22, ఏప్రిల్ 2022, శుక్రవారం

పాస్క కాలపు రెండవ ఆదివారం

పాస్క కాలపు రెండవ ఆదివారం

 క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ! ఈనాడు మనందరం  కూడా పాస్కకాలపు రెండవ  ఆదివారం లోనికి ప్రవేశించి ఉన్నాం. అయితే ఈనాటి సువిశేష  పఠనం ద్వారా దేవుడు మనకు  5 విషయములను తెలియజేస్తున్నాడు. 

1. పునరుత్థాన యేసు ప్రభువు  శాంతి నొసగుచున్నాడు 

2. పునరుత్థాన యేసు ప్రభువు తనను తాను తెలియ పరుచుకుంటున్నాడు. 

3. తన చిత్తాన్ని శిష్యులకు తెలియ పరుస్తున్నాడు. 

4. పవిత్రత్మశక్తిని వారికి ఇస్తున్నాడు. 

5. దేవునికి సాక్షులుగా జీవించడానికి వారిని ఆహ్వానిస్తున్నాడు. 

1. శాంతినొసగుట 

యేసు ప్రభువు  పునరుత్థానుడైన తరువాత తన శిష్యులు ప్రాణ భయంతో , యూదులు వారిని చంపి వేస్తారేమో అని  తలంచి వారు ఒక ఇంటిలో ప్రవేశించి తలుపులు మూసుకొని జీవించారు. ప్రాణ భయంతో  జీవించారు. ప్రాణ భయంతో  తలుపులు మూసుకొని జీవించిన శిష్యుల జీవితాలలోకు పునరుత్థానుడైన యేసు క్రీస్తు వస్తున్నాడు. వారివద్దకు రావడమే కాదు. వారికి శాంతి నొసగుచున్నాడు. పునరుత్థానుడైన  యేసు క్రీస్తు మనతో ఉన్నడని మనం నిజంగా విశ్వసిస్తే , నీవు ఈలోకంలో జరుగు ఏ విపత్తుకు, నీ జీవితంలో ఏ విషయానికి దిగులు చెందక భయపడక ధైర్యం గా వుంటావు. యోహాను 20:20. లో చూస్తే  ప్రభువుని చూచిన వారు ఆనందించిరి, అని వ్రాయబడినది. కానీ 19 వ వచనంలో చూస్తే యూదుల భయముచే శిష్యులు ఒక చోట  తలుపులు మూసుకొని ఉండిరి. ఇక్కడ యూదులను చూసి భయ పడితే, అక్కడ యేసుని చూసి ఆనందించారు. మత్తయి 10:28 "శరీరమును మాత్రము నాశనము చేయ గలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. శరీరమును, ఆత్మను కూడా నాశనము చేయ గల వానికి భయపడుము." అని చాటుతున్నది.

 మనం జీవితంలో కూడా ఇది పాటించినట్లయితే  ఈలోకంలో ఎవరికి భయపడకుండా దేవుని శాంతిలో మనం జీవించగలుగుతాము. 

2. తనను తాను తెలియపరుచుకొనుట 

ఇక్కడ యేసు క్రీస్తు యొక్క కర్తవ్యం గూర్చి తెలుపబడుతుంది. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తన స్వార్ధం కోసం కాదు. మరి ఎందుకు  పంపబడ్డాడు అంటే అందరిని ప్రేమించి,  వారికి రక్షణ ఇవ్వడానకి. యోహను 3:17. దేవుడు తన కుమారుని ఈ లోకమునకు రక్షించడానికి పంపేనె కానీ దానిని ఖండించడానికి పంపలేదు. మరి ఈనాడు యేసు ప్రభువు కూడా తన శిష్యులను కూడా అదే చేయమనుచున్నాడు. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. యోహను 20:21. ఎందుకు దేవుడు తన శిష్యులను తన పనిని, కర్తవ్యాన్ని నెరవేర్చడానికి పంపుచున్నడంటే, యోహను 14:34 లో మనం చూస్తాము, ప్రభువు చెప్పేది ఏమిటంటే, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరి నొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. యోహను 6:57 . జీవము గల తండ్రి నన్ను పంపేను. 

3. తన చిత్తాన్ని వారికి తెలియ పరుస్తున్నాడు. యోహను 20:21 

యేసు చిత్తము ఏమిటంటే 1. ఒకరి నొకరు ప్రేమించుకోవాలి. యోహను 14:34 

2. ఒకరినొకరు క్షమించుకోవాలి యోహను 8:10 

3. ఒకరినొకరు రక్షించుకోవాలి లూకా 19:10 

4. ఒకరికొకరు ప్రార్ధన చేసుకోవాలి. లూకా 6:12 . నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. యోహను 20: 2 

4. పవిత్రత్మ శక్తిని వారికంధిచుట 

యోహను 14:18 నేను మిమ్ము అనాధులుగా విడిచి పెట్టను. నేను మీ ముద్దు వత్తును. ఈనాటి సువిశేషంలో దేవుడు తన  వాగ్ధానాన్ని తెలియపరుస్తున్నాడు. 

రెండవ పఠనంలో కూడా చూస్తే పవిత్రత్మ పొందిన శిష్యులు గొప్ప గొప్ప ప్రార్ధనలు చేస్తున్నారు. పేతురు నడుచుచున్నప్పుడు అతని అంగీని నీడన పడిన చాలు అని విశ్వసించిన ప్రజలు ఎప్పుడైతే శిష్యులు ఈలోక relationship ను తృణీకరిస్తున్నారో వారు   పవిత్రత్మ శక్తి ద్వార ఎన్ని అద్భుతాలు చేశారు. 

ఈ శక్తి ద్వార ఎంతో మంది విశ్వాసులు స్వస్థతను పొందుతున్నారు. నూతన విశ్వాసులుగా మారుచున్నారు. యోహను 20: 24. 

5. దేవునికి సాక్షులుగా వుండటానికి వారందరికీ ఆహ్వానిస్తున్నాడు. 

ఎలా మనం సాక్షులుగా మారుతం అంటే , మనల్ని మనం పూర్తిగా సమర్పించుకొనుటచే దేవునికి సాక్షులలుగా జీవించడానికి అలా చేశారు. ఎవరి పాపములైన  మీరు క్షమిస్తే వారి పాపములు క్షమించబడతాయి. మనం ఎప్పుడైతే ఇతరుల పాపములను క్షమిస్తామో అప్పుడు మనం దేవుని యొక్క సాక్షులుగా జీవిస్తాం. 

కాబట్టి ఈనాడు నీవు నేను ఈ లోకంలో ఉన్న వస్తువులకు , వ్యక్తులకు ,ఇబ్బందులకు బయపడకుండా దేవునికి భయ పడాలి. ఆయన పిలుపుని పొందిన మనం ఆయనను అనుసరించు వారీగా జీవించాలి. ఆ దేవాతి దేవుడినికి  ఒక గొప్ప సాక్షిగా మారి దేవుని ప్రేమను నీవు నేను అందరికి అందేలా చేయాలి. 

Br. Joseph mario 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...