకు కనబడుతాయి. ఆయన తన జీవితంలో మంచి, చెడు చేసే విషయాలలో   పడిపోతూ, లేస్తూ ఉంటాడు. తను పడిపోయిన కాని దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు.  మరియు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు, తన బలహీనతలు మరియు శక్తి సామర్ధ్యాలు ఇవన్నీ కూడా ఆయన జీవితాన్ని చాలా ఆసక్తి కలిగిస్తాయి. ఇతని జీవితం బాహుముఖాలు కలిగిఉంది. ఈనాటి మానవ స్వాభావానికి సరిగ్గా సరిపోతాడు. యాకోబులో లోపాలు ఉన్నాయి కాని ప్రార్ధన పరుడు. నిలకడలేనితనం ఉంది కాని చివరిలో చాలా మార్పు చెందనివాడు  అయ్యాడు. తన జీవిత మొదటి భాగంలో మంచి చెడులు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం చాలా ఆసక్...

మరియ ఫెలిసియా జీవిత చరిత్ర | కార్మెల్ సభ పునీతులు

చిత్రం
  పరాగ్వే లిల్లీ పుష్పం – మరియ ఫెలిసియా (చికితుంగ ) మరియ ఫెలిసియా గుగ్గియారి  ఎచేవెరియా  అనే కార్మెల్ సభ పునీతురాలు జనవరి 12 వ తేదీన , 1925 వ సంవత్సరంలో పరాగ్వే  లోని వియారీక దె స్పిరితూ సంతోలో జన్మించింది.   ఈమె కేవలం 34 సంవత్సరాలు మాత్రమే జీవించింది. ఈ 34 సంవత్సరాలలో కేవలం 4 సంవత్సరాలు మాత్రమే కార్మెల్ లో జీవించింది.  ఆమెను తన తండ్రి చికితుంగ అనే ముద్దు పేరుతో పిలుచుకునేవాడు. ఆమె తండ్రి పేరు రామోన్ గుగ్గుయారీ మరియు తల్లి పేరు మరియ అర్మీండా ఎచేవెరియా . ఈమె ఏడుగురు సంతానంలో మొదటిగా బిడ్డగా  జన్మించింది.  1929 వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీన అంటే నాలుగు సంవత్సరాల ప్రాయంలో జ్ఞానం స్నానం పొందింది. 1937 వ సంవత్సరం డిసెంబర్ 8 వ తేదీన ప్రధమ దివ్య సత్ప్రసాదం స్వీకరించింది.  ఈమె పరాగ్వే నుండి మొదటి పునీతురాలు. ఈమె బాల్యం  నుండి కూడా పేదలకు సహాయం చేయుటకు ఎంతో శ్రద్ద చూపిస్తూ ఉండేది. వారి ఇంటిలో ఈమె ఆహారం కోసం లేక సహాయం కోసం వచ్చే వారికి కావలసిన వాటిని ఇచ్ఛే బాధ్యతను తీసుకొని ఎవరైనా సహాయం కోసం లేక ఆకలితో వచ్చిన వారికి తగిన వాటిని ఇస్తూ ఉండేది....

దైవరాజ్యపు సూచనలు: లూకా 21:29-33 | కార్మెల్ శోభ

చిత్రం
 లూకా 21:29-33  అయన వారికి ఒక ఉపమానమును చెప్పెను: "అంజూరపు వృక్షము, తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూచినపుడు, వసంతకాలం సమీపించినదని తెలిసికొందురు. అట్లే ఇవిఅన్నియు సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలిసికొనుడు. ఇవి అన్నియు జరుగునంతవరకును, ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.  భూమ్యాకాశములు గతించిపోవును. కాని నా మాటలు ఎన్నటికిని గతించిపోవు.  ధ్యానం : యేసు ప్రభుని మాటలు చాల స్పష్టముగా ఈ లోకము గురించి చెబుతున్నారు. చెట్లు కొత్త చిగురును తొడుగుకినునపుడు వసంతకాలం అని అందరికి తెలుసు. వాతావరణమార్పులను బట్టి మనము కాలాలను గుర్తిస్తాము. యేసు ప్రభువు మనలను ఏవిధముగా మనం వీటిని తెలుసుకుంటున్నామో అదేవిధముగా యేసు ప్రభువు చెప్పిన విషయాలు జరుగినపుడు దేవుని రాజ్యము సమీపించినది అని తెలుసుకోమని తెలియజేస్తున్నారు. యేసు ప్రభువు చెబుతున్న విషయాలు ఏమిటి అంటే భూకంపాలు, ఒక రాజ్యం మీద మరియొక రాజ్యం దండెత్తటము, అశాంతి మరియు హింసలు మొదలయినవి జరుగుతాయి అని చెబుతున్నారు. ఇవి అన్ని జరిగిన తరువాత యేసు ప్రభువు అక్కడ శాంతి నీలకోల్పబడే ఒక సందర్భం గు...

క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించడం: లూకా 21:12-19 | కార్మెల్ శోభ

చిత్రం
 లూకా 21:12-19  ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్ధనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతులయొద్దకు మిమ్ములను తీసుకొనిపోవుదురు. ఇది మీరు సాక్షులుగఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసినదానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును , వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు ,  బంధువులు, మిత్రులుకూడ మిమ్మును పట్టిఇచ్చెదరు. మీలో  కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు. కాని మీ తల వెంట్రుకకుడా రాలిపోదు. మీ సహనమువలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు.  ధ్యానము: యేసుప్రభువును అనుసరించేవారిని యేసు ప్రభువును వ్యతిరేకించేవారు  ఎలా వేధించేది తెలియచేస్తున్నారు. యేసు ప్రభువు శిష్యులను అనేక విధాలుగా హింసిస్తారు. శిష్యులను బంధిస్తారు, ప్రార్ధన మందిరాలకు చెరసాలలకు అప్పగిస్తారు. ప్రార్ధన మందిరాలకు ఎందుకు వారిని అప్పగిస్తారు? ప్రార్ధన మందిరాలు కేవలం ప్రార్ధన మాత్రమే ఇతరులను తీర్పు తీర్చే న్యాయస్థానాలులాగ కూడా పని చ...

అనుగ్రహ పరిపూర్ణురాలు మరియమాత - లూకా 1:26-38 ధ్యానం | Carmel Shobha

చిత్రం
 లూకా  1:26-38 తదుపరి ఆరవమాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రధానము చేయబడిన  కన్యక యొద్దకు  పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి, ఆమెతో "అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు"అనెను. మరియమ్మ ఆ పలుకులకు  కలతచెంది ఆ శుభవచనము ఏమిటొ అని ఆలోచించుచుండగా దేవ దూత "మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని  అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" అనెను. అంతట మరియమ్మ "నేను పురుషుని ఎరుగను కదా! ఇది ఎట్లు జరుగును?" అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను: "పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్రశిశువు 'దేవుని కుమారుడు' అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిశబేతమ్మను చూడుము. ...

నిజమైన దేవుని సాన్నిధ్యం: లూకా 21:5-11 | కార్మెల్ శోభ

చిత్రం
 లూకా 21:5-11 కొందరు ప్రజలు ఆలయమును గురించి  ప్రస్తావించుచు "చక్కని రాళ్లతోను , దేవునికి అర్పింపబడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు"అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో "ఈ కట్టడమును మీరు చూచుచున్నారుగదా! ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును"అనెను. అపుడు వారు "బోధకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి. అందుకు, అయన "మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలుకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని, మీరు వారివెంట వెళ్ళవలదు. యుద్ధములను, విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నియు జరిగితీరును. కాని, అంతలోనే అంతము రాదు." ఇంకను అయన వారితో ఇట్లనెను:"ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్లు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును.  ధ్యానం: యెరూషలేము దేవాలయం ఒక అద్భుత కట్టడం. ఆ దేవాలయం యిస్రాయేలు ప్ర...

మనుష్యులను పట్టు జాలరులు: లూకా 5:1-11 | కార్మెల్ శోభ

చిత్రం
 లూకా 5: 1-11 యేసు ఒక పర్యాయము గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయనయొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచట రెండు పడవలను చూచెను. జారరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డుననుండి లోనికి త్రోయమని, అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో "మీరు పడవను ఇంకను లోతునకు తీసికొని వెళ్లి చేపలకై మీ వలలను వేయుడు" అనెను అందుకు సీమోను "బోధకుడా! మేము  రాత్రి అంతయు శ్రమించితిమి. కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము" అని ప్రత్త్యుత్తరము ఇచ్చెను. వల వేయగనే,  వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు రెండవ పడవలోనున్న తమ తోటి వారికి, వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా, వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది  చూచి యేసు పాదములపై పడి "ప్రభూ ! నేను పాపాత్ముడను. నన్ను విడిచిపొండు" అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను, అతని తోటి వారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జెబదాయి...