16, జులై 2022, శనివారం

16వ సామాన్య ఆదివారము (2)

                         16  సామాన్య ఆదివారము

ఆది 18 : 1-10, కోలస్సి 1: 24-28, లూకా 10: 38-42

ఈనాటి దివ్య పఠనాలు ఇతరులకు ఆతిధ్యం ఇచ్చుట గురించి తెలియజేస్తున్నాయి

భారతీయ సంప్రదాయం ప్రకారం అతిధులను దైవంగా భావిస్తారు అందుకే అంటారు మాతృదేవోభవ పితృదోవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ అని అంటారు

అతిధిని ఆదరించి ఆతిధ్యం మంచిగా ఇస్తే దాని ద్వారా మనం దీవెనలు పొందుతాం 

ఈనాటి మొదటి పఠనంలో అబ్రాహాముసారా ఇచ్చిన ఆతిధ్యం గురించి చెప్పబడింది. సిందూరపు వృక్షము వద్ద కూర్చున్న అబ్రాహాము ప్రభువైన దేవుడను చూసారు 

దేవుడు ఇద్దరు దూతలను తన వెంటబెట్టుకొని సొదొమగోమర్రా పట్టణములను శిక్షించుటకు వెళ్లి మార్గములో అబ్రాహామును దర్శనం ఇస్తున్నారు ప్రభువు మానవ రూపంలో  దర్శనం ఇచ్చారు 

అబ్రాహాము  మార్గము గుండా వెళ్లుచున్న  ముగ్గురు దెగ్గరకు వెళ్లి సాగిల పడి నమస్కరిస్తున్నారుఅబ్రాహాము వారు దైవజనులు అని గుర్తించారు అందుకే వెంటనే వారిని తన ఇంటికిపిలుస్తున్నారు ముగ్గురు వ్యక్తులు అబ్రాహాము నీవు మాకు భోజనం సిద్ధం చేయమని అడుగలేదు కానీ ఆబ్రహామే వారిని పిలుస్తున్నాడువారిని ఆహ్వానించుటలో అబ్రాహాము యొక్క సిద్ధపాటుతత్వం చూస్తున్నాము.

అతిధులను చుసిన వెంటనే వారి దెగరకు వెళ్లి వారికీ నమస్కరించి పిలిచి తన ఇంటికి భోజనం చేయుటకు రమ్మనుచున్నాడు.

 ప్రాచీన కాలంలో ఆతిధ్యమును గొప్పగా భావించేవారుఆనాటి యూదులు కానివ్వండి తొలి క్రైస్తవులు కానివ్వండి ఎవరినా సేవకులనుబాటసారులను చుస్తే  వెంటనే వారికీ ఆతిధ్యం సేవ చేసెడి వారుఅందుకే ప్రభువు సువార్త సేవకు శిష్యులను పంపించే ముందు  గృహవమైతే మిమ్ము ఆహ్వానిస్తుందో అక్కడే ఉంది భుజించండి అని ప్రభువు తెలిపారు. లూకా 10 :8

 పరదేశయినబాటసారి అయినా ఎచటికి వెళ్లిన వారికీ తగిన మరియాదలు దక్కేవి. అప్పటి కొంతమంది విశ్వాసులు యొక్క నమ్మకం ఏమిటంటే అతిధులు దేవలోకంనుండి విచ్చేసిన వారు అని అనుకునేవారు ఇది అన్యమతస్తుల యొక్క దృఢ నమ్మకం.

ఇశ్రాయేలు ప్రజలు కూడా అతిధి ఇంటికి వచ్చినపుడు యావే దేవుడే వారిని సందర్శించటానికి వచ్చారు అని భావించేవారు అందుకే వారిని సత్కరించేవారుఆతిధ్య మిచ్చేవారు.

ఆతిధ్యం ఇచ్చేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గుర్తుంచుకునే అంశం ఏమిటంటే వారు కూడా ఒక్కపుడు ఐగుప్తు దేశంలో ఆతిథ్యంను పొందిన వారే కాబట్టి ఇతర అతిదులపట్ల జాలి కలిగి ఉండాలి అని ఎప్పుడు కూడా గుర్తుంచుకొని వారు. ప్రభువే స్వయంగా పరదేశుల పట్ల జాలి కలిగి జీవించమని చెప్పారు. (ద్వితీ 10 :18 -19 ).

అతిథికి సేవ చేస్తే ఆదేవునికి సేవ చేసినట్లే అనే భావన అనేక మందికి ఉండేది ఆరోజుల్లో.

అబ్రాహాము వారి సేవ చేయటం సంతోషంగా భావించారు వెంట వెంటనే వారికీ భోజనం సిద్ధం చేయాలనుకున్నాడుఏది ఏమైనా సరే వారికీ గొప్ప ఆతిధ్యం తనకున్న దానిలో ఇవ్వాలనుకున్నాడుఅందుకే వెంటనే సారా దెగ్గరకు వెళ్లి రొట్టెను చేయమన్నాడుఆవుదూడను తెచ్చి కోసి భోజనం సిద్ధం చేసాడు వారికీ కావలిసిన దంతా సమకూర్చాడు.

అబ్రాహాము దేవునితో చాల సన్నిహితంగా ఉంటూ దేవుని యొక్క సాన్నిద్యంను అనుభవిస్తున్నాడు కాబట్టియే వచ్చిన ముగ్గురును దేవుళ్లుగా భావించి సేవ చేశారు.

అబ్రాహాము వారికీ భోజనం వడ్డించే సమయంలో వారి చెంతనే కూర్చొని వారి యొక్క విలువైన మాటలను ఆలకిస్తున్నారు అబ్రాహాము జీవితంలో  రెండు అంశాలు చుస్తునాంమొదటిగా దేవునికి సేవ చేయుట రెండవది వారి చెంత కూర్చొని చూపిన దంత సావధానంగా వింటూ మననం చేసుకోవటం  రెండు లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉండాలిపొరుగు వారికీ సహాయం చేస్తే  సమయం దీవెనగా మారుతుంది.

షూనేము పట్టణంలో ఉన్న సంపన్నురాలు ఎలీషా ప్రవక్తకు ఒక గది నిర్మించి తాను అటువైపుగా పరిచేర్యకు వెళితే బస చేయుటకు ధాబా ఇంటిలోనే ఒక గదిని ప్రవక్త కోసం ఏర్పరిచారు. 2 రాజు 4 : 8 -10

  సంపన్నురాలు చేసిన సహాయం ఆమె జీవితంలో ఆశిర్వాదంగా మారింది. అదేమిటంటే ఆమెకు సంతానం కలిగింది. 2రాజు 4 :17

సారెఫెతులో ఉన్న వితంతువు కూడా ఏలీయా ప్రవక్తకు ఆతిధ్యమిచ్చి మంచిగా అన్ని ఏర్పరిచినది కావున దేవుడు తనను కూడా కష్టకాలం నుండి కాపాడారు.1 రాజు 17 :7 -16

జక్కయ యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించి యేసు ప్రభువుకు ఆతిధ్యం ఇచ్చారు. ఆయన రక్షణను పొందారు.

ఇంకా చాల మంది దైవ సేవకులకు ఆతిధ్యం ఇచ్చి దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకున్నారు.

మన యొక్క పొరుగు వారికీ సహాయం చేస్తే ఆది దేవునికి చేసినట్లే అని క్రీస్తు ప్రభువే సెలవిచ్చారు. మత్తయి 25 :40

మనం కూడా మన యొక్క పొరుగు వారికీ సహాయం చేస్తే దేవుడు ఆశిర్వదిస్తారు.

అబ్రాహాము దేవునికి ఆతిధ్యమిచ్చారు కాబట్టి అడగక పోయిన సరే దేవుడే అవసరతను గుర్తించి వారికీ సంతానం కలుగజేసారు.

 అసాధ్యమైనది దేవుడు వారి జీవితంలో సాధ్యం చేశారుఅబ్రాహాము వయస్సు 99 సారా వయస్సు 89 ఏళ్ళుఆది17:17 అయినప్పటికీ వారికీ దేవుడు సంతాన వరం కలుగుజేస్తున్నారు

దేవుడు అబ్రాహామును ఇచ్చిన వాగ్దానం  విధంగా నెరవేర్చుతున్నారు ఆది 12 :2 మహా జాతిగా తీర్చిదిద్దుతాను అని ప్రభువు చేసిన వాగ్దానం ప్రారంభమగుచున్నది.

మన యొక్క హృదయాలలో కూడా దేవునికి ఆతిధ్యం ఇచ్చి ఆహ్వానిస్తే దేవుడు మన జీవితాల్లో కూడా అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తారు.

అబ్రాహాము తన యొక్క మంచి తనముతో సేవ చేశారు ప్రేమ చూపారు అందుకే దీవెనెలు పొందారు.

 నాటి రెండవ పఠనంలో పౌలు గారు క్రీస్తు ప్రభువు కోసం అనుభవించే శ్రమలు గురించి బోధిస్తున్నారు.

తన శరీరమైన శ్రీసభ కోసం  శిరస్సు అయిన క్రీస్తు ప్రభువు అనేక శ్రమలు అనుభవాయించారు నిజానికి ఆయన అనుభవించిన శ్రమలలో ఎలాంటి కొదవ లేదు. ప్రభువు తనయొక్క శ్రమల, మరణ, పునరుత్తానం ద్వారా అంతా నెరవేర్చారు.

పౌలుగారు  తాను ఇంకా సువార్త వ్యాప్తికోసం ఎన్ని కష్టాలైనా అనుభవించుటకు సిద్ధంగా ఉన్నాను అని తెలుపుచున్నారు.

ప్రభువు సందేశము ప్రకటించుట తనకు అప్పచెప్పబడిన పని అని పౌలు గారు తెలుపుచున్నారుఆయనను దేవుడు ఎన్నుకున్నది అనేక యుగములనుండి దాచబడిన దేవుని పరమ రహస్యం అన్యులకు తెలియజేయుటకొరకే.

సువార్త బోధన చేసేటప్పుడు కష్టాలు అనేవి సర్వ సాధారణం ఎందుకంటె అవి మనలను దేవునికి సాక్షులయేలా చేస్తాయిశ్రములు అనుభవించటానికి సిద్ధంగా లేకపోతె మన యొక్క పరిచర్య ఫలప్రదం కాదుకాబట్టి సువార్తను బోధించుటకు ఎన్ని కష్టాలైనాశ్రమలైన అనుభవించుటకు సిద్ధంగా ఉండాలి.

పునీత పౌలు గారు దేవుని కొరకు జీవించుటలో ఆనందం ఉందని తెలిపారు అదేవిధంగా పౌలుగారు కోలస్సిలో ఉన్నటువంటి విశ్వాసులను దేవుని పరమ రహస్యాన్ని తన యొక్క హృదయమును తెరవమని ఆహ్వానిస్తున్నారు.

హృదయం తెరచి క్రీస్తు ప్రభువుకు ఆహ్వానం పలికితే వారిని కూడా ప్రభువు దీవిస్తారు అని పౌలుగారు తెలిపారు.

 నాటి సువిశేష పఠనంలో బెతానియా గ్రామములో మార్తమ్మమరియమ్మ గార్లు యేసు ప్రభువుకు ఆతిధ్యం ఇచ్చిన విధానం తెలుసుకుంటున్నాం.మార్తమ్మమరియమ్మల కుటుంబం అంటే దేవునికి చాల ఇష్టమైన కుటుంబం  కుటంబంలో ఉన్న లాజరు మరణించినపుడు ఆయన కన్నీరు కార్చారుప్రభువు ఎవరికోసం ఏడ్చినట్లు సువిశేషాలు చెప్పలేదు కేవలం లాజరు మరణ వార్త విన్నప్పుడే ప్రభువు ఏడ్చారు

మనకి చాల దెగ్గరగా ఉన్న వ్యక్తులు మరణిస్తేనే మనం బాధపడతాం, ఏడుస్తాం. మార్తమ్మమరియమ్మల కుటుంబం దేవునికి అంత సన్నిహితంగా ఉన్న కుటుంబం. యొక్క కుటుంబం గురించి కొన్ని అంశాలు మనం తెలుసుకొందాం.

మార్తమ్మ, మరియమ్మల కుటుంబం దేవుడిని ఆదరించిన కుటుంబం 

దేవునికి సేవచేసిన కుటుంబం 

దేవున్నిప్రేమించిన కుటుంబం 

దేవునికి ఆతిధ్యం మిచ్చిన కుటుంబం 

దేవుని కొరకు జీవించిన కుటుంబం 

ప్రభువు నందు ఆనందించు కుటుంబం.

మరియుమమ్మ, మార్తమ్మ గారి జీవితంలో చాల గొప్ప లక్షణాలను చూస్తున్నాము.

చాల సందర్భాలలో మనమందరం కూడా మరియమ్మ వలె ఉండాలని కోరుకుంటాము కానీ మనమందరం మార్తమ్మలాగా కూడా ఉండాలి ఆమెలో కూడా గొప్ప గొప్ప మంచి లక్షణాలు ఉన్నాయి

మార్తమ్మలో ఉన్న లక్షణాలు 

1)మార్తమ్మకు ఇచ్చే ఉదార స్వభావం ఉంది. తనకు ఉన్న దానిలో ప్రభువుకు మేలైనది చేసి ఇవ్వాలన్నది ఆమె కోరిక 

ప్రభువును తన ఇంటిలోకి ఆహ్వానించింది ఆయనతో పాటు శిస్యులుకూడా ఇంటిలోనికి ప్రవేశించారుమాములుగా ప్రభువు ఎక్కడికైనా వెళుతున్నారంటే ఆయనతో పాటు మిగతా సేవకులు కూడా వెళుతుంటారుఅలాంటి వారందరికీ మార్తమ్మ తన ఇంటిలో ఆతిధ్యం ఇచ్చింది.

ఎప్పుడో ఒక రోజున ఒక మంచి వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడు అంటే అతనికి లేదా ఆమెకు మేలైన ఆతిధ్య సేవలు అందిస్తారు.

యేసు ప్రభువు ఇంటిలోనికి ఆహ్వానించి తనకు తోచిన విధంగా రుచికరమైన ఆహారాన్ని ఇవ్వాలనుకొంది అది ఆమెకు ఉన్న ఇచ్చే మనస్సు.

అనేక మందికి ఆతిధ్యం ఇవ్వటమంటే ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ వారికోసం హెచ్చించాలని అనుకున్నదిఇక్కడ ఆమెలో ఉన్న ఉదార స్వభావం తెలుసుకుంటున్నాం.

2) మార్తమ్మ దైర్యం కలిగిన వ్యక్తిఆమెలో ఎంతో దైర్యం ఉంది ఎందుకంటె యెరూషలేములో ప్రభువును చంపాలనుకొని కొంతమంది అనుకున్నారు. యోహాను 7 : 25 , 7 : 30.

ఆయనకు చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు యోహాను- 7: 20, 43  

ఆయనను చాలామంది విడిచి వెళ్లారు యోహాను 5 : 66

  ప్రభువుకు ఆశ్రమిచ్చిందని తన శత్రువుల నుండి ముప్పు వస్తుందని తెలిసినప్పటికిని యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించింది.

క్రీస్తు కొరకు మరణించుటకు సైతం సిద్ధంగా ఉంది ఏది ఏమైనా పర్వాలేదు అని తలంచి ప్రభువును తన ఇంటికి ఆహ్వానించింది.

అదేవిధంగా సోదరుడి మరణ వార్త విని యేసయ్య వస్తాడని తెలుసుకొన్న మార్తమ్మ వెంటనే లేచి దైర్యంగా ఆయన్ను కలుసుకోవడానికి వెళ్ళుతుంది. యోహాను 11:18.

మరియమ్మ యేసు ప్రభువు పిలిస్తేనే వెళ్ళింది యోహాను 11:28. కానీ మార్తమ్మ ఆయన్ను కలుసుకోవడానికి ఆతురతతో దైర్యంగా ముందుకు వెళ్లుచున్నారుఅది ఆమె యొక్క దైర్యం.

మార్తమ్మ యేసు ప్రభువుని విశ్వసించిన వ్యక్తి :మార్తమ్మకు క్రీస్తునందు సంపూర్ణమైన విశ్వాసం ఉందిఆమె వాస్తవానికి చాలా మంచిది, దేవుని చేత ఆదరించబడినది. యోహాను 11:5.

క్రీస్తు ప్రభువు మరణించిన వారికీ సైతం జీవమును ప్రసాదిస్తారని ఆమె విశ్వసించింది. యోహాను 11:27.

ఆమె యొక్క విశ్వాస జీవితం చుసిన ప్రభువు తన యొక్క సోదరునికి జీవ ప్రసాదిస్తున్నారు.

మరణించిన వారు జీవితంలో లేపబడతారు అనే అంశం నమ్మాలంటే దానికి గొప్ప విశ్వాసం కావాలి అలాంటి విశ్వాసం మార్తమ్మలో చుస్తునాం.

క్రీస్తు ప్రభువును ఆమె సంపూర్ణంగా విశ్వసించింది.

4) మార్తమ్మ ప్రేమించే వ్యక్తి : మార్తమ్మ సోదర ప్రేమ కలిగి జీవించింది అందుకే లాజరును, మరియమ్మను తన దెగ్గరనే ఉంచుకుంది. యోహాను 11:1.

అదేవిధంగా దేవుడిని ప్రేమించిందిశిష్యులను ప్రేమించింది అందుకే వారికి మేలు చేయాలనీ భావించింది.

5) మార్తమ్మ తను తన యొక్క పనిలో నిమగ్నమై ఉన్న వ్యక్తి అంటే తాను తీసుకున్న బాధ్యతను 100% సక్రమంగా నెరవేర్చలనుకున్న వ్యక్తి అందుకే కుటుంబం బాధ్యతలను తన మీద వేసుకున్నారు అదే విధంగా యేసు ప్రభువుకు ఆతిధ్య ఇచ్చే బాధ్యతను సక్రమంగా చేయాలనుకున్నారుయేసు ప్రభువును  భోజనం ద్వారా సంతృప్తి పరచాలనుకున్నదిచాలా మంచి లక్షణాలు ఉన్న మార్తమ్మలో ఒక చిన్న బలహీనత ఉంది ఏమిటంటే ఆమె అనేక పనులతో సతమతమగుచున్నది.ఆమె ఏమి చేయాలాఎలా చేయాలా అనే ఆలోచనల్లో ఉంది ఎవరిని పట్టించుకోలేనంత పనిలో ఉందిఅందుకే ప్రభువు ఆమెను రెండు సార్లు పిలుస్తున్నారుఒక సారి పలకకపోతే రెండొవ సారి పిలుస్తూ మార్తమ్మ అనేక విషయాలు గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఆమె మొదట సారి పలుక లేదుమార్తమ్మ ఒక విధంగా చెప్పాలంటే పరధ్యానంగా అయ్యింది కలవరపడ్డదిమనం కూడా తొందరగానే కలవరపడతాంపరధ్యానం అవుతుంటాముగుడికి క్రొత్త చీర కట్టుకొని వచ్చానాక్రొత్త నగలు ధరించానాక్రొత్త వాళ్ళు వచ్చిన వారిని చూసి వెంటనే కలవరపడుతుంటాముమనకి facebookలో,whatsappలో చాట్ చేయటానికి సమయం ఉంటుంది కానీ దేవుని దెగ్గర కూర్చోవటానికి సమయం ఉండదు.

 లోక సంబంధమైన పనులలో మనమందరం నిమగ్నమై  ఉంటున్నాము.

మరియమ్మలో ఉన్న లక్షణాలు 

1) మరియమ్మ వినయవంతురాలు:- దేవుని పాదములు చెంత కూర్చొని ఆయన చెప్పే ప్రతి మాటను సావధానంగా విన్నది. దేవుడైన క్రీస్తు ప్రభువును ఆదరించింది.

2) మరియమ్మ వచనాహారం కోసం తపించుచున్నదిమరియమ్మ గారు యేసయ్య చెప్పే పరలోక సత్యములు తెలుసుకొని తన జీవితమును మార్చుకోవాలనుకున్నది.

వాక్యం విని దేవుని వాక్కు మననం చేసుకొని దాని ప్రకారంగా జీవించాలనుకున్నది.

దేవుని యొక్క వాక్కు వలన జీవిస్తాను అని భావించి. మత్తయి 4:4  

దేవుని మాటలు నిత్యా జీవపు మాటలు అని తలంచి వాటిని ఆలకించటానికి ప్రభువు పాదాల చెంత కూర్చున్నది 

మరియమ్మ గారు చేసినది ఉత్తమమే అని ప్రభువు  మెచ్చుకున్నారు వచ్చిన అతిధిని పట్టించుకోకపోతే అది కూడా తప్పే అందుకే మరియమ్మ యేసు ప్రభువు దగ్గర ఉన్నారు.

మన విశ్వాసం జీవితంలో వీరిద్దరిలో ఉన్న లక్షణాలు ఉండాలి 

1. దేవుని దెగ్గర కూర్చోవాలి 

2. దేవునికి సేవ చేయాలి 

మోషే ప్రవక్త దేవుని దెగ్గర 40 రోజులు కూర్చొని ఆయన మాటలు విని దేవుని సేవ చేశారు

యేసు ప్రబువు కూడా 40 రోజులు నిర్జన ప్రదేశంలో తండ్రితో గడిపి తండ్రి పరిచర్య ప్రారంబించారు.

మనం కూడా దేవుని దెగ్గర కూర్చొని ఆయన సేవ చేయాలి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి.

 కుటుంబం ఇచ్చిన ఆతిధ్యం ద్వారా వారు తమ్ముడు పునర్జన్మ పొందాడు కాబట్టి ఇతరులకు ఆతిధ్యం ఇచ్చి దేవుని అనుగ్రహాలు పొందుదాం.

ఫాదర్. బాల యేసు. . సి. డి.

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...