తపస్సు కాల మొదటి వారం - బుధవారం
యోనా 3:1-10
లూకా 11:29-32
క్రీస్తు
నందు ప్రియమైన సహోదర సహోదరీలారా, దేవుడు తమ మధ్య ఉన్నాడని తెలియజేయడానికి పాత నిబంధనలో
అనేక సూచనలు మరియు అద్భుతాలు ఉన్నాయి. మోషే పిలుపు విషయంలో, అతను దేవుని ద్వారా పంపబడ్డాడని
చూపించడానికి అతను కొన్ని సంకేతాలను చేసాడు,
నిర్గమకాండము 4 వ ఆధ్యాయము చూసినట్లయితే అక్కడ కొన్ని సంకేతాలు ఉన్నాయి : కర్ర
పాముగా మారడం, తన చెయ్యి కుష్ఠము వలె తెల్లగా మారడం మరల
యధాప్రకారం
అవడం. మరియు గిద్యోను విషయంలో- ఉన్నితో పరీక్ష
(న్యాయాధిపతులు 6:36-40). ఇది దేవునిపై
నిర్దిష్ట విశ్వాసాన్ని ప్రేరేపించింది.
మరోవైపు, కొన్ని సార్లు సంకేతాలు ఇవ్వబడ్డాయి, అది
నమ్మకానికి దారితీయలేదు. ఎడారి ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా సంకేతాలు అందుకున్నారు కానీ అవిశ్వాసులయ్యారు.
ఫరో దేవుని సంకేతాలను చూశాడు కానీ నమ్మ లేదు కానీ మొండి వాడుగా అయ్యాడు. సువార్తలో కూడా, ప్రజలు క్రీస్తు యొక్క అద్భుత కార్యాన్ని
చూసి ఆశ్చర్యపోయారు మరియు విస్మయం చెందారు, కాని వారందరూ విశ్వాసంలోకి వెళ్లలేదు.
(లూకా 5:26; మార్కు 2:12) వారు మహిమపరచడానికి ప్రేరేపించబడ్డారు కానీ మనసు మార్చుకోలేదు.
అందువల్ల, ఈ సంకేతాలు మరియు అద్భుతాలన్నీ విశ్వాసాన్ని
కలిగించవు, కానీ వీటన్నింటిలో భగవంతుని ఆజ్ఞ ప్రకారం వాటిని చేసే వ్యక్తి ఉన్నాడు.
దేవుని సత్యానికి మరియు విశ్వాసానికి ఇతరుల మనస్సులను తెరవడానికి ఆ వ్యక్తి యొక్క పదం
మరియు చర్య ఒక ముఖ్యమైన ప్రమాణం.
సందర్భం: యేసు సువార్త సువార్త పరిచర్య సమయంలో,
ప్రజలు అతని అసాధారణ పనులు మరియు మాటలను చూసి ఆశ్చర్యపోయారు, కాబట్టి వారు అనుసరించడం
ప్రారంభించారు. వారిలో కొందరు అద్భుతాలు చూడాలని, మరికొందరు ఆయన మనుష్యకుమారుడు, మెస్సీయ
అని నమ్మడానికి ఇతర సంకేతాలను వెతుకుతున్నారు.
అయితే యేసు వారితో ఇలా అన్నాడు: “ఈ తరం దుష్టమైనది;
ఇది ఒక గురుతు కోరుచున్నది , కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహించు బడదు.
మనం సంకేతాలను
ఎందుకు కోరుకుంటాము?
ఇవి దేవుని
నుండి అని నిర్ధారించడానికి
వారి అవిశ్వాసానికి సాకులు చూపడానికి (నమ్మే
ఉద్దేశం లేదు) మత్తయి 16:1; లూకా 11:16).
వారి ఉత్సుకతను /ఆత్రుతను తీర్చడానికి కానీ నిజంగా
తెలుసుకోవాలనే కోరిక లేదు
స్వలాభం కోసం , తమను తాము
ఆకర్షించుకోవడం
యేసు చెప్పిన
యోనా సంకేతం ఏమిటి?
యోనా యొక్క సంకేతం
యోనా యొక్క సంకేతానికి రెండు అంశాలు ఉన్నాయి.
చేపల కడుపులో
మరియు భూమి యొక్క గుండెలో: Jonah 1:17 ప్రభువు నియమించిన ప్రకారము ఒక పెద్ద
చేప యోనాను మ్రింగివేసెను. మరియు యోనా మూడు పగళ్లు మరియు మూడు రాత్రులు చేప కడుపులో
ఉన్నాడు. ఇది యేసు మరణానికి సంబంధించి సూచిస్తుంది,
క్రీస్తు మూడు రోజులు మరియు మూడు రాత్రులు భూమి యొక్క గుండెలో ఉంటా రు.
వాక్య పరిచర్య : యోనా 2:10 యెహోవా ఆ చేపతో
మాట్లాడగా అది యోనాను ఎండిన నేలమీద వెళ్ల గ్రక్కేను. అతను నీనెవెలో ఉన్నప్పుడు, అతను
దేవుని వాక్యాన్ని, దేవుని ఉగ్రతను బోధిస్తూ, హృదయాన్ని మరియు జీవితాలను మార్చు కోమని
నినివె ప్రజలను ఆహ్వానించాడు. అలాగే క్రీస్తు మరణం మరియు పునరుత్థానం తర్వాత కూడా,
హృదయ మార్పు మరియు దైవ రాజ్య విస్తరణ సందేశం
అంతటా ప్రకటించబడుతుంది.
మొదటి పఠనం - యోనా ప్రవక్త దైవ సత్యాన్ని పలికారు, ప్రజలు విన్నారు,
విశ్వసించారు మరియు వారు రక్షించబడ్డారు.
ప్రజలు వినరు అని జోనా అనుకున్నాడు, నీనెవె వాసులు
అస్సిరియన్లు; వారు అన్యమతస్థులు, వారి స్వభావంలో క్రూరమైన మరియు అనైతికంగా ఉన్నారు.
ప్రవక్త తన ప్రాణభయం మరియు క్రూరత్వానికి బయపడి వెళ్ళడానికి వెనుకాడినప్పటికీ, దేవుని
మార్గం వేరే, వెళ్లేలా చేసారు. అతనిని ఆశ్చర్యపరిచే విధంగా, ప్రజలు అతని సందేశాన్ని
విన్నప్పుడు వెంటనే ప్రతిస్పందన వచ్చింది, వారు అతని సందేశాన్ని విశ్వసించారు. వారు
సత్యాన్ని గుర్తించి, దేవుణ్ణి విశ్వసించారు మరియు పశ్చాత్తాపపడ్డారు. అత్యంత అణగారిన
వారి నుండి అత్యంత శక్తివంతమైన వారి వరకు, వారు యోనా మాటలను హృదయపూర్వకంగా తీసుకున్నారు.
వారు పశ్చాత్తాపపడి తమ చెడు మార్గాలను విడిచిపెట్టారు. ఆ విధంగా వారు తప్పించబడ్డారు.
యేసు సొలొమోను
జ్ఞానం గురించి కూడా ప్రస్తావించాడు, షెబా రాణి
సొలొమోను విజ్ఞానం వినడానికి, అభినందించడానికి
చాల దూరం నుండి వచ్చింది. ఆమె ఈ విజ్ఞానాన్ని
భగవంతుని బహుమతిగా గుర్తించింది మరియు వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వడానికి వచ్చింది.
సొలొమోను జ్ఞానం ఒక సంకేతం, ఇది దేవుని జ్ఞానం మరియు సత్యం చూపుతుంది.
యేసు పలికి ఉన్నారు, యోనా, సొలొమోను మరియు ప్రవక్తలందరి కంటే గొప్పవాడు
ఉన్నాడు. ఆయనే క్రీస్తు .మృత్యువుపై కూడా ఏదీ అతన్ని గెలవలేదు.
క్రీస్తు యొక్క సందేశం ఏమిటంటే పశ్చాత్తాపపడి మరియు
విశ్వసించమని ప్రజలను ఆహ్వానించడం, దైవ రాజ్యం సమీపంలో ఉంది అని. ప్రజలు తమ పాపపు మార్గాలను
విడిచిపెట్టి, వారి జీవిత గమనాన్ని మార్చడం ద్వారా దేవునితో గల సంబంధము మరల నయమవుతుంది.
ప్రజలు యేసు బోధనలకు, ఉపదేశానికి ఆశ్చర్యపోయారు,
క్రీస్తు అద్భుత కార్యాలు చూసి ఆశ్చర్యపోయారు,
కానీ చాలా మంది సంకేతాల కోసం అడగడం కొనసాగించారు. వారు యేసు రూపంలో ఉన్న గొప్ప సంకేతాన్ని చూడలేకపోయారు, వారి ముందు ఎవరు
ఉన్నారో గ్రహించ లేకపోయారు.
నేటి ప్రమాదం:
ప్రజలు ఇప్పుడు సులభంగా గురి చేయబడతారు, దేవుని మనిషి
అని పిలవబడే వారిచే తప్పుదారి పట్టించబడ్డారు. ఎక్కువ మంది అనుచరులను సంపాదించడానికి
దేవుని పేరులో మోసాలు. కాబట్టి అనుచరుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అతడు దేవుని మనిషి
అని ప్రలోభ. కాబట్టి వారు ఎక్కువ మందిని ఆకర్షించడానికి చర్యలను మాత్రమే చేస్తున్నారు, అనుచరులను ఆకట్టుకోవడానికి
మరియు పెంచడానికి కొన్ని సంచలన మైన పనులను రూపొందించారు మరియు సృష్టిస్తున్నారు. అదేత్మిక
జీవితాన్ని విస్మరించి, కానీ సంచలనాత్మక (మంచివి కానివి) మరియు భావోద్వేగాలకు (నచ్చే
పదాలు మరియు అసత్యపు అద్భుతాలు) గురిచేయడం. ఈ రోజు కూడా ప్రజలు ఏదైనా సంచలనాత్మక సంఘటనలు
జరిగితే, దానిని ధృవీకరించకుండానే ఆ ప్రదేశాలకు తరలి వస్తున్నారు. ఇది విశ్వాసానికి
ప్రమాదకరం. ప్రజలు సంకేతాలు మరియు అద్భుతమైన పనులను కోరుకుంటారు కానీ వారి ముందు ఎవరు
ఉన్నారో చూడలేరు ఎందుకంటే:
ఈ రోజు మనకు తగినంత సంకేతాలు ఉన్నాయి
★
దివ్య బలిపూజ (కొంచెం సమయం గడపడంలో విఫలమైయము)
★
దేవుని వాక్యం
(చదవడం మరియు నేర్చుకోవడంలో విఫలమైయము)
విశ్వాసాన్ని కలిగించడానికి ఇంతకు మించిన రుజువు
అవసరం లేదు. వాటికీ మించి అనుకుంటే ఇది సముద్రంలో నీరు పోయడం మరియు సూర్యునికి కొవ్వొత్తి
పట్టుకోవడం లాంటిది. ప్రభువు తన జీవితం మరియు మరణం మరియు పునరుత్థానం ద్వారా ఇప్పటికే
తగినంత సంకేతాలను ఇచ్చాడు.
★
దివ్య సంస్కారాలు మరియు విశ్వాసుల సంఘం. (వాటి పాత్రను
అర్థం చేసుకోవడంలో విఫలమైంది)
తపస్సు కాలం గొప్ప సమయం ఎన్ని విధాలుగా ప్రభువు మనకు
కనపడుతున్నారో తెలుసుకోవడానికి. మన విశ్వాసానికి మరియు నమ్మకానికి మనకు మరిన్ని సంకేతాలు మరియు అద్భుతాలు అవసరం లేదు.
నిత్య సత్యమైన దేవుని వాక్యాన్ని విని విశ్వసిద్దాము
సదా మనముందు ఉండే క్రీస్తును దివ్య సంప్రసాదం ద్వారా గుర్తిద్దాం
“కనుక వినుట
వలన విశ్వాసం కలుగును.
వినుట క్రీస్తును
గురించి వాక్కు వలన కలుగును.” రోమీయులు
10:17
మీ విశ్వాసం వాక్యంపై
ఆధారపడనివ్వండి, మరియు దివ్యాసప్రసాదం = క్రీస్తు, శాశ్వతమైన సత్యం
మన విశ్వాసం ఇంద్రియ అనుభవాలు, అనుభూతులు, భావోద్వేగ సంతృప్తిపై
ఆధారపడకూడదు
, ‘నీవు
విశ్వసించినది, నన్ను చూచుట వలన కదా!
చూడకయే
నన్ను విశ్వసించువారు ధన్యులు'' యోహాను
20:29
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి