పోస్ట్‌లు

మరియమాత దివ్య మాతృత్వ పండగ | Mary Mother of God Telugu | Carmel Shobha

చిత్రం
 మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం  ఈ రోజు మనం మూడు ముఖ్యమైన పండుగలు చేసుకుంటున్నాము. మొదటిది మరియ మాత దివ్య మాతృత్వ పండగ. ఏమిటి మరియమాత మాతృత్వం, ఆ మాతృత్వ గొప్పతనం ఏమిటి అంటే ఇది సాధారణ మాతృత్వం కాదు. దేవునికి తల్లి అవ్వడం. దేవునికి తల్లి అవ్వడం అంటే  ఏమిటి ? రెండవది యేసు ప్రభువుకు సున్నతి చేసి పేరు పుట్టిన రోజు. మూడవదిగా ఈరోజు మనము నూతన సంవత్సరములోనికి అడుగుపెడుతున్నాము.  ఈ యొక్క పదాన్ని 431వ సంవత్సరంలో ఎఫెసుస్ కౌన్సిల్ లో మొదటిగా మరియమాత దేవుని తల్లి అని అనడం జరిగింది. దానిమీద అనేక వాదనలు జరిగాయి.  వీటన్నింటి సారాంశం ముఖ్యముగా  దేవుని గురించే. అది యేసు ప్రభువు ఈలోకమునకు మానవునిగా రావడం వలన ఈ మానవ రూపంలో దైవత్వాన్ని పూర్తిగా చూపించడం ప్రధాన అంశం యేసు ప్రభునియొక్క మానవత్వాన్ని మరియు దైవత్వాన్ని పూర్తిగా మనము పూర్తిగా అంగీకరించినప్పుడు మరియమాత యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తాము. మరియమాతకు ఉన్న పేరులలో చాలా ముఖ్యమైనది దేవుని తల్లి. ఆమె దేవునికి మానవునిగా జన్మనిచ్చిన తల్లి. ఈ పేరుకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది యేసు ప్రభువు పూర్తిగా మానవుడు మరియు దేవ...

క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం (ఎపిఫని) ఆధ్యాత్మిక సందేశం | కార్మెల్ శోభ

చిత్రం
 క్రీస్తు  సాక్షాత్కార మహోత్సవం   యెషయా 60:1-6, ఎఫెసీ 3:2-3,5-6, మత్తయి 2:1-12    హెరోదురాజు పరిపాలన కాలములో యూదయ సీమయందలి బెత్లేహేము నందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు నుండి యెరుషలేమునకు వచ్చి, "యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పున చూచి మేము ఆరాధింప వచ్చితిమి" అని అనిరి. ఇది విని, హెరోదు రాజు, యెరుషలేము నగర వాసులందరు కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను, ధర్మ శాస్త్ర బోధకులను సమావేశ పరచి  "క్రీస్తు ఎచట జన్మించును" అని ప్రశ్నించేను. "యూదయ సీమ యందలి బెత్లేహేము నందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమ యందలి బెత్లేహేమా!నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏలన నా యిస్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో  నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను." అంతట హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి, నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలిసికొనెను. పిమ్మట అతడు వారిని బెత్లేహేమునకు పంపుచు "మీరు వెళ్ళి, జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నెను వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను...

హృదయ పరివర్తన లేక నాశనం | లూకా 13:1-9 Telugu Homily తపస్సుకాలం | Carmel Shobha

చిత్రం
 లూకా 13:1-9 మన రక్షణకు అవసరమైనది హృదయ పరి వర్తన. ఈనాటి సువిశేషం ద్వార దీనిని ప్రభువు వెల్లడి చేస్తున్నారు.  మనం  మారు మనస్సు పొందక పోతే మనం నాశనం అవుతాము అని యేసు ప్రభువు వెల్లడిచేస్తున్నారు. నేను చాలా పాపములు చేసెను ఇంకా నన్ను దేవుడు నన్ను క్షమించడులే అని మనం బాధకు గురికానవసరం లేదు. కాని మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనలను శిక్షించకుండా మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం ఉపయోగించుకుంటే నీవు శిక్షకు గురికావు. నివివే ప్రజలు పాపం చేసిన వారు మారు మనసు పొందినందుకు వారిని శిక్షించడం లేదు.  దేవుని యందు నీకు అభయం ఉంది అది ఏమిటి అంటే నీకు ఒక అవకాశం ఇవ్వడానికి సిద్దాముగా ఉన్నాడు. సాతాను నీకు  రక్షణ లేదు అని చెబుతుంది, కానీ యేసు ప్రభువు కోసం ఆ అవకాశం తీసుకొస్తాడు. మొదటి తిమోతి రెండవ అధ్యాయం 5 వ వచనం మనకు ఇది చెపుతుంది. "దేవుడు ఒక్కడే,దేవుని ,మనుజులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు  ఒక్కడే ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రయ ధనముగా ఆయన తనను తాను అర్పించుకొనేను." "ఆ సమయమున కొందరు, గలీలియ దేశీయులు బలులు సమర్పించునప్పుడు పిలాతు వారిని చంపి...

అష్ట భాగ్యాలు | మత్తయి 5:1-12 Telugu Beatitudes Meaning | Carmel Shobha

చిత్రం
  అష్ట భాగ్యాలు  నాలుగవ సామాన్య ఆదివారం   మత్తయి 5:1-12  యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూచేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు దైవ రాజ్యము వారిది.  శోకార్తూలు ధన్యులు వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు వారు భూమికి వారాసులగుదురు. నీతినిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరుపబడుదురు. దయామయులు ధన్యులు వారు వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. శాంతి స్తాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్ధము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బాహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహనందపడుడు.  యేసు ప్రభువు ప్రసంగాలలో చాలా ముఖ్యమైన ప్రసంగం ఈ అష్టభాగ్యాల ప్రసంగం.  అనేక మందిని ప్రభావితం చేసిన ప్రసంగం మరియు అనేక మంది చేత ప్రశంసించబడిన ప్రసంగం కూడా ఇదే. ...

యేసు ప్రభువు బాప్తిస్మం | లూకా 3:15-22 Telugu Sunday Homily | Carmel Shobha

చిత్రం
  యేసు ప్రభువు బాప్తిస్మ ఆదివారం  యెషయా 40:1-5, 9-11, తీతు 2:11-14,3:4-7, లూకా 3:15-16,21-22 యేసు ప్రభువు బప్తిస్మము చాలా ప్రాముఖ్యత కలిగినది మన రక్షణ చరిత్రలో అందుకనే సువార్తికులందరు దీని గురించి రాసారు. మత్తయి 3:14-15 యేసు ప్రభుని బప్తిస్మము ఆయన పాపం చేసినందుకు కాదు దేవుని ఆజ్ఞలకు అనుకూలముగా స్వీకరించాడు అని తెలియచేస్తుంది. యోహాను , యేసు ప్రభువుల మధ్య సంభాషణ ద్వారా ఇది తెలుసుకుంటున్నాము. యోహాను బప్తిస్మము పాప జీవితానికి ముగింపును పలికి నూతన జీవితాన్ని సాగించడానికి కానీ యేసు ప్రభువు స్వీకరించిన బాప్తిస్మము ఒక నూతన కార్యాన్ని స్వీకరించడానికి, అంటే తన పెంపుడు తండ్రి అయినా యేసేపు గారి పని అయిన వడ్రంగి పనిని వదలి ఒక నూతన కార్యాన్ని స్వీకరిస్తున్నారు లేక మొదలు పెడుతున్నారు. ఆ నూతన కార్యం ఏమిటి అంటే మానవ రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యం మొదలు పెట్టడానికే యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు.  యేసు ప్రభువు బప్తిస్మము తీసుకున్నప్పుడు జరిగిన విషయాలు మనము గురించి ఈ రోజు మనము వింటున్నాము. అవి ఏమిటి అంటే 1. పరలోకం తెరవబడుతుంది. పరలోకం తెరవబడటం అనే మాట దర్శన గ్రంధం లోని భ...

యేసుతో సమృద్ది | లూకా 5:1-11 Telugu Homily శిష్యుల పిలుపు | Carmel Shobha

చిత్రం
 5 వ సామాన్య ఆదివారం యేసు తో సమృద్ది  లూకా 5: 1-11   క్రీస్తు నాధుని యందు ప్రియ మిత్రులారా ,ఈనాటి  సువిశేషంలో యేసు ప్రభువు శిష్యులను ఎన్నుకోవడం చూస్తున్నాం. ఎందుకు యేసు ప్రభువు వీరిని ఎన్నుకున్నారు. వారికి ఉన్న లక్షణాలు ఏమిటి? వారు గొప్ప వారా ? లేక వారు ఎప్పుడు దేవుని మాటను ఖచ్చితముగా పట్టించేవారా ? వారు తెలివిగాలవారా? జ్ఞానవంతులా? అనేటువంటి ఈ ప్రశ్నలు అన్నింటికీ  సమాధానం కాదు అనే , అయిన యేసు ప్రభువు వారిని ఎన్నుకుంటున్నారు.ఈ లోకం దేనికి పనికి రారు అని చెప్పేవారిని దేవుడు ఎంనుకొంటున్నారు. వారి ద్వార గొప్ప కార్యాలు చేస్తున్నారు. 1 కోరింథీ 1:27 మనం చూస్తున్న. "వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు, లోకముచే అవివేకులుగాభావింపబడువారిని దేవుడు ఎన్నుకొనేను."   యేసు ప్రభువు మొదటి శిష్యులు సంపూర్ణులు కారు వారిలో అనేక లోపాలు ఉన్నాయి. మొదటి పఠనంలో యోషయా తన అయోగ్యత వెల్లడి చేస్తున్నారు. కానీ దేవుని మాటలను చెప్పడానికి తాను సిద్దము అని చెబుతున్నారు. పేతురు కూడా తన అయోగ్యతను వెల్లడి చేస్తున్నారు, అది తెలియచేసి దేవుని అనుసరించదానికి సిద్దపడుతున్నాడు....

లోకమును కాక దేవున్ని నమ్ముము | లూకా 6:17-26 Telugu Homily | Carmel Shobha

చిత్రం
 సామాన్య 6 వ ఆదివారం   యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26  ఈనాటి మొదటి పఠనంలో యిర్మియా ప్రవక్త ద్వార మనం ఎవరిని నమ్మలో చెపుతున్నారు. నీవు ఈ లోకం కానీ దానిలోని వ్యక్తులను లేక వస్తువులను , ఆస్తులను నమ్మితే ఏమి జరుగుతుంది. నీవు మోసపోతావు. ఒకసారి యోసేపును గుర్తుకు చేసుకోండి. ఆయన తన అన్నలను నమ్మాడు, నా అన్నలే కాదా! నన్నుఏమిచెయ్యరు అనుకున్నాడు. తన అన్నలు  ఆయనను  అమ్ముకున్నారు. సాంసోను ను చూడండి. తన ప్రేయసి తనను మోసం చేయదు అనుకున్నాడు. తన ప్రేయసి తనను పట్టించిది. అది తన మరణానికి దారితీసింది. ఏసావును తన తమ్ముడు మోసం చేశాడు. యేసు ప్రభువును తన శిష్యుడే డబ్బులు కోసం అమ్ముకున్నాడు. నాబాలు తన సంపదను నమ్ముకున్నాడు అది ఆయనను కాపాడలేక పోయింది. నీవు ఈలోకాన్ని కానీ దానిలో ఉన్న వాటిని కాని  వ్యక్తులనుకానీనమ్మితే నీవు మోసానికి గురి అవుతావు. మరి దేనిని నమ్మాలి? నీ నమ్మకమును దేవుని యందు ఉంచినట్లయితే నీవు అవమానమునకు గురికావు, ఎవరు నిన్ను ఏమి చేయలేరు.  ఎందుకు యిర్మియా ప్రవక్త వారికి ఈ మాటలను చెపుతున్నారు. కారణం ఏమిటిఅంటే వారికి చాలా సంపదలు వస్...