29, అక్టోబర్ 2022, శనివారం

31 వ సామాన్య ఆదివారం

 31 వ సామాన్య ఆదివారం

సో. జ్ఞా. 11:22-12:2,  2 తెస్స 1:11-2:2 ,  లూకా 19:1-10

 ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క అనంతమైన ప్రేమ గురించి తెలుపుచున్నవి. పాపులను రక్షించుటకు దేవుడు ఎప్పుడు సిద్ధంగా వుంటారు. దేవునిమన్నింపు  పొందినమనము హృదయ పరివర్తన చెంది జీవించాలి.

జక్కయ్య మారుమనసు పొందుట

యేసుప్రభు రోజు సువిశేషంలో జక్కయ్య యొక్క జీవితంను పరిశీలించుటకు వచ్చారు. సువిశేషంలో ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం ఒకరు రక్షించాలి అని అనుకునేవారు, ఇంకొకరు రక్షణ పొందాలని అనుకునేవారు.

జక్కయ్యలోని రక్షణ పొందాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. యేసుప్రభువు యెరికో పట్టనంలోకి ప్రవేశిస్తారని గ్రహించిన వ్యక్తి ప్రభువును కలవటానికి వస్తున్నారు. దేవుడు వస్తున్నారని వారి ఇంటి గుండా పోతున్నారని తెలుసుకున్న వ్యక్తి చూడటానికి వస్తున్నారు. దేవుడు మన ఇంటిలోకి కూడా వచ్చే సమయాలు మన సంఘంలోనికి వచ్చే సమయాలు చాలా ఉన్నాయి. మన గ్రామంలో ప్రార్థన పెట్టినప్పుడు మైకు తీసుకొని చెబుతారు ఫాదర్ వచ్చారు పూజకు రావాలి అని.  ఎంతమంది ఇలాగ ప్రార్థనకు వస్తున్నాం. జక్కయ్యకు అవకాశం వచ్చింది. ప్రభువు అటు వెళ్తున్నారని తెలుకున్న ఆయన   వచ్చిన అవకాశము సద్వినియోగం చేసుకున్నారు.యేసుప్రభువు గెన్నేసరేతు ప్రాంతమునకు వెళ్ళినప్పుడు కూడా అక్కడికి రోగులను తీసుకొని వచ్చారు- మార్కు 6:55-56.

గ్రుడ్డివాడు ప్రజల కేకలను వింటున్నారు, యేసుప్రభు అటుగా వస్తున్నారని తెలుసుకున్నాడు అందుకే బిగ్గరగా అరుస్తున్నారు(లూకా 18:37,38. మార్కు 10: 46-52 -బర్తిమయి యేరికోలో చూపు పొందుట). దేవుడు వారి మార్గం గుండా పోతున్నారని వారు తెలుసుకున్నారు అందుకే దేవుడిని   కలవాలని వెళ్ళుచున్నారు. సువిశేషం గురించి ధ్యానించే ముందు యెరికో నగరం గురించి తెలుసుకోవాలి. యెరికో పట్టనం ఒక సంపద కలిగిన ప్రదేశం, వనరులు ఎక్కువగా ఉండే స్థలం.  రోము నగరస్తులు వర్తకానికి వచ్చేవారు. అక్కడ అధిక సంపదలు ఉంటాయి కాబట్టి సొమ్ము చేసుకోవడానికి రోము నగరస్తులు వస్తారు. డబ్బు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి జక్కయ్య కూడా అధికంగా సుంకం వసూలు చేసేవారు. జక్కయ్య డబ్బు సంపాదించుటలో ఒక గొప్ప స్థాయికి ఎదిగాడు కానీ దైవ ప్రేమను పొందుటలో సోదర ప్రేమను పంచుటలో ఆయన ఎదగలేకపోయారు.ఆయన సంపాదనలైయితే పెరిగాయి కానీ స్నేహితులు పెరగలేదు. ఆయనను అందరూ ద్వేషించారు ఎందుకంటే ఎక్కువగా సుంకం వసూలు చేసేవారు కొంత రోమాను చక్రవర్తులకు కొంత తన సొంత లాభానికి . ద్వేషించబడే వ్యక్తి సంఘంలో జీవించుట చాలా కష్టం అయినా జక్కయ్య నివసిస్తున్నారు. సువిశేష పఠనంలో మూడు ముఖ్యమైన స్థాయిలు ఉన్నాయి.

1. ఆయన ధనికుడు: ధనం ఉంది కానీ సంతోషం లేదు (లూకా 12: 16-21). ధనం ఉన్న వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండలేరు. డబ్బు పెట్టి double cot ను కొనవచ్చు కానీ నిద్ర నువ్వు కొనలేము. డబ్బు పెట్టి బిర్యానీ కొనవచ్చు కానీ ఆకలిని కొనలేము. డబ్బు పెట్టి వస్తువులను కొనవచ్చు కానీ సంతోషాన్ని కొనలేము. డబ్బుతో అంతా మనము కొనలేం. జక్కయ్య ధనమే సర్వం అనుకొని ధనంకు తన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చి ధనం దగ్గరే ఉన్నాడు. నీ సంపద ఉన్న చోటనే నీ హృదయం ఉండును.- మత్తయి 6:21.

జక్కయ్యకు దేవుడిచ్చిన స్వేచ్ఛ వలన ఆయన ఎన్నుకుంటున్నారు తన యొక్క పాపపు జీవితాన్ని. అన్యాయపు మార్గము వలన ఆయన ప్రజలను కోల్పోతున్నారు. మనం ఎలా ఉండాలన్నా మనమే నిర్ణయం తీసుకుంటాం.

- పవిత్రంగా ఉండాలి- పాపిగా ఉండాలి

- మంచి కోడలిగా- మంచి భార్యగా

- తండ్రిగా - భర్తగా

- బిడ్డగా - కూతురిగా

అని మనకు ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి మన మార్గం ఎన్నుకొంటాం. యూరప్ ఖండంలో 15 సంవత్సరాలు వస్తే వారి దారి వారే చూసుకోవాలి ఎందుకంటే ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను బట్టి. ఆదాముకు ఇవ్వబడిన స్వేచ్ఛలో ఆయన తన మార్గం ఎన్నుకొన్నారు, పండు తిన్నారు -ఆది 3:6. శిష్యులకు కూడా స్వేచ్ఛ ఇవ్వబడింది యేసుప్రభువు దివ్య సత్ప్రసాదం గురించి చెప్పినప్పుడు అయితే మార్గం ఎన్నుకునేది స్వేచ్ఛ వలన- యోహాను 24:15,16. మనం కూడా మంచి మార్గాన్ని ఎన్నుకుంటే మన జీవితాలు ఫలప్రదంగా ఉంటాయి. జక్కయ్య ప్రభువు గురించి విన్నారు, వినుట వలన విశ్వాసం వచ్చింది- రోమీ 10:17. మనం కూడా వింటాం మంచి మాటలు అయితే అందరితో కలిసి పోతాం. ప్రసంగం చెప్పే వాళ్ల గురించి వింటే గుడికి వస్తాం. యేసుప్రభువు పాపుల యొక్క స్నేహితుడని విన్నారు అందుకే ఆయనను కలవాలని అనుకున్నారు- మత్తయి 11:16-19.

2. యేసు ప్రభువును చూడాలని కోరిక, నిర్ణయం.

ఒక్కసారి దేవుని గురించి విన్న తరువాత ఆయనను చూడాలని కోరిక ఆయనలో కలిగింది. మనలో కూడా దేవుని చూడాలని కోరిక ఉండాలి. కోరిక ఉంటే చదవగలం. పవిత్ర గ్రంథంలో కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం:  రక్తస్రావంతో బాధపడే స్త్రీ. ప్రభు అంగీని తాకాలని కోరిక వచ్చింది తాకుతుంది. రోగులు స్వస్థత పొందాలని కోరికతో వచ్చారు పొందుతున్నారు. కోరిక ఉంటే చాలదు దానికోసం ప్రయత్నించాలి. జక్కయ్య ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి. సమాజంలో అన్యాయం చేసే వ్యక్తిని ఎవరు ఇష్టపడరు. తనను ఏమనుకున్నా పర్వాలేదు అని అనుకున్నాడు, కొట్టిన తిట్టిన ఏమి చేసినా సరే. కొన్నిసార్లు మనం సమాజంలో ఉన్నప్పుడు భయపడతాం. గుడికి వెళ్లాలన్నా, ప్రార్థన బయటకు చెప్పాలన్నా, దివ్య సత్ప్రసాదం తీసుకోవాలన్నా, కానీ జక్కయ్యలో మాత్రం దేవుని కలవాలనే కోరిక చాలా ధృడంగా ఉండిపోయింది. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు అంటున్నారు ప్రతి ఒక్కరం ధృడ సంకల్పం కలిగి ఉండాలి, ఎటువంటి వాటికి వెనుదీయక మనం అనుకున్నదానిలో ముందుకు సాగిపోవాలి. మనం కూడా ఇలాగే ఉండాలి.

3. జక్కయ్య తాను ఇక నుండి ఒక కొత్త వ్యక్తి అని సమాజానికి చూపించారు అంటే తాను మారుమనస్సు పొందానని చెప్పాడు.

 యేసుప్రభుతో ఉంటే మన జీవితాలు మారతాయి.

శిష్యులు- మార్కు 3:14.

వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ- యోహాను 7:53–8:11

సౌలు ధమస్కు వెళ్లే మార్గంలో- అపో 9:1….

జక్కయ్యకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు. యేసుప్రభువును కలిసినప్పుడు మనలో కూడా మార్పు రావాలి. అప్పుడే ఆయన యొక్క రాకడకు అర్థం ఉంటుంది. ప్రభువు మనతో ఉండాలి అంటే మనం కూడ మన జీవితంలో క్రిందికి దిగి రావాలి.

ఎక్కడి నుంచి క్రిందకు రావాలి?

1. మూఢనమ్మకాలు

2. పాపం నుండి

3. గర్వం నుండి

4. చెడు వ్యసనాల నుండి

5. కోపం, ద్వేషం, పగల నుండి

6. ఆస్తులు అంతస్థుల నుండి

అలా ఉంటేనే దేవుడు నీతో ఉంటారు నాతో ఉంటారు. మనం కూడా తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవిస్తేనే దీవెనలు ఎక్కువగా వస్తాయి. అవకాశం ఒక్కసారే వస్తుంది వచ్చినప్పుడు జీవితాలను మార్చుకోవాలి.


BY. FR. BALAYESU OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...