4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

అయిదవ సామాన్య ఆదివారము (2)

అయిదవ సామాన్య ఆదివారము
 యెషయా   6:1-8
 1 కొరింతి 15:1-11
  లూకా  5:1-11

నేటి దివ్యపఠనాలు దేవుని సేవకు ఎన్నుకొనబడిన వారి జీవితం గురించి భోదిస్తుంది. ప్రభువు యొక్క సేవ చేయడానికి ఆయన యొక్క పవిత్ర వాక్యం బోధించడానికి అలాగే దేవుని ముంగిట నిలబడడానికి ఎన్నుకొన్న బడిన వారి యొక్క అయోగ్యత గురించి తెలుపు చున్నాయి.
అర్హత లేని వారిని ఎన్నుకొని, వారిని బలపరిచి తన యొక్క సేవకు వినియోగించిన విధానం నేడు మూడు పఠనాలు ద్వారావింటున్నాం.

ఈనాటి మొదటి పట్టణములో దేవుడు యెషయా ప్రవక్తను తన యొక్క పని నిమిత్తము  పిలిచినా విధానం తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క ప్రణాళికలను, భోధనలనుతెలియజేయుటకు దేవుడు యెషయా ప్రవక్తను ఎన్నుకొంటున్నాడు. క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దములో దేవునియొక్క ప్రజలు రెండుగా విభజింపబడ్డారు. ఉత్తర రాజ్యమును ఇశ్రాయేలుగా, దక్షణ రాజ్యము యూదాగా విభజింపబడ్డాయి. యెషయాను దేవుడు క్రీస్తు పూర్వం 742 వ సంవత్సరములో పిలిచి, ప్రవక్తగా ఎన్నుకొంటున్నారు. ఆయన ప్రవక్తగా పిలుపుని పొందిన సమయములో అస్సిరియా సేనలు బలంగా ఉండేవి. దానితోపాటు సిరియా కూడా బలంగా ఏర్పడుచున్న సమయమది. అయితే అప్పటి యూదా, ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు వారియొక్క రాజ్యములను సంరక్షించుకొనుటకు వారు భద్రముగా ఉండుటకు రాజకీయ పరంగా అస్సిరియులకు మిగతా బలంగా వున్నా సైనిక రాజ్యాలకు సహకరించి జీవించేవారు. దేవుణ్ణివారు నమ్మకుండా వేరే మానవ శక్తులను, బలాలను నమ్ముకొని వారిమీద ఆధారపడే సమయములో దేవుడు యెషయాను పిలిచి ఆయనయొక్క సందేశం అందించుటకు ఆయన్ను ఎన్నుకొంటున్నారు.

దేవునియొక్క విలువైన ప్రతిమాటను రాజులకు, మతపెద్దలకు, ప్రజలకు తెలియజేయుటకు దేవుడు ప్రవక్తను ఎన్నుకొంటున్నారు. యెషయా దైవపిలుపును అందుకొన్న సమయములో యూదా రాజ్యాన్ని యోతాము,ఆహాసు, హిజ్కియా రాజులు పరిపాలించేవారు.

యెషయా ప్రవక్త యొక్క ఎన్నిక ప్రత్యేకమైనది. ఎందుకంటే, స్వయముగా దేవుడు తన దర్శనం కలుగజేస్తూ, తనయొక్క మహిమను వెల్లడిస్తూ తనయొక్క పనికోసం ఎన్నుకొన్నారు. యెషయా ప్రవక్త యెరూషలేము దేవాలయములో ప్రార్ధిస్తున్నప్పుడు ఆయనకు ఈ దర్శనం కలిగినది. దేవునియొక్క సమక్షంలో తన యొక్క అయోగ్యతను గుర్తించాడు.

 యెషయా  ప్రవక్త  తనకు కలిగిన దర్శనంలో దేవుని యొక్క పవిత్రతను గుర్తించాడు 
ఎందుకంటే దేవదూతల విలువైన మాటలు చెవులారా విన్నాడు.
-పవిత్ర మూర్తి అయినా దేవుణ్ణి చూసినప్పుడు, దేవుణ్ణి గురించి విన్న స్తుతిగానాలు యెషయా ప్రవక్త దేవుని యొక్క సన్నిదిలో తాను ఎంత పాపియే తెలుసుకుంటున్నాడు.
-దేవుని ముంగిట నూలువబడటానికి ప్రజలు ఎంతటి అనర్హులో గ్రహిస్తున్నాడు, అయినప్పటికీ దేవుడు మరలా  బలహీనులను పాపాత్ములైన జనుల మధ్య నుండే తన సేవకు ఎన్నుకుంటున్నారు. 

మనం దేవునికి ఎంత దగ్గరవుతామో అప్పుడు అంట తెల్లగా మన యొక్క పాపపు జీవితం అర్థమవుతుంది. 
-ఇంకొక విధంగా చెప్పాలంటే మనము వెలుగులోనో లేక వెలుతురుకు దగ్గరగా వెళ్తే మన మీద వున్నా మరకలు, మచ్చలు, మురికి అంత స్పష్టంగా కనిపిస్తుంది. 
-అదేవిధంగా ఈ లోకానికి వెలుగైయున్న పవిత్ర మూర్తి అయినా దేవునికి దగ్గరగా వస్తే మనయొక్క అపవిత్రత తెలుస్తుంది.
-యెషయా దేవునికి దగ్గరగా వున్నాడు కాబట్టియే తనయొక్క పాపపు జీవితం గుర్తుకువచ్చింది. 
-ఆ సమయంలో దేవుని యొక్క సెరాఫీము దూతలు ఆయన్ను పవిత్రపరిచారు. 
-సెరాఫిక్ అంటే జ్వలితాలు, మండుచున్నవారు. వీరు నిత్యం పవిత్రతతో జ్వలించే వారు, పవిత్రతతో ప్రకాశించేవారు. 

-రెండవ పఠనంలో పునీత పౌలుగారు తన యొక్క ఎన్నిక గురించి బోధిస్తున్నారు. 
-పౌలుగారు కొరింతునగరంలో సువార్త పరిచర్య చేసే సమయంలో యేసు క్రీస్తు ప్రభుని పునరుత్తానం గురించి అనేక ప్రశ్నలు ప్రజలలో ఉండేవి. కొందరు క్రీస్తు పునరుత్తానం అవ్వలేదని మరికొందరు అయ్యారని అలాగే పౌలుగారి యొక్క సువార్త భోదన్ను కూడా ప్రశ్నించే వారు ఆ సందర్భంలో పౌలుగారు వారందరికీ సాక్ష్యములతో తెలియచేస్తున్నారు .
-క్రీస్తు ప్రభువు నిజంగా ఉత్తానమైనవారు ఆయన మొదటిగా పేతురుకు తరువాత ఆపోస్తులకు, ఐదువేలమందికి దర్శనం ఇచ్చారు అని వారికీ తెలియచేస్తున్నారు. 
-దేవుడు నిజంగా ఉత్తానమై ఉన్నారు దానికి సజీవ సాక్షులు మన మధ్య వున్నారు అని తెలుపుచున్నారు.
ఆయన  యొక్క  మరణ పునరుత్తానములను ప్రకటించుటకే నేను ఎన్ను కోన బడ్డాను అని పౌలుగారు తెలుపుచున్నారు. 
-ఆయన ఎన్నికలో తన యొక్క అయోగ్యతను గుర్తిస్తున్నారు తాను అపోస్తులుడుగా పిలువబడుటకు అర్హుడను కాని ఎందుకంటే దేవుని ప్రజలను హింసించాను కాబట్టి అయినా దేవుడు తన్ను ఎన్నుకొన్నారు అది ఆయన గొప్పతనం అని పలుకుచున్నారు.
-దేవునియొక్క పునరుత్తానం ప్రకటించుటకు దేవుని కృప తనకు తోడుగా ఉందని తెలుపుచున్నారు. దేవుని కృపవలెనే నేను ఇప్పుడు న్న స్థితిలో  వున్నాను అని తెలుపుచున్నారు. 1 కొరింతి 15: 10 
-పౌలు గారు అర్హతలేని నన్ను దేవుడు ఎన్నుకొన్నారు, ఆయన పునరుత్తానమునకు నేనే నిజమైన సాక్షి అని తెలుపుచున్నారు. 

ఈ నాటి సువిశేష పఠనంలో దేవుడు శిష్యులను ఎన్నుకొనే విధానం చూస్తున్నాం. ఆ యన ఎంతో మంది గొప్పవారిని జ్ఞానులను, సమాజంలో పేరున్న వారిని విడిచి పెట్టి ఏమి లేనటువంటి సాధారణమైన ప్రజలను తన సేవకు ఎన్నుకొంటున్నారు.
 
-సామాన్యమైన చేపలు పట్టేవారిని దేవుడు ఎన్నుకొని మనుష్యులను పట్టేవారినిగా చేస్తున్నారు. 
- ఈ సువిశేష భాగంలో చాల విషయాలు మనం ధ్యానించుకోవచ్చు.
- గెన్నేసరేతు ప్రజలయొక్క విశ్వాస జీవితం - ఆ ప్రజల దేవుని యొక్క పవిత్రమైన మాటలను ఆలకించటానికి నెట్టుకొనుచు వస్తున్నారు. దేవునియొక్క మాటలు నిత్య జీవం ఇచ్చే మాటలు అని గ్రహించారు అందుకే నెట్టుకొంటున్నారు . ఇది వారి యొక్క విశ్వాస జీవితానికి నిదర్శనం. 
-మార్కు 6 :53 - 56 వచనాలలో వింటాం యేసు ప్రభువు వారి మధ్యకు వచ్చారని విని ఊరిలో ఎక్కడెక్కడో వున్నా అనారోగ్యులను ప్రభువు చెంతకు తీసుకొనివస్తున్నారు. వచ్చిన అవకాశం కోల్పోకూడదని భారమైన, కష్టమైన రోగులను , యేసుప్రభువు దగ్గరకు మోసుకొని వచ్చారు. వారికి స్వస్థత కావాలి ఆ స్వస్థత దేవుడే ఇస్తారు అని గ్రహించి యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు అలాంటి  గొప్ప విశ్వాసం కలిగి వున్నా వారు గెన్నేసరేతు ప్రజలు.

-గెన్నేసరేతు ప్రజలకు విశ్వాసం ఎక్కువగా ఉన్నదియే కాబట్టి ఆయన వాక్కు ఆలకించటానికి నెట్టుకొని పోతున్నారు.
-ఏం సమయంలో మనం నెట్టుకొని పోతాం? మనకు ఏదైనా ముఖ్యమైనది పొందాలంటే అందరికన్నా ముందే వెళ్తా అని తక్కువుగా ఉంటె నెట్టుకొని పోతాం.
-ఇంకా మనం పలానా సమయంలో వెళ్లకపోతే ఇక ఇది మనకు దొరకదు అనే సమయంలో నెట్టుకొని పోతాం. 
-ఉదా; 2020 లో కరోనా వచ్చినప్పుడు కొన్ని నెలలు ముందు పాపులు శ్రమలేదు ఎప్పుడైతే ఆ షాపులు ఓపెన్ చేశారో జనాలు ఒకరినొకరు నెట్టుకుంటూ రెండు మూడు కిలోమీటర్ల వరకు క్యూలో వున్నారు. 
-ఎందుకంటే ఆ టైయంలో వెల్లకపోతే ఇక ముందు దొరకదు అని వారు భావించిన సందర్భంలో నెట్టుకుంటున్నారు. 
-క్రొత్త సినిమా రిలీజ్ అయినా అదే సంగతి. 
-గెన్నేసరేతు ప్రజలు విశ్వాసంతో జీవించే ప్రజలు. వారు నెట్టుకొని వచ్చింది కేవలం దేవుని యొక్క వాక్కును ఆలకించటానికి వస్తున్నారు. 

- ఈ ప్రజలు దేవుని యొక్క వాక్కు ఆ సమయంలో ఆలకించక పోతే ఎదో మేము కోల్పోతాం అని భావించారు. కాబట్టియే దాని   కోసం నెట్టుకొని పోతున్నారు.
-యేసు భోదన, మాటలు కొత్తగా ఉంది ఆ సందేశం ప్రేరణగా ఉంటుంది, ఆ సందేశం చాల గొప్పదని భావించారు. కాబట్టియే ఆ వాక్కు కోసం ఆలా తహ తహ లాడుచున్నారు. 

1. దేవుని యొక్క వాక్కు అయస్కాంత వాక్కు, అయస్కాంతం ఇనుమును ఆకర్షించిన విధముగానే దేవుని యొక్క వాక్కు విశ్వాసులను ప్రజలను అకార్చిస్తుంది. చాల సందర్భాలలో అన్యులు యేసు అనుచరులుగా మారటం చూస్తాం ఎందుకంటే వాక్కు వారిని ఆకర్శించింది కాబ్బటి 
ఉదా: సాధు సుందర్ సింగ్ 

2. దేవుని యొక్క వాక్కు పుట్టించే వాక్కు లూకా 8 : 4 
దేవుని యొక్క వాక్కు మనలో ప్రేమను పుటిస్తుంది
దేవుని యొక్క వాక్కు మనలో క్షమా పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో ప్రేరణ పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో హృదయ పరివర్తన పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో దయను పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో క్రొత్త జీవితం పుటిస్తుంది.

3 దేవుని వాక్కు నేర్పించే వాక్కు మనం ఎలా జీవించాలన్నది నేర్పిస్తుంది. 

4 దేవుని వాక్కు స్వస్థతను ఇచ్చే వాక్కు అనేక మందికి మాటలతో స్వస్థతను ఇచ్చారు దేవుడు
గన్నేసరెతు ప్రజలు ఈ వాక్యం యొక్క గొప్ప తనం తెలుసుకొని  ఈ వాక్యం వినకపోతే అలాగే ఈ వాక్యం ప్రకారం జీవించకపోతే మేము ఎదో కోల్పోతామని భావించారు కాబ్బటియే అంత అతృతతో ఉన్నారు.
వారి యొక్క వాక్యం యొక్క ఆకలి తీసివేయబడింది ఇప్పుడు ఉన్న రోజులో దేవుని యొక్క వాక్కు కోసం అంతగా ఆకలితో ఉన్నామా? ఎదురు చుస్తున్నామా? ఆసక్తిగా ఉన్నామా?
ii వారు తమ యొక్క వలలు శుభ్రపరుస్తున్నారు, ఆ సమయంలో దేవుడు వారి పడవలో ప్రవేశిస్తునాడు, మన జీవితంలో పాపమును కడిగివేస్తే పాపాలు ఒప్పుకొని పచ్చాత్తాపం పడితేనే దేవుడు మన జీవితంలోకి ప్రవేశిస్తాడు.
iii విశ్వాస జీవితంలో దేవుని ఆశీర్వాదాలు దొరకాలంటే, మన యొక్క విశ్వాస జీవితంలో లోతుగా వెళ్ళాలి.
- ఒడ్డున వలవేస్తే ఏమి జరగదు, దొరకదు అలాగే నమ మాత్రపు క్రైస్తవ జీవితం జీవిస్తే మనకు అనుగ్రహాలు కూడా దొరకవు. 
- దేవునితో ప్రయాణం చేసినప్పుడు లోతుగా వెళ్ళాలి గాఢమైన విశ్వాసం కలిగి ఉంటె అలాగే దేవునితో ఆ అనుబంధం కలిగి ఉంటేనే దేవుడు మనలను దివిస్తాడు.
- మనం కూడా ప్రార్థనలో లోతుగా వెళ్ళాలి, కష్టపడాలి అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు.
- విధేయత చూపుట ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. పేతురును అన్ని తెలిసినాకూడా దేవుడు చెప్పిన మాట విని నమ్మకం ఉంచి వాలా వేసాడు, తన జీవితంలో అద్భుతం దేవిని శక్తి చూశాడు అందుకే వాలా చినిగే అన్ని చేపలు బడ్డాయి. 
- నోవా విదేయించాడు - రక్షణ పొందాడు 
- అబ్రాహాము విదేయించాడు - దీవెనలు పొందాడు 
-కాన పల్లి సేవకులు విదేయించాడు - వారు దీవెన పొందారు 
- మరియా తల్లి విడియించారు - దేవుని తల్లి అయారు
- మనం విదేఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు.
 -సెరెఫాతు వితంతువు విడియించింది- నూనె సంవృద్ధిగా పొందింది.  (1 రాజు :17 :8 -16 )

మనం కూడా విధేయులై జీవిస్తే మనలోకూడా దేవుని ఆశీర్వాదాలు సంవృద్ధిగా వస్తాయి. నిరాశలో వుండే వారికి దేవుడు తనయొక్క ఓదార్పునిస్తాడు. పేతురుగారిని దేవుడు తనయొక్క సువార్తా  పనికోసమై ఎన్నుకొంటున్నారు. పేతురు దేవునితో సంభాషించే వేళలో తనయొక్క పాపపు జీవితం గుర్తుకు తెచ్చుకొని తనయొక్క అయోగ్యతను గుర్తించి నేను పాపాత్ముడను అని ఒప్పుకొంటున్నారు. పేతురు హన సంభాషణ ద్వారా తనకు దగ్గరైన కొలది తనయొక్క పాపపు జీవితం గుర్తుకుతెచ్చుకొని నన్ను వదలిపొండు అని ప్రభువుతో అంటున్నాడు.  దేవుడు అతడ్ని విడిచిపెట్టడంలేదు. మనంకూడా దేవునితో సంభాషిస్తే అయన సాన్నిధ్యం మనజీవితములో అనుభవిస్తే, మన పాపాలు గుర్తుకు వస్తాయి.మనంకూడా పశ్చాత్తాపపడతాం. పేతురుగారిని దేవుడు ఎన్నుకొని పవిత్రపరచి తనయొక్క రాజ్య స్థాపనకై నాయకుడిగా నియమిస్తున్నారు. తన వాక్యాన్ని, తన రాజ్యాన్ని స్థాపించుటకు దేవుడు సామాన్యమైన వారిని ఎన్నుకొని బలపరిచి, దీవించి వారికి కావలిసిన వరములను ఇస్తున్నాడు. అయోగ్యులైనాకూడా  వారిని తన ప్రేమతో ఎన్నుకొని వారిని నియమించిన గొప్పదేవుడు ప్రభువు. ప్రభువు.

     ఈ మూడు పఠనాల ద్వారా తెలియజేయబడిన వ్యక్తులు యెషయా, పౌలు, పేతురు గార్లు దేవునికి విధేయులై దేవుని కొరకు జీవించిన విధంగా మనం కూడా జీవించాలి.
Rev. Fr. Bala Yesu OCD

5 వ సామాన్య ఆదివారం (మూడవ సంవత్సరం )

 దైవ పిలుపు- దైవ పిలుపునకు మన స్పందన -దైవ పిలుపు ఉద్దేశం 

యోషయా 6:1-8,     1 కోరింథీ 15:1-11             లూకా 5:1-11 

ఈనాడు  తల్లి తిరుసభ 5 వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి మూడు పఠనాలు దైవ పిలుపు  గురించి ప్రస్తావిస్తున్నాయి. వీటిని వివరంగా మూడు అంశాల రూపేనా ధ్యానిస్తూ, అర్థం చేసుకొని మన జీవితాలకు అపాదించుకుందాం. 

1. దైవ పిలుపు 

2. దైవ పిలుపునకు మన స్పందన 

3. దైవ పిలుపు ఉద్దేశం 

1 . దైవ పిలుపు -

 దైవ పిలుపు  చాలా పవిత్రమైనది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క  విధంగా పిలుస్తుంటారు. దేవుని యొక్క పిలుపు మరియు ఎన్నిక మానవ మేధస్సుకు అతీతంగా వుంటుంది. దేవుడు సామాన్యులను నిరాక్షరాసులను , అయోగ్యులను , మానవ దృష్టిలో  దేనికి పనికిరారు అన్నటువంటి అతి సాధారణమైన వ్యక్తులను పిలిచి, ఎన్నుకొని, వారిని తనకు తగిన వారీగా మలిచి ,అభిషేకించి తన ప్రేషిత కార్యాన్ని వారి ద్వారా నెరవేరుస్తారు. దేవుడు అల్పులను పిలిచి అత్యదికులను చేస్తారు.  బలహీనులను పిలిచి బలవంతులను చేస్తారు. అయోగ్యులను పిలిచి యోగ్యులనుగా చేస్తారు. 

మనము పవిత్ర గ్రంధంలో  ఎంతో మందిని పిలవడం ,మరెంతో మందిని ఎన్నుకోవడం చూస్తున్నాం. ముఖ్యముగా ఈనాటి మొదటి పఠనంలో అతి సామాన్యమైన యోషయాను పిలిచి ప్రవక్తగా మలుస్తున్నారు.(యోషయా 6:8). రెండవ పఠనంలో సౌలును పౌలుగా అంటే హింసకుడిని , సువార్త సేవకై పిలిచిన దేవుడు తన సువార్త వ్యాప్తికై ఒక సాధనముగా వాడటం చూస్తున్నాం.(1 కోరింథీ 15:10-11), మరియు చేపలు పట్టువాడైన సీమోనును ప్రేరేపించి పిలిచి మనుషులు పట్టువానిగా మలచడం చూస్తున్నాం.(లూకా 5:1-11). 

 ఈరోజు అత్యల్పులమైన,  అతి సామాన్యులమైన , అయోగ్యులమైన మనందరిని ప్రభువు పేరు పెట్టి పిలుస్తున్నారు. కొందరిని తన సువార్త సేవకై  మరి కొందరిని కుటుంబ జీవితానికి పిలుస్తున్నారు. పిలువబడిన వారు వారి జీవిత అంతస్తుకు తగిన విధంగా జీవించాలి. కానీ మనం ప్రభువు పిలుపునకు స్పందిస్తున్నామా ? సరిగా స్పందిస్తే ఈ పిలుపు మన జీవితాలను మలచకలదు,  మన జీవితాలను మార్చ కలదు. మన జీవిత ఉద్దేశాలను కార్యసాధనకు చేర్చకలదు. 

2 . దైవ పిలుపునకు మన స్పందన 

దేవుడు మనలను పిలవడం ఒకెత్తయితే దానికి స్పందించడం మరొక ఎత్తు . దైవ  పిలుపునకు స్పందించడం అంటే కేవలం కాళ్ళ నడక ద్వారా దేవుని అనుసరించడం కాదు. కానీ పిలుపునకు అనుగుణంగా  మన జీవిత మార్పు ద్వారా  దేవుని అనుసరించడం. మనం దేని నుండి దేనికి పిలవబడ్డాం అని గ్రహించాలి. ఎవరి చేత పిలవబడ్డాం, అని తెలుసుకోవాలి మరియు దానికి అనుగుణంగా  స్పందించాలి. అంటే 

1. మన పాపపు స్తితిని గ్రహించాలి: -నేను హా !చేడితిని కదా ! నా నోటి నుండి వెలువడునవన్నియు  అపవిత్రమైన మాటలే.  అపవిత్రమైన మాటలు పల్కు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. అని యోషయా ప్రవక్త తన పాపపు స్థితిని గ్రహించాడు. (యోషయా 6:5). ఏలయన అపోస్తులందరిలో  నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులుడని  పిలువబడుటకు నేను అయోగ్యుడను" అని పౌలు తన జీవిత స్థితిని  గ్రహించాడు. (1 కోరింథీ 15:9).  ప్రభూ ! నేను పాపాత్ముడను నన్ను విడిచి పొండు అని పేతురు గారు కూడా తన పాప స్థితిని గ్రహించారు.(లూకా 5:8). ఈనాడు నీవు నేను కూడా మన పాపపు స్థితిని గ్రహించాలి.

 2. పాపాన్ని విడిచి పెట్టాలి :- పాపాపు స్థితిని గ్రహించడమే కాదు . పాపాన్ని పరి పూర్తిగా విడిచిపెట్టాలి. మన జీవితాన్ని పవిత్రీకరించమని దేవుని అర్థించాలి. మనము పాప కార్యముల నుండి వైదొలగి నూత్న హృదయమును,నూతన మనస్సును పొందాలి. ఎవడు చనిపోవుట వలన  ప్రభువునకు సంతోషం కలగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు. ఇది యావే ప్రభు వాక్కు. యోహేజ్కేలు 18:31-32. 

3. మనలని మనం దేవుని చిత్తానికి అప్పగించాలి:-  దౌర్జన్యమునకు సాధనముగా మీ శరీరములందు ఏ అవయములను పాపమునకు అర్పింపకుడు. అంతేగాక , మృత్యువు నుండి జీవమునకు కొనిరాబడినవారుగా మిమ్ము మీరు దేవునికి  అర్పించుకొనుడు. మీ శరీరమునందలి అవయములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించుకొనుడు. (రోమి 6:13). దేవుని  పిలుపునందుకున్న మనమందరము దేవునికి మనలను మనం సంపూర్ణముగా అప్పగించుకోవాలి. అంటే దేవుని చిత్తమే మన చిత్తం కావాలి. దేవుని చిత్తానుసారంగా ఆలోచించాలి, మాట్లాడాలి, కార్యాలు చేయాలి. ఈ విధంగా దేవుని పిలుపునకు  స్పందిస్తే దేవుని అనుగ్రహాలను పొందగలము, ఆ అనుగ్రహాలకు సాధనాలుగా మారగలము. 

3. దేవుని పిలుపు  యొక్క ఉద్దేశము

  దేవుడు  తన ప్రజలను ఓ గొప్ప ఉద్దేశంతో పిలిచి వారిని పవిత్రులుగా , నిర్దోషులుగా  చేస్తారు. (ఏపేసి 1:4) పవిత్రులుగా , నిర్దోషులుగా మలచబడినవారు, దైవ పిలుపు ఉద్దేశమైన సువార్త వ్యాప్తిద్వారా ఇతరులను పవిత్రులుగా, నిర్దోషులుగా  తయారుచేయాలి. ఈ ప్రేషిత కార్యం కొరకై మనము ప్రభుని సొంత ప్రజలుగా ఎన్నుకోబడతాము. (ద్వీతి14:2 ), అదే యోషయా  ప్రవక్త (6:8) , పౌలు గారు (1 కోరింథీ 15:10) మరియు పెతురు (లూకా 5:10 ) వీరి జీవితాలలో జరగడం   ఈనాటి పఠనాలలోమనం చూస్తున్నాం . 

దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క జీవిత శైలికి పిలిచియున్నారు. కొంతమందిని సువార్త  వ్యాప్తికై , మరి కొంత మందిని భర్తలుగా, భార్యలుగా , పిల్లలుగా మరియు ఇతర జీవిత శైలికి పిలిచారు. ప్రతి ఒక్కరు వారి జీవిత అంతస్తుకు తగిన విధంగా జీవించాలి. ఆ విధంగా జీవించాలంటే మనకు కావల్సిన మొట్ట మొదటి  ఆయుధం విశ్వాసం. విశ్వాసం లేకపోతే దైవ పిలుపు యొక్క ఉద్దేశం నెరవేర్చలేము. పునీత పౌలుగారు ఈనాటి రెండవ పఠనములో చాలా చక్కగా చెప్తున్నారు. "మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప ,నేను మీకు భోదిం చిన విధంగా మీరు దానిని గట్టిగా అంటి పెట్టుకొని ఉంటిరేని , మీరు రక్షింపబడుదురు." (1 కోరింథీ 15:2). పేతురు గారు ప్రభువు మాట యందు విశ్వాసించాడు, వల చినుగునన్ని చేపలు పట్టగలిగాడు. లూకా 5:6 . మనము కూడా విశ్వసించాలి, ప్రభువునకు ప్రార్ధించాలి. తద్వారా మన విశ్వాసాన్ని  బలపరచుకోవాలి. మన జీవితాలలో ప్రభువు కార్యాలను చవి చూడాలి. 

రెండవది ప్రేమ. యోహను 3:16 . 15:12. ప్రభువు కాపరికి అప్పగించిన తన మందను , కుటుంబ పెద్ద సభ్యులను ఎటువంటి పక్షపాతం లేకుండా అందరిని సమానంగా  ప్రేమించాలి. ప్రేమ అనే ఆయుధం ద్వార పరలోకాన్ని భూలోకంలోనే సృజించవచ్చు. ఎప్పుడైతే కాపరులు తమ స్వార్ధనికి ,ఆనందాలకు, ఇహలోక జీవిత శ్రేయస్సుకు, వస్తువులకు మరణించి, తన ఆలోచనలను, శక్తిని మాటలను మరియు కార్యాలను  దైవ చిత్తానికి  దైవ రాజ్య  వ్యాప్తి ఉపయోగార్దం జన్మిస్తారో. అప్పుడు  ప్రేమ ద్వార ఇహలోక  జీవియతం పరలోక జీవితంగా మారుతుంది. 

మూడవ ఆయుధం ఓర్పు , సహనం. ఈ సద్గుణాలు ఉన్నటువంటి వారు ఎటువంటి బేరుకు లేకుండా  దేవునితో నడవగలరు. సంఘంలో  కుటుంబంలో  ప్రజలందరు ఒకే విధంగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క  తీరుతో  ప్రవర్తిస్తుంటారు. కానీ దైవ పిలుపు స్వీకరించిన మనం  ఓర్పు సహనం కలిగి అందరిని ఒక తాటిపై  నడిపించగలగాలి. ఇది దేవునితో మనం ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు లేనప్పుడు పేతురుగారు ఒక్క చేపనైన పట్టలేక పొయ్యాడు. కాని దేవుడు తనతో ఉన్నప్పుడు వల చినిగే చేపలను పట్టగలిగాడు. (లూకా 5:5,6 ), దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలలో కూడా ఎటువంటి కొరతలు ఉండవు. అన్నీ సమృద్దిగా ఒసగపడుతాయి. 

ఏ విధంగా దైవ పిలుపు అందుకున్న కుటుంబ అంతస్తుకు చెందినవారు సువార్తను భోధించగలరు ? దివ్య వాక్కు  వినడం, పఠించడం, పాటించడం ద్వారా. దైవ వాక్కు మన జీవితాలకు  ఆధ్యాత్మిక  భోజనం. భోజనం భుజింపకపోతే ఏ విధంగా  భౌతిక ఆరోగ్యాన్ని కోల్పోతాము. అధేవిధంగా ఆధ్యాత్మిక భోజనం  అయినటువంటి దేవుని వాక్యం పఠించక,వినక, పాటించక పోయిన ఆధ్యాత్మిక అనుగ్రహాలను కోల్పోతాము. కాబట్టి దేవుని వాక్యం చదువుదాం , విందాం, ఆచరిదాం. తద్వారా  దైవ పిలుపును గ్రహించి , ఆ పిలుపునకు సరిగ్గా స్పందించి, ఆ పిలుపును జీవిస్తూ ముందుకు సాగుదాం. ఆమెన్ 

 Br. Sunil Inturi  OCD

   


పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...