24, డిసెంబర్ 2021, శుక్రవారం

క్రీస్తు జయంతి మహోత్సవము(2)

క్రీస్తు జయంతి మహోత్సవము

                       యెషయా 9:1 -6, తీతు 2 :11-14 , లూకా2:1 -14

ప్రతిజననం ఎంతో ప్రత్యేక్యమైనది  ఈలోకంలో  ఉన్న మనందరి జీవితం జన్మoతోనే ప్రారంభంఅవుతుంది మనం చాల మంది పుట్టినరోజులను ఘనంగా కొనియాడతo. అంగరంగవైభవంగా కొన్నీ పుట్టిన రోజులను చేసుకుంటాం. సంఘసేవకుల, రాజకీయానాయకుల పుట్టినరోజును జరువుపుకుంటాం. ఈరోజు ప్రత్యేకమంగా రాజులకు రారాజు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తుప్రభు యొక్క జన్మదినము. జరుపుకుంటున్నాం. ఎందరో చూడాలనుకున్నారు కానీ చూడలేదు.ఎందరో ఆయనను తాకాలనుకున్నారు కానీ తాకలేదు. కానీ మనం అదృష్టవంతులము. పరలోకదూతలు మాత్రమేకాదు ఈరోజు సంతోషంమనందరికీ  ఎందుకు అంటే సృష్టిలో మొట్టమొదటి సారి దేవుడు మన మధ్యలోకి వస్తున్నారు.
తన     పర లోక మహిమను అలాగే నిత్యము సేవించుకునే విధానము వదిలి పెట్టి మన కోసం మన మధ్య లోనికి వస్తున్నారు. సృష్టిలో మొట్టమొదటి సారిగా ఒక్క శిశువు జన్మించిన తరువాత తల్లి తన కుమారుని పొలి ఉన్నారు.
మాములుగా ఈలోకంలో జన్మిస్తే, మనం అంటాము మీ అమ్మలాగా ఉన్నావు నాన్నాలాగా ఉన్నావు. కానీ యేసు ప్రభువు జనము తో తన తల్లి శిశువుని పోలి వుంది. ఎందుకంటే  దేవుడు మానందరిని తన పోలికలో సృజించారు . 
దేవుడే మరియమ్మ గారిని  సృజించారు ఆ తల్లి ఇప్పుడు దేవున్ని పోలివుంది. మొట్టమొదట  సారిగా మరియమ్మగారు పరలోక అనుభూతిని పొందారు. తన పవిత్ర చేతులులతో దేవున్ని తాకారు . బాల యేసు జన్మిoచిన స్థలం   పవిత్ర మైనది, పశువుల పాక పవిత్ర స్థలంగా  మారింది. ఆయన  జన్మిoతో భూలోకం పరలోకంగా మారింది . ఎవరు ఇష్ట పడని అంగీకరించని స్థలం అందరిచేత అంగీకరించబడుతుంది. ఎందుకంటే రక్షకుడు జన్మిoచరు .యేసు ప్రభువు పశువుల పాకలో జన్మిoచరు.ఎందుకంటే స్థలం ఆ స్థలం సామాన్యలకు చెందినది, సమాజంలో ఎవ్వరు పట్టించుకోని వారు అక్కడ వుంటారు
(Outcast people ignored people forgotten in the society) ఆయన అక్కడ జన్మనిoచుట ద్వారా ఆయన అందరితో సరిసమానం అని చెబుతున్నారు. ఈ సమాజం పట్టించుకోని వారిని దేవుడు పట్టించుకుంటున్నారు.
దేవుడు కేవలం ఎన్నుకొన్న వారికి మాత్రమే కాదు  జన్మిoచిoది.
 క్రీస్తు ప్రభువు తన్ను తాను అందరి చేత అంగీకరించబడేoదుకు ఆయన కూడా అందరిలో ఒక్కరె, సరి సమానమే  అనే భావన ప్రజల్లో తీసుకొని రావటానికి ఈ విధంగా ఆయన చేశారు.  మనకు జన్మిoచిన శిశువు ఎలాంటి వారంటే
ఆశ్చర్యకరుడు
 ఆలోచన  కర్త
బలవంతుడగు దేవుడు
 నిత్యుడగు తండ్రి
సమాధాన కర్త
ఆనాడు యూదా ప్రజలు చీకటిలో వెలుగును చూసారు అంటే స్వయంగా దేవుడు ఇచ్చే  రక్షకున్ని చూసారు  అని అర్ధం.
  వారి జీవితంలో పాపం తొలగించబడినది అని అర్ధంకూడా.మన కోసం జన్మిoచిన శిశువు తనయొక్క పరిచర్య ద్వారా అద్భుతముల ద్వారా ,బోధనల ద్వారా   ఆశ్చర్యకరమైన కార్యములు ద్వారా అనేక మంది జీవితాలలో వెలుగు ను నింపారు. ఆయన పుట్టుకతో  ఈ లోకంలో వెలుగు నింపబడినది భూలోకం పవిత్ర  పరచబడింది.
 మన కుంటుంబంలో శిశువు  జన్మిస్తే   ఆ తల్లి మీద వున్నా అవమానం తొలిగిపోతుంది శిశువు     దుఃఖము  సంతోషంగా  మారుతుంది.
మనకోసం జన్మిoచిన   శిశువు మాటతప్పని వారు మనస్సు బాధ పెట్టని వారు ,సమర్దుడు మన కోసం తన జీవాన్నే త్యాగం చేసే వారు ,స్వస్థత పరిచే కుమారుడు
 ఆయన తండ్రితో నిత్యం వుంటూ తన దీవెనలు మనకు  ఇచ్చేవారు.
 యేసు ప్రభువు  జన్మిoచిన తరువాత ఆయన్ను కనుగొన్నది రెoడు వర్గాల వారు
1.గొల్లలు - సామాన్న ప్రజలు
2. జ్ఞానులు - అన్ని తెలిసినవారు
ఒక వర్గ  వారు ఏమి తెలియని సామాన్యులు రెండవ వారు అన్ని తెలిసినవారు.
రెoడు వర్గాల వారు ఆయన్ను మెసయ్యగా గుర్తించారు మిగతా సగం  సగం తెలిసినవారు  యేసయ్యను గుర్తించలేదు, అంగీకరించలేదు.
రెoడవ పఠనములో పౌలు గారు రక్షకుని  రాక గురించి చెబుతున్నారు సర్వమానవాళికి రక్షణ కృప  ఒసగబడినది .
 ఆయన ఈలోకంలో వున్నా వారి జీవితములను సరిచేయుటకు  ఆయన వచ్చి వున్నారు
 ఆయన రాకడ కోసమై  మనం -ఇంద్రియ నిగ్రహం కలిగి జీవించాలి ,ఋజు మార్గాన ప్రయాణించాలి, పవిత్రమైన  జీవితం  గడపాలి .ఈ వాన్ని జరిగినప్పుడు ఆయన మనలో  జన్మి స్తారు. కాబట్టి మన జీవితంలను సరిచేసుకోవాలి ఆయన కోసం తయ్యారవాలి. పునీత అగస్టీన్గారుఅంటున్నారు యేసుప్రభు ఈలోకానికి వచ్చింది మనకు దైవత్వం పంచటానికి మనలో దైవత్వం పెంచటానికి, దైవత్వం ఇవ్వడానికి వచ్చారు.
మన కొరకు పంపబడిన వారు లోక రక్షకుడు,
అయన మన పాపముల నుండి రక్షించే వ్యక్తి
అయన మనలను చేడు నుండి రక్షించే వ్యక్తి
అయన మనలను స్వార్ధం నుండి రక్షించే వ్యక్తి
అయన మనలను ఈలోక ఆశల నుండి రక్షించే వ్యక్తి
అశాంతి నుండి రక్షించే దేవుడు సాతాను బాధల నుండి రక్షించే దేవుడు.

అయన మన కొరకు పంపబడిన దేవుడు. అయన మరణించిన వారికే జీవమునిచ్చుటకు వచ్చిన పంపబడిన దేవుడు.
గాయ పడినవారికీ స్వస్థత ఇచ్చుటకు పంపబడ్డాడు.
త్రప్పిపోయిన గొర్రెలను వెదకి రక్షిన్చుటకు పంపబడ్డారు.
గ్రుడ్డువారికిచూపును ఇచ్చుటకు కృంటువారిని నడిపించుటకు చెవిటి వారికి వినికిడి ఇచ్చుటకు స్వర్గఅనుభూతుని ఇచ్చుటకు అయనపంపబడ్డారు.
సేవసేయడానికి అయన పంప బడ్డారు. ఆయనను దేవుడు పంపించింది మన కొఱకు అలానే మనం కుడా  ఈలోకానికి పంపబడ్డాం. మరి ఆయన లాగే మనం జీవిస్తున్నాము? దేవుని యొక్క ప్రణళికయె మనజీవితం దేవుడు పంపించారు కాబట్టి    ఈలోకానికి మనతల్లిదండ్రుల ద్వారా వచ్చాము, అయన మన కొరకు  వచ్చిన వ్యక్తియే   దేవుడు ఇమ్మానుయేల్ అనగా దేవుడుమనతో ఉన్నాడు. పవిత్ర గ్రంధం మనం క్షుణముగా తెలుసు కుంటే దేవుడు తన ప్రజలతో ఉన్నాడు.
ఇశ్రాయేలీయలను నడిపించుటకు దేవుడు వారిమధ్యలోనే ఉన్నారు, వారిని  నడిపిస్తున్నారు నిర్గమ ;   3: 14
దేవుడు వారితో ఉండాలనుకునారు. అయిన ప్రజలు అయన గొప్పతనం గ్రహించలేదు. ఆయనకు అవిశ్వాసముగా జీవించారు. యేసు ప్రభువారు  మన మధ్య లోకి వచ్చారు. మనవునిగా మన మధ్య జీవించారు.
మత్తయి: 14  : 16   దేవుడుమనతో ఉండాలని ఆశపడి 
పరలోకం వీడి   భువికి వచ్చారు.  అన్నీ వదిలేసుకొని వచ్చారు. ఇంకామనం అయనగొప్పతనం తెలుసుకోలేక పోతున్నాం.
దేవుడు మన కొరకు మన మధ్యకు 
వచ్చి ఉండాలనుకున్నారు. అయితే మనం దేవుని తో ఎలాగా ఉంటున్నాం.
క్రీస్తు జననం దేవుని మనకు దగ్గరకు చేర్చింది. ఆయనను మన కుటుంబ సభ్యులుగా పరిచయంచేసింది.
ఆయనను మన స్నేహితులుగాచేసింది.
పంపబడిన యేసుప్రభు యొక్క మంచితనం రక్షణకార్యంలో యేసు ప్రభువు   యొక్క జననం ఈరోజు మనం ధ్యానించు కొంటున్నాం.  అయితే ఆ జననములో నలుగురు ముఖ్య మైన వ్యక్తులు ఉన్నారు. 
తండ్రిదేవుడు, కుమారుడైనయేసుప్రభు, పవిత్రాత్మదేవుడు , మరియమ్మ యేసేపు
వీరు అందరు కూడా ప్రజల కొరకు మేలును మాత్రమే చేసారు. తండ్రి, పవిత్రాత్మ, కుమారుడుని ఈలోకంలో మేలు చేయడానికి పంపిస్తున్నారు. నా కుమారుడు వెంటనే వస్తున్నారు. అయన జీవితములో ఎవరికి హానిచేయలేదు. యేసు మానవ అవతారంకు  సహాకరించిన వారు మరియమ్మగారు యేసేపుగారు. వారు కుడా బిడ్డను తమ బిడ్డగా స్వీకరించారు. 
ఆయనను అనేక విధాలుగా కాపాడారు. 
వీరు అందరు కూడా ప్రజల కోసం ,శ్రీ యేసు కోసం పని  చేసిన వారే. వారి అభివృద్ధికి తోడ్పడిన వారే.

అదేవిధముగా మనం కుడా ఇతరుల మేలుకోరకు పని చేయాలి. 

వారికీ  మనకు ఉన్న దానితో సహాయం చేయాలి.
వారికీ ఇవ్వాల్సినంత ప్రేమను ఇవ్వాలి. క్రిస్మస్ పండుగ
 ద్వారా దేవుడు మనకు ఇచ్చిన  గొప్ప ఆశీర్వాదాలు
ఆయన మనలను దత్త పుత్రులుగాచేసారు గలతి : 4 : 5 మనలను తనబిడ్డలుగా అంగీకరించారు

క్రీస్తు జయంతి సామాన్యుల కు గుర్తుపునిచ్చింది. గొర్రెల కాపరులకు దేవుడు ఒక గుర్తింపు ఇస్తున్నారు.
వారికే గొప్ప దర్శనం కలగజేస్తున్నారు. యేసు ప్రభు వారికీ మనకు కూడా గుర్తిపును ఇస్తున్నాడు.
క్రీస్తు జయంతి దేవుని అభయం ఇస్తుంది. దేవుడు మనతో ఉన్నాడు అన్న అభయం.
క్రీస్తు జయంతి మనలను పాపముల నుండి వైదొలిగి నీతిమంతమైన జీవితం జీవించమని నేర్పిస్తుంది.
క్రీస్తు జయంతి మనకు జీవితం ప్రసాదిస్తుంది. ఆయనతో క్రొత్త జీవితం మొదలైంది. అలాగే ఈరోజు అయన
మనతో జన్మిస్తే క్రొత్తజీవితం ప్రారభించవచ్చు.
Rev.Fr.Bala Yesu OCD

క్రీస్తు జయంతి మహోత్సవము

క్రీస్తు జయంతి మహోత్సవము
మన కోసము దేవుడు మానవుడై రక్షకునిగా జన్మించెను.

క్రిస్మస్ అర్ధరాత్రి పూజ      క్రిస్మస్ వేకువ జామున పూజ           క్రిస్మస్ పగలు పూజ
యెషయా 9:1-6                      యెషయా 62:11-12                     యెషయా 52:7-10
తీతు 2:11-14                          తీతు 3:4-7                                   హెబ్రీ 1:1-6
లూకా2:1-4                             లూకా 2:15-20                               యోహాను 1:1-18
ముందుగా మున్ముందుగా మీకందరికి క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే అర్థమేమిటి? క్రిస్మస్(క్రీస్తు జయంతి) అంటే దేవుడు మానవుడై (యోహా 1:14) ఇమ్మానువేలుగా మన మధ్య, మనతో, మనలో ఉండటము (మత్తయి 1:22-23). ఆనందించడానికి, మహానందించడానికి సరియైన సమయమిది. ఎందుకంటే లోక రక్షకుడు మనకోసము, మన మధ్యలో, మనలో జన్మిస్తున్నారు. మనుష్యావతారము(దేవుడు మానవ రూపము దాల్చడము)  అనేది చరిత్రలో ఒక్కసారి మాత్రమే జరిగినది కాదు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ. చిన్నారి పొన్నారి బాలయేసు ప్రతి ఒక్కరి హృదయములో జన్మించేంతవరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. క్రీస్తు జయంతి కేవలము ఒక గొప్ప మహోత్సవము మాత్రమే కాదు, ఓ దైవానుభూతి. ఈ దైవానుభూతి క్రీస్తు మనలో జన్మించినప్పుడు మాత్రమే పొందగలము. లేదంటే ప్రతి క్రిస్మస్ పండుగ కేవలము ఒక మహోత్సవము లానే మిగిలిపోతుంది. కాబట్టి ఈ గొప్ప మహోత్సవ ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని ఏ విధముగా మన జీవితాలకు అపాందించుకుని, ఆ క్రీస్తు జనన అనుభూతి ఏ విధముగా పొందాలో ఈ క్రింది మూడు అంశాల రూపేణా అర్ధము చేసుకుందాము. 
క్రీస్తు జనన ప్రవచనాలు, వాటి నెరవేర్పు
క్రీస్తు జయంతి పర్వము; మనకు ఆనందాల వరము
క్రీస్తు జయంతి పర్వము; మన రక్షణ చరిత్రలో ఓ అత్యుత్తమ ముఖ్య ఘట్టము 

క్రీస్తు జనన ప్రవచనాలు, వాటి నెరవేర్పు
క్రీస్తు జనన ప్రవచనాలు పాత నిబంధనలో లెక్కకు మిక్కుటము. కానీ మనము ఇక్కడ కొన్నింటిని మాత్రమే ధ్యానిద్దాము. చరిత్రలో ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు. కానీ ఏ వ్యక్తి గురించి కూడా ఈలాగున, ఈ సమయములో, ఈ స్థితిలో జన్మిస్తాడని ముందుగా ఏ ప్రవక్త ప్రవచించలేదు. కానీ క్రీస్తు ప్రభువు జన్మిస్తాడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు.
"ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కనును. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుము" (యెషయా 7:14)
"మనకొక శిశువు జన్మించెను. మనము ఒక కుమారుని బడసితిమి. అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును" (యెషయా9:6-7)
"మీరు సీయోను కుమారితో ఇట్లు నుడువుము. ప్రభువు నిన్ను రక్షింప వచ్చుచున్నాడు." (యెషయా 62:11)
ఈ ప్రవచనాలు పొల్లుపోకుండా నెరవేరాయి.
ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు. అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను" (మత్తయి 1:22-23)
"నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టును. ఆయన క్రీస్తు ప్రభువు" (లూకా 2:11)
"ఆ వాక్కు (దేవుడై) మానవుడై మన మధ్య నివసించెను. (యోహాను 1:14)
క్రీస్తు జయంతి పర్వము; మనకు ఆనందాల వరము
క్రిస్మస్ దగ్గరకు వస్తుందంటే మనకు కలిగే ప్రథమ భావము, ఆనందము. క్రిస్మస్ మన జీవితాలలో చీకటిని తొలగించి వెలుగునిస్తుంది. నిరాశ,నిస్పృహలను తీసివేసి క్రొత్త ఆశలను చిగురింపజేస్తుంది. అశాంతిని తీసివేసి శాంతినిస్తుంది. పాపాన్ని ప్రక్షాళన గావించి రక్షణను ఇస్తుంది. దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్నిస్తుంది. పునీత పౌలు గారు నుడువుచున్నారు,"ప్రభువు నందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను, ఆనందింపుడు (ఫిలిప్పు4:4), ఆనందించడానికి కారణము ప్రభవు దగ్గరలోనే ఉన్నారు (ఫిలిప్పు 4:5)." సీయోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షద్వానము చేయుము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము (జెఫ 3:14) ఎందుకనగా నీ దేవుడైన ప్రభవు నీ నడుమనున్నాడు(జెఫ 3:17). దేవదూత గొర్రెల కాపరులతో, "మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించెదను, మీకు ఒక రక్షకుడు జన్మించెను (లూకా 2: 10-11)
ఎందుకు   రక్షకుడు  నడుమనున్నాడని  అని ఆనందించాలి ? ఎందుకు అంటే  ఈ  రక్షకుడే  ఈలోక  సంతోషము కంటే అతీతమైన  ఆనందాన్నిస్తాడు.  ఈ ఆనందం ఏది,  ఎవరు  మననుంచి  తీసివేయలేరు.  ఇది  సత్యమైన  మరియు  శాంతియుతమైన  నిత్యానందం.  ఇమ్మానుయేలు  దేవునిగా  ప్రభు మనకోసం  మన మధ్య  జన్మించింది  మనతో ఉండడానికి (మత్తయి 1: 22 -23) మనలో  ఈ శాంతియుతమైన  నిత్యానందం నింపటానికి  దేవుడు మనతో  ఉండాలంటే  మనం దేవునితో వుండాలి.  మనం దేవునితో దేవుడు మనతో  ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు జయంతి పర్వము మనకు ఆనందాల వరంగా మారుతుంది. అప్పుడు గొర్రెల కాపరులతో కలిసి 'మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగుగాక (లూకా 1:22-23)' అంటూ దేవుని స్తుతిస్తూ క్రీస్తు జయంతిని ఆనందముగా, మహానందముగా జరుపుకోగలము. 
ఈ లోకములో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు. వీరందరూ జన్మించింది జీవించడానికి కానీ క్రీస్తు ప్రభువు జన్మించింది మరణించడానికి. తన జీవన, జీవిత, శ్రమల, మరణ పునరుత్తానాల ద్వారా మనకు రక్షణ తీసుకుని రావడానికి. మానవ రక్షణ చరిత్రలో క్రీస్తు జననము ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక మాటలో చెప్పాలంటే మానవ రక్షణ చరిత్రలో క్రిస్మస్ ఒక అత్యుత్తమ ఘట్టము. ఎందుకంటే స్వయానా లోక రక్షకుడు జన్మించిన తరుణము. ఈ తరుణము మానవులను పాప జీవితము నుండి పవిత్ర, పుణ్య జీవితానికి ఆహ్వానించే ముఖ్య సమయము. ఎందుకంటే రక్షింపబడాలంటే పవిత్ర జీవితము ఎంతో అవసరము. 
రక్షణలో రెండు పాత్రలున్నాయి. a. దేవుని పాత్ర, మరియు b. మానవ పాత్ర. 
దేవుని పాత్ర: దేవుడు లోక రక్షకుడు. మనలను రక్షింప జన్మించెను. అది మనకందరికీ తెలుసు. కాబట్టి మనము మన పాత్రపై మననము చేద్దాము. 
మానవ పాత్ర: లూకా19: 1-10 వచనాలలో జక్కయ ఇంటికి ఏ విధముగా రక్షణ వచ్చిందో మనము చదువుతున్నాము. జక్కయ సుంకరులలో ప్రముఖుడు, ధనికుడు(లూకా 19:1), యేసుని చూడాలనే కోరికతో ఉన్నాడు. ఆ కోరిక కార్య సాధనకు తన పొట్టి తనము అడ్డు రాలేదు, తన గురించి ఇతరులు ఏమనుకుంటారో అని తలంచలేదు. కానీ తన లక్ష్యము ఒక్కటే. యేసును చూడాలి. జనసమూహము ఎక్కువగా ఉండినను కూడా ముందుకు పరుగు తీసి మేడి చెట్టును ఎక్కాడు. అది చూచిన యేసు, “జక్కయ్య నీ ఇంటిలో ఉండ తలచితిని” అని చెప్పి పాపియైన జక్కయ ఇంటికి అతిధిగా వెళ్ళాడు. యేసు రాకతో జక్కయ జీవితము మారిపోయింది. ఒకనాడు అన్యాయముగా జనము నుంచి పన్ను తీసుకున్న జక్కయ్య ఇప్పుడు తన ఆస్తిలో సగము పేదలకు దానము చేయడానికి మరియు తాను ఎవరికైనా అన్యాయము చేసినచో నాలుగు రెట్లు కూడా ఇచ్చివేయుటకు సిద్ధముగా ఉన్నాడు. తన జీవితములో అచంచలమైన మార్పును చూసిన ప్రభువు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఏలన ఇతడును అబ్రాహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు, అని చెప్పారు. 
అవును క్రీస్తునందుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనము కూడా రక్షకుడిని స్వీకరించాలంటే బలమైన, ధృడమైన కోరికను కలిగి ఉండాలి. ఈ కోరిక కార్యసాధనకు శాయశక్తులా కృషించాలి. మన బలహీనతలను సహితము లెక్క చేయకూడదు. మన లక్ష్యము ఒక్కటై ఉండాలి. నేను నా కోసము జన్మించిన రక్షకుని నా జీవితములోనికి ఆహ్వానించాలి. నీ కృషిని చూసిన రక్షకుడు జక్కయ్యతో లాగానే నీతో కూడా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని ఓ శుభ సందేశాన్ని తెలియజేస్తాడు. 
కాబట్టి ఆ క్రిస్మస్ కేవలం ఓ మహోత్సవము లాగానే మిగిలిపోకూడదు. కానీ ఓ దైవానుభవముగా మారాలి. దైవానుభవముగా మారాలి అంటే క్రేస్తును స్వీకరించాలను నీ నిరీక్షణ నమ్మకముగా మారాలి, నీ నమ్మకము ఆనందముగా మారాలి, ఆనందము శాంతిగా మారాలి, శాంతి ప్రేమగా మారాలి. ఈ ప్రేమ క్రీస్తు కోసమై ఉండాలి. ఈ ప్రేమ నీలో క్రీస్తును జన్మింపజేస్తుంది. క్రీస్తులో నిన్ను జన్మింపజేస్తుంది. మరొకసారి మీ అందరికి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు.
ఆమెన్.....
Br. Sunil Inturi OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...