9, ఏప్రిల్ 2022, శనివారం

మ్రాని కొమ్మల ఆదివారం

 యేసు ప్రభువు తన యొక్క వైభవాన్ని పబ్లిగ్గా చాటడానికి అంగీకరించిన రోజు. యేసు ప్రభువు మరణానికి ఒక జాతి కాకుండా , మానవ జాతి అంతా బాధ్యత వహించింది. 

క్రీస్తు నాధునియందు ప్రియ దేవుని బిడ్డలారా మరియు క్రైస్తవ విశ్వాసులారా, ఈనాడు తల్లి శ్రీ సభ మ్రాని కొమ్మల ఆదివారం కొనియాడుతుంది. మ్రాని కొమ్మల ఆదివారం నాడు యేసు క్రీస్తు ఒక గొప్ప రాజుగా బేతానియ  నుండి యెరుషలేము దేవాలయంలోనికి ప్రవేశించటం. అదే విధంగా ఈ రోజు నుండి యేసు ప్రభువు జీవితంలో కష్టాలు మరియు  శ్రమలు ప్రారంభం అవుతాయి.  

ఈ రోజున మూడు పఠనాలు కూడా శ్రమలన్నీటిని,  ప్రేమతో ఎలా స్వీకరించటమో చూస్తున్నాము. 

మొదటి పఠనములో  యోషయా ప్రవక్త తెలియచేస్తున్నాడు, సేవకుడు అంటే, దేవుని సేవకుడు శ్రమలన్నీటిని కూడా ప్రేమతో ఇతరుల కోసం అనుభవించటం మనము గమనిస్తున్నాము. సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు మనందరి రక్షణ కొరకై తనను తాను బలివస్తువుగా సీలువపై సమర్పించుటను గురించి చూస్తున్నాము. రెండవ పఠనంలో  పిలిప్పీయులకు వ్రాసినటువంటి లేఖలో  క్రీస్తు ప్రభువు మానవుల రక్షనార్ధమై తనను తాను తగ్గింపు తనముతో ఆ సీలువపై మనస్పూర్తిగా అంగీకరించి, మనందరి కొరకై బలిగా సమర్పించుకున్నారు. అని పునీత పౌలుగారుఅంటున్నారు.  

మొదటి పఠనం 

సేవకుని యొక్క జీవితం : 

సేవకుడు అందరికి ఒ సేవకుని వలె జీవించాలి. అంటే తగ్గింపు తనముతో జీవించాలి. దీనిని  క్రీస్తు ప్రభువు జీవితంలో చూస్తున్నాము. తనను తాను తగ్గించుకొని , ఒక సేవకుని వలె తనను తాను సీలువపై బలిగా మానవులందరి కొరకు సమర్పించుకున్నాడు.  . అలాగే మనం జీవించాలి. 

సేవకుని జీవితంలో కష్టాలు, సుఖాలు 

: మనం ఎప్పుడైతే సేవకుని వలె జీవిస్తామో అప్పుడే మన యొక్క జీవితంలో కష్టాలు, సుఖాలు సంభవిస్తాయని యోషయా ప్రవక్త తన యొక్క జీవితం ద్వారా  తెలియజేస్తున్నాడు. 50:5-7. 

ఈ యొక్క సేవకుడుతగ్గింపు  జీవితం జీవించాలి : జీవితంలో ఎన్ని ఇబ్బందులు కష్టాలు, శ్రమలు వచ్చిన కూడా తగ్గింపు జీవితం జీవించాలని యోషయా ప్రవక్త , క్రీస్తు శిష్యులు  మరియు క్రైస్తవులందరు కూడా తమ యొక్క జీవితం ద్వారా చూపిస్తున్నారు. 

అలా జీవించాలంటే సేవకుడు ఏమి చేయాలి :

 ఈ యొక్క తగ్గింపు జీవితం జీవించాలంటే సేవకుడు అనేవాడు యజమాని యొక్క అడుగుజాడల్లో నడవాలి అంటే క్రైస్తవులమైన మనమందరం కూడా క్రీస్తు యొక్క అడుగుజాడలలో నడవాలి. ఏవిధంగానైతే యోషయా ప్రవక్త  మరియు క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని మాటలను అనుసరించి జీవించారో అదే విధంగా మనమందరం కూడా జీవించాలి. 

సేవకునిగా జీవించడం ద్వార వచ్చే లాభాలు :

 క్రైస్తవులమైన  మనం సేవకునిగా జీవించడం ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశం పొందుతాం. మరియు ఇతరులకు ఒక గొప్ప ఉదాహరణగా ఉంటాము. ఈ ఐదు అంశాలను  ఈనాటి మొదటి పఠనంలో యోషయా  యొక్క జీవితం ద్వారా చూస్తున్నాము. యోషయా మరియు క్రీస్తు ఏ విధంగా జీవించారో  తమ యొక్క జీవితాలను ఇతరుల కొరకు ధార పోసి అనేకమైనటువంటి బాధలను, ఇబ్బందులను అవమానములను పొంది మన యొక్క జీవితాలకు  ఒక గొప్ప మేలుగా మరియు  మార్గధర్శులుగా ఉన్నారు. అధేవిధంగా  మనమందరం వారి ఇద్దరి వలే  జీవించాలని మొదటి పఠనం మనకు తెలియచేస్తుంది. 

రెండవ పఠనం 

రెండవ పఠనములో పునీత పౌలు గారు క్రీస్తు మొక్క వినయము , ఆ యొక్క వినయము ద్వారా పొందినటువంటి అత్యున్నత స్థానము గురించి తెలియజేస్తున్నాడు. ఎందుకంటె క్రీస్తు ప్రభువు దేవుని యొక్క బిడ్డ అయినకాని  తనను తాను తగ్గించుకొని ఒక సేవకుని వలె మానవ రూపం దాల్చి ఈ యొక్క  లోకంలో ఉన్నటువంటి పాపాత్ములమైన  మనందరి కొరకు ఈ భూలోకంలోనికి వచ్చి యున్నారు. 

ఏ విధంగానైతే మొదటి పఠనములో యోషయా ప్రవక్త జీవితం గురించి చూసియున్నామో అదే విధంగా పౌలుగారు క్రీస్తు యొక్క జీవితం గురించి పిలిప్పు ప్రజలకి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క యోషయా ప్రవక్త మరియు పౌలుగారు ఇద్దరు కూడా దేవుని చేత ఎన్నుకోబడినవారు . అంతే కాకుండా దేవుని యొక్క మాటలను తు. చ తప్పకుండా వారి యొక్క జీవితంలో జీవించి యున్నారు. 

వీరు ఇద్దరు కూడా ఈ రెండు పఠనాలలో క్రీస్తు యొక్క జీవితం గురించి ప్రస్తావించడం మనకందరికీ కూడా ఆశ్చర్యం. ఎందుకంటే యోషయా 50:6 వ వచనంలో చూస్తున్నాము. నన్ను మోదువారికి నా వీపును అప్పగించితిని, నా మొగము మీద ఉమ్మి వేసినప్పుడు నేనూరకుంటిని, నన్ను అవమానించుచుండగా నేనురకుంటిని, ఇది అంతా కూడా క్రీస్తు యొక్క జీవితంలో అక్షరాల  నెరవేరింది. ఎందుకంటే పిలిప్పీ 2:8 వ వచనంలో చూస్తున్నాము, క్రీస్తు  మరణము వరకు , సిలువ మరణము వరకు విధేయుడయి జీవించేను. 

అందుకే పునీత పౌలుగారు అంటున్నారు. క్రీస్తు ఏ విధంగానైతే  వినయవంతుడై  జీవించాడో ఆ యొక్క జీవితం ద్వారా అత్యున్నత స్థానాన్ని  పొందియున్నాడు. అదేవిధంగా  క్రైస్తవులమైన మనం  క్రీస్తు యొక్క అడుగుజాడలలో నడుస్తూ, క్రీస్తు యొక్క వినయము మనకందరికీ రావాలని , ఒక తగ్గింపు జీవితం జీవించాలని  ఈనాటి రెండవ పఠనం తెలియజేస్తుంది. 

సువిశేష పఠనం 

సువిశేష పఠనంలో లూకా సువార్తికుడు  క్రీస్తు ఏ విధంగా శ్రమలను అనుభవించాడు, ఆ యొక్క శ్రమల ద్వారా మానవులకు  ఏ విధంగా  రక్షణ కలిగిందో తెలియజేస్తున్నాడు.  ఈ యొక్క లూకా సువార్తికుడు తన యొక్క సువార్తను అన్యుల కోసం రాశారు. ఎందుకంటే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చింది కేవలం యూదుల కోసం మాత్రమేకాదు,  సర్వమానవాళి కోసం వచ్చారు అని లూకా గారు వివరించారు. తండ్రి అయిన దేవుని దయ , ప్రేమ , పాప మన్నింపు అన్నవి పవిత్ర   గ్రంధంలో ప్రధానాంశాలు. అటువంటి దేవుని సిలువ వేయటం మనం చూస్తున్నాం. 

యేసు యొక్క సొంత ప్రజలే ఆయన్ను తృణీకరించి ఆయనను మట్టుపెట్టాలనుకున్నారు, అంటే క్రీస్తు యొక్క రూపంలో వచ్చినటువంటి రక్షణను త్యజించారు. మరియు తృణీకరించారు. యేసుని సిలువ వేయుడు అని ఒక్కటిగా డిమాండు చేశారు పిలాతుని.  వారి బెదిరింపులుకు బయపడినటువంటి పిలాతు క్రీస్తుకు సిలువ మరణంను  ఆమోదించాడు. 

ప్రభువైన క్రీస్తు మానవుని యొక్క రక్షనార్ధం కొరకై ఆ యొక్క సిలువ మరణంను అంగీకరించాడు. మరియు మానవుల యొక్క పాప పరిహారమునకై ఆ యొక్క సీలువను మనస్పూర్తిగా అంగీకరించాడు. ఏ విధంగానైతే  క్రీస్తు మన యొక్క జీవితాలకు రక్షణ కల్పించాడో  అదే విధంగా  మనమందరము కూడా ఇతరులకు మన యొక్క ప్రార్దన జీవితం  ద్వారా రక్షణ కల్పించాలని ఈనాటి సువిశేష పఠనం  ,మరియు  రెండు పఠనాలు  కూడా మనలను ఆహ్వానిస్తున్నాయి. 

Br. Johannes OCD

తపస్సుకాల 6 వ ఆదివారం, మ్రాని కొమ్మల ఆదివారం

 మ్రాని కొమ్మల ఆదివారం 

 యోషయా 50: 4-7, పిలిప్పీ 2: 6-11 లూకా 19:28-40, 22:14-23:56 

ఈ రోజు తల్లి శ్రీ సభ  మ్రాని కొమ్మల ఆదివారం కొనియాడుచున్నది. దీనినే  క్రీస్తు పాటుల ఆదివారం అని కూడా పిలుస్తారు. 

ప్రతి ఒక్కరి జీవితంలో సంతోష సమయాలు కొన్ని ఉంటాయి. ఈ మ్రాని కొమ్మల రోజు కూడా  ప్రభువు యొక్క జీవితంలో  ప్రత్యేకమైనది, సంతోష కరమైనది ఎందుకంటే ప్రజలు ఆయన్ను రాజుగా  గుర్తించి హోసన్న పాడారు. 

ప్రతి ఒక్కరి సంతోషాన్ని అనుభవించినట్లే తరచుగా దుః ఖాన్ని కూడా పొందుతుంటాం. విచారం కలిగినట్లే ఆనందం కూడా కలుగుతుంది. 

ఈరోజు మనందరం పవిత్ర వారంలోకి అడుగుపెడుతున్నాం. మన యొక్క రక్షణ సంఘటనలు ధ్యానించుకోబోతున్నాం. 

యేసు ప్రభువు యొక్క రక్షణ ఘట్టాలను ధ్యానించుకోబోతున్నాం. ఆయన యొక్క శిలువ , శ్రమలు, మరణం పునరుత్థానం అధే విధంగా క్రీస్తుతో మన మరణ, పునరుత్థనాలు కూడా ధ్యానించుకోవాలి. 

ఈ పవిత్ర వారం యొక్క ఘట్టాలు మనం శ్రద్దగా ధ్యానిస్తే మనకు దేవునితో ఉన్న సంబంధం పెరుగుతుంది. దేవునిలో ఉన్న విశ్వాసం పెరుగుతుంది. దేవుని పట్ల ప్రేమ పెరుగుతుంది మనలో కూడా హృదయ పరివర్తనం కాలుగుతుంది. 

ప్రభువు నా కోసమే మరణించారు అనే ఆలోచన మన జీవితాలను మార్చుతుంది. 

ఈ మ్రాని కొమ్మల ఆదివారం నాడున రెండు ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

1. ఆయన మహిమ సంఘటన 

2. ఆయన శ్రమల సంఘటన 

మహిమ సంఘటన ఏమనగా ప్రజలు ప్రభువును రాజుగా గుర్తించి ఆయన్ను యెరుషలేముకు ప్రేమతో ఆహ్వానించారు. శ్రమలు సంఘటన ఏమనగా ప్రభువును ద్రోహిగా నిందించి ఆయన్ను శిలువ వేయుటకు పన్నాగం చేయుట. 

ఒకటి సంతోషకరమైనది రెండవది బాధాకరమైనది. మన శరీరంలో రక్తం నీరు ఎలాగైతే కలసి వుంటాయో మన యొక్క జీవితంలో కూడా బాధ , సంతోషం కలసి ఉంటాయి. 

ఈరోజు మ్రానికొమ్మలతో ప్రదక్షణలో  వచ్చే సమయంలో ఒక సువిశేష భాగం చదువుతాం, పూజలో శ్రమల వృత్తాంతం చదువుతాం. 

యేసు ప్రభువు అనేక సార్లు యెరుషలేము వెళ్లారు కానీ అన్ని సార్లు అంత గొప్ప ఆహ్వానం ఇవ్వలేదు. కేవలం ఈరోజు మాత్రమే వారు గుర్తిస్తున్నారు. 

యేసు ప్రభువు పేదవారి పట్ల పోరాడిన విధానం ప్రజల్లో ఒక నమ్మకం కలుగజేసింది. ఇతడు మా కోసం జీవిస్తాడు. ఆధికార బంధముల నుండి మమ్మల్ని  విడిపిస్తాడు అనే ఆలోచన నమ్మకం వారిలో కలిగింది. 

ఈనాటి మొదటి పఠనంలో బాధామయ సేవకుని యొక్క జీవితం గురించి చదువుకున్నాం. 

యోషయా గ్రంధంలో 40-55 ఆధ్యాయాలలో నాలుగు బాధామయ సేవకుని గీతాలు మనం వింటున్నాం. 

ఈనాటి మొదటి పఠనంలో 3 వ గీతం గురించి చదువుతున్నాం. క్రీస్తు పూర్వం 7 వ శతాబ్దంలో దేవుడు యోషయాను ప్రవక్తగా నియమించారు. 

సోలోమోను రాజు తరువాత యిస్రాయేలు రెండుగా విభజించబడింది. ప్రతి ఒక్క రాజ్యంకు వారివారి ప్రవక్తలు, నాయకులు, మత పెద్దలు ఉండేవారు. 

యోషయా ప్రవక్త యెరుషలేములో పని చేసిన ప్రవక్త. ఆయన అనేక మంది రాజులకు దేవుని యొక్క ప్రవచనాలు తెలిపారు. 

ఆయన కాలంలో అస్సిరియులు యిస్రాయేలును నాశనం చేసిన దానిని ఆయన కనులారా చూశాడు. అప్పుడు హేజ్కియా రాజును లొంగిపోవద్దు అని తెలిపాడు. దేవునికి ప్రార్ధించి ముప్పు తొలగించాడు. 

యోషయా ప్రవక్త ఈ సేవకుని యొక్క గీతము వ్రాసేటప్పుడు ఆయన మనస్సులో ఉన్నది ఇద్దరు వ్యక్తులు 

1. యిస్రాయేలు ప్రజలు - ఎన్నుకోబడిన ప్రజలు 

2. మెస్సయ్య 

మెస్సయ్య తాను అందరి కోసం శ్రమలు అనుభవించి మరణిస్తారని ముందుగానే ప్రవక్త ప్రవచించారు. అందుకే అంటారు ప్రవక్తల ప్రవచనాలు నిజమేనని.  

యిస్రాయేలు ప్రజలు కూడా తమ యొక్క జీవితంలో సేవకుల  వలె బానిసత్వంలో అనేక శ్రమలు అనుభవించారు. 

మరి ముఖ్యంగా బాధామయ సేవకుని జీవితం మెస్సయ్యా గురించి ఉద్దేశించబడినది. 

ఈనాటి మొదటి పఠనంలో రెండు భాగాలు ఉన్నాయి. 

1. సేవకునికి అప్పజెప్పిన బాధ్యత 

2. సేవకుని యొక్క త్యాగ జీవితం 

సేవకునికి అప్పజెప్పిన  బాధ్యత ఏమిటంటే ప్రకటించుట , బోధించుట.దేవుని యొక్క రాజ్యం గురించి , దేవుని ప్రేమ గురించి, ఆయన క్షమ గురించి ప్రకటించే శక్తిని దయ చేశారు. ఆయన అలసిపోయిన వారికి ఓదార్పు దయ చేస్తారు. మత్తయి 11:28. 

బాధలలో, కష్టాలలో, నిరాశలో, జీవితంలో అన్ని సమస్యలు పడేవారిని దేవుడు ఈ సేవకుని ద్వారా  ఓదార్చుచున్నారు. 

సహాయం లేనివారికి ఒక సహాయంగా ఉండుటకు ఎన్నుకొన బడినవాడు, ప్రేమ లేని వారికి ప్రేమను పంచుటకు ఎన్నుకొనబడినవాడు, జీవితంలో ఆశలు కోల్పోయినవారికి ధైర్యం ఇచ్చుటకు ఈ సేవకుడు ఓదార్పును దయ చేస్తాడు. 

సేవకుడు తన జీవితంలో  దేవునికి ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చి యున్నారు. హెబ్రీ 10:7, హేబ్రి 5:8 

ఆయన మరణం వరకు తండ్రికి అడ్డు చెప్పలేదు. పిలిప్పీ 2:8 ఆయన మాటను ఎల్లప్పుడు నెరవేర్చారు. తనకు అప్పజెప్పిన పరిచర్య బాధ్యత సక్రమంగా నెరవేర్చాడు ఈ సేవకుడు. 

రెండవ భాగంలో తన యొక్క సేవక బాధ్యతలు నెరవేర్చుటలో ఈ సేవకుడు ఎంతగానో శ్రమలను అనుభవించాడు, నిందలు భరించాడు. 

ఆయనను మోదు వారికి వీపును అప్పగించారు అని 6 వ వచనంలో చెప్పబడింది. అంటే ఎన్ని దెబ్బలైనా భరించడానికి తనను తాను సమర్పించుకున్నారు. ఆయన ఎవరికి ఎదురు చెప్పలేదు. మౌనంగా భరించాడు. 

ఆయన గడ్డపు వెంట్రుకలు లాగేసారు, ఉమ్మి వేశారు, అవమానించారు. ఇవన్నీ కూడా భరించడానికి కష్టం అయినా భరిస్తున్నారు. ఇది కేవలం ప్రేమ వలనే సాధ్యం. ప్రేమ సమస్తమును భరించును. 1 కోరింథీ 13:7. యేసు ప్రభువు జీవితంలో ఇవన్నీ జరిగాయి. ఆయన వస్త్రములు లాగారు. యోహను 19:23. ఆయన మొహం  మీద ఉమ్మి వేశారు. మత్తయి 26:67 . ఆయన్ను కొరడాలతో కొట్టారు. మార్కు 15:15 , యోహను 19:1 

ఇన్ని రకాలైన  అవమానాలు తాను ఎదుర్కొన్నప్పటికి ఆయన క్రుంగిపోలేదు, పారి పోలేదు అన్ని సహనంతో భరించాడు. ఇంత బాధలు పొంది వాటిని భరించాలంటే నిజంగా దైవ శక్తి మనకు అవసరం. 

బాధమయ సేవకుడు  తండ్రి మీద ఉన్న గాఢమైన ప్రేమ  వలన అధే విధంగా తన ప్రజలను కాపాడాలనే ఉద్దేశం వలన ఎంతో బాధను భరించాడు. 

ఒక  క్రోవోత్తి తాను కరుగుతూ ఎలాగైతే ఇతరులకు వెలుగునిస్తుందో అధే విధంగా ఈ సేవకుడు తన జీవితం, ప్రాణం త్యాగం చేస్తూ ఇతరులకు రక్షణనిచ్చాడు. 

రెండవ పఠనంలో పునీత పౌలుగారు యేసు ప్రభువు యొక్క సేవా జీవితం గురించి తెలుపుచున్నారు. 

యేసు ప్రభువు తండ్రి , పవిత్రాత్మతో అన్నింటిలోను సరిసమానం అయినప్పటికీ తనను తాను తగ్గించుకొని జీవించారు. 

ఈ వాక్యాలలో పౌలుగారు దేవుని యొక్క వినయ జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఎవ్వరు కూడా ఆయన వలె తగ్గించుకొని జీవించలేదు. 

ఆయన దేవుడు అయినా మనిషిగా మన మధ్య జన్మించారు. పరలోకంలో జీవించే దేవుడు భూలోకంలో జీవించుటకు ఇష్టపడ్డారు. పరలోక మహిమను విడిచి పెట్టారు. భూలోక సీలువను మోసారు. పవిత్రమైన  పరలోకంలో జీవించే దేవుడు పాప మలినం శోకిన ప్రజల మధ్యకు వచ్చారు. 

అధికారం కలిగినప్పటికి అణిగిమణిగి వినయంతో జీవించారు. ఆయన దేవుడే అయినప్పటికీ అన్ని విడిచిపెట్టారు మన మధ్యకు వచ్చారు పిలిప్పీ 2:7 

-సేవించబడాల్సిన దేవుడు సేవ చేస్తున్నారు 

-ప్రేమించబడాల్సిన దేవుడు ప్రేమిస్తున్నారు

-ఆరాధించబడాల్సిన  దేవుడు మన మంచికై అన్ని చేస్తున్నారు. 

-మనం ఎవరికోసం , ఎవరి రాక కోసం ఎదురు చూడాలో ఆయనే మన కోసం ఎదురు చూస్తున్నారు. 

-మనం వెదికే దేవుడు మన కోసం వెదుకుచున్నారు. 

ఆయన అన్నింటినీ త్యజించుకొని మన మధ్యకు వచ్చి జీవించారు. యేసు ప్రభువు అంతటి వినయంను చూపుతూ మన మధ్యలో జీవించి తన ప్రాణ త్యాగం చేశారు. ఆయన స్వార్ధం వేదకలేదు. సేవకుని వలె జీవించి అంత దేవుని కొరకు ప్రజల కొరకు చేశారు. 

యేసు ప్రభువు  తండ్రికి మాత్రమే కాదు వినయం చూపినది మానవులకు, అధికారులకు వినయం చూపించారు. తనను హింసించిన వారికి, చంపిన వారికి కూడా ప్రభువు వినయం చూపించారు. 

ఆయనకు అధికారం వుంది, ఆయన సృష్టికర్త అయినా కానీ అంతటి వినయం చూపించారు. యోహను 10:18, రోమి 5:19 , హెబ్రీ 10:9 . 

వినయం వలన ప్రాణ త్యాగం చేశారు, తనను తాను తగ్గించుకొని నిందలు మోసారు. 

తనను తాను తగ్గించుకొని శత్రువుల చేతికి అప్పగింప బడినారు, తనను తాను తగ్గించుకొని అందరి పాపాలు తన మీద వేసుకున్నారు. 

తనను తాను తగ్గించుకొని శిలువ భారం మోసారు, ఘోరమైన శిలువ మీద మరణం అంగీకరించారు. 

ఆయన పాప రహితుడైనప్పటికి మన పాపాల కోసం అన్ని భరించారు, మనల్ని రక్షించారు.2 కోరింథీ 5:12, గలతి 3:13 .1 పేతురు 2:24, 1 పేతురు 3:18 

యేసు ప్రభువు తన్ను  తాను రిక్తుని చేసుకున్నారు కాబట్టి తండ్రి కుమారున్నీ అంతగా సన్మానించారు. చివరి వరకు సంపూర్ణ విధేయతను, వినయంను చూపిన కుమారిడిని తండ్రి మిక్కిలిగా ప్రేమించారు. ఆయనకు సమస్తము ఇచ్చి ఉన్నారు. ఎఫెసీ 1:22, 1 పేతురు 3:22 ,రోమి 14:11. 

మనం ఒకరి ముందు తలవంచటానికి ఇష్టపడం కానీ యేసు ప్రభువు వినయంలో అందరి ముందు తనను తాను తగ్గించుకొని జీవించారు. 

ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు యొక్క  శిలువ శ్రమలు ధ్యానించు కుంటున్నాం. ఈ రోజు ముఖ్యంగా మనందరం ధ్యానించుకోవల్సిన అంశం ఏమిటంటే యేసు ప్రభువు ప్రజలు రాజుగా గుర్తించారు. 

యేసు ప్రభువు చాలా సార్లు యెరుషలేము దేవాలయంకు వెళ్లారు. కానీ ఈ సమయంలోనే ఆయన్ను గొప్పగా ఆహ్వానిస్తున్నారు. 

ప్రభువు యెరుషలేముకు వెళ్ళిన సమయాలు 

1. యెరుషలేము దేవాలయంను శుభ్రం చేసిన సమయం -యోహను 2:3 

2. యెరుషలేము కోనేటి వద్ద స్వస్థత ఇచ్చినప్పుడు -యోహను 5:1 

3. యెరుషలేములో ఆయన దేవుని కుమారుడని ప్రకటించిన వేళ . యోహను 7:16-17 

4. జీవ జలపు  ఊట అని చెప్పినప్పుడు - యోహను:37-39 

5. లోకానికి వెలుగు అని చెప్పినప్పుడు కూడా ప్రభువు యెరుషలేములో ఉన్నారు.- యోహను 8:12, 9:5 

ఇలాగ చాలా సందర్భాలలో ప్రభువు యెరుషలేములోనే ఉన్నారు. కాని ఇప్పుడు దానికి ప్రత్యేకత ఉంది. ప్రభువు ఈ లోకంలో తండ్రి క్రియలు నెరవేర్చారు, అద్భుతాలు చేశారు, యూదుల విశ్వాసం పెంచడానికి 7 అధ్భుతాలు చేశారు. 

1. నీటిని ద్రాక్షరసంగా మార్చుట . యోహను 2:1-11 

2. ప్రభుత్వ ఉద్యోగి  కుమారునికి స్వస్థత నిచ్చుట.-యోహను 4:46-54 

3. బెత్సయిదా  వద్ద పక్షవాత  రోగికి స్వస్థత నిచ్చుట - యోహను 5:1-15 

4. 5000 మందికి ఆహారం పెట్టుట- యోహను 6:5-14 

5 . నీటి మీద నడుచుట -యోహను 6:16-24 

6. పుట్టు గ్రుడ్డి వానికి చూపును దయచేయుట -యోహను 9:1-7 

7. లాజరును జీవంతో లేపుట - యోహను 11: 1-45 

ఇవన్నీ చేసిన తరువాత ప్రజల యొక్క ఆత్మ విశ్వాసం పెరిగింది. ఆ కాలంలో ప్రభువు బలహీనుల పట్ల, ప్రజల పట్ల పోరాడుతున్నారు. కాబట్టి ఇతడు నిజంగా ప్రజల కోసం వచ్చారని, ప్రజల సమస్యల నుండి కాపాడుతారని నమ్మకం అందుకే ఆయన్ను రాజును చేయాలనుకున్నారు. 

ఆయనయే తమ రాజు అని ఆయన్ను స్తుతించారు. మాకోసం నిలబడే వ్యక్తి అని మాకోసమె పుట్టిన ప్రభువు అని అందరు భావించారు. అందుకే ఆయన తమ యొక్క రాజని గుర్తించారు. ఆ సందర్బంలోనే ఆయన్ను ఘనంగా ఆహ్వానించారు. 

ప్రజలు యేసు ప్రభువుకు హోసన్న పాడారు. హోసన్న అంటే మమ్ము ఇప్పుడు రక్షించు అని అర్ధం. ఆయన వారిని రక్షిస్తారు అని తెలుసుకున్నారు. పాపముల నుండి రక్షిస్తాడని తెలుసుకొని రక్షించమన్నారు. అధే విధంగా ఈ లోక బంధనముల నుండి, అధికారుల క్రింద నుండి రక్షించమని కోరారు. 

ఆయన ద్వారానే రక్షణ వస్తుందని భావించారు. ఆయన రాజుగా పాలిస్తాడని భావించారు. 

యేసు ప్రభువు యొక్క రాజ్యాధికారం  ఈ లోక అధికారం కన్నా  భిన్నంగా ఉంటుంది. 

ఈ రాజు  రాజ్యాలు గెలిచే రాజుగా రావడం లేదు. ప్రజల యొక్క మనస్సులు గెలిచే రాజుగా వస్తున్నారు. మన రాజు శ్రమలు అనుభవించారు, సుఖ సంతోషాలు విడచి పెట్టారు. ఈరాజు అందరికంటే ముందుగా నిలబడి తన ప్రజల కోసం పోరాడతారు. 

క్రీస్తు రాజు బంగారపు కిరీటము ధరించలేదు ముళ్ళ కిరీటము ధరించారు. అధికారంను దుర్వినియోగం చేసుకోకుండా  వినయంతో ప్రేమతో ఈ రాజు జీవించారు. 

యేసు ప్రభువును  రాజుగా సంభోదించుట వలన పరిసయ్యులు భయ పడ్డారు. ఎందుకంటే రోమా పాలకులకు తెలిస్తే వారు తమ పై యుద్దానికి వస్తారని అనుకొన్నారు. ఎందుకంటే యేసును యూదులు రాజుగా చేసుకున్నారని గ్రహించి రోమియులు యుద్దానికి వస్తారని భయ పడ్డారు అందుకే శిష్యులను గద్దించారు. లూకా 19:39 

దేవదూత పలికిన మాటలు నెరవేరాయి. దేవ దూత మారియమ్మకు  జన్మించిబోయే  శిశువు  దావీదు సింహాసనము అదిష్టిస్తారు అని అన్నారు. అది ఈ రోజు కార్యం ద్వారా జరిగింది. లూకా 19:18 . 

ప్రభువు పేరిట వచ్చే రాజు స్తుతింపబడును గాక అన్న మాటలు దావీదుకు చెందినవి, ఆయన శత్రువులను జయించి యెరుషలేముకు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఇలాగే స్తోత్రగానం చేసేవారు అధేవిధంగా యేసు ప్రభువు యొక్క గొప్పతనం గుర్తించి ప్రజలు ప్రభువును పొగిడారు. 

యేసు ప్రభువు గాడిదను ఎన్నుకొని ప్రజల యొక్క నమ్మకంను పెంచుతున్నారు. అంతకు ముదనే ప్రవచనాలు చెప్పబడ్డాయి. మెస్సయ్యా గాడిద పిల్ల మీద వస్తాడని - జెకార్య 9:9 , జెఫన్యా 3:16-19 . 

యేసు ప్రభువు అడిగిన వెంటనే ఇంటి యజమానుడు కూడా వెంటనే గాడిద ఇచ్చారు. బహుశా ఆయనకు కూడా క్రీస్తు ప్రభువును రాజుగా గుర్తించి ఉండవచ్చు. 

యేసు ప్రభువుకు రాజుకు ఇచ్చిన గౌరవం ఇచ్చారు. 1మక్కా 13:51. 

ప్రభువు స్వయంగా గాడిదను ఎంనుకొంటున్నారు. ఎందుకంటే పూర్వం రాజులు యుద్ధం చేయడానికి వెళ్లేటప్పుడు గుర్రం మీద వెళ్ళేవారు, శాంతిని నెలకొల్పేటప్పుడు గాడిద మీద వెళ్ళేవారు. 

గాడిద  వినమ్రుని, శాంతి పరుని సూచిస్తుంది. యేసు ప్రభువు ప్రపంచానికి శాంతి ప్రధాత, ఆయన ఇహలోక సంబంధమైన రాజు కాక పరలోక సంభందమైన రాజు ఆయన అందరికి రాజు ప్రజలందరి పాపాలు తన మీద మోసుకొని మరణించిన గొప్ప రాజు. 

సోలోమోను తన తండ్రి గాడిద మీద వచ్చారు, సింహాసనం అదిష్టించే రోజు . 1 రాజు 1:38-41. 

గాడిద మీద  వచ్చిన వారు.- న్యాయ 10:4 , 2 సమూ 17:23, 2 సమూ 19:26  

ఈ లోకమును తన తండ్రితో సమాధాన పరుచుటకు ఆయన గాడిద మీద వస్తున్నారు. సఖ్యత ఏర్పరచడానికి . ప్రభువు ప్రజల యొక్క హృదయాలను గెలవడానికి గాడిద పిల్ల మీద వస్తున్నారు, ఎఫెసీ 2:13-18 

గాడిదను ప్రభువు ఎన్నుకొనుటకు కారణాలు 

1. గాడిద బరువు మొస్తుంది - అందరి భారం మొస్తుంది 

2. గాడిద సేవ చేస్తుంది - అందరికి సేవ చేస్తుంది 

3 గాడిద శాంతికి గుర్తు 

4. గాడిద పవిత్రతకు గుర్తు - వస్తువులను జంతువులను దేవునికి సమర్పించుటకు వాడతారు కాబట్టి అవి పవిత్రమైనవి. సంఖ్యా 19:2, ద్వితీ 21:3 , 1 సమూ 6:7  

యేసు ప్రభువు వాడిన గాడిదను ఎవ్వరూ ఎన్నడూ వాడలేదు అది పవిత్రమైనది. మనం దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన కొరకు మంచి జీవితం జీవించాలి. 

Rev. Fr. Bala Yesu OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...