మూడవ సామాన్య ఆదివారం
నెహెమ్యా 8:2-4,5-6,8-10 1 కోరింథీ 12:12-30 లూకా 1:1-4,4:14-21
నేటి దివ్య పఠనాలు దేవుని యొక్క వాక్కు వినేటటువంటి ప్రజలు ఎలాంటి జీవితం జీవించాలి అనే అంశం గురించి తెలుపుతున్నాయి. దేవుని యొక్క వాక్కు యొక్క గొప్పతనం శక్తిని గ్రహించి దేవుని ప్రజలు ఐక్యత, సక్యత కలిగి జీవిస్తూ దేవున్ని అంటి పెట్టుకొని జీవిస్తూ దేవుని సేవ చేయాలని కూడా ఈనాటి పఠనాలు మనకు తెలుపుచున్నాయి.
ఈనాటి మొదటి పఠనంలో దేవుని వాక్కు యొక్క గొప్పతనం గురించి చదువుకుంటున్నాము. మొదటి పఠనం యొక్క చరిత్ర మనం గ్రహిస్తే, ఆనాటి పర్షియా రాజు కోరేషు బాబిలోనియా ప్రజలను జయించిన తరువాత బానిసత్వంలో దాదాపు 70 సంవత్సరాలు గడిపిన యూదులను వారి సొంత భూమి అయిన యెరుషలేముకు పంపించారు.
తిరిగి వచ్చిన యూదులు యెరుషలేము దేవాలయంణు పునర్నిమించారు. ఎజ్రా 6:15-17 అదే విధంగా ఆ పట్టనపు గొడలు కూడా కట్టడం ముగించిన పిదప దేవుని యొక్క వాక్యం చదువుచున్నారు. దేవుని యొక్క వాక్యం చదువుచున్నారు. దేవుని యొక్క వాక్యం చదివినది ఎజ్రా. ఆయన ధర్మ శాస్త్ర భోధకుడు , యాజకుడు అదే విధంగా మత సంబంధిత నాయకుడు (నెహెమ్యా 8:9)
అదేవిధంగా నెహెమ్యా రాష్ట్ర పాలకుడు దేవునితో మంచి అనుభందం కలిగిన వ్యక్తి, దైవ భయం వున్న వ్యక్తి ,దేవుడు ఎజ్రాకు మరియు నెహెమ్యాకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పజెప్పారు. ఆదేమిటంటె దేవుని యొక్క వాక్కును ప్రకటించుట, ప్రకటించుట మాత్రమే కాదు ప్రజలను ప్రేరేపించాలి.
ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్కు మనం ప్రకటించాలి, ఇతరులను దైవ వాక్కుతో ప్రేరేపించాలి. ఈ మొదటి పఠనంలో యిస్రాయేలు ప్రజలు దేవుని యొక్క వాక్కును వినుటకు కనబరిచిన ఆసక్తి గొప్పది.
దేవుని యొక్క వాక్కు వినాలని ఎంతో ఆశతో వున్నారు. దేవుని యొక్క వాక్కు దేవునితో సమానమని భావించారు. బానిసత్వంలో బహిరంగంగా దేవుని వాక్కు ఆలకించే అవకాశం లేదు అందుకే ఇప్పుడు దొరికిన అవకాశంను బట్టి వారు ఆ వాక్కుకై తయారై వున్నారు. ఎజ్రా దేవుని వాక్కు చదివినప్పుడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అందరుకూడా సావదానంగా విన్నారు. వారు విసుగు చెందక, అలసట పొందకు అదే పనిగా ఎలాగా వినగలిగారు. అంటే ఆ వాక్కులు ఆ ప్రజలకు వినసొంపుగా వున్నాయి. ఆ వాక్కు వల్ల దేవుని తెలుసుకోవచ్చు అం గ్రహించారు. కీర్తన 119:103
ఆ వాక్యములు వారికి వెలుగును , చూపేలా ఉన్నాయి. అందుకే వాటిని వినడానికి చాలా ఇష్టపడుతున్నారు. దేవుని వాక్కు యొక్క ఔనత్యాన్ని తెలుసుకున్నారు. అందుకే ఎటువంటి ఇబ్బంది లేకుండా విన్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంకు దైవ వాక్కే ఆహారం. దేవుని యొక్క వాక్కు సృష్టించే వాక్కు అని. దేవుని యొక్క వాక్కు ఆదరించే వాక్కు అని ,దేవుని యొక్క వాక్కు నేర్పించే వాక్కు అని , దేవుని యొక్క వాక్కు పుట్టించే వాక్కు అని , దేవుని యొక్క వాక్కు స్వస్థత నిచ్చే వాక్కు అని వారు గ్రహించారు.
మనం దేవుని వాక్కుకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం? దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి చదవడానికి ఎంత మందికి ఆసక్తి ఉంది. యూదుల కాలంలో అందరి దగ్గర దేవుడు మోషే ద్వార ఇచ్చిన ధర్మ శాస్త్రం లేదు అయినప్పటికీ అయినప్పటికీ అవకాశం ఉన్న చోటల్లా దేవుని వాక్కు వింటున్నారు. మనందరికీ ఇప్పుడు బైబుల్ గ్రంధం ఉంది. ఎంత మంది చదువుతున్నారు? చదువు లేకపోయినా చదువుకున్న బిడ్డల దగ్గర ఎంతమంది చదివించుకొని వింటున్నారు.
గుడికి వచ్చినప్పుడు యాజకులు బైబుల్ గ్రంధం మొత్తం వివరించలేరు ప్రసంగంలో , అందుకే దేవున్ని తెలుసుకోవాలంటే మన జీవితాలు సన్మార్గంలో నడిపించు కోవాలంటే మనం దేవుని వాక్కు చదవాలి, వినాలి.
చదివితే మరియు వింటేనే మనలో విశ్వాసం పెరుగుతుంది. రోమి 10:17. ఆనాటి యూదా ప్రజలు సమయం గురించి ఆలోచించలేదు. దేవుని వాక్కు గురించి మాత్రమే ఆలోచించారు. మనం కూడా పవిత్ర గ్రంధం చదువుట ద్వారా దేవుని ప్రేమ, క్షమా, త్యాగం చాల విషయాలు నేర్చుకోవచ్చు.
అలంటి ఆసక్తి మనలో ఉందా?
2. రెండవది గా దేవుని ధర్మ శాస్త్రమునకు ఇచ్చిన గౌరవం అందరం ధ్యానించుకోవాలి.
నెహెమ్యా 8: 5-6 ఎప్పుడైతే ఏజ్రా
గ్రంధమును విప్పారో అప్పుడు అందరుకూడా లేచి నిలబడ్డారు, దేవుణ్ణి స్తుతించి అదేవిధంగా ఆ ప్రభువుని ఆరాధించారు.
- ఆ గ్రంధం గురించి వారికి తెలుసు కాబట్టియే ఆ పుస్తకం కు అంత ప్రాధాన్యత
ఇచ్చారు.
-మరి ఈ రోజు మనం పవిత్ర గ్రంథం ను ఎలాంటి స్థలాల్లో ఉంచుతున్నాం?
-కొంతమంది ఎక్కడెక్కడో పెడతారో. అది కాదు మనం చేయాల్సింది, ఆ గ్రంధం దేవుడే కాబట్టి మనం మంచి స్థలం ఇవ్వాలి.
- విలువ గ్రహిస్తే ప్రాధాన్యత ఇస్తాం. ఇశ్రాయేలు ప్రజలు గ్రహించారు
కాబట్టియే అది చేయగలిగారు.
-చర్చిలో నిలబడ్డ సమయంలో కొన్నిసార్లు బైబిలు మన కాళ్ళ దగ్గరఉంటుంది. అది కూడా
మనం పట్టుకొని నిలబడితే అప్పుడు ఆ వాక్కు కు మనం గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.
- ప్రతి ఒక్కరు పవిత్ర గ్రంధమును దేవాలయానికి తీసుకురావాలి.
-దేవునియొక్క వాక్కును చదివిననప్పుడు వారియొక్క హృదయాలు చలించి పోయాయి.
అందుకే దుఃఖం పట్టలేక ఏడ్చిరి . నెహెమ్యా 8:9
- దేవుని ఆజ్ఞలు మీరు జీవించినందుకు ఏడ్చి ఉండవచ్చును.
- వారు బోరున ఏడ్చారు. దేవుని వాక్కును విన్న సమయంలో దేవుడి ప్రేమ వారికి
గుర్తుకు వచ్చింది.
-దేవుడు వారిని ఒక కాపరిగా, తండ్రిగా నడిపించిన
విధానం గుర్తుకు వచ్చింది.
-వారికి బానిసత్వం వచ్చింది ఆయన యొక్క వాక్కును ధిక్కరించడం వల్లే అని గ్రహించి
ఉండవచ్చును.
- వారికి ఇచ్చిన మన్నా, పూరేడు పిట్టలు, సమృద్ధిగా స్వేచ్ఛ జీవితం గుర్తుకు వచ్చింది.
- వారు దైవమును కాదని అన్య దైవములను ఆరాధించిన పాపపు జీవితం గుర్తుకు వచ్చింది.
-దేవుని యొక్క వాక్కు వారి జీవితాలకు అన్వయించారు కాబట్టియే వారియొక్క బలహీనతలు, పాపపు మచ్చలు గుర్తుకు వచ్చాయి.
మనం కూడా దేవుని వాక్కును మన జీవితాలకు అన్వయించుకుంటేనే మనలో కూడా హృదయ పరివర్తనం అనేది కలుగుతుంది.
- కొన్నిసార్లు మనం కొంతమందిని చూస్తాం ప్రసంగం చెప్పేటప్పుడు ఏడుస్తారు
ఎందుకంటే ఆ వాక్యం వారిని తాకింది.
అదేవిధంగా వారియొక్క పాపపు జీవితం గుర్తుకు వచ్చినప్పుడు, ఏడుస్తారు.
-పాపపు జీవితం ద్వారా, స్వార్ధపు జీవితం
ద్వారా ఇతరులను దేవుడిని బాధ పెట్టిన సమయాల గురించి వాక్యంతో భోదించినప్పుడు
సాధారణంగా అందరూ ఏడుస్తారు. మనం కూడా ప్రభువు యొక్క వాక్కు విన్న సమయంలో భాద కలిగి
మార్పు కలగాలి.
1.సౌలు విన్నాడు హృదయ పరివర్తనం చెందాడు. (పౌలు)
2.దావీదు నాతాను ప్రవక్త యొక్క దైవ వాక్కులు విన్నాడు పశ్చాత్తాప పడ్డారు.
3.నినెవె పట్టణ వాసులు విన్నారు దుఃఖం తో జీవితాలు సరిచేసుకున్నారు
4.అగస్టీను దేవుని యొక్క వాక్కు విన్నాడు -హృదయ పరివర్తనం చెందాడు. మనం
కూడా అలాగే మన జీవితాలు మార్చుకోవాలి.
-వాక్యం చదవటానికి, వినటానికి సమయం కేటాయించాలి.
అప్పుడే దేవుని గురించి తెలుసుకొని జీవిస్తాము.
-దేవుని వాక్కు చదివితే ఆ వాక్యమే మనలను నడిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. మనం ఎలా జీవించాలి అని తెలుపుతుంది.
- దేవుని యొక్క వాక్కు లేని లోపం వారు తెలుసుకున్నారు. అందుకే ఎంత సమయమైనా
కాని పట్టించుకోకుండా శ్రద్ధగా విన్నారు, ప్రభువునందు
ఆనందించారు. అలాంటి విశ్వాసం, ఆశ మనలో కూడా ఉండాలి.
రెండవ పఠనంలో
దేవుని బిడ్డలు, దేవుని వాక్కు
వినేవారు చదివేవారు జీవించవలసిన విధానం గురించి పౌలుగారు తెలుపుచున్నారు.
-కొరింతు ప్రాంతంలో భిన్నమైన ప్రజలు జీవిస్తుండేవారు వారిలో బేధాభిప్రాయాలు
ఎక్కువగానే ఉండేయి. ఐతే పౌలు గారు వారందరు కూడా ఐక్యంగా కలిసి జీవించుటకు శరీరం
మరియు దానిలో వున్నా అవయవములు ఉదాహరణ తీసుకొని ఐక్యతను గురించి తెలుపుచున్నారు.
-జ్ఞానస్నానం పొందిన ప్రతి యొక్క విశ్వాసి దేవుని యొక్క పవిత్రమైన శరీరంలో
భాగమే.
- జ్ఞాన స్నానం స్వీకరించుటకు ముందు మనలో ఎన్నోరకాలైన భావాలూ భేదాలు
ఉన్నప్పటికీ వాటన్నింటిని జ్ఞానస్నానం పొందిన తరువాత విడిచిపెట్టాలి అని పౌలుగారు
వివరిస్తున్నారు. (1కొరింతి12: 12-13 )
-మన శరీరంలో వున్న ప్రతియొక్క అవయవం ముఖ్యమైనది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని
ఉంటుంది. కొన్ని అవయవాలు పెద్దవి అయివుండవచ్చును కొన్ని చిన్నవి అయి ఉండవచ్చు, అయినప్పటికీ దేని ప్రాముఖ్యత దానికి ఉంది.
-కాబట్టి ఒక్క అవయవం ఇంకొక్క దానికి సహకరిస్తూ జీవిస్తే అక్కడ మంచిగా
ఆరోగ్యంగా ఉంటుంది.
-మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తేనే మనందరం బాగుంటాం. ఏది బాగా లేకపోయినా
మనం సంతోషం గా ఉండలేము. అలాగే మనందరం కూడా దేవుని శరీరంలో భాగస్తులం మరి మనం కూడా ఐక్యంగా జీవించాలి.
చేయి నోటికి సహకరించకపోతే మనం తినలేం
-కన్ను కాలికి సహకరించకపోతే మనం నడవలేం
-నోరు చెవులకు సహకరించకపోతే మనం వినలేం.
అందుకే ప్రతి ఒక్క అవయవం అవసరం, ప్రతి అవయవం
శరీర అభివృద్ధి కోసం, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడాలి.
-ప్రతి ఒక్క వ్యక్తి తాను శ్రీసభ (శరీరం) కోసం తన వంతు తాను కష్టపడాలి. అప్పుడే
శ్రీసభ ఆనందంగా ఉంటుంది.
- శ్రీ సభ శిరస్సు క్రీస్తుప్రభువే ఆయన లేకుండా మనం లేము. కాబట్టి ఆ శరీరం
గొప్పతనం గ్రహించి , సహకరించి జీవించాలి.
-మనందరం కూడా ఐక్యత కలిగి జీవించాలి. పౌలుగారు అంటారు జ్ఞానస్నానం
పొందినవారందరు దేవుని బిడ్డలే అందుకే వారు ఐక్యంగా జీవించాలి.
-సాధారణంగా సమాజంలో మనం చుస్తే ఇంకా చాలామందికి జాతి,
మత, కుల భేదాభి ప్రాయాలు
వున్నాయి. బహుశా ఇంకా వారిని దేవుని యొక్క వాక్కు తాకలేదు.
-స్వయంగా యేసు ప్రభువే తనను తాను తగ్గించుకొని పాపులతో, సుంకరులతో కలిసి జీవించారు.
-పౌలు పరిసయ్యుడు అయినప్పటికీ అన్యులకు సేవచేసారు. ఆయన్ను దేవుని వాక్కు
మార్చింది.
-దేవుని వాక్కు అతనికి వివేకాన్ని అందించింది అందుకే భేదాభి ప్రాయాలు లేకుండా
జీవించారు.
-మనం దేవుని బిడ్డలం, ఆయన మన తండ్రి మనందరం ఒకే
కుటుంబంలో ని బిడ్డలం కాబట్టి అందరితో కలిసి మెలసి ఐక్యంగా జీవించాలి.
-శ్రీ సభ అభివృద్ధి కోసం సహాయపడాలి. అందరుకూడా విలువైన వారే ధనిక -పేద
వ్యత్యాసం లేకుండా .
-మనందరం దేవుని వాక్కు చదివి, ధ్యానించి ఆ వాక్కు
అనుసారం జీవించాలి, ఎలాంటి భేదాలు మనలో వుండవు. వాక్యమును
చదువుకొని జీవించుద్దాం, ఐక్యంగా కృషిచేద్దాం.
-ఈనాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు యొక్క పంపబడిన విధానం
తెలుసుకుందాం.
-ప్రభువు ఎందుకు ఈ లోకానికి పంపించబడ్డారు అని తెలుపుచున్నారు.
సువార్త ప్రారంభంలో లూకా గారు ఈ సువార్త తెయోఫిలుకు వ్రాస్తున్నారు. అదేవిధంగా
అందరి విశ్వాసుల కోసం వ్రాస్తున్నారు.
-తెయోఫిలు బహుశా నీటి గలిగిన వ్యక్తి అయి ఉండవచ్చు, మంచి
పేరు కలిగిన వ్యక్తి కావచ్చు, లేకపోతే దేవుణ్ణి తెలుసుకోవాలి
అనే ఆసక్తి కలిగి లూకా గారిని యేసు ప్రభువు గురించి వ్రాయమని అడిగివుండవచు.
-బహుశా దేవునియందు విశ్వాసం ఉంచి క్రొత్తగా జ్ఞానస్నానం పొందిన వ్యక్తి అయి
ఉండవచ్చు.
-తెయోఫిలు అంటే (a
friend of God) దేవునికి స్నేహితుడు, దేవుణ్ణి ప్రేమించువాడు అని అర్థం.
-దేవుణ్ణి ప్రేమించు ప్రతిఒక్కరికి లూకా గారు ఈ సువార్తను వ్రాస్తున్నారు.
-వారియొక్క విశ్వాసంలో దృడంగా ఉండటానికి ఈ విధంగా వ్రాస్తున్నారు.
-సువార్తలో మనం వింటున్నాం లూకా 4:14-15 యేసు ప్రభువు చేసినా సువార్త పరిచర్య గురించి
-ఆయన కేవలం ప్రార్థించుటకు మాత్రమే కాకుండా వీలైన ప్రతి సమయంలో వాక్యాన్ని
ప్రకటిస్తున్నారు.
-ప్రకటించిన వాక్యంకు ప్రతి ఫలం ఉండాలి. యేసుప్రభువు తండ్రి గురించి
సువార్తలో తెలిపారు. ఆయన యొక్క జీవిత లక్ష్యం, ప్రణాళిక
తెలిపారు.
-ప్రభువు ప్రతి ప్రాంతమునకు వెళ్ళేది అందరూ కూడా దేవున్ని తెలుసుకొని,
హృదయ పరివర్తనం చెంది, రక్షణ పొందాలి అనే
ఉద్దేశంతోనే.
యేసు ప్రభువు చదివిన మాటలు యెషయా 61:1-2 నుండి తీసుకొనబడినవి.
- ఈ మాటలు మోషే ఎన్నికకు దగ్గరగా వున్నాయి. నిర్గమ 3:7-10
మోషేను ఎందుకు ప్రభువు ఎన్నుకున్నారు అని తెలుపుచున్నారు.
-18 వచనం ద్వారా దేవుని ఎన్నిక దేని నిమిత్తం అని అర్థమవుతున్నది.
1. దేవుని ఆత్మ ఆయన పై ఉన్నది.
2. పేదలకు సువార్తను భోధించుటకు అభిషేకించారు.
3. చెరలో వున్న వారికి విడుదలను దయచేయుటకు.
4. గ్రుడ్డివారికి చూపును నిచ్చుటకును
5. పీడితులకు విమోచనం కలిగించుటకును
6. ప్రభు హిత సంవత్సరమును ప్రకటించుటకు ఆయన్ను అభిషేకించారు.
-దేవుని కార్యముల కోసం, సువార్త వ్యాప్తి కోసం మూడు
రకాల ప్రజలు అభిషేకించబడ్డారు.
1.రాజులు
2.యాజకులు
3.ప్రవక్తలు
1.సమువేలు సౌలును, దావీదును రాజులుగా అభిషేకిస్తున్నారు.
దేవుని యొక్క ప్రతినిధులు వుంది దేవుని కార్యములు నెరవేరుచుటకు.
2. యాజకులు ప్రతి ఒక్క యాజకున్ని దేవుడు అభిషేకిస్తారు దేవుని యొక్క యాజకులు
ఆరోను దేవుని యొక్క యాజకులు ఆరోను అతని కుమారులు దేవుని సేవకోసం ప్రత్యేకంగా
కేటాయించబడిన వారు - 2 రాజులు 29, 30 అధ్యాయాల్లో చెప్పబడినవి.
3. ప్రవక్తలు - దేవుడే వారికి స్వయంగా పిలుపునిస్తున్నారు. దేవునికి మానవులకు మధ్యవర్తులుగా ఉండటానికి దేవుడు ఏలియాతో ఏలిషాను అభిషేకించడానికి చెప్పారు. 1 రాజులు 19:16-19 వీరందరూ దేవుని యొక్క పనికోశం అభిషేకించబడిన వారే, వారికి అధికారం , శక్తి, ఆత్మ వరములు ఇవ్వబడ్డాయి. కాబట్టి వారు చేసే సువార్త అంగీకరించి జీవించాలి.
1. దేవుని ఆత్మ అభిషేకించబడిన వారి మీద ఉన్నది. దేవుని ఆత్మచె వారు నడిపించబడాలి. యేసు ప్రభువు నాపై ప్రభుని ఆత్మ ఉన్నది అని పలికారు. ఆ ఆత్మ శక్తిచే శోదనలు జయించారు, ఆత్మ శక్తిచే సువార్తను ప్రకటించారు. కష్టలు ఓదార్చుకున్నారు. దేవుని ఆత్మ తనను పరిచర్యకు సంపూర్ణంగా సిద్దం చేసింది.
దేవుడు తాను పిలిచిన వారిని బలపరుస్తారు. దేవుని యొక్క ఆత్మ వారిని నడిపిస్తుంది.
2. పేదలకు సువార్తను భోధించారు. పేదలు అనగా లేని వారు. దేవుని గురించి అవగాహన లేనివారు. దైవ ప్రేమ లేని వారు, దేవుని సుగుణాలు లేని వారు ,దేవుని యొక్క ఆత్మ లేనివారు, దేవుని యొక్క మంచి తనం, గొప్పతనం తెలియని వారికి సువార్తను ప్రకటించుటకు యేసు ప్రభువును తండ్రి దేవుడు అభిషేకించారు. గురువులను కూడా అందుకే అభిషేకించారు.
3. చెరసాలలో ఉన్న వారికి విడుదల దయచేయుటకు ఈ లోక ఆశతో , వ్యామోహంతో బంధీలుగా ఉన్నవారిని పాప సంకీర్తనల ద్వారా విడుదల దయ చేయుటకు దేవుని యొక్క పరిశుద్ద వాక్కు ద్వారా విడుదల దయ చేయుటకు ఎన్నుకొనబడ్డారు.
4. గ్రుడ్డి వారికి చూపు నిచ్చుటకు
ఎవరైతే దేవుని యొక్క కార్యాలు చూడలేక పోతున్నారు. దేవున్ని తమ జీవితంలో గుర్తించలేక పోతున్నారు. ఎదుటి వారిలో ఉన్న ప్రేమను చూడలేని గ్రుడ్డి వారు కొంతమంది కనులుండి గ్రుడ్డి వారిగా ఉండే వాళ్ళు ఉన్నారు. వారు అనుకున్నదే సత్యం అనుకుంటారు అట్టి వారికి దేవుడు మాత్రమే చూపు నివ్వగలరు.
కొందరికి దేవుడు ఆధ్యాత్మిక చూపు దయ చేస్తారు.
5. పిడితులకు -విమోచనం -ఎవరైతే శారీరకంగా , మానసికంగా ,ఆధ్యాత్మికంగా పీడించబడుతున్నారో అలాగే దయాల చేత పీడించబడేవారికి ,విమోచనం కలిగిస్తారు. మానసిక గాయాలవల్ల పీడించబడే వారు , అణచి వేయబడినవారు , ఎదుటి వారి పట్ల హర్ట్ అయినవారికి విమోచనం కలుగ చేయుటకు పంపించబడ్డారు.
6.దేవుని సంవత్సరం ప్రకటించుటకు - దేవుని యొక్క రక్షణ సంవత్సరం అని అర్ధం లేక మెస్సీయ్య యొక్క రాక అని అర్ధం. దేవుడు వారి మధ్యలో ఉన్నారు, అని తెలిపే సంవత్సరం అది. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి, అనుసరించి ఆ వాక్కు చేత స్వతత్రం పొందుతు సన్మార్గంలో నడుస్తూ దేవునికి అంగీకార జీవితం జీవిద్దాం. సాధ్యమైనంత వరకు సువార్త వ్యాప్తి కోసం కృషి చేద్దాం, దేవుని రాజ్య స్థాపనకు కృషి చేద్దాం.
REV.FR.BALAYESU OCD