15, జనవరి 2022, శనివారం

రెండవ సామాన్య ఆదివారం

రెండవ సామాన్య ఆదివారం 

 యోషయా 62:1-5,  1 కోరింథీ 12:4-11 యోహను 2:1-11 

ఈనాటి దివ్య పఠనాలు దేవునితో దేవునిలో  ఒక క్రొత్త జీవితం  జీవించాలి అనే అంశం గురించి  భోదిస్తున్నాయి. దేవుడు  మనలో ఉన్న  అలాగే మనం దేవునితో ఉన్న అప్పుడు  మన యొక్క జీవితంలో  నూతనత్వం కలిగి జీవించాలి. ఈనాటి మొదటి పఠనంలో  దేవుడు యిస్రాయేలు ప్రజలను  దీవించిన  విధానంను  అదే విధంగా వారి  పునరుద్దరణను గురించి తెలుపుతుంది. 

దేవునికి విరుద్దముగా పాపం  చేసినందువల్ల  యిస్రాయేలు ప్రజలు  బాబిలోనియాకు పంపబడ్డారు. అయితే దేవుడు వారిని అక్కడితో మరచి పోలేదు, విడిచి పెట్టలేదు. వారు క్రొత్త జీవితం జీవించడానికి మరలా పిలుస్తున్నారు. 

మొదటి పఠనంలో దేవునికి మరియు యిస్రాయేలు ప్రజలకు ఉన్న బంధం ఒక వివాహ బంధం వంటిదని తెలుపుచున్నారు. యోషయా 62:5 యిస్రాయేలును  వధువుగా సంభోధీంచుట ద్వార ఇక యిస్రాయేలు ఒంటరి కాదని, వదలివేయ బడదని , అలాగే చేయి విడచి పెట్టబడదని తెలుపుచున్నారు. 

ఒక వరుడు  ఏ విధంగా  తన యొక్క వధువు  పక్షమున నిలబడతాడో అదే విధంగా దేవుడు కూడా యెరుషలేము కొరకు నిలబడతాడు. ఇక వారిద్దరు  సంతోషముగా జీవిస్తారు. వారు జీవించబోయే  ఒక నూతన జీవితం పూర్తిగా  అది ఒక క్రొత్త అనుభందంతో  ముడివేయబడుతుంది. 

దేవుడు తనలో  ఉంటే  ఎంతో లాభం కలుగుతుంది. ఎందుకంటే యోషయా 62:1 చివరి భాగంలో ఆ నగరపు విజయము వేకువ  వెలుగు వలె ప్రకాశించును,  ఆ పట్టణ రక్షణము చీకటిలో దీపమువలే మెరయును. 

వారి జీవితంలో  ఎప్పుడు కూడా విజయము ఉంటుంది. ఈ వెలుగు సంతోషానికి గుర్తు, వారు ఎప్పుడుకూడా సంతోషముగా ఉంటారు. వారి జీవితం బానిసత్వం, అనే అంధకారం నుండి తొలగించ బడుతుంది. 

యెరుషలేము పట్టణం రక్షణము పొందును వారి యొక్క వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది. యిస్రాయేలు ప్రజలు దేవునితో ఒక క్రొత్త నిబంధనా జీవితాన్ని జీవించినప్పుడు వారిద్దరి మద్య అన్యోన్య ప్రేమ , విధేయత విశ్వాస పాత్రులుగా ఉంటారు. దేవుడు క్రొత్త  జీవితాన్ని ఒకరికి దయచేసినప్పుడల్లా వారి యొక్క పేరును కూడా మార్చుతున్నారు. ఉదాహరణకు అబ్రాముకు  అబ్రహము అని, యాకోబుకు యిస్రాయేలు అని , సీమోనుకు పేతరు అని మార్చుతున్నారు.  ఈ విధంగా దేవుడు క్రొత్త జీవితాన్ని యెరుషలేము ప్రజలకు దయచేస్తున్నారు. దానిని దాంపత్య బంధంతో పోల్చుతున్నారు. వారిరువురు కూడా ఇక ఒకే జీవితం పంచుకోబోతున్నారు. అది ప్రేమ జీవితం. 

యోషయా ప్రవక్త,  దేవుడు  ఎప్పుడు కూడా వారితో ఉంటారు అనే భరోసా ఇస్తున్నారు. దేవుడు ఎల్లప్పుడు యెరుషలేముకు  మంచిని చేస్తూ  విశ్వాస పాత్రుడైన వరుడుగానే ఉన్నారు. యిస్రాయేలు మాత్రం అవిధేయత వలన , అవిశ్వాసనీయత వలన దేవునికి దూరమయ్యారు, కాని మరలా దేవుడు తనను క్షమించి, అంగీకరించి ఒక క్రొత్త  జీవితానికి  ఆహ్వానిస్తున్నారు. 

వాస్తవానికి  వివాహ బంధంలో కూడా కొన్నిసార్లు  ఎవరైనా బలహీనతవలన తప్పు చేస్తే  క్షమించి అంగీకరించి ఒక క్రొత్త జీవితం జీవించాలే కాని ఒకరినొకరు నిందించుకోకూడదు. దేవుడు  యిస్రాయేలుతో మెలిగిన విధానం అలాంటిదే  ఆయన వారి బలహీనతను అర్ధం చేసుకున్నారు. పవిత్ర గ్రంధం  ఒక వివాహ బంధం ద్వారా ప్రారంభమౌతుంది. అదే విధంగా క్రీస్తు ప్రభువు జీవితం కూడా ఒక వివాహం తోనే  ప్రారంభమగుచున్నది. యేసు ప్రభువే స్వయంగా కానా పల్లెలో జరిగిన పెండ్లి లో వరుడు వధువును ఆశీర్వధించారు. 

రెండవ పఠనంలో పౌలు గారు  దేవుని యొక్క ఆత్మ వరములను గురించి  భోధిస్తున్నారు. దేవుడిచ్చిన వరాలు మనం ఇతరులతో పంచుకోవాలి. 

దేవుడు ప్రతి ఒక్కరికి దీవెనలు ఒసగివున్నారు ఆ  దీవెనలు అందరితో మనం పంచుకోవాలి, అని పౌలుగారు తెలియచేసారు. కృపా వరములు చాలా వున్నాయి కాని  వాటిని ఇచ్చేవాడు మాత్రము దేవుడు. ఈ కృపా వరముల యొక్క ఉద్దేశం ఒక్కటే అది  మంచి చేయడానికి. 

దేవుడు తన జీవితాన్ని మనకు ఇచ్చారు అంటే తన వద్ద ఉన్న కృపా వరములు అన్నీ మనతో పంచుకుంటున్నారు. అలాగే   దేవుడు ఉచితంగా ఇచ్చిన జీవితం మనం కూడా మంచిని చేయడానికి వినియోగించాలి. మన జీవితాలు అభివృద్ది చెందడానికి కారణం  దేవుడు అన్నీ ఇచ్చింది ఆయనయే. మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు  ఏమి తీసుకొని రాలేదు. కాబట్టి మన జీవితంలో మనం ఏమి సంపాదించిన అది దేవుని వరమే. 

మనకు దేవుడు ఒసగిన ఆత్మ వరములు వివేకం, విజ్ఞానం , విశ్వాసం , స్వస్త పరచు శక్తి , అద్భుతాలు చేయు శక్తి, ప్రవచన శక్తి , ఆత్మలను వివరించు శక్తి, వివిధ బాషలలో మాట్లాడే శక్తి, బాషల అర్ధం వివరించే శక్తి . ఈ కృపా వరాలు అన్నీ స్వంత లాభం కొరకు కాకుండా ఇతరుల మేలు కొరకు ఉపయోగించాలి. 

ఆత్మ వరాలు పొందిన వారు , అవి తమ గొప్ప తనం వల్లనే లభించినవని గర్వించడానికి గాని , పొంగిపోవడానికి కానీ కాదు అహంకారంతో విర్ర వీగుతూవేరె  వారిని చిన్న చూపు చూడకూడదు. 

మన శరీరంలో గుచ్చ బడిన ముల్లు మనల్ని అది ప్రతిసారి  disturb చేస్తుంది , అది మనకు గుర్తు చేస్తుంది. అది మనకు గుర్తు చేసిన సమయంలో మన యొక్క బలహీనత మనకు గుర్తుకు రావాలి. మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా , ఎంత మంచి చేసినకాని మనం గర్వంగా గొప్పలు చెప్పుకోకూడదు. ఎందుకంటే అది అంతా  దేవుని కృపా వరమే. 

దేవుని యొక్క కృప  మనతో ఉంటే చాలు ఆ కృప వలన మనం జీవించగలుగుతాం.  ఆ కృప వలన మంచి కార్యాలు చేయవచ్చు. మనం గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఉదారంగా పొందినది , ఉదారంగా ఇస్తే మనం ఇంకా దీవించబడుతాం. చాలా సందర్భాలలో ఇవ్వడానికి మనం ముందుకు రాలేము. అదె విధంగా చాలా సందర్భాలలో మనం గొప్పలు చెప్పుకుంటాం. 

గొప్పలు చెప్పుకోవడం కొందరికి అలవాటు కాని పౌలు గారు గొప్పలు చెప్పుకొనవసరం లేదని తెలుపుచున్నారు. ఎందుకంటే మనలను గొప్ప వానిగా చేసింది దేవుడే కాబట్టి ఆయనను మనం పొగడాలి,  ఆ దేవుడిని ఘన పరచాలి, స్తుతించాలి.  

-ఈనాటి సువిశేషం లో యేసు ప్రభువు చేసిన మొట్ట మొదటి అద్భుతం గురించి చదువు చున్నాం.క్రీస్తు ప్రభువు తన దగ్గర వున్నా దివ్య వరములు తమ పొరుగువారితో పంచుకొనుటను తెలుసుకుంటున్నాం.

- తాను ఈ లోకంలోకి వచ్చింది తనకు వున్నది మనకు ఇవ్వటానికి,

-తన జీవం ఇచ్చారు

-తన ప్రేమనిచ్చారు

-తన సేవనిచ్చారు

-తన క్షమను ఇచ్చారు

-తన వరములు వారములు ఇచ్చారు.

-ఈ లోకంలో దేవుడు ఈ అద్భుతం ద్వారా తన కుమారుని ద్వారా మరలా సృష్టించే శక్తిని గురించి తెలుపుచున్నారు.ఆయనకు సృష్టించే శక్తి మరియు ఉత్పత్తి చేయగల శక్తి ఉంది. కానా పల్లెలో జరిగిన ఆ పెండ్లి యొక్క విధానం మనం తెలుసుకోవాలి.ఆ పెండ్లి ప్రతి ఒక్కరి కుడా కుడా ఆనంద దాయకమైనది. అందరూ కూడా సంతోషంగా  ఉంటారు.యూదుల ఆచారం ప్రకారం జరిగే పెండ్లి దాదాపుగా వారం ఉంటుంది. అక్కడ వారికి కావలసిన దంతా పెండ్లి వారే చూసుకోవాలి. ఈనాటి సువిశేషంలో విన్న అంశం, వారి పెండ్లి జరుగుతున్నప్పుడు ద్రాక్షా రసము తక్కువగా వున్నది అని.

- ఈ పెండ్లికి యేసు ప్రభువు, తల్లి మరియమ్మగారు ఆహ్వానించబడ్డారు. వారితో పాటు ఆంద్రెయ, పేతురు , యోహాను, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమియా(నతానియేలు )  కూడా  వివాహ వేడుకలో పాల్గొన్నారని ఒక (Coptic Gospel )లో చెప్పబడింది .ఆ యొక్క సువిశేష ఆదారంగా చెప్పబడే అంశం ఏమిటంటే వరుడు మరియమ్మగారి చుట్టం. వరుడు పేరు "సీమోను" కానాకు చెందిన సీమోను.అతడు యాకోబు, యుదాల యొక్క సోదరుడు. అలాగే మరియమ్మ గారి అక్క  యొక్క కుమారుడు అందుకే బహుశా మరియమ్మ గారు ఎక్కువగా ఆసక్తి తీసుకొని ఆమె యే అంతా నడిపిస్తున్నారు. ఇది ఒక విధమైన భావన.

-ఇంకొక విధంగా ఆలోచిస్తే యేసుప్రభువు మొట్ట మొదటిగా తనయొక్క మహిమను వ్యక్త పరుస్తున్నారు.

-మరియమ్మ గారి ద్వారా ఈలోకంలోకి వచ్చిన యేసు ప్రభువు మళ్ళీ అదే తల్లి యొక్క మధ్య వర్తిత్వం ద్వారా సహాయం చేస్తున్నారు, అద్భుతం చేస్తున్నారు. వివాహం లో ఎందరో ఉన్నప్పటికీ అక్కడ అవసరం గుర్తించింది, తల్లియే గుర్తించటం మాత్రమే కాదు, ఆ అసమానత కొరతను, అవసరతను తీసివేయమని తన కుమారున్ని వేడుకొంది. మరియమ్మ గారు తాను విశ్వసించింది, తన కుమారుడు వారిని నిందలనుండి మరియు అక్కడున్న అవసరతనుండి రక్షిస్తాడు, వారిని ఆనందంగా ఉంచుతాడు అని ఆ తల్లి విశ్వసించినది   కాబట్టే  మొదటిగా  ఆయన దగ్గరకు  వెల్లింది. వేరే వాళ్ళ దగ్గరకు  వెళ్లి  ద్రాక్షా  రసము  కొనమని  చెప్పలేదు కానీ  తన కుమారుని  అడిగింది. మన  జీవితంలో  అవసరాలు  వున్నప్పుడుఎదో   కావాలి  అని అన్నప్పుడు  మనం మొదటిగా  దేవుని  దగ్గరకు  రావాలి.

-దేవుడే అన్నారు యిర్మీయా 17: 7 - తన మీద ఆధార పడితే దీవిస్తానని.

-అడగండి ఇస్తాను అన్నారు - మత్తయి 7: 7

-సమస్యలలో వుంటే తన చెంతకు రమ్మన్నారు- మత్తయి 11: 28

మనం   మాత్రం  బంధువుల  దగ్గరకు  ధనవంతుల దగ్గరకు  ఇంకా  వేరే  వాళ్ళ  చెంతకు  వెళతాం  కానీ  మరియ  తల్లి  తన  దేవుడైన  తన  కుమారుని  చెంతకు  వెల్లింది . అది  ఆమె  యొక్క  విశ్వాసం , నమ్మకం,  గొప్పతనం , వినయం. పాలస్తీనాలో    పెండ్లి జరిగేటప్పుడు ద్రాక్షా రసము చాలా అవసరం. నీటిని చాలా తక్కువగా అవసరమైతేనే వాడేవారు. ఎందుకంటే మధ్య తూర్పు ప్రాంతాలలో అంత మంచి నీరు దొరకదు. అందుకనే నీటికి బదులుగా ద్రాక్షా రసమును ఎక్కువగా వాడేవారు.

ఒక వేళా ఈ వివాహంలో ద్రాక్షా రసము లేకపోతే వారు సంతోషంగా వుండే వారు కాదు. వారు నిందలు, అవమానాలు భరించవలసి వచ్చేది, కానీ దేవునియొక్క సాన్నిధ్యం ద్వారా అలాగే మరియతల్లి యొక్క మధ్య వర్తిత్వం ద్వారా అవేమి జరగకుండా వారు సంతోషంగా వివాహమును కొనసాగించారు. మరియ తల్లి ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తూనే వుంటారు.యేసు క్రీస్తు అద్భుతం చేయకముందు ఆమె పలికిన మాటలు " ఆయన చెప్పినట్లు చేయుడు"వాస్తవానికి ఆయన చెప్పినట్లు చేస్తే మన అందరం కూడా సంతోషంగా ఉంటాం.

-ఆయన చెప్పినట్లు - పొరుగు వారిని ప్రేమించాలి, క్షమించాలి, సహించాలి, విధేయత కలిగి ఉండాలి, హృదయ పరివర్తన చెందాలి, దైవభయం కలిగి ఉండాలి.

-మరియ తల్లి మనతో వుంటే మనకు మేలు కలుగుతుంది. ఎందుకంటే ఆమె మన అవసరతలను గ్రహిస్తుంది. ఆమె మన కొరకు తన కుమారున్ని ప్రార్థిస్తుంది., మనకు సహాయం చేస్తుంది.

-నిందలు, అవమానాలు, సమస్యల్లో మనకు ఆదరువుగా ఉంటుంది.

-నీటిని ద్రాక్షా రసముగా మార్చుతాడని తల్లి ముందే గ్రహించింది. యేసు ప్రభువు వారు తన యొక్క సమయం రాకున్నా కానీ తల్లి అడిగినది కాబట్టియే అద్భుతం చేస్తున్నారు. అది ఆయనకు తన తల్లి మీద ఉన్న ప్రేమ, గౌరవం. దీని ద్వారా యేసు క్రీస్తు తన తల్లి అంటే తనకు చాలా ఇష్టం అని కూడా తెలుపుచున్నారు. తల్లి తన హృదయంకు  దగ్గరగా ఉన్నది కాబట్టియే ఆమె కొరకు అద్భుతం  చేస్తున్నారు. తల్లి అడిగితే కుమారుడు తప్పక దయచేస్తారన్నది మరియమ్మ గారి నమ్మకం.

-మనం కూడా మరియమ్మ గారిని యేసుప్రభువును మన ఇంటికి ఆహ్వానించాలి అప్పుడు మన కుటుంబాలు కూడా దీవించబడతాయి.

-మన జీవితాలు దేవుడికి సమర్పిస్తే అవి శ్రేష్ఠంగా దేవుడు చేస్తారు.

-పాత పాపపు జీవితం తీసివేసి క్రొత్త పవిత్ర జీవితం దయచేస్తారు.

- ఈ సువిశేషంలో సేవకులు విధేయత చూపారు, యేసు ప్రభువును నమ్మారు.

వాస్తవానికి ఈ సేవకులు విందు పెద్ద చెప్తేనే చేసేవారు కానీ ఎప్పుడైతే మరియమ్మ గారు ఆయన చెప్పినట్లు చేయమన్నారో వారు అలాగే చేశారు. అది వారియొక్క విధేయత  మరియు విశ్వాసం. దేవుడు మన కుటుంబంలో ఉంటే మనం దీవించ బడతాం. కాబ్బట్టి మరియమ్మ గారిని, యేసు ప్రభువుని మన గృహంలోకి ఆహ్వానించుకుందాం.

Rev. Fr. Bala Yesu OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...