31, డిసెంబర్ 2021, శుక్రవారం

నూతన సంవత్సరము

నూతన సంవత్సరము
                                                                               పఠనములు:సంఖ్యా:6 :22-27,   గల : 4;4-7,లూకా;2:16-21

         ఈనాడు మనమందరము నూతన సంవత్సరములోనికి అడుగెడుతున్నాము. ఈనాడు మనమందరము నూతన సంవత్సరములోనికి అడుగెడుతున్నాము. ఈ నూతన సంవత్సరములో మనము ఈలోకంలో జరుగు విపత్తులను చూచి భయపడనక్కరలేదు. నాజీవితములో ఏమిజరుగుతుందోఅని దిగులుచెందనక్కరలేదు.నేనిప్పడిదాకా పాపపుజీవితాన్ని జీవించాను అని కుమిలిపోనక్కరలేదు. కానీ దేవునియందు విశ్వాసము కలిగి జీవించు. దేవునియందు నమ్మకము కలిగి నాజీవితములో ఏమిజరిగినా అంతా దేవుడే చూసుకుంటాడని నీవు విశ్వసించినట్లయితే, నీవు ఈలోకంలో దేనికీ భయపడనక్కర లేదు. నీవు భయపడేది ఎవరికయ్యా అంటే, నిన్ను సృష్టించిన దేవునికి, నీకు రక్షణ నిచ్చిన దేవునికి.
      ఈనాడు మనమందరము మూడు పండుగలను జరుపుకొనుచున్నాము. అవి:1 .మరియమాత మాతృత్వ పండుగ.2 .యేసుప్రభువు యొక్క నామకరణ పండుగ.3 .నూతన సంవత్సరం.
      1. మరియమాత మాతృత్వ పండుగ:
            మరియ మాత యొక్క మాతృత్వపండుగను ఈలోక నలుమూలల ప్రతియొక్క కాథోలికుడు జరుపుకుంటారు.సాధారణముగా,కాథోలికులైన మనము మరియ మాత అనగానే,దేవునియొక్క తల్లి అని, నిష్కళంక మాత అని, దేవునియొక్క సంకల్పానికి తలయొగ్గి, విశ్వసించి,దానిని తన జీవితములో నెరవేర్చిన గొప్ప తల్లి అని మనందరికీ తెలిసిన విషయమే.అయితే ఈనాడు మనము ఎందుకు ఈ పండుగను జరుపుకొనుచున్నాము,దాని ప్రాముఖ్యత ఏమిటని తెలుసుకుందాము.
          పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల జీవితములో మనము చూసినట్లయితే, ఫరోరాజు బానిసత్వములో పడి మ్రగ్గిపోతూ, కన్నీరు కారుస్తూ, ఇక దేవుడేమాకు దిక్కు అని ఆ దేవాతి దేవునికి మొరపెట్టినపుడు వారి గోడును ఆలకించి వారి రక్షణకు దాస్యవిముక్తికొరకు మోషే ప్రవక్తను ఎన్నుకొని అతని ద్వారా వారికి దాస్యవిముక్తిని కలుగజేస్తున్నాడు.
       నోవా కాలములో పాపము పండిపోయినది. దేవుని మరచిపోయి వారికి ఇష్టంవచ్చినట్లు జీవిస్తున్న సమయములో నోవాప్రవక్తను ఎన్నుకొని అతని ద్వారా రక్షణను కలుగజేయాలని తన సంతతినుండి ఒక నూతన జీవితాన్ని పునర్నిర్మిస్తున్నాడు.
         యాకోబు పనెండుమంది కుమారులలో చిన్న కుమారుడైనటువంటి ఏసోపును దేవుడు ఎన్నుకొని అతని ద్వారా వారికి దాస్యవిముక్తిని కలుగజేస్తున్నాడు.ఆహార కొరతను తొలగించి వారికి కావలిసిన సదుపాయాలను సమకూర్చి వారిని నూతన ప్రదేశమునకు తీసుకొనివెళ్ళి అక్కడ వారికి నివాస స్థలమును ఏర్పాటుచేస్తున్నారు. ఇలా ఎంతోమంది ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజుల ద్వారా దేవునియొక్క ప్రణాలికను నెరవేరుస్తున్నారు.
          మరి నూతన జీవితమునకు, రక్షణ ప్రణాళికకొరకు డేడు మరియమాతను ఎన్నుకొని ఆమె ద్వారా యేసుప్రభువును ఈలోకానికి పరిచయము చేసి అతని ద్వారా పాప ప్రక్షాళననూ, నూతన జీవితమును కలుగజేస్తున్నాడు.దీనిద్వారా అంధకారములోవున్న ప్రతియొక్క వ్యక్తి  నూతన వెలుగును చవిచూస్తున్నారు.
అయితే మరియమాత యేసుప్రభువు తల్లిగా దేవుని యొక్క ప్రణాళికతో గర్భము ధరించి మనందరికీ తల్లిగా మారింది. మరి ఆమె గర్భం ఈలోగా సంభందమైన గర్భం కాదు. కానీ పరలోక సంభందమైన గర్భం. ఎందుకంటే ఈలోకంలో గర్భం ధరించాలి అంటే, రెండుమనుషుల కలయికవల్ల కలుగుతుంది. కానీ మరియమాత మాత్రం ఇలాకాకుండా దేవునియొక్క సహకారముతో, దేవునియొక్క తోడ్పాటుతో ఈలోకంలోవున్న ప్రతిఒక్క ప్రజలకు దేవునియొక్క ప్రేమనూ, తనయొక్క స్నేహాన్ని తెలియజేయడానికి మనతోనివాసమును ఏర్పరచుకోవడానికి గర్భమనే ప్రధషయాన్ని ఎన్నుకొని మరియమాత ద్వారా ఈలోకములోకి అడుగెడుచున్నాడు.
     మరియమాత యొక్క గర్భంపవిత్రమైన గర్భం.
    మరియమాత యొక్క గర్భం సృష్టికర్తను మోసిన గర్భం.
    మరియమాత యొక్క గర్భం ఈలోకానికి ప్రేమను చవిచూపించిన గర్భం.
     మరియమాత యొక్క గర్భం రక్షణను తీసుకొనివచ్చిన గర్భం.
       మరియమాత యొక్క మాతృత్వానికి గల కారణాలు:
1 . ఇది దేవునియొక్క సంకల్పము:
        యెషయ ప్రవక్త ప్రవచనాల ద్వారా దేవుడు రానున్న ఇమ్మానుయేలుగురించి తెలియజేస్తున్నాడు.ఈ ఇమ్మానుయేలు ఒక యువతి గర్భంధరించడముద్వారా ఈలోకానికివస్తాడు. "యువతి గర్భవతియై ఉన్నది.ఆమె కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును" (యెష:7 :14 ) అని తెలియజేస్తున్నాడు. ఇది కేవలము దేవుని సంకల్పమే కానీ ఏ ఇతరమైన వ్యక్తులనుండికాదు. "ఇమ్మానుయేలు" అనగా దేవుడుమనతోవున్నదని అర్ధం. ఆదేవుడుమనతోవుంటే అన్నీ మనతోవున్నట్లే. అప్పడిదాకా దేవునియొక్క ఎడబాటును చూసిన వారు ఇప్పుడు అదేదేవుని ద్వారా ఆయనయొక్క స్నేహబంధాన్ని చూస్తారు. అందుకేఇది దేవుని ప్రణాళిక మరియు దేవునియొక్క సంకల్పము. యెష:27 :21 లో చూస్తే, "అదిగో! భూలోకవాసులు చేసిన పాపములను గాంచి వారిని దండించుటకుగాను,ప్రభువు తన నివాసము నుండి వేంచేయుచున్నాడు చూడుడు" అని పలుకుచున్నాడు.అయితే ఇప్పుడు అయన ఈలోకమునకు వచ్చేది ఖండించుటకుకాదు- ప్రేమించుటకు. శిక్షించుటకు కాదు-రక్షించుటకు. శపించుటకుకాదు-దీవించుటకు. యోహా:౩:17 -18  :"దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనేకాని,దానిని ఖండించుటకు పంపలేదు.ఆయనను విశ్వసిన్హువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియె ఉన్నాడు.ఏలయన, దేవుని ఏకీక కుమారునినామమున అతడు విశ్వాసముంచలేదు". ఇది దేవునియొక్క సంకల్పము.
2. మరియ మాత అంగీకరణ:
        గాబ్రియేలు దేవదూత మరియమాతదగ్గరకువచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపుర్ణురాలా! నీకు శుభము.నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు.ఆ శిశువుకి యేసు అని పేరు పెట్టుము( లూకా :1 :28 , 31 )అని అన్నప్పుడు ఆమె దేవుని సంకల్పానికి తలవొగ్గి నీమాట చొప్పున నాకు జరుగునుగాక అని అంగీకరించింది (లూకా :1 :38 ). ఎప్పుడయితే మరియ మాత దేవుని యొక్క మాటను అంగీకరించిందో అప్పుడే ఈలోకంలో దేవునియొక్క రక్షణ ప్రణాళిక ప్రారంభమైనది. 
అయితే, ఆమె అంగీకారానికి గల కారణాలు:
   2 .1. మరియమాత యొక్క విశ్వాసము:
        పు.II జాన్ పౌలు పోపుగారు ఇలా అంటారు: "విశ్వసించు ప్రతి ఒక్కరికి మరియ మాత ఒక ఒక ఆదర్శముగా నిలిచింది.అందుకే మనంకూడా ఆమెవలె విశ్వాసాన్ని వెదకాలి".మనము ఈలోకంలో ఎంతోమందిని విశ్వసించి  వారి బాటలోనే నడుస్తుంటాం.ఉదా: డాక్టర్లు, అధికారులు, స్నేహితులు,ఉపాధ్యాయులు. ఇలాఎంతోమందిమాటలువింటూవుంటాం. కానీ ఒకరోజు వారుమానాల్ని మోసము చేయవచ్చు. కానీ దేవుడుమాత్రము అలాకాదు.  ఆయనను మనము నిజంగా విశ్వసిస్తే,మనకోసం ఏదయినా చేస్తాడు.చివరికి తన ప్రాణాన్ని సహితము మన కోసం ధారపోస్తాడు. మరియ మాతకు దేవునిపైన అచెంచలమైన విశ్వాసము ఉన్నది.ఆ విశ్వాసము మూలముననే ఆ దేవాతి దేవుడిని ఈలోకమునకు తీసుకొని రావడానికి తన గర్భమును దేవునికి సమర్పించింది.
     మరియ మాత యొక్క విశ్వాసము వినయముతో కూడుకున్నది.ఎందుకంటే, ఈ వినయమునుండే విశ్వాసము వస్తుంది.వినయము లేకపోతే విశ్వాసము రాదు.అందుకే, నీమాట ప్రకారము నాకు జరుగును గాక అని విశ్వాసముతో వినయముగా దేవదూతతో పలికింది.
    మరియ మాత విశ్వాసముతో అంగీకరించింది.
    మరియ మాత వినయముతో అంగీకరించింది.
    మరియ మాతప్రేమతో అంగీకరించింది.
    మరియ మాత తనను తాను సమర్పించుకుంటూ అంగీకరించింది.
    అదే విధముగా, మరియ మాత ధైర్యముగా అంగీకరించింది.


2. యేసు ప్రభువు యొక్క నామకరణ పండుగ:
            ఈనామకరణ పండుగను జరుపుకొను చున్నామంటే ఆనాడు మరియ మాత, జోజప్ప గారు మోషే ధర్మశాస్త్రము ప్రకారము చిన్నారి బాలయేసును దేవాలయములోకి తీసుకొనివచ్చి నామకరణము చేస్తూ అతనికి యేసు అని పేరు పెడుచున్నారు (లూకా:2 :21 ). ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి, ఆ బాలుడు గర్భము నందు పడక పూర్వము దేవదూత సూచించునట్లు "యేసు" అని పేరు పెట్టిరి.
యేసు అంటే హీబ్రు భాషలో యెహోషువ అని అంటారు మరి దీని అర్ధం రక్షణ. "దేవుడు రక్షిస్తాడు". అయితే యేసు అనగా రక్షకుడు అని అర్ధం. ఈ ఏయూ ప్రభువే మనలను రక్షించేది. మోషే ఆజ్ఞ ప్రకారము "ఏ స్త్రీ అయినా ప్రసవించి మగబిడ్డను కనిన యెడల తాను ఋతుమతి అయినప్పటికీ ఏడున్నాళ్ళు శుద్ధిని కోల్పోవును.ఎనిమిదవనాడు శిశువునకు సున్నతి చేయవలయును" లేవి:13 :1 .మరియమాత మోషే చట్టమును తూచా తప్పకుండా పాటించినదని ఇదిఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే, మరియమాత కూడా యేసుప్రభువును దేవాలయమునకు ఎనిమిదవరోజు తీసుకొనివెళ్ళి నామకరణాన్ని చేస్తూ, యేసుప్రభువుని దేవునికి అంకితము చేస్తుంది. నిర్గ :13 :1 లో చూస్తే,ప్రభువు మోషేతో ఇట్లనుచున్నాడు:"ఇశ్రాయేలీయులలో పుట్టిన తొలిచూలి బిడ్డలనెల్ల నాకుమాత్రమే అంకితము చేయవలయును".ఈనాడు మనము మరియా మాత కూడా చిన్నారి బాలయేసును దేవాలయములో సమర్పిస్తూ, నామకరణము చేస్తుంది. యేసుప్రభువుయొక్క నామమును మనము చూస్తే,
   యేసునామములో శక్తివుంది.
    యేసునామములో ముక్తివుంది.
    యేసునామములో రక్షణ ఉంది.
    యేసునామములో స్వస్థత ఉంది.
ఈనామము ఈయనకుతప్ప ఎవరికీ ఇవ్వబడలేదు.ఆనామమునకు అందరూ మొఖాళ్లు వంచి వినతులు కావలెను." ఆయనకు అన్ని నామాములే కంటే ఘనమగు నామమును ప్రసాదించెను"(ఫిలి:2 :9 ). పరలోక, భూలోక పాతాళలోకములయందలి సమస్తజీవులునూ క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులుకావలెను"(ఫిలి:2 :10 ).అయన నామమును విశ్వసించు ప్రతివారు రక్షణ పొందుతారు.
2.1. యేసు అనగా పాపములనుండి రక్షించువాడు:
నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను.అయన క్రీస్తు ప్రభువు. మరి ఈయనను ఎవరైతే రక్షకుడని తెలుసుకుంటారో వారు రక్షణ పొందుతారు.దేవుడంటున్నాడు: నేనీ పాపులను పిలువా వచ్చితిని కానీ,నీతిమంతులను పిలుచుటకు రాలేదు మత్త :9 :13 .
         వ్యభిచారము పట్టుబడిన స్త్రీని తన పాపాలనునుండి రక్షించాడు (యోహా :8 1 -11 ).
         పక్షవాత రోగిని స్వస్థపరిచాడు.  "కుమారా! ధైర్యము వహింపుము. నీపాపములు పరిహరింప బడినవి"(మత్త:9 :2 ).
         సిలువపైఉన్నదొంగను క్షమించాడు. నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉందువు" (లూకా :23 :43 ).
2.2. యేసు అనగా రోగములను నయంచేసేవాడు:
      యేసుప్రభువు తన జీవితములో ఎంతోమంది యొక్క జీవితములను మార్చాడు. ఎంతోమందిని స్వస్థపరిచాడు. 
 ఉదా: సీమోను అత్తకు స్వస్థత (లూకా :4 :38-39).
            కుష్టు రోగికి స్వస్థత : (లూకా :5:12-13)
            మూగ చెవిటివానికి స్వస్థత (మర్కు:7:37).
           యాయీరు కుమార్తెకు స్వస్థత (మార్కు :5:41).
  3. నూతన సంవత్సరము:
        నూతన సంవత్సరము నూతన జీవితానికి గుర్తు.క్రొత్త ఆశలతో,క్రొత్త ఆశయాలతో మన జీవితాలను చిగురింపచేయడానికి ప్రయాస పడే సమయము ఈ నూతన సంవత్సర సమయము.ఇంకో విధముగా చెప్పాలి అంటే,గడిచిపోయినా సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ,రాబోవు సంవత్సరానికి స్వాగతము పలకాలి. ఈనాటి మొదటి పఠనంలో చూస్తే,యాజకులు ప్రజలను ఏవిధముగా దీవించాలి అని దేవుడు మోషేప్రవక్తకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు దేవుడు ప్రజలను యాజకులద్వారా దీవిస్తున్నాడు? దేవుడే స్వయముగా ప్రజలను దీవించవచ్చుకదా అని మనకు ఆలోచన రావచ్చు. కానీ, దేవుడు ఒక జాతిని పూర్తిగా ఎన్నుకొని అయన ప్రేమ వారిలోకి కుమ్మరించి ఆ ప్రేమ వారు చవి చూచునట్లు చేయుచున్నాడు. 
మరి కాథోలికులైన మనము ఎందుకు దేవాలయములో మన జీవితమును ఆరంభిస్తున్నాము? ఎందుకంటే,కాలములు,య్యుగములు దేవునియొక్క ఆధీనములో వున్నవి కాబట్టి (దాని :2 :21 ). నూతన సంవత్సరము దేవుని సన్నిధిలోవుండి, ఆయననామమును స్మరించుకొంటాము దీవెన కరము. ఉదా: హిజ్కియా రాజు తన రాజ్యాన్ని దేవాలయములోనే ప్రారంభించాడు. అందుమూలముననే అయన మూడు మేలులను పొందాడు.

 అవి:    1 . పాడిపంటలు సంవృద్ధిగా పండుతాయి.
             2. శత్రువులమీద విజయము కలుగును.
             3. మరణించిన తరువాత నిత్యజీవపు భాగ్యమును దయచేస్తాడు. 
ప్రతిరోజు మనల్నిమనం దేవునికి సమర్పించుకోవాలి.అప్పుడే నీకు ఇవనీ వర్ధిల్లుతాయి. దీనికి దేవునియొక్క తోడ్పాటు ఎంతో అవసరము. 
అందుకే ఈనాడు నూతన సంవత్సరమునాడు మనమందరము దేవుని సన్నిధిలో చేరి ఆ దేవాతి దేవుడిని స్తుతించడానికి ఆరాధించడానికి, గణపరచడానికి వచ్చివున్నాము. అదేవిధముగా,మనయొక్క కోరికలను దేవునికిసమర్పించి అవి మనజీవితములో నెరవేరాలని ప్రార్ధన చేస్తాము.
     ఈనాడు ఈనూతన సంవత్సరము లాగా నువ్వునేను నూతనముగా ఉండాలి అంటే, రెండు కార్యాలు మనము చేయాలి. అవి:
1. మనల్నిమనం దేవునికి సమర్పించాలి:
          ఈలోకంలో ఎంతోమంది ఎన్నోవస్తువులకు, అధికారాలకు,ధనమునకు,చెడ్డ ఆలోచనలకూ, చెడ్డ వ్యసనాలకు,వారిని వారు సమర్పించుకుంటారు.దాని ఫలితముగా వారి జీవితములో నిజమైన శాంతి సమాధానములు కరువగుచున్నాయి. వారి కుటుంబాలలో ప్రేమలేకుండా పోతుంది.ఒకరినొకరు అర్ధం చేసుకోలేక పోతున్నారు.ఉదా; ధనవంతుడు ధనమునకు లోబడి దైవారాజ్యమున సంపదను కోల్పోయాడు.జాలితో తిరిగి వెళ్లి పోయాడు.
   ఎన్నడూ నువ్వునేను కూడా లోకాశాలకు మనల్నిమనం సమర్పించుకుంటే ఈ ధనవంతుడిలాగా మనంకూడా నిత్యముఉండే సంపదను కోల్పోతుంటాము.దానిద్వారా శాంతిసమాహాదానాలు మనలో కరువవుతాయి.కాబట్టి,మనల్ని మనము దేవునికి సమర్పించుకొని అయన అజ్ఞాను సారము నడుచుకోవాలి. పశ్చాత్తాప హృదయముతోదేవుని చేరాలి. విశ్వాసముతో దేవునికి ప్రార్ధన చేయాలి. తప్పిపోయిన కుమారుడివలె పాత జీవితమును విడిచిపెట్టి ఒక క్రొత్తజీవితమును ప్రారంభించాలి.
2. కృతజ్ఞతా భావముతో కలిసి జీవించాలి:
          దేవుడు మనజీవితములో ఎన్నో గొప్ప గొప్ప మేలులు చేసి ఉన్నాడు.నెలనుండిమట్టిని తీసుకొని మనిషిగాచేసి,దానిలో జీవము పోసి తన పోలికలో సృష్టించుకొని,తనతోపాటు నివాస స్థలమును ఏర్పరచుకొని, తన ప్రేమను ప్రతిక్షనం చూపిస్తూ, చివరికి మనందరికోసం ఆ కలువారి సిలువలో గోరతి గోరంగా మరణించి మూడవనాడు తిరిగిలేచి,ఎంతోమంది జీవితాలను మార్చాడు.
ఉదా : పదిమంది కుష్టురోగులు.
    ఈ పదిమంది కుష్టురోగులలో ఒక్కడే వెనుకకు తిరిగి వచ్చి ఆ దేవునికి కృతజ్ఞత తెలిపాడు.దీనిమూలముననే,మిగతా తొమ్మిది మంది కంటే ఎక్కువగా  అందరి సమక్షంలో గొప్పవానిగా పరిగణించబడ్డాడు. ఈనాడు నువ్వు నేను కూడా దేవునికి కృతజ్ఞతా భావముతో జీవించాలి.
         కాబట్టి ఈ నూతన సంవత్సరములో మనమందరము ఒక నూతన జీవితానికి నాంది పలకాలి. ఎందుకంటే, ఈ నూతన సంవత్సరములో నువ్వు నేను కూడా నూతన సంవత్సరములో మరియా మాత ఏవిధముగానైతే,తనను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకొని, ఆ దేవాతిదేవుని ఈ లోకమునకు తీసుకొని వచ్చింది. ఈ నాడు నీ విశ్వాసము కూడా మరియమాతవిశ్వాసమువలె ఉండాలి. అదేవిధముగా మరియ మాత మరియు జోజప్ప గారు ఏవిధమిగానయితే  బాలయేసును దేవాలయములో మోషే ధర్మశాస్త్ర ము ప్రకారము బాలయేసును సమర్పించి,నామకరణము చేసియున్నారో, అదేవిధముగా ఒక తల్లి తండ్రిగా పిలువబడుచున్న మీరు మీ పిల్లలను ఎసైప్రభువువలె దేవాలయములో సమర్పించి అయన అడుగుజాడలలో నడిపించడానికి ప్రయత్నము చేయాలి. ఇంకా ఈ నూతన సంవత్సరములో దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నిద్దాము. ఆమెన్.

Br. Sunil Mario Nandigama
  
      
 

24, డిసెంబర్ 2021, శుక్రవారం

క్రీస్తు జయంతి మహోత్సవము(2)

క్రీస్తు జయంతి మహోత్సవము

                       యెషయా 9:1 -6, తీతు 2 :11-14 , లూకా2:1 -14

ప్రతిజననం ఎంతో ప్రత్యేక్యమైనది  ఈలోకంలో  ఉన్న మనందరి జీవితం జన్మoతోనే ప్రారంభంఅవుతుంది మనం చాల మంది పుట్టినరోజులను ఘనంగా కొనియాడతo. అంగరంగవైభవంగా కొన్నీ పుట్టిన రోజులను చేసుకుంటాం. సంఘసేవకుల, రాజకీయానాయకుల పుట్టినరోజును జరువుపుకుంటాం. ఈరోజు ప్రత్యేకమంగా రాజులకు రారాజు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తుప్రభు యొక్క జన్మదినము. జరుపుకుంటున్నాం. ఎందరో చూడాలనుకున్నారు కానీ చూడలేదు.ఎందరో ఆయనను తాకాలనుకున్నారు కానీ తాకలేదు. కానీ మనం అదృష్టవంతులము. పరలోకదూతలు మాత్రమేకాదు ఈరోజు సంతోషంమనందరికీ  ఎందుకు అంటే సృష్టిలో మొట్టమొదటి సారి దేవుడు మన మధ్యలోకి వస్తున్నారు.
తన     పర లోక మహిమను అలాగే నిత్యము సేవించుకునే విధానము వదిలి పెట్టి మన కోసం మన మధ్య లోనికి వస్తున్నారు. సృష్టిలో మొట్టమొదటి సారిగా ఒక్క శిశువు జన్మించిన తరువాత తల్లి తన కుమారుని పొలి ఉన్నారు.
మాములుగా ఈలోకంలో జన్మిస్తే, మనం అంటాము మీ అమ్మలాగా ఉన్నావు నాన్నాలాగా ఉన్నావు. కానీ యేసు ప్రభువు జనము తో తన తల్లి శిశువుని పోలి వుంది. ఎందుకంటే  దేవుడు మానందరిని తన పోలికలో సృజించారు . 
దేవుడే మరియమ్మ గారిని  సృజించారు ఆ తల్లి ఇప్పుడు దేవున్ని పోలివుంది. మొట్టమొదట  సారిగా మరియమ్మగారు పరలోక అనుభూతిని పొందారు. తన పవిత్ర చేతులులతో దేవున్ని తాకారు . బాల యేసు జన్మిoచిన స్థలం   పవిత్ర మైనది, పశువుల పాక పవిత్ర స్థలంగా  మారింది. ఆయన  జన్మిoతో భూలోకం పరలోకంగా మారింది . ఎవరు ఇష్ట పడని అంగీకరించని స్థలం అందరిచేత అంగీకరించబడుతుంది. ఎందుకంటే రక్షకుడు జన్మిoచరు .యేసు ప్రభువు పశువుల పాకలో జన్మిoచరు.ఎందుకంటే స్థలం ఆ స్థలం సామాన్యలకు చెందినది, సమాజంలో ఎవ్వరు పట్టించుకోని వారు అక్కడ వుంటారు
(Outcast people ignored people forgotten in the society) ఆయన అక్కడ జన్మనిoచుట ద్వారా ఆయన అందరితో సరిసమానం అని చెబుతున్నారు. ఈ సమాజం పట్టించుకోని వారిని దేవుడు పట్టించుకుంటున్నారు.
దేవుడు కేవలం ఎన్నుకొన్న వారికి మాత్రమే కాదు  జన్మిoచిoది.
 క్రీస్తు ప్రభువు తన్ను తాను అందరి చేత అంగీకరించబడేoదుకు ఆయన కూడా అందరిలో ఒక్కరె, సరి సమానమే  అనే భావన ప్రజల్లో తీసుకొని రావటానికి ఈ విధంగా ఆయన చేశారు.  మనకు జన్మిoచిన శిశువు ఎలాంటి వారంటే
ఆశ్చర్యకరుడు
 ఆలోచన  కర్త
బలవంతుడగు దేవుడు
 నిత్యుడగు తండ్రి
సమాధాన కర్త
ఆనాడు యూదా ప్రజలు చీకటిలో వెలుగును చూసారు అంటే స్వయంగా దేవుడు ఇచ్చే  రక్షకున్ని చూసారు  అని అర్ధం.
  వారి జీవితంలో పాపం తొలగించబడినది అని అర్ధంకూడా.మన కోసం జన్మిoచిన శిశువు తనయొక్క పరిచర్య ద్వారా అద్భుతముల ద్వారా ,బోధనల ద్వారా   ఆశ్చర్యకరమైన కార్యములు ద్వారా అనేక మంది జీవితాలలో వెలుగు ను నింపారు. ఆయన పుట్టుకతో  ఈ లోకంలో వెలుగు నింపబడినది భూలోకం పవిత్ర  పరచబడింది.
 మన కుంటుంబంలో శిశువు  జన్మిస్తే   ఆ తల్లి మీద వున్నా అవమానం తొలిగిపోతుంది శిశువు     దుఃఖము  సంతోషంగా  మారుతుంది.
మనకోసం జన్మిoచిన   శిశువు మాటతప్పని వారు మనస్సు బాధ పెట్టని వారు ,సమర్దుడు మన కోసం తన జీవాన్నే త్యాగం చేసే వారు ,స్వస్థత పరిచే కుమారుడు
 ఆయన తండ్రితో నిత్యం వుంటూ తన దీవెనలు మనకు  ఇచ్చేవారు.
 యేసు ప్రభువు  జన్మిoచిన తరువాత ఆయన్ను కనుగొన్నది రెoడు వర్గాల వారు
1.గొల్లలు - సామాన్న ప్రజలు
2. జ్ఞానులు - అన్ని తెలిసినవారు
ఒక వర్గ  వారు ఏమి తెలియని సామాన్యులు రెండవ వారు అన్ని తెలిసినవారు.
రెoడు వర్గాల వారు ఆయన్ను మెసయ్యగా గుర్తించారు మిగతా సగం  సగం తెలిసినవారు  యేసయ్యను గుర్తించలేదు, అంగీకరించలేదు.
రెoడవ పఠనములో పౌలు గారు రక్షకుని  రాక గురించి చెబుతున్నారు సర్వమానవాళికి రక్షణ కృప  ఒసగబడినది .
 ఆయన ఈలోకంలో వున్నా వారి జీవితములను సరిచేయుటకు  ఆయన వచ్చి వున్నారు
 ఆయన రాకడ కోసమై  మనం -ఇంద్రియ నిగ్రహం కలిగి జీవించాలి ,ఋజు మార్గాన ప్రయాణించాలి, పవిత్రమైన  జీవితం  గడపాలి .ఈ వాన్ని జరిగినప్పుడు ఆయన మనలో  జన్మి స్తారు. కాబట్టి మన జీవితంలను సరిచేసుకోవాలి ఆయన కోసం తయ్యారవాలి. పునీత అగస్టీన్గారుఅంటున్నారు యేసుప్రభు ఈలోకానికి వచ్చింది మనకు దైవత్వం పంచటానికి మనలో దైవత్వం పెంచటానికి, దైవత్వం ఇవ్వడానికి వచ్చారు.
మన కొరకు పంపబడిన వారు లోక రక్షకుడు,
అయన మన పాపముల నుండి రక్షించే వ్యక్తి
అయన మనలను చేడు నుండి రక్షించే వ్యక్తి
అయన మనలను స్వార్ధం నుండి రక్షించే వ్యక్తి
అయన మనలను ఈలోక ఆశల నుండి రక్షించే వ్యక్తి
అశాంతి నుండి రక్షించే దేవుడు సాతాను బాధల నుండి రక్షించే దేవుడు.

అయన మన కొరకు పంపబడిన దేవుడు. అయన మరణించిన వారికే జీవమునిచ్చుటకు వచ్చిన పంపబడిన దేవుడు.
గాయ పడినవారికీ స్వస్థత ఇచ్చుటకు పంపబడ్డాడు.
త్రప్పిపోయిన గొర్రెలను వెదకి రక్షిన్చుటకు పంపబడ్డారు.
గ్రుడ్డువారికిచూపును ఇచ్చుటకు కృంటువారిని నడిపించుటకు చెవిటి వారికి వినికిడి ఇచ్చుటకు స్వర్గఅనుభూతుని ఇచ్చుటకు అయనపంపబడ్డారు.
సేవసేయడానికి అయన పంప బడ్డారు. ఆయనను దేవుడు పంపించింది మన కొఱకు అలానే మనం కుడా  ఈలోకానికి పంపబడ్డాం. మరి ఆయన లాగే మనం జీవిస్తున్నాము? దేవుని యొక్క ప్రణళికయె మనజీవితం దేవుడు పంపించారు కాబట్టి    ఈలోకానికి మనతల్లిదండ్రుల ద్వారా వచ్చాము, అయన మన కొరకు  వచ్చిన వ్యక్తియే   దేవుడు ఇమ్మానుయేల్ అనగా దేవుడుమనతో ఉన్నాడు. పవిత్ర గ్రంధం మనం క్షుణముగా తెలుసు కుంటే దేవుడు తన ప్రజలతో ఉన్నాడు.
ఇశ్రాయేలీయలను నడిపించుటకు దేవుడు వారిమధ్యలోనే ఉన్నారు, వారిని  నడిపిస్తున్నారు నిర్గమ ;   3: 14
దేవుడు వారితో ఉండాలనుకునారు. అయిన ప్రజలు అయన గొప్పతనం గ్రహించలేదు. ఆయనకు అవిశ్వాసముగా జీవించారు. యేసు ప్రభువారు  మన మధ్య లోకి వచ్చారు. మనవునిగా మన మధ్య జీవించారు.
మత్తయి: 14  : 16   దేవుడుమనతో ఉండాలని ఆశపడి 
పరలోకం వీడి   భువికి వచ్చారు.  అన్నీ వదిలేసుకొని వచ్చారు. ఇంకామనం అయనగొప్పతనం తెలుసుకోలేక పోతున్నాం.
దేవుడు మన కొరకు మన మధ్యకు 
వచ్చి ఉండాలనుకున్నారు. అయితే మనం దేవుని తో ఎలాగా ఉంటున్నాం.
క్రీస్తు జననం దేవుని మనకు దగ్గరకు చేర్చింది. ఆయనను మన కుటుంబ సభ్యులుగా పరిచయంచేసింది.
ఆయనను మన స్నేహితులుగాచేసింది.
పంపబడిన యేసుప్రభు యొక్క మంచితనం రక్షణకార్యంలో యేసు ప్రభువు   యొక్క జననం ఈరోజు మనం ధ్యానించు కొంటున్నాం.  అయితే ఆ జననములో నలుగురు ముఖ్య మైన వ్యక్తులు ఉన్నారు. 
తండ్రిదేవుడు, కుమారుడైనయేసుప్రభు, పవిత్రాత్మదేవుడు , మరియమ్మ యేసేపు
వీరు అందరు కూడా ప్రజల కొరకు మేలును మాత్రమే చేసారు. తండ్రి, పవిత్రాత్మ, కుమారుడుని ఈలోకంలో మేలు చేయడానికి పంపిస్తున్నారు. నా కుమారుడు వెంటనే వస్తున్నారు. అయన జీవితములో ఎవరికి హానిచేయలేదు. యేసు మానవ అవతారంకు  సహాకరించిన వారు మరియమ్మగారు యేసేపుగారు. వారు కుడా బిడ్డను తమ బిడ్డగా స్వీకరించారు. 
ఆయనను అనేక విధాలుగా కాపాడారు. 
వీరు అందరు కూడా ప్రజల కోసం ,శ్రీ యేసు కోసం పని  చేసిన వారే. వారి అభివృద్ధికి తోడ్పడిన వారే.

అదేవిధముగా మనం కుడా ఇతరుల మేలుకోరకు పని చేయాలి. 

వారికీ  మనకు ఉన్న దానితో సహాయం చేయాలి.
వారికీ ఇవ్వాల్సినంత ప్రేమను ఇవ్వాలి. క్రిస్మస్ పండుగ
 ద్వారా దేవుడు మనకు ఇచ్చిన  గొప్ప ఆశీర్వాదాలు
ఆయన మనలను దత్త పుత్రులుగాచేసారు గలతి : 4 : 5 మనలను తనబిడ్డలుగా అంగీకరించారు

క్రీస్తు జయంతి సామాన్యుల కు గుర్తుపునిచ్చింది. గొర్రెల కాపరులకు దేవుడు ఒక గుర్తింపు ఇస్తున్నారు.
వారికే గొప్ప దర్శనం కలగజేస్తున్నారు. యేసు ప్రభు వారికీ మనకు కూడా గుర్తిపును ఇస్తున్నాడు.
క్రీస్తు జయంతి దేవుని అభయం ఇస్తుంది. దేవుడు మనతో ఉన్నాడు అన్న అభయం.
క్రీస్తు జయంతి మనలను పాపముల నుండి వైదొలిగి నీతిమంతమైన జీవితం జీవించమని నేర్పిస్తుంది.
క్రీస్తు జయంతి మనకు జీవితం ప్రసాదిస్తుంది. ఆయనతో క్రొత్త జీవితం మొదలైంది. అలాగే ఈరోజు అయన
మనతో జన్మిస్తే క్రొత్తజీవితం ప్రారభించవచ్చు.
Rev.Fr.Bala Yesu OCD

క్రీస్తు జయంతి మహోత్సవము

క్రీస్తు జయంతి మహోత్సవము
మన కోసము దేవుడు మానవుడై రక్షకునిగా జన్మించెను.

క్రిస్మస్ అర్ధరాత్రి పూజ      క్రిస్మస్ వేకువ జామున పూజ           క్రిస్మస్ పగలు పూజ
యెషయా 9:1-6                      యెషయా 62:11-12                     యెషయా 52:7-10
తీతు 2:11-14                          తీతు 3:4-7                                   హెబ్రీ 1:1-6
లూకా2:1-4                             లూకా 2:15-20                               యోహాను 1:1-18
ముందుగా మున్ముందుగా మీకందరికి క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే అర్థమేమిటి? క్రిస్మస్(క్రీస్తు జయంతి) అంటే దేవుడు మానవుడై (యోహా 1:14) ఇమ్మానువేలుగా మన మధ్య, మనతో, మనలో ఉండటము (మత్తయి 1:22-23). ఆనందించడానికి, మహానందించడానికి సరియైన సమయమిది. ఎందుకంటే లోక రక్షకుడు మనకోసము, మన మధ్యలో, మనలో జన్మిస్తున్నారు. మనుష్యావతారము(దేవుడు మానవ రూపము దాల్చడము)  అనేది చరిత్రలో ఒక్కసారి మాత్రమే జరిగినది కాదు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ. చిన్నారి పొన్నారి బాలయేసు ప్రతి ఒక్కరి హృదయములో జన్మించేంతవరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. క్రీస్తు జయంతి కేవలము ఒక గొప్ప మహోత్సవము మాత్రమే కాదు, ఓ దైవానుభూతి. ఈ దైవానుభూతి క్రీస్తు మనలో జన్మించినప్పుడు మాత్రమే పొందగలము. లేదంటే ప్రతి క్రిస్మస్ పండుగ కేవలము ఒక మహోత్సవము లానే మిగిలిపోతుంది. కాబట్టి ఈ గొప్ప మహోత్సవ ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని ఏ విధముగా మన జీవితాలకు అపాందించుకుని, ఆ క్రీస్తు జనన అనుభూతి ఏ విధముగా పొందాలో ఈ క్రింది మూడు అంశాల రూపేణా అర్ధము చేసుకుందాము. 
క్రీస్తు జనన ప్రవచనాలు, వాటి నెరవేర్పు
క్రీస్తు జయంతి పర్వము; మనకు ఆనందాల వరము
క్రీస్తు జయంతి పర్వము; మన రక్షణ చరిత్రలో ఓ అత్యుత్తమ ముఖ్య ఘట్టము 

క్రీస్తు జనన ప్రవచనాలు, వాటి నెరవేర్పు
క్రీస్తు జనన ప్రవచనాలు పాత నిబంధనలో లెక్కకు మిక్కుటము. కానీ మనము ఇక్కడ కొన్నింటిని మాత్రమే ధ్యానిద్దాము. చరిత్రలో ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు. కానీ ఏ వ్యక్తి గురించి కూడా ఈలాగున, ఈ సమయములో, ఈ స్థితిలో జన్మిస్తాడని ముందుగా ఏ ప్రవక్త ప్రవచించలేదు. కానీ క్రీస్తు ప్రభువు జన్మిస్తాడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు.
"ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కనును. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుము" (యెషయా 7:14)
"మనకొక శిశువు జన్మించెను. మనము ఒక కుమారుని బడసితిమి. అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును" (యెషయా9:6-7)
"మీరు సీయోను కుమారితో ఇట్లు నుడువుము. ప్రభువు నిన్ను రక్షింప వచ్చుచున్నాడు." (యెషయా 62:11)
ఈ ప్రవచనాలు పొల్లుపోకుండా నెరవేరాయి.
ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు. అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను" (మత్తయి 1:22-23)
"నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టును. ఆయన క్రీస్తు ప్రభువు" (లూకా 2:11)
"ఆ వాక్కు (దేవుడై) మానవుడై మన మధ్య నివసించెను. (యోహాను 1:14)
క్రీస్తు జయంతి పర్వము; మనకు ఆనందాల వరము
క్రిస్మస్ దగ్గరకు వస్తుందంటే మనకు కలిగే ప్రథమ భావము, ఆనందము. క్రిస్మస్ మన జీవితాలలో చీకటిని తొలగించి వెలుగునిస్తుంది. నిరాశ,నిస్పృహలను తీసివేసి క్రొత్త ఆశలను చిగురింపజేస్తుంది. అశాంతిని తీసివేసి శాంతినిస్తుంది. పాపాన్ని ప్రక్షాళన గావించి రక్షణను ఇస్తుంది. దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్నిస్తుంది. పునీత పౌలు గారు నుడువుచున్నారు,"ప్రభువు నందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను, ఆనందింపుడు (ఫిలిప్పు4:4), ఆనందించడానికి కారణము ప్రభవు దగ్గరలోనే ఉన్నారు (ఫిలిప్పు 4:5)." సీయోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షద్వానము చేయుము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము (జెఫ 3:14) ఎందుకనగా నీ దేవుడైన ప్రభవు నీ నడుమనున్నాడు(జెఫ 3:17). దేవదూత గొర్రెల కాపరులతో, "మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించెదను, మీకు ఒక రక్షకుడు జన్మించెను (లూకా 2: 10-11)
ఎందుకు   రక్షకుడు  నడుమనున్నాడని  అని ఆనందించాలి ? ఎందుకు అంటే  ఈ  రక్షకుడే  ఈలోక  సంతోషము కంటే అతీతమైన  ఆనందాన్నిస్తాడు.  ఈ ఆనందం ఏది,  ఎవరు  మననుంచి  తీసివేయలేరు.  ఇది  సత్యమైన  మరియు  శాంతియుతమైన  నిత్యానందం.  ఇమ్మానుయేలు  దేవునిగా  ప్రభు మనకోసం  మన మధ్య  జన్మించింది  మనతో ఉండడానికి (మత్తయి 1: 22 -23) మనలో  ఈ శాంతియుతమైన  నిత్యానందం నింపటానికి  దేవుడు మనతో  ఉండాలంటే  మనం దేవునితో వుండాలి.  మనం దేవునితో దేవుడు మనతో  ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు జయంతి పర్వము మనకు ఆనందాల వరంగా మారుతుంది. అప్పుడు గొర్రెల కాపరులతో కలిసి 'మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగుగాక (లూకా 1:22-23)' అంటూ దేవుని స్తుతిస్తూ క్రీస్తు జయంతిని ఆనందముగా, మహానందముగా జరుపుకోగలము. 
ఈ లోకములో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు. వీరందరూ జన్మించింది జీవించడానికి కానీ క్రీస్తు ప్రభువు జన్మించింది మరణించడానికి. తన జీవన, జీవిత, శ్రమల, మరణ పునరుత్తానాల ద్వారా మనకు రక్షణ తీసుకుని రావడానికి. మానవ రక్షణ చరిత్రలో క్రీస్తు జననము ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక మాటలో చెప్పాలంటే మానవ రక్షణ చరిత్రలో క్రిస్మస్ ఒక అత్యుత్తమ ఘట్టము. ఎందుకంటే స్వయానా లోక రక్షకుడు జన్మించిన తరుణము. ఈ తరుణము మానవులను పాప జీవితము నుండి పవిత్ర, పుణ్య జీవితానికి ఆహ్వానించే ముఖ్య సమయము. ఎందుకంటే రక్షింపబడాలంటే పవిత్ర జీవితము ఎంతో అవసరము. 
రక్షణలో రెండు పాత్రలున్నాయి. a. దేవుని పాత్ర, మరియు b. మానవ పాత్ర. 
దేవుని పాత్ర: దేవుడు లోక రక్షకుడు. మనలను రక్షింప జన్మించెను. అది మనకందరికీ తెలుసు. కాబట్టి మనము మన పాత్రపై మననము చేద్దాము. 
మానవ పాత్ర: లూకా19: 1-10 వచనాలలో జక్కయ ఇంటికి ఏ విధముగా రక్షణ వచ్చిందో మనము చదువుతున్నాము. జక్కయ సుంకరులలో ప్రముఖుడు, ధనికుడు(లూకా 19:1), యేసుని చూడాలనే కోరికతో ఉన్నాడు. ఆ కోరిక కార్య సాధనకు తన పొట్టి తనము అడ్డు రాలేదు, తన గురించి ఇతరులు ఏమనుకుంటారో అని తలంచలేదు. కానీ తన లక్ష్యము ఒక్కటే. యేసును చూడాలి. జనసమూహము ఎక్కువగా ఉండినను కూడా ముందుకు పరుగు తీసి మేడి చెట్టును ఎక్కాడు. అది చూచిన యేసు, “జక్కయ్య నీ ఇంటిలో ఉండ తలచితిని” అని చెప్పి పాపియైన జక్కయ ఇంటికి అతిధిగా వెళ్ళాడు. యేసు రాకతో జక్కయ జీవితము మారిపోయింది. ఒకనాడు అన్యాయముగా జనము నుంచి పన్ను తీసుకున్న జక్కయ్య ఇప్పుడు తన ఆస్తిలో సగము పేదలకు దానము చేయడానికి మరియు తాను ఎవరికైనా అన్యాయము చేసినచో నాలుగు రెట్లు కూడా ఇచ్చివేయుటకు సిద్ధముగా ఉన్నాడు. తన జీవితములో అచంచలమైన మార్పును చూసిన ప్రభువు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఏలన ఇతడును అబ్రాహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు, అని చెప్పారు. 
అవును క్రీస్తునందుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనము కూడా రక్షకుడిని స్వీకరించాలంటే బలమైన, ధృడమైన కోరికను కలిగి ఉండాలి. ఈ కోరిక కార్యసాధనకు శాయశక్తులా కృషించాలి. మన బలహీనతలను సహితము లెక్క చేయకూడదు. మన లక్ష్యము ఒక్కటై ఉండాలి. నేను నా కోసము జన్మించిన రక్షకుని నా జీవితములోనికి ఆహ్వానించాలి. నీ కృషిని చూసిన రక్షకుడు జక్కయ్యతో లాగానే నీతో కూడా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని ఓ శుభ సందేశాన్ని తెలియజేస్తాడు. 
కాబట్టి ఆ క్రిస్మస్ కేవలం ఓ మహోత్సవము లాగానే మిగిలిపోకూడదు. కానీ ఓ దైవానుభవముగా మారాలి. దైవానుభవముగా మారాలి అంటే క్రేస్తును స్వీకరించాలను నీ నిరీక్షణ నమ్మకముగా మారాలి, నీ నమ్మకము ఆనందముగా మారాలి, ఆనందము శాంతిగా మారాలి, శాంతి ప్రేమగా మారాలి. ఈ ప్రేమ క్రీస్తు కోసమై ఉండాలి. ఈ ప్రేమ నీలో క్రీస్తును జన్మింపజేస్తుంది. క్రీస్తులో నిన్ను జన్మింపజేస్తుంది. మరొకసారి మీ అందరికి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు.
ఆమెన్.....
Br. Sunil Inturi OCD

18, డిసెంబర్ 2021, శనివారం

ఆగమన కాల 4 వ ఆదివారం

 ఆగమనకాల 4 వ ఆదివారం 

మికా 5:1-4, హెబ్రీ 10:5-10,  లూకా 1:39-45 

నేటి దివ్య పఠనాలు దేవుని యొక్క రాకడ కోసం సంసిద్దులై జీవిస్తున్న వారందరిలో ఆయన యొక్క జన్మం జరుగుతుంది అనే అంశం గురించి భోధిస్తున్నాయి. దేవుని ప్రణాళికకు సహకరిస్తూ ఆ ప్రణాళికను వ్యక్తిగత జీవితములో అమలు చేస్తూ జీవించే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు జీవిస్తారు. ఈనాటి మొదటి పఠనంలో దేవుడు మీకా ప్రవక్త ద్వారా చేసిన వాగ్దానములను గురించి వింటున్నాం. 

బెత్లెహేము ఏఫ్రాతా !నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్న దానవు , కాని యిస్రాయేలు పాలకుడు నీ నుండి ఉద్భవించును మీకా 5:2 . 

బెత్లేహేము నుండి రక్షకుడు  ఉదయిస్తాడు. అని చెప్పినప్పుడు దానిలో ఒక అర్ధము దాగిఉన్నది. ఎందుకు ప్రత్యేకంగా దేవుడు బెత్లేహేమును ఎన్నుకున్నారు. రక్షకుని యొక్క  యొక్క జన్మస్థలంగా? మొదటిగా బెత్లేహేములో  న్యాయాధిపతియైన ఇబ్సాను జన్మించారు. న్యాయదీపతులు 12:8  

బెత్లేహేము లెవీయులకు ఒక కేంద్రంగా ఉన్న స్థలం. న్యాయా 17:7-9, 19:1 

యాజకుల యొక్క స్థలం 

బెత్లేహేము దావీదు రాజు యొక్క జన్మ స్థలం 1 సమూ 16:4 . లెవీయులకు అదే విధంగా  దావీదు  రాజుకు జన్మస్థలంగా కేంద్రంగా ఉన్నటువంటి ఒక చిన్న స్థలంను దేవుడు  పుట్టిన స్థలంగా ఎంనుకొంటున్నారు. 

యిస్రాయేలును పరిపాలించే  పాలకుడు దేవుడు పంపబోయే క్రీస్తు ప్రభువే . ఎందుకంటే దేవ ధూత మరియమ్మకు ప్రత్యక్షమైన  సమయంలో తనతో పలికిన మాటలు ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. అని అన్నారు-లూకా 1:33. 

దేవుడు చిన్నదైనటువంటి బెత్లేహేమునే ఎన్నుకొంటున్నారు. అల్పమైన  ప్రదేశమును దేవుడు ఎన్నుకొని ఒక క్రొత్త అర్ధం తెలుపుచున్నారు. 

పూర్వ వేదంలోని ప్రజలు , వారి జీవితాలు అన్నియు రక్షణ కోట కలిగిన యెరుషలేము నగరం మీదనే కేంద్రీకృతమై ఉండేవి. 

యవే దేవునికి ఆరాధన స్థలం యెరుషలేము అని ప్రజల నమ్మకం అలాగే దేవుడు అక్కడ ఉండియే ప్రజలను పరిపాలిస్తాడని వారియొక్క ఆలోచన వారి ఆలోచనలకు భిన్నంగా దేవుడు యిస్రాయేలును పరిపాలించే రాజు అతి చిన్నదైన బెత్లేహేము నుండి జన్మిస్తారని మీకా ప్రవక్త తెలియచేస్తున్నారు. 

ఏఫ్రాతా అనేది ఒక చిన్న గ్రామం , దానికి పెద్ద గుర్తింపు లేదు. అయితే దేవుడు మాత్రం ఆ గ్రామన్నే ఎంచుకున్నారు. ఆయన ఈ భూలోకానికి రావడానికి ఒక గొప్ప ప్రాంతంను  ఎన్నుకొనక కేవలం గుర్తింపు లేని అతి సామాన్యమైన, అల్పమైన చిన్న గ్రామాన్ని , చిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. 

మనందరి జీవితంలో ప్రముఖమైన స్థలంలో ఉండటానికి ఆశ కలిగి ఉంటాం. కాని దేవుడు మాత్రం గుర్తింపు లేని వాటికె ప్రాముఖ్యతనిస్తున్నారు. 

దేవుడు కూడా అల్పమైన లేదా  చిన్న వారికి అనగా వినయం కలిగి జీవించే  దీనులను దేవుడు ఎప్పుడు  కూడా బాలపరుస్తూనే ఉన్నారు. 

చిన్న వారైన  చేపలు పట్టుకునే వారిని  ఎన్నుకొని దేవుడు వారిని  సువార్త సేవకులను , అద్భుతాలు చేసేవారిగా ఎన్నుకొన్నారు. 

సామాన్యురాలైన  మరియమ్మను ఎన్నుకొని దేవునికి తల్లిగా దీవించారు. యేసు క్రీస్తు ప్రభువు కూడా తనను తాను  తగ్గించుకొని పశువుల పాకలో  జన్మించారు. ఎవరూ ఊహించని పశువుల తొట్టిలో శయనించారు. దేవుడు బెత్లేహేమును  తన నివాస స్థలంగా ఎన్నుకొన్నారంటే మనం ఆయన యొక్క వినయంను అర్ధం చేసుకోవాలి. గుర్తింపు లేని ఎందరో జీవితాలకు గుర్తింపు ఇవ్వడానికి దేవుడు ఇలా చేశారు. 

ఆ చిన్న ప్రాంతం మానవుల యొక్క  తగ్గింపు జీవితానికి ఒక గుర్తు. తగ్గించుకొని జీవిస్తే దేవుడు వారి జీవితంలో జన్మించి దానికి సరైన అర్ధం దయ చేస్తారు. 

మన కోసం జన్మించే వ్యక్తి సామాన్యుడైన వ్యక్తి కాదు. 

-ఆయన పాలకుడు 

-ఆయన కాపరి 

-ఆయన శాంతి ధూత 

ఆయన ప్రతి ఒక్కరి జీవితాలను పాలించే రాజు , ప్రజల మేలు కోసం తన ప్రాణాలు త్యాగం చేసే పాలకుడు. 

-ప్రజలను ప్రేమతో పాలించే పాలకుడు 

-ప్రజలను శాంతితో నింపే పాలకుడు 

-ప్రజలకు సహాయం చేసే పాలకుడు 

-ప్రజల మీద కరుణ చూపే పాలకుడు 

-ప్రజలను పరలోక గమ్యం వైపు నడిపే పాలకుడు

-తన ప్రజల కోసం సైతనుతో పోరాడి మనకు విజయం చేకూర్చే పాలకుడు

-శాంతితోను,  సమానత్వంతోను, దీవెనలతోనూ నింపే పాలకుడు. ఆ రాజు యొక్క రాకడ కోసం మన జీవితాలను సంసిద్దం చేసుకోవాలి. 

రెండవ పఠనంలో నిత్య యాజకుడైన క్రీస్తు ప్రభువు, తండ్రి  యొక్క చిత్తమును నెరవేర్చుటకు వచ్చియున్నారు అని తెలుపుచున్నారు. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ ప్రత్యేక విధంగా  యూదా మతం నుండి క్రైస్తవులుగా మారిన వారికోసం వ్రాయబడినది. 

క్రైస్తవులుగా మారటం వల్ల  మిగతా యూదులు వారిని దేవాలయం నుండి , ప్రార్ధనాలయాల నుండి బహిష్కరించారు. బలులు సమర్పించేందుకు యాజకులను సంప్రదించేందుకు   ధర్మ శాస్త్రమును పఠించుటకు నిర్భందించారు. అయితే ఇలాంటి కష్టతరమైన సమయంలో క్రీస్తు ప్రభువే మీ యాజకుడని, ధర్మ శాస్త్రమని ఆయన బలియే శాశ్వత బలి అని వారి విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఇలా వ్రాశారు. 

యేసు దేవుడు ఈ లోకంలోకి  వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు వచ్చారు. ఆయన యొక్క మనుష్యవతారం కేవలం తండ్రి చిత్తం పరిపూర్ణమొనర్చుటయే. యేసు ప్రభువు తండ్రి చిత్తమును ప్రతి నిత్యం కనుగోంటు ఆయన చిత్తము వేదకుచు దానిని తన జీవితంలో నెరవేర్చారు. 

మన జీవితంలో మొదటిగా దేవుని చిత్తం వేదకాలి, తరువాత ఆ చిత్త ప్రకారం జీవించాలి. 

యేసు ప్రభువు సుస్పష్టంగా తెలియ జేస్తున్నారు, "దేవా నేను నీ చిత్తం నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను" అని. యేసు ప్రభువు యొక్క జీవితంలో ప్రతిసారీ కూడా తండ్రి చిత్తమునే వేదికారు. దేనిలో కూడా స్వార్ధం లేదు. ఆయన చిత్త ప్రకారం ఈ లోకంలోకి వచ్చారు. ఆయన చిత్త ప్రకారం దైవ రాజ్య స్థాపన చేశారు. ఆయన చిత్త ప్రకారం అందరిని ప్రేమించారు, అందరికోసం ప్రాణ త్యాగం చేశారు. సమస్త మానవాళి కోసం తానే ఒక బలిగా సమర్పించబడి తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చారు. 

మనం కూడా దేవుని  చిత్తాన్ని నెరవేర్చుటకే ఈ లోకంలోకి పంపించబడ్డాం. దేవుని చిత్తాన్ని వెదకి దానిని నెరవేర్చుదాం. దేవుడు మనకు శరీరం ఇచ్చారు. దాని ద్వారా దేవున్ని తెలుసుకొంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మన శరీరం ఉపయోగపడాలి. నేటి సువిశే షంలో   మరియమ్మ గారు ఎలిజబెతమ్మ సందర్శించిన విధానం మనం వింటున్నాం. 

దేవ దూత  వద్ద నుండి శుభ వచనం  విన్న మరియమ్మ గారు వెంటనే తన చుట్టమైన ఎలిజబెతమ్మను కలుసుకొనుటకు వెల్లుచున్నారు. దాదాపు నాలుగు రోజుల ప్రయాణం 130 కి. మీ  దూరం. విసుగు చెందకుండా ప్రయాణం చేస్తూ  నజరేతు నుండి యూదయా లో ఉన్న  ఒక పట్టణంనకు వెళ్లారు. 

మరియమ్మ గారి ప్రయాణం చాలా కష్టతరమైనప్పటికిని ఎలిజబెతమ్మ మీద ప్రేమ వల్ల  ప్రయాణం చేసి వెళ్లారు. మరియమ్మ గారి గర్భమందున్న యేసు ప్రభువు, తల్లి  గర్బంనుండియె తండ్రి చిత్తమును నెరవేర్చుట ప్రారంభించారు. అవసరంలో ఉన్నవారికి తన సహాయం చేస్తున్నారు. 

మరియమ్మ గారు మరియు  ఎలిజబెతమ్మ ఇద్దరు గర్భవతులే అయినప్పటికీ మరియమ్మ గారు సేవా బావంతో ఒక అడుగు ముందుకువేసి ఆమెకు సహాయం అందించింది. 

దేవుడు కూడా చేసిన పని అది. మానవ జాతికి  దేవుని యొక్క అవసరం ఉంది. అందుకే తన యొక్క ఏకైక కుమారున్నీ ఈ లోకానికి పంపించారు. యేసు క్రీస్తు ప్రభువు తన పుట్టుకకు ముందే సేవలు అందించేందుకు వచ్చారు. సేవలు అందుకొనుటకు ఆయన రాలేదు. మత్త  20:28 . దేవున్ని తన గర్భమున మోస్తున్న తల్లి మరియమ్మ కూడా సేవా బావంతో సహాయం చేయుటకు వెల్లుచున్నారు. ఇది కూడా దేవుని చిత్తం నెరవేర్చుటలో ఒక ప్రణాళికయే. 

మరియ తల్లి దైవ సందేశం  ఆలకించిన వెంటనే త్వరితముగా సేవకు వెల్లుచున్నది. త్వరితముగా అంటే ఆమె ఎంతో ఉత్సాహం కాలీగ్ , ఆనందంతో నింపబడినదై వెల్లుచున్నది. 

మరియమ్మ గారు  ఎలిజబెతమ్మను సందర్శించినది ఎందుకంటే  దేవుడు వారిద్దరి అద్భుతాలు చేశారు. ఒకరిని దేవుని ప్రవక్తకు జన్మనిచ్చుటకు , ఇంకోకరిని దేవునికే జన్మనిచ్చుటకు ఎన్నుకొన్నారు కాబట్టి. ఈ రెండు అధ్బుత కార్యాలు ఒకరికి ఒకరు పంచుకొనుటకు, సహాయం చేసుకొనుటకు, ఆనందాన్ని వెల్లడించుకొనుటకు కలుసుకొంటున్నారు. 

మరియమ్మ గారికి ఎలిజబెతమ్మ గర్భవతి అని తెలుసు కానీ ఎలిజబెతమ్మకు మరియమ్మ గర్భవతి అని తెలియదు అయినప్పటికీ పవిత్రాత్మ శక్తితో గ్రహించి నా దేవుని తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగ ప్రాప్తించేను అనెను. 

మరియ తల్లి వందన వచనం పలికినప్పుడు ఎలిజబెతమ్మ మరియు ఆమె గర్బంలో ఉన్న  శిశువు బాప్తిస్మ యోహను దేవుని యొక్క సాన్నిధ్యంను గుర్తించారు. 

మరియమ్మ గారు ఎలిజబెతమ్మ కలిసిన సమయంలో జరిగిన సంఘటనలు 

1. ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నారు. 

2. ఎలిజబెతమ్మ దేవుని యొక్క  ఆత్మచేత నింపబడింది. అందుకే నా ప్రభుని  తల్లి అని పలికింది. 

3. ఎలిజబెతమ్మ ఆనందంతో  వెలుగెత్తి  దేవుని సువార్తను ప్రకటిస్తుంది. 

ఎలిజబెతమ్మ గారే మొట్ట మొదటిగా  యేసు క్రీస్తును గుర్తించారు. మరియమ్మ గారి గర్భమందున్న  దేవున్ని గుర్తించారు. 

ఎలిజబెతమ్మ గారు కూడా వినయంతో , మరియ తల్లి తన కన్నా చిన్నదైనప్పటికి ఆమెను గౌరవించింది, దేవుని తల్లి అని అంగీకరించింది. ఆమెలో ఎటువంటి స్వార్ధం లేదు. ఆమె పలికిన ప్రతి మాట నిస్వార్ధమే. పిలిప్పీ 2:3-4 . 

ఎలిజబెతమ్మ ,మరియమ్మ గర్భమందున్న శిశువును తన మెస్సియా గా అంగీకరించింది. దేవుని సజీవ కుమారునిగా బావించింది. 

తన గర్బంలో ఉన్న శిశువు కన్నా మరియమ్మ గారి గర్భంలో ఉన్న శిశువు గొప్ప వాడని భావించింది . మరియమ్మ గారు దేవుని ప్రణాళికను తన జీవితంలో నెరవేర్చింది. అందుకే ఆమె గురించి ఎలిజబెతమ్మ గొప్పగా పొగుడుతుంది. స్త్రీలందరిలో  ఆశీర్వదింపబడిన దానవు అని అన్నారు.42 వ వచనం. సృష్టిలో ఎవ్వరికీ దక్కని గొప్ప ఆశీర్వాదం దేవుడు మరియమ్మకు ఇచ్చారు అని ఎలిజబెతమ్మ గ్రహించారు. 

జీవం పోసిన దేవునికే జీవం నీచ్చుటకు నిన్ను ఎన్నుకొన్నారు అని  మరియమ్మను పొగిడారు.మరియమ్మ గారు దేవున్ని తన గర్భమందు మోసారు. అది గొప్ప విషయం. తాను ఆశీర్వదింపబడటానికి కారణం - దేవుడు ఆమెను ఎన్నుకొన్నారు. రెండవది ఆమె దైవ ప్రణాళిక నెరవేర్చుతూ  జీవించింది. 

అదే విధంగా మరియమ్మ గారు దేవుడు పలికిన ప్రతి మాట విశ్వసించింది. తనకు వచ్చిన సందేశం దేవునిది అని విశ్వసించింది. తన గర్భమున జన్మించే శిశువు దేవుడని విశ్వసించింది.  ఆయన తన ప్రజల కోసం జన్మించే దేవుడని మరియ తల్లి విశ్వసించింది. లూకా 11:28,యోహను 15:7 . ఆమె దేవుని వాక్కును విశ్వసించి వీధేయించింది. 

మనం కూడా మన జీవితాలను మరియమ్మ వలె , అదే విధంగా ఎలిజబెతమ్మ వలె దేవుని కొరకు తయారు చేసుకొంటే ఆయన రాకడ మనలో జరుగుతుంది. 

ఇద్దరు దేవుని మాటలు విశ్వసించారు. 

ఇద్దరు దేవుని కొరకు జీవితాలు సిద్దం చేసుకున్నారు. 

ఇద్దరు దేవుని సేవకు , ప్రజల శ్రేయస్సు కొరకు తమ బిడ్డలను సమర్పించారు. 

ఇద్దరు దేవుని చిత్తం నెరవేర్చారు, దేవున్ని ప్రేమించారు. 

కాబట్టి మన జీవితంలో కూడా దైవ ప్రణాళికలను నెరవేర్చుతు దేవుని కొరకు జీవించుదాం, అప్పుడే ఆయన మనలో జన్మించి మనతో ఎప్పుడూ  ఉంటారు.  


Rev. Fr. Bala Yesu OCD

13, డిసెంబర్ 2021, సోమవారం

పునీత సిలువ యోహను

పునీత సిలువ యోహను

పునీత సిలువ యోహనుగారు  ఒక తిరు సభ పండితుడుగా, ఆధ్యాత్మిక జీవిత మార్గ చూపరిగా అందరికి సుపరిచితులే. కానీ ఆయన జీవితం అందరికి అంతగా తెలియదు. అతను  తన మాటలలో, చేతలలో ఒక ప్రవక్త అంతటి గొప్పవాడు. ఏలియా ప్రవక్త అంతటి ఆత్మీయ శక్తి కల వాడు.

సిలువ యోహను గారి కుటుంబ నేపధ్యం

సిలువ యోహాను గారు ఫోన్టిబెరోస్ అనే గ్రామములోని  ఆవిలా  మెత్రాసనం లో జన్మించారు. ఆయన తండ్రిగారి పేరు యెపేస్ గోన్సాలో , యెపేస్ అనేది తోలేదో అనే పట్టణంలో  ఉన్న ప్రాంతం, ప్రాంతం నుండి , కుటుంబం పేరు పొందింది. ఆయన తల్లి పేరు కతలీన అల్వెరోస్, ఆమెది  తోలేదో పట్టణం, గోన్సలో గారు,   ధనిక కుటుంబం నుండి వచ్చినా కానీ, తన భార్య వలె ఒక పేద, చెనేత వృత్తిని  తాను కూడా నేర్చుకున్నాడు. ఆయన తన   తండ్రి చనిపోయిన తరువాత, తన తండ్రి  సోదరులు ఆయనను దత్తత తీసుకొని వెళ్లారు. తన మారు తండ్రి చాలా ధనవంతుడు మరియు వ్యాపారి. కనుక ఆయన గోన్సలో గారిని తన వ్యాపార పనిలో పెట్టాడు.  వ్యాపార పనిమీద తరచూ ఆయన మెదిన దేల్ కాంపో   అనే నగరానికి వెళ్ళేవాడు. అప్పుడు అది ఒక అభివృద్ధి చెందుతున్న గొప్ప నగరం. ప్రయాణం మధ్యలో గోన్సలో గారు ఫోన్టిబెరోస్ వద్ద తోలేదో  నుండి వచ్చిన ఒక విధవరాలి దగ్గర విడిదికి ఉండేవాడు. ఆమె దగ్గర అనాథగా ఉన్న కతలీన అల్వెరోస్ ని చూసి, ఆమె సుగుణాలకు ముగ్ధుడై  , ఆమె  కతోలిక విశ్వాసాన్ని  మెచ్చి, తన కుటుంబానికి కూడా చెప్పకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన కుటుంబానికి తెలియకుండా, తాను చేసిన పనికి  కుటుంబం మొత్తం అతనికి వ్యతిరేకము అయ్యింది. తన కుటుంబం మొత్తం ఆయనను వదిలివేసింది. అతను చేసిన ఒక్క పనితో పేద వాడిగా మారిపోయాడు. తన భార్య వృత్తిని చేపట్టి ఆమెకు తోడుగా ఉన్నాడు. తన భార్య చేసే నేత పని వలన చాలా తక్కువ సంపాదన వారికి వచ్చేది. కనుక పేదరికం వారిని చాల ఇబ్బంది పెట్టేది. వీరు పేదరికంలో ఉండగానే వారికి ముగ్గురు పిలలు జన్మించారు. వారు ఫ్రాన్సిస్, లూయిస్ మరియు మన సిలువ యోహను. కుటుంబానికి సాయం చేస్తూ, తల్లి లేని కతలీనకు తల్లిగా ఉన్న విధవరాలు మరణించారు. అటు  తరువాత గోన్సలో గారు రెండు సంవత్సరాలు, అనారోగ్యంతో బాధ పడి, ముగ్గురు పిల్లలను తల్లికి వదలి, పేరును మాత్రమే శేషంగా వదలి,1545 సంవత్సరంలో  మరణించారు.

కతలీన తన భర్త మరణించిన తరువాత,  ఆయన కుటుంబాన్ని తన పిల్లలను ఆదుకోమని, తొర్రిహోస్ , గలివేస్  అడగడానికి వెళ్ళింది, కానీ వారు సహాయం చేయలేదు.  అక్కడ నుండి మరల ఫోన్టిబెరోస్కి, తన బిడ్డలతో కలిసి వచ్చి తన చేతులతో తన బిడ్డలకు ఆహారాన్ని సంపాదించినది. రెండవ కుమారుడు లూయిస్ చనిపోయాడు.  

బాల్యం

1542 లో పునీత సిలువ యోహను గారు ఫోన్టిబెరోస్లో జన్మించారు. ఆయన జూన్ 24 తేదీన జన్మించారా లేక డిసెంబర్ 27 జన్మించారా అనేది పూర్తిగా తెలియదు. కానీ రెండు తేదీలలో ఒక రోజున ఆయన జన్మించారు. ఎందుకంటే తన జ్ఞాన స్నాన సమయంలో యోహను అనే పేరును ఆయనకు పెట్టారు. సంవత్సరంలో యోహను గారి పండుగ రోజున  జన్మించారు, యోహను అనేది మనకు కచ్చితముగా తెలియదు. జ్ఞానం స్నాన రికార్డు 1546 లో  ఫోన్టిబెరోస్ విచారణ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రమాదవశాత్తు కాళీ పోయాయి. 1545 సంవత్సరంలో తన తండ్రి చనిపోయారు.కతలీన  తన భర్త తరుపువారు ఏమి సహాయం చేయకపోవడంతో ఒక సంవత్సరం గలవేస్ లో వుండి మరల  పొంటివెరోస్ వచ్చారు. 1548 సంవత్సరంలో అరవేలో లో ఉన్నారు. ఇక్కడే రెండవ కుమారుడు లూయిస్ చనిపోయారు. 1551 సంవత్సరంలో మరల ఆర్ధిక అవసరాలు, పేదరికం మనసులో పెట్టుకొని మెదిన దేల్ కంపో   వచ్చారు. అప్పది నుండి 1564 వరకు అక్కడే ఉన్నారు.

కతలీన  అల్వేరేస్  తన పిల్లలను కటిక పేదరికంలో పెంచినప్పటికీ వారిని  గొప్ప మాతృ వాత్సల్యంతో పెంచారు. వారికి యేసు ప్రభువును ఆశ్రయించడం, మరియ మాత మీద భక్తిని  నేర్పింది.  దైవ భయం లో తన పిల్లలు ఎదిగేలా చేసింది. అదే విధముగా పవిత్ర వస్తువులను గౌరవించడం ఆమె నేర్పింది. తన బిడ్డలు సుగుణాలు కలిగి జీవించే విధంగా చేసింది. తన పిల్లలను రక్షించుకోవడానికి ఆమె ఎప్పుడు వారి వద్దనే ఉండేది. ఆమె వారి ఆటలలో కూడా పాల్గొనేది. ఒక రోజు యోహను ఒక పిల్లవాడితో ఆడుకోవడానికి వెళ్ళి, చెరువులో ఉన్న  మట్టిలో అడుకొంటు ఉండగా, నీటిలో మునిగి పోయాడు. కానీ వెంటనే పైకి తేలడం జరిగినది. అతనికి ఎటువంటి దెబ్బలు కాని గాయాలు కానీ జరగకుండా పైకి రావడం జరిగినది. తాను మరియమాత ద్వార మరణం నుండి తప్పించుకున్నానని యోహను గారు గట్టిగా  నమ్మాడు. మరియమాత తనకు ప్రత్యక్షమై, తనను పైకి తీయడానికి చేయి చాపగా, ఆయన తన చేయి ఇవ్వడానికి సాహసించలేదు.  ఎందుకంటే తాను చాలా మురికి అంటుకొని  ఉన్నందుకు, ఆమెకు ఎక్కడ బురద అంటుకుంటుందో అని  వేరె ఒక వ్యక్తి వచ్చి తనను పైకి తీసినంతవరకు, ఆమెకు తన చేయి ఇవ్వడానికి  తాను సాహసించలేదు.  మరియ మాత మీద యోహను గారి భక్తి ఎప్పటికీ తగ్గకుండా అలానే ఉంది. ఆయన తరువాత ఎప్పుడు ప్రాంతమునకు వెళ్ళిన కానీ ఒక యాత్రకు వెళ్ళినట్లు గా వెళ్ళేవాడు.

సిలువ యోహను గారి భక్తి మరియు మేదిన దేల్ కాంపో వద్ద ఆసుపత్రి

ఫ్రాన్సిస్ అయిన యోహను గారి అన్న గారి  ప్రకారం, వారు ఇద్దరు తమ తల్లి గారితో కలిసి మెదిన కు వెళ్ళేవారు. మెదిన కు వెళ్ళేముందు ఉన్న చెరువు వద్దే  మరియమాత ఆయనను రక్షించడం జరిగినది. ఫ్రాన్సిస్ తన తమ్ముడు గురించి చెబుతూ , ఆయనను   దర్జీ , వడ్రంగి, పెయింటింగ్ , శిల్ప కళ మొదలయిన పనులను  నేర్పించాలని చూసిన, ఆయన వాటికి తగిన నైపుణ్యాన్ని కనబర్చలేదు. దేవుడు ఆయనకు గొప్ప కార్యాన్ని అప్పగించబోతున్నాడు, అందుకేనేమో ఆయన వాటిలో కొనసాగలేక పోయాడు.  తన తల్లి ఆయనను మంచి పాఠశాలలో వేయాలి అనుకున్నది, కానీ వారి ఆర్ధిక స్తోమత దానికి సహకరించలేదు. మెదిన లో ఉన్న పేద మరియు అనాధుల పాఠశాలలోనే చేర్పించారు. ఇక్కడ కొంత కాలం యోహను గారు చదువుకుంటూ, ప్రార్థన మరియు భక్తి పరమైన పనులు చేస్తూ అందరికి ఆదర్శముగా  ఉండేవాడు.   సమయములోనే ఉదయాన్నే ఆయన దివ్య బలి పూజకు పునీత అగుస్తిను సభకు చెందిన,  పునీత ముగ్ధల మరియా ఆశ్రమానికి వెళ్ళేవాడు. అక్కడ దివ్య బలి పూజలో గురువుకి, చాల భక్తితో సహాయం చేసేవాడు. ఆయనను అందరూ మెచ్చుకునేవారు. తన సుగుణాలు, దైవ భక్తి తనను చూసేవారి అందరికి ఒక ఆకర్షణగా ఉండేది. విధముగా ఆయనకు ఆకర్షించబడిన  వారిలో తోలేదో నుండి అల్వేరేస్ గారు. ఆయన తన జీవితాన్ని పేదలకు,  రోగులకు అంకితం చేసి జీవిస్తున్నారు.    ఆయన  అక్కడ ఒక ఆసుపత్రి నడుపుతుండేవాడు. ఆయన యోహను గారు తల్లి కతలీన దగ్గరకు వచ్చి, యోహనును ఆసుపత్రి లో సేవ చేయడానికి పంపమని అడిగారు. యోహను గారికి అప్పుడు 12, 13 సంవత్సరాలు వయస్సు ఉంటుంది. అల్వేరేస్ గారు , యోహను ఆసుపత్రి లో సేవ చేస్తూ చదువుకోవచ్చు అని , తరువాత తనని గురువును చేసి, ఆసుపత్రి ని యోహనుకు అప్పగిస్తాను అని చెప్పడం జరిగినది. విధముగా యోహను మరియు కతలీన దానికి ఒప్పుకున్నారు . విధముగా సిలువ యోహను గారు  మేదిన ఆసుపత్రిలో పేదలకు , రోగులకు సేవ సాగించాడు.

ఆయన ఉపకారాలు, చదువు, ప్రార్థన జీవితం

అక్కడ ఉన్న ఆసుపత్రి, యోహను గారు తన సుగుణాలను వ్యక్త పరచడానికి అనేక అవకాశాలను ఇచ్చింది. తన నిద్రను కూడా మానుకొని, ఆయన అక్కడ ఉన్న రోగుల ప్రక్కనే ఉంటూ, వారి బాగోగులను చూసుకునే వాడు. యోహాను గారు ఎప్పుడు కూడా అలసట లేకుండా ఉండేవాడు. రోగుల బాధ సాదలను పట్టించుకొని, వారికి  సమయానికి మందులు ఇస్తూ ఎంతో ప్రేమగా ఉండే వాడు. ఎవరికైతే ఎటువంటి మందులు ఉపయోగ పడక  బాధపడుతూ ఉంటారో, వారికి దగ్గర ఉండి  తన మాటలతో ఊరటను ఇచ్చేవాడు. యోహను గారి చదువు గురించి  ఫ్రాన్సిస్ చెబుతూ,  వారి అమ్మ మొదట యోహాను గారిని  పాఠశాలలో  క్రైస్తవ సిద్దాంతము నేర్చుకోవడంలో వేయడము జరిగినది. అక్కడ ఆయన చదవడం , రాయడం, చాలా త్వరగా నేర్చుకున్నాడు. వారు ఆయనను  లాటిన్ నేర్చుకోవడానికి, యేసు సభ  కళాశాలకు  పోవడానికి అనుమతి ఇచ్చారు. ఆయన తన చదువులలో చాలా చురుకుగా ఉండేవాడు.  యోహాను గారు తెలివైన విద్యార్థి గా పేరు తెచ్చుకున్నాడు. తక్కువ సమయం లోనే అక్కడ తన చదువును పూర్తి చేశారు. ఆసుపత్రి లోని  వారు యోహాను గారు  రాత్రి సమయములో చదువుకుంటూ ఉండగా చూసేవారు. యేసు సభ కళాశాలలో, ఆయనకు  వారు వ్యాకరణం, వాక్చాతుర్యం నేర్పించారు. వాటిలో  ఆయన అసామాన్య ప్రతిభ కనబరిచాడు. 

మేదిన  దేల్ కంపోలోని కార్మెల్ ఆశ్రమం లో  యోహను

యోహనుగారు  20  సంవత్సరాల వయసులో, ఎటువంటి  కల్మషం లేని రెండు సంవత్సరాల  పిల్లవాడిగా, 50 సంవత్సరాల వ్యక్తి  వలె వివేకము కలిగి  ఉండేవాడు. యోహనుగారు  అల్పమైన విషయాలను మాటలాడటానికి కానీ, సమయం వృధా చేయడం గాని ఎప్పుడు ఉండేది కాదు. అందుకే  ఆయన అనేక సుగుణాలలో ఎదగడానికి అది ఉపయోగపడినది. యోహను గారు ఒక రోజు ప్రార్ధన చేస్తూండగా, దేవున్ని తాను ఎటువంటి జీవితం ఎన్నుకోవలో, మార్గం చూపమని, ముఖ్యముగా  ఎందులో అయితే తాను పూర్తిగా దేవుని సంకల్పాన్ని నిర్వర్తించగలడు,  దానికి దారి చూపమని వేడుకున్నాడు. తన ప్రార్ధన విన్న దేవుడు, ఆయనకు ఓదార్పునిస్తు, ఒక సందేశం ఇచ్చాడు. ఆయన ప్రార్థనలో ఉండగా ఆయన ఒక స్వరం విన్నారు, మాటలు ఏమిటంటే నీవు నాకు  ఒక పురాతన సభ ద్వార సేవ చేయాలి, దాని పూర్వ స్థితికి తీసుకురావడానికి నీవు సహాయం చేయాలి.”

మాటల ద్వార  దేవుడు, తనను ఒక సన్యాస సభకు పిలుస్తున్నాడు, అని ఆయన అర్దం చేసుకున్నాడు. కానీ అది సభకు వెళ్ళాలో ఆయనకు తెలియలేదు. ఒక పురాతన సభను పూర్వ స్థితికి తీసుకురావడం అంటే ఆయనకు అర్దం కాలేదు. విషయాన్ని, కొన్ని సంవత్సరాల  తరువాత పవిత్ర జీవితం జీవించిన,  ఆవిలాపురి తెరేసమ్మగారి  సహచరురాలు అయిన  యేసు అన్నమ్మ అనే కన్య స్త్రీ కి తెలియచేశాడు.  1560 లో కార్మెల్ సభ గురువులు మెదిన నగరానికి వచ్చారు. అక్కడ అన్నమ్మ గారి మఠాన్ని ఏర్పరిచారు. ఒకరోజు యోహనుగారు అక్కడకు వెళ్ళారు. అక్కడ సభ వస్త్రాన్ని చూసి చలించిపోయారు. దాని ద్వార దేవుడు తనను  సభకు పిలుస్తున్నాడు అని  అర్ధం చేసుకున్నారు. మఠము లోనికి వెళ్ళి తనను సభలోనికి తీసుకొమ్మని  కోరారు. మఠ వాసులు ఎంతో ప్రేమతో ఆయనను ఆహ్వానించారు. అప్పటికే యోహను గారు, మెదిన నగరంలో  గొప్ప వ్యక్తిగా అందరికి సుపరిచితులుగా  ఉండటం వలన, వారు ఆయనను ఆనందముగా ఆహ్వానించారు.   అటు తరువాత ఆయన  కార్మెల్ సభ వస్త్రాన్ని, తన  21 సంవత్సరాల వయసులో పునీత  మత్తయి  పండుగ రోజున అంటే ఫిబ్రవరి 24, 1563 లో స్వీకరించాడు, అందుకే ఆయనను మొదటగా జాన్ ఆఫ్ మత్తయాస్ అనేవారు.  

 నోవిషియేట్ జీవితం- కార్మెల్ సభ మొదటి నియమావళి

నోవిషీయెట్ లో ఉండగా అతని క్రమబద్ధమైన విధేయత జీవితం, ఉత్సాహం , కఠిన జీవితాన్ని నిష్ట తో జీవించిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. 1564 సంవత్సరంలో యోహను తన మాట పట్టును తమ పెద్ద గురువు గారైన ఫా. ఏంజిల్ గారి  చేతుల మీదుగా స్వీకరించాడు.                                                                                           

  మాట పట్టుకు  అలెన్సొ  అల్వెరోస్ కూడా హాజరయ్యారు. మాట పట్టు రికార్డు మఠములో ఉంచబడింది. అందులో యోహను గారు చేసిన సంతకం ఉండటము తో దానిని పునీతునీ గుర్తుగా ఉంచారు. కార్మెల్ సభకు తనను  తీసుకువచ్చినందుకు నిరంతరము దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండేవాడు. ఇక్కడ ఆయన ప్రధానంగా, కార్మెల్ సభ  మొదటి నియమావళిని జాగ్రత్తగా చదవి దానిని సంపూర్ణముగా జీవించడానికి ప్రయత్నించాడు. ఆయన అప్పుడు ఒక  విషయం తెలుసుకున్నాడు. అది ఏమిటి అంటే?  పునీత ఆల్బర్ట్ గారు ఇచ్చిన నియమావళిని స్వీకరిస్తున్నప్పటికీ వారు ఆవిధముగా జీవించడము లేదు అని , అంతేకాదు, తరువాత అది  నాలుగవ ఇన్నోసెంట్ పోపు గారు మార్పు చేసిన నియమావళి కూడా కాదు అని ,ఎంతో సవరించబడిన నాలుగవ ఎవుజినియస్ పోపు  గారి చేత ఆమోదించబడిన నియమావళిని వారు పాటిస్తున్న విషయాన్ని తెలుసుకున్నాడు. దానిలో కఠినమయిన నియమాలు అన్నీ తీసి వేయబడినవి. ఇవన్నీ తెలుసుకున్న తరువాత మొదటి నియమావళిని స్వీకరించి, చదివి దానిలో ఉన్న అన్నీ నియమాలను పాటించడానికి అనుమతిని కోరాడు పునీత యోహనుగారు. ఆయన ఉత్సాహాన్ని చూసి, సభ పెద్దలు  ఆయనకు అందుకు అనుమతిని ఇచ్చారు. కానీ వారు అప్పుడు చేస్తున్న పనిని కూడా వదలి వేయకూడదు అని, మరియు అప్పుడు మఠం లో ఉన్న క్రమాన్ని పాటించాలి అని, వారు ప్రస్తుతం జీవిస్తున్న అన్నీ పనులలో యోహానుగారు హాజరు అవ్వాలని, ఇవి చేయుటకు ఎటువంటి ఆటంకం ఉండకూడదనే  షరతుతో అనుమతిని ఇచ్చారు.    కానీ పునీత సిలువ యోహను గారు మొదటి నియమావళి అడిగిన దాని కన్నా, ఇంకా  ఎక్కువ కఠిన జీవితాన్ని జీవించారు. మరియు తాను మఠ నియమాలను దేనిని విడవకుండా అందరితో కలిసి, అన్నీ పనులలో పాలుపంచుకునేవాడు.  సిలువ మహోత్సవం  పండుగనుండి క్రీస్తు పునరుత్థాన మహోత్సవం వరకు ఆయన ఉపవాసాన్ని ఆచరించేవాడు.

ఆయన చదువు - సాలమాంక లో ఆయన కఠిన  జీవితం మొదటి దివ్య పూజ బలి

ఆయన మఠ పెద్దలు  యోహను గారి యొక్క ప్రతిభను, ఆయన  సుగుణాలు  చూసి, ఆయనను దైవ శాస్త్ర  చదువుకు సాలమాంక  లో ఉన్న వారి కళాశాలకు వెళ్ళడానికి,  ఆయనకు అనుమతి ఇచ్చారు.  ఆయన చదువుకొని వారికి ఉపయోగపడతారు అని అనుకున్నారు. సాలమాంక లో ఉన్న కళాశాల పేరు పునీత ఆంద్రేయ  కానీ తరువాత దానిని పునీత తెరెసా కళాశాల గా మార్చారు. కళాశాలకు యోహనుగారు 1564 లో వెళ్లారు. ఆయన అక్కడ కూడా తన నోవిషీయెట్  జీవితాన్నే జీవించాడు. నియమాలన్నీ యోహనుగారు, చాలా సునాయాసంగా పాటించారు. ఆయన జీవించే విధానం అందరికి తెలిసినది. నిష్టతో కూడిన ఆయన  జీవితం మరియు ప్రార్థన,  రెండు ఆయన ఆధ్యాత్మిక జీవితానికి రెండు కళ్ళు. వీటి ద్వారానే ఆయన ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. ప్రార్థన ఆయనకు సర్వస్వం అయ్యింది.

ఆయన కార్మెల్ సభ మొదటి నియమావళిని పాటించినప్పటికీ, ఎప్పుడు కూడా మఠ నియమాలను వేటిని విస్మరించలేదు. 1567 లో తన చదువు, అతడు  25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు  పూర్తి అయ్యింది. దాని తరువాత సభ పెద్దలు, తనను గురుత్వ అభిషేకానికి సిద్దపడమని, తమ అనుమతిని తెలియచేశారు.   బాధ్యతను తీసుకునే ముందు తనను తాను  సిద్ద పరుచుకోవడానికి ధ్యాన వడకమునకు  వెళ్ళాడు. అదే సంవత్సరం సాలమాంక లో  గురువుగా అభిషేకం పొందాడు.  అభిషేకం పొందిన వెంటనే మఠ పెద్దలు, ఆయనను మెదినలో తన మొదటి  దివ్య బలి పూజ అర్పించడానికి పంపించారు. ఎందుకంటే ఆయన మఠం నుండి  వచ్చాడు, మరియు తన తల్లి అక్కడే ఉన్నది. తన మొదటి దివ్య బలి పూజలో, “తాను  నిర్మలముగా ఉండటానికి, ఎప్పటికీ మలిన పడకుండా, తన జ్ఞాన స్నాన నిర్మలత్వం అలానే ఉంచ గలిగే   శక్తినిఅడిగారు. 

 కర్తుసియాన్ అవ్వాలనుకోవడం తెరెసా ను కలవడం

యోహాను గారికి లౌకిక విషయాలనుండి  దూరముగా ఉండాలని,  దేవునితో ఉండవలసిన  ఆవశ్యకత ఎక్కువ ఉంది అనిపిస్తూండేది. అందుకే ఆవిదంగా ఉండాలని  నిర్ణయించుకున్నాడు. అవకాశం ఉంటే  అందరికి దూరముగా ఎడారి ప్రాంతంలో, ఎక్కడైతే దేవుడు, తాను, మాత్రమే  ఉండే ప్రదేశమునకు వెళ్లాలనుకున్నాడు. ఆయన తన జీవితాన్ని మొత్తం  దేవునికి అర్పించాడు. ఇంకా ఆయన దగ్గర ఏమీలేదు, కానీ అబ్రహాము వలె ఆకాశ  పక్షులను తోలడం ఆయన కర్తవ్యం అని,   పక్షులు,   అర్పణను మలినం చేయకుండా చూడటం తన బాధ్యత అని, విధంగా జీవించాడు. పునీత యోహను గారికి,  అబ్రహాము వలె జీవించడానికి  ఒకే ఒక మార్గం  కనపడినది, అది కర్తుసియాన్ సభ ఎందుకంటే అది మాత్రమే ఒక కార్మెల్ సభ  మఠ వాసి వెల్లగలిగేది.   సమయంలోనే తెరెసా గారు కార్మెల్ సభ సన్యాసినుల విభాగాన్ని నూత్నీకరించారు. మరియు పురుషుల విభాగాన్ని కూడా నూత్నీకరించడానికి  ఇటువంటి అభిప్రాయాలు కలిగిన  కొంత మంది గురువుల కోసం చూస్తుంది. ఆలోచనలతో ఉన్న తెరెసా  మెదినలో రెండవ  నూతన కార్మెల్ను స్థాపించడానికి వచ్చారు. తెరెసా గారు తన ఆలోచనలు ఆంటోనియో హెరోడియా అనే మెదిన  కార్మెల్ మఠ పెద్దకి తెలియచేసింది. అందుకు ఆంటోనియా గారు సుముఖంగా ఉన్నప్పటికీ, ఆయన వయస్సు రీత్యా కఠిన జీవితం జీవించగలడా, అనే అనుమానం తెరెసా గారికి ఉండేది.  యోహనుగారు  మెదినలో తన మొదటి పూజ తరువాత మరల   సాలమాంక వెళ్ళారు.  తరువాత అదే సంవత్సరం ఒరోస్కో పేతరు గారితో కలిసి  సేగోవియా లో ఉన్న  కర్తుసియాన్ మఠం లో చేరాలనే ఆలోచనతో  యోహనుగారు మెదినకు   వచ్చాడు. కొన్ని రోజులు ఆయన అక్కడే  కార్మెల్ మఠం లో ఉన్నాడు. పేతురు గారు తెరెసాగారికి యోహను గారి గురించి చెప్పారు. ఆయన ఎటువంటి  జీవితం జీవిచ్చేది,  ఆయనకు కార్మెల్ సభ మీద ఉన్న అవగాహన  మొత్తం ఆమెకు చెప్పడం జరిగినది. యోహను గారు  పునీత తెరెసా గారిని కలిసినప్పుడు ఆయన వయస్సు 25 సంవత్సరాలు. నాలుగు సంవత్సరాలు సభలో ఉన్నారు, ఆమె  అప్పటికే  33 సంవత్సరాలు సభలో ఉన్నారు. అప్పుడు ఆమె వయసు 53.  తెరెసా యాబై మూడు సంవత్సరాల వయసులో వీరు ఇద్దరు కలిశారు. ఒరేస్కో  పేతురు గారి  అభ్యర్ధన ప్రకారం మేదిన కార్మెల్  కాన్వెంట్ లో  ఆమెను  కలిసి, ఆయన ఆలోచలను ఆమెతో చెప్పగా, ఆమె ఏమి చేయాలనుకుంటున్నది చెప్పింది. ఆయన కార్మెల్ సభలోనే ఉన్నట్లయితే  మొదటి నియమావళిని పునరుద్దరించవచ్చు అని కోరింది. దానికి యోహను గారు ఒక షరతుతో ఒప్పుకున్నారు . షరతు ఏమిటంటే అది త్వరగా జరగాలని. తెరెసా కి ఇది దేవుని  వరం లా కనబడింది.  ఎందుకంటే ఆమె అనుకున్నటువంటి  వ్యక్తి, ఆమెకు ఇంత వరకు కనబడలేదు,కాని యోహను గారితో తన పనికి తగిన వ్యక్తి దొరికినట్లయింది. ఇప్పుడు నిశ్చింతగా తన పునరుద్దరణ కార్యాన్ని కొనసాగించవచ్చు.

ఇద్దరు సన్యాసులు, ఆంటోనియో మరియు యోహను గారు జీవితానికి స్వస్తి చెప్పి, మొదటి నియమావళిని అవలంభించడానికి సిద్దమయారు.  కానీ వారికి ఒక మఠం కావలసివుంది. వారి వద్ద మఠం ఏర్పాటుచేయడానికి డబ్బు కూడా లేదు.  తెరెసా 1567 చివరలో మెదిన నుండి  మాద్రిద్  వెళ్లిపోయారు. 1568 ఏప్రిల్ లో ఆమె సన్యాసినుల మఠాన్ని మళగొన్ లో స్థాపించారు, వయడోలీడ్ లో వేరె మఠాన్ని స్థాపించడానికి సిద్దపడుచున్నారు. మలగొన్ లో తెరెసా ను  యోహను గారు కలిశారు. అప్పుడు  రఫాయేలు అనే ఒక పెద్ద మనిషి  తనకు దురుఎలో లో ఉన్న చిన్న ఇంటిని మఠాన్ని స్థాపించడానికి ఇస్తాను అని చెప్పాడు. ఇంటిని స్వీకరించిన తెరెసా అది సంస్కరించబడిన కార్మెల్ కు బెత్లెహేము లాంటిది అని  అనుకున్నది.

దురుఏలో లో యోహను సంస్కరణ ప్రారంభం  

 తెరెసా వయాదోలీద్కు  మఠాన్ని  స్థాపించడానికి  వెళ్ళారు. ఆమె యోహనును,  ఆమెతోపాటు తీసుకొని వెళ్ళింది.అక్కడ  ఆయన వారి జీవిత  విధానము చూడటానికి తీసుకొని వెళ్ళింది. వయదోలిద్  లో సన్యాసినుల కొంత కాలం పూర్తిగా లోపల లేకుండా  జీవించారు, అక్కడ  మఠంలో పని జరుగుతూ ఉంది . ఇది వారి జీవిత విధానము  యోహను చూడటానికి చాలా ఉపయోగపడింది. విధముగా మరొక కసారి నోవిస్ గా  ఉన్నారు. తెరెసా  ప్రొవిన్సియల్  అనుమతి కోసం ఎదురుచూచ్తుంది. యోహను వారి మొదటి ఆధ్యాత్మిక గురువుగా, అక్కడ వారి పాప సంకీర్తనలు వింటున్నారు. ఆయన కార్మెల్ సభ మొదటి ఆధ్యాత్మిక  గురువు, అటు గురువులకు మరియు సన్యాసినులకు.  జెనరల్ గారి అనుమతితో నిష్పాదుక కార్మెల్ సభ సన్యాసుల మొదటి మఠం స్థాపించడానికి ఉన్న అన్నీ అవరోధాలు తొలగిపోయాయి.  తెరెసా మరియు ఆమె సహచరులు మొదటి అంగీని తయారు చేసి యోహను గారికి ఇవ్వడము జరిగినది. అంగీతో దివ్య బలి పూజ చేయడానికి యోహనుగారు  దురుఏలో బయలుదేరి వెళ్ళేడు. అంతకు ముందు దురుఏలోను ఆయన  ఎప్పుడు చూడలేదు. 1568 లో అక్కడ మఠాన్ని స్థాపించారు. అక్కడకు వెళ్ళిన వెంటనే  అక్కడ ఉన్న కర్రలతో సిలువలు చేసి, దానిని దేవాలయముగా మార్చాడు పునీతుడు. దేవాలయములో ఉన్న ఆభరణాలు ఏమిటి అంటే కర్రలతో చేసిన సిలువలు మరియు  మనిషి పుర్రెలు సిలువలుగా చేసి ఉంచాడు. అవి భయాన్ని అదే విధముగా, పునీతుడు ఎంత నిష్టతో కూడిన  జీవితము జీవించాడో  తెలియచేస్తుంది. ఉదయాన్నే బలి పిఠాన్ని సిద్దం చేసి, తాను స్వీకరించిన అంగీని బలి పీఠం మీద ఉంచి, దీవించి పూజ చివరిలో అంగీని ధరించాడు. ఆవిధముగా నిష్పాధుకా కార్మెల్ సభ అంగీని మొదట ధరించాడు.  ఆయనకు చలి నుండి కాపాడుకోవడానికి తగిన వస్త్రాలు కానీ  పాదరక్షలు  కానీ లేవు.

(1568-74 )నిష్పాధుక కార్మెల్ సభలో ముఖ్యమైన రోజులు

1568 సంవత్సరంలో నవంబర్ 28 తేదీన ప్రొవిన్సియల్ గారు  దురువేలో లో, దివ్య బలి పూజ అర్పించి  మొదటి  పురుషుల నిష్పాధుక కార్మెల్ సభ మఠంను  అధికారికంగా ప్రారంభించారు. 1569 సంవత్సరంలో ప్రొవిన్సియల్ గారు నిష్పాధుక కార్మెల్ ను నోవిసులను తీసుకోవడానికి అనుమతిని ఇచ్చారు. యోహను గారిని సుపీరియర్ గా మరియు నోవిసుల శిక్షణ గురువుగా నియమించబడ్డాడు. సంవత్సరంలో చివరలోనే ఆయన మెదినలో తెరెసాను కలిశారు.

1570 సంవత్సరం జూన్ 11 తేదీన దురుఏలో నుండి సాలమాంక  దగ్గరలో మన్సెర కు బదిలీ అయి అక్కడ సుపీరియర్ మరియు నోవిసుల శిక్షణ గురువుగా నియమించ బడ్డారు. 1570 సంవత్సరం అక్టోబర్ 8 యోహను గారి మొదటి నోవిసులు మాటపట్టు తీసుకున్నారు. సమయంలో యోహను గారు ప్రయాణ బడలిక చేత చాలా అలసిపోయేవారు. అక్కడ నుండి పస్త్రన లో నోవిషియేట్ మొదలు పెట్టడానికి అక్టోబర్ నవంబర్ నెలలలో వెళ్లారు.

1571 సంవత్సరం జనవరి లో ఆల్బ దె తోర్మేస్ కు తెరెసా గారెకి తోడుగా వెళ్ళి అక్కడ మఠ స్థాపనలో పాల్గొని అక్కడ నుండి కొన్ని నెలలు మన్సెర తిరిగి వచ్చారు. మరలా ఏప్రిల్ నెలలో ఆల్కలా దె హేనేరేస్కు వెళ్ళి అక్కడ ఉన్న సభ  కళాశాల రెక్టర్ గా ఉన్నారు. 1572 సంవత్సరంలో ఏప్రిల్ -మే నెలల్లో అల్కాలా నుండి పస్త్రనలో నోవిషియేట్ స్థాపించాడానికి అనుమతికొసమై వెళ్ళి అక్కడ నుండి మరలా తన మఠం అయిన అల్కాలకు తిరిగివచ్చాడు. మే మరియు జూన్ నెలల్లో ఆవిలాలో ఉన్న ఇంకర్నెషన్  మఠానికి ఆధ్యాత్మిక గురువుగా తెరెసా గారు మఠ పెద్దగా ఉండగా ఆమె యోహనుగారిని ఆధ్యాత్మిక గురువుగా కోరి ఆమెకు సహాయం చెయడానికి మఠాన్ని ఆధ్యాత్మికంగా ప్రత్యేక అనుమతితో తీసుకున్నారు. ఇదే సమయములో నిష్పాధుక కార్మెల్ సభ సభ్యుల గురించి సవరించబడిన కార్మెల్ సభ నియమావళిని పాటిస్తున్న వారి మనసులు మారిపోయాయి. దీనికి కారణం ఏమిటంటే 1566 సంవత్సరంలో కార్మెల్ సభ జెనరల్ గారు అయిన రూబీయో గారు స్పెయిన్ దేశంలో ఉన్న అన్నీ కార్మెల్ సభ మఠలను సందర్శించి వెళ్లారు. తరువాత సంవత్సరం రెండవ పిలిప్పు రాజు ట్రెంట్ మహా సభ ఆదేశాలను అవలంభించడానికి మఠాల పునరుద్దరణకు సభ జెనరల్ కు ఉండే అటువంటి అధికారం కలిగిన ప్రత్యేక అధికారులను నియమించడానికి అనుమతిని పొందారు. సమాచారం రూబీయో గారికి 1568 లో చేరింది. దానిని రద్దు చేయించాలనుకున్నారు రూబీయో గారు. కానీ పిలిప్పు గారు ఇద్దరు దోమినిక్ సభ గురువులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరిలో ఒకరు జెనరల్ గారి ప్రకారం ప్రవర్తించాడు. కానీ రెండవ వ్యక్తి పూర్తిగా స్వతంత్రంగా ప్రవర్తించి సవరించిన నియమావళిని పాటిస్తున్న మఠాన్ని   నిష్పాధుక కార్మెల్ ఇచ్చి , ఇంకా సేవియా , గ్రనాధ , పెనుఎలా లో నూతన మఠాలను స్థాపించడానికి అనుమతిని ఇచ్చాడు.  ఇవి అన్నీ జెనరల్ రూబీయో గారికి వ్యతిరేకంగా ఉన్నాయి. సమాయములోనే 1574 లో స్పెయిన్ దేశంలో ఉన్న అన్నీ ప్రొవిన్సిలు ప్రత్యేక అధికారులుగా కార్మెల్ సభ సభ్యులను నియమించమని కోరారు. అదే సంవత్సరం ఆగస్ట్ 3 వారి కోరికకు అనుకూలముగా 13 గ్రేగరి పోపు గారు ఆదేశించారు. కానీ పోపు గారి ప్రతినిధి ఒరమెంతో గారు తన ఆధికారాన్ని ఉపయోగించి వారినే కొనసాగించారు. మరియు నిష్పాధుక కార్మెల్ సభ్యుడైన జెరోమ్ గ్రషీయన్ ను నిష్పాధుక కార్మెల్ సభ ప్రొవిన్సియల్ గా మరియు అందలుసియాలోని సవరించిన నియమావళిని అనుసరిస్తున్న కార్మెల్ సభ్యులకు ప్రత్యేక అధికారిగా నియమించారు. 1574 సంవత్సరం డిసెంబర్ 27 తేదీన పోపు గారు నిర్ణయాలకు ఆమోదం తేలిపారు. 1575 లో కార్మెల్ సభ పియ జెన్స , ఇటలీ లో జరిగిన చాప్టరులో స్పైయిన్ జరుగుతున్న విషయాలమీద చర్చించి జెనరల్ గారి అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన మఠాలను మూసివేయాలని ఆదేశించారు. విధంగా కార్మెల్ సభ పునరుద్దరణ కొంత ఆగవలసినవచ్చింది. నిష్పాధుక కార్మెల్ సభ్యులు 1576 సెప్టెంబర్ లో అల్మోదొర్ వద్ద ఎన్నిక జరిగింది అని కోపంతో ఉన్నారు.

 

 పునీతుని మీద ఒత్తిడి మరియు శిక్ష

కార్మెల్ సభ సభ్యులు 1576 సంవత్సరం మేలో పునీత సిలువ యోహను గారిని మరియు ఆయన సహచరుడిని ఇంకార్నెషన్ మఠం వద్ద  అరెస్టు చేసి మెదిన వద్ద ఉంచారు, పోపుగారి ప్రతినిధి ఒరమెంతో గారి ఆదేశం తో కొన్ని రోజుల తరువాత వదలి వేశారు. 1577 సంవత్సరం డిసెంబర్ నెల రెండవ తేదీన రాత్రి మరల వారు సిలువ యోహను గారిని అరెస్టు చేశారు. పూర్తిగా పునరుద్దరణ గురించి మాటలాడకూడదని, మరల అటువేళ్ళకూడదని , వదలివేయాలని అడిగారు. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు.  అక్కడ నుండి తోలేదో తీసుకొని వెళ్లారు. అక్కడ ఎనిమిది నెలల పైన మఠ చరసాలలో ఉంచారు. ఆయనను ఉంచిన చరసాల గది కూడా చాలా చిన్నది. ఆయన పద్యాలు కొంత భాగాన్ని ఇక్కడే రాశారు. అక్కడ చరసాలలోనుండి 1578 సంవత్సరం ఆగస్ట్ నెల 16-18,తేదీల మధ్య  మరియ మాత మోక్ష రోపణ పండుగ అష్టకం లో  అక్కడ నుండి తప్పించుకున్నారు.

బేయజ వద్ద మఠం మఠ పేదరికం

బేయజ ప్రజలు అందరు పెనుఎలాలో నిష్పాదుకా కార్మెల్ సభ గురువులను చూసి వారిని తమ పట్టణం లో కూడా ఉండాలి అని ఫా. ఏంజల్  గారిని అభ్యర్దించ్చారు.  1579 లో  కోరేంజుఎలా నుండి పెనుఎలా లో ఉన్న పాత మఠం దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడ నుండి  పునీతుడు చాలా మంది సన్యాసులను బేయజ వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ మఠానికి కావలసిన అన్నీ సమకూర్చి మరలా పెనుఎలా కు రావడం జరిగినది,  తరువాత జూన్ 13, 1579 లో  ప్రారంభించారు. దివ్య బలి అర్పించి అక్కడ మఠాన్ని ప్రారంభించారు. ఇది శిక్షణా మఠం వలె ఉండేది,  అంతకు ముందు 1570 లో హేనేరస్ వద్ద నిర్మించిన మఠంలో కూడా పునీత సిలువ యోహనుగారు మఠ స్థాపకుడు మరియు మఠ పెద్ద. మఠాన్ని అన్నీ విధాలుగా నడుపుతూ నూతన మఠ వాసులకు తర్పీదు  ఇస్తూ మఠాన్ని ప్రార్థన , మౌనం , ధ్యానం నియమావళి అనుకూలంగా నడిపేవాడు. అక్కడి విశ్వ విద్యాలయ పండితులు క్రొత్త మఠ గొప్పదనం గురించి వారి ప్రసంగాలలో కూడా ప్రస్తావించేవారు. విధంగా అందలుసియాలో అందరికి మఠం గురించి తెలిసింది. అక్కడ ఉన్న మఠ వాసులు ఎప్పుడు కూడా దేవాలయంలోనే ఉండేవారు, కేవలం మఠ విద్యార్ధులు మాత్రమే చదువులు నిమిత్తం బయటకు వెళ్ళేవారు. వారిని చూసిన వారిలో ఒక రకమైన భక్తి కలిగించింది.  మఠ పెద్దగా తమ ఆంతరంగిక  మరియు  బాహ్య జీవితాన్ని మిళితం చేసి జీవించారు.  తాను విశ్వాసులు ఇచ్చే ఉపకారం మీద బతుకుతున్నప్పటికి,  తనకి మంచి చేసిన వారికి ఆయన మంచి చేస్తున్నప్పటికి, ఈయన  ఎప్పుడు మఠ మౌనం ఉల్లంఘించలేదు. మఠ వాసులు ఎప్పుడు విధులలో కనపడేవారు కాదు. పునీతుడు దేవునితో అద్బుతమైన సంభంధం అనుభవిస్తుండగా బేయజలో అప్పుడే 13 గ్రేగరి పోపుగారు  నిష్పాదుకా  కార్మెల్ సభ్యులు అధికారికంగా వేరు పడే ఆదేశం ఇచ్చారు. ఆదేశాన్ని అమలు చేయడానికి నిష్పాధుకా కార్మెల్ సభ గురువులు 1583 మార్చి 4 తేదీన చాప్టర్ చేశారు. చాప్టర్ లో నలుగురు డెఫినిటర్లను నియమించారు. వారిలో 3 డెఫినిటర్ పునీత సిలువ యోహనుగారు. చాప్టర్ తరువాత పునీత సిలువ యోహను గారు బయేజ వెళ్ళి  మరల తన పనిని ప్రారంభించాడు. బయేజ వద్ద జూన్ 14 వరకు వున్నారు. గ్రనాధ మఠం పునీత యోహను గారిని వారి మఠ పెద్దగా ఎన్నుకొన్నారు. ఇది మొదటి సారి పునీత యోహను గారు ఒక  మఠాన్ని నడిపించినది. ప్రత్యేక పర్యవేక్షకుడు ఫా.దీయగో అక్కడకు వచ్చినప్పుడు, వారు అందరు చాలా లోకం నుండి పూర్తిగా విరమణ తీసుకున్నట్లుగా ఉన్నారు అనుకున్నారు. మఠ పెద్ద ఎప్పుడు బయట కనపడేవాడు కాదు.

గ్రనాథ లో సభ సన్యాసినుల మఠం

గ్రనాధ ప్రజలు వారి జీవితము చూసి, నూతన కార్మెల్ సభ సన్యాసినులను కూడా వారి పట్టణం లో కావాలని కోరుకున్నారు. విషయాన్ని అక్కడి ప్రజలు అందలుసియా ప్రొవిన్సియల్  అయిన ఫా. దీయగో గారెకి తెలియచేసారు. విషయాన్ని దైవ భక్తురాలు అన్నమ్మ గారెకి ఆమె బయేజ వద్ద ఉన్నప్పుడు,అక్టోబర్ నెల 1581 లో  వారిని చూడటానికి వచ్చినప్పుడు  చెప్పడం జరిగింది. అన్నమ్మ గారు అస్వస్థతకు గురి అయ్యి వుండటం వలన మరియు వారు  ఫా. దీయగో గారెకి ఇచ్చిన  మాటలలో నమ్మకం లేక ముందుకు సాగలేకపోయింది. అంతే కాక అర్చి బిషప్ మరియొక మఠాన్ని అనుమతించరని అనుకున్నారు. కానీ ఒక రోజు ఉదయం తన ఆధ్యాత్మిక గురువు సిలువ యోహనును సంప్రదించి, దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తరువాత ఆమె తన మనస్సు మార్చుకొని, గ్రనాధ వెళ్ళడానికి నిశ్చయించుకుంది. నవంబర్ 13 తేదీన ఫా. దీయగోగారు, పునీత సిలువ యోహను గారిని ఆవిలా వెళ్ళి  తెరెసాగారిని తీసుకురావలసినదిగా ఆదేశించారు. పునీత యోహాను గారు తాను తప్పించుకున్న తరువాత మొదటి సారి తెరేసాను మరల ఇప్పుడే కలవడం. కానీ తెరెసాగారు బుర్గోస్ లో నూతన మఠ స్థాపన నిమిత్తమై గ్రనాధ వెళ్లలేకపోయింది. 1581 నవంబర్ 29 తేదీన నిష్కళంక మాత పండుగా రోజున ఆవిలా నుండి పునీత యోహను గారు ఇద్దరు సన్యాసినులతో ఒకరు ఆవిలా మరియొకరు తోలేదో నుండి బేయజ వచ్చారు.   సన్యాసినులు బేయజ వద్ద 1582, జనవరి 15 వరకు ఉన్నారు. అప్పుడు సిలువ యోహాను ,అన్నమ్మ మరియు ఫా. పీటర్ కలిసి ఉదయాన్నే గ్రనాధ బయలుదేరి వెళ్లారు. అక్కడ  యోహాను గారి శిష్యురాలు అన్న అనే ఆమె ఉన్నారు. ఆమె తన సోదారునితో అక్కడే ఒక మంచి ఇంటిలో ఉండేవారు. ఈమె సోదారుడే అక్కడ మరియొక మఠం కావాలని కోరినది. అతను సన్యాసినులు రోడ్డు మీద ఉన్నారు, వారికి ఒక ఇల్లు దొరికినంత వరకు ఇక్కడ ఉండనివ్వమని కోరాడం జరిగింది. అందుకు ఆమె ఇంటిని ఇవ్వడం మాత్రమే కాకుండా వారికి కావలసినవి అన్నీ సమకూర్చారు. వారు ప్రార్థన చేసుకోవడానికి ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు . జనవరి 20 తేదీన 1582 , ఉదయం 3 గంటలకు ఇద్దరు గురువులతో సన్యాసినులు అక్కడకి వెళ్ళేసరికి వారిని స్వీకరించడానికి అక్కడ తలుపు దగ్గరే నిలుచొని ఉన్నారు. అన్నమ్మగారు  ఆక్కడే ఉన్నారు. యోహను గారు వారిని అక్కడ వదిలి తమ ఇంటికి వెళ్లిపోయారు.కాని  తరువాత వారికి కావలసిన వాటిని అన్నింటినీ సమకూరుస్తూనే ఉన్నాడు.  

అల్మొదవర్   లో సభ ఎన్నిక , మలాగ మఠ స్థాపన

అలమొదవర్ వద్ద మే  నెల, 1583  లో పునీత యోహాను గారు గ్రనాధ మఠ పెద్దగా  ప్రొవిన్స్  ఎన్నికలకు   హాజరయ్యారు.  నలుగురు సలహాదారులను ఎన్నుకున్న తరువాత మఠ పెద్దలను ఎన్నుకోవడం గురించి చర్చించారు. పునీత యోహానుగారు మఠ పెద్ద గారిని , ప్రొవిన్సియల్ ఎన్నికలలో కాకుండా  మఠ సభ్యులు ఎన్నుకోవాలి అని కోరాడు. కానీ ఎన్నికలలో పునీత యోహాను గారి కోరికకు వ్యతిరేకముగా నిర్ణయించారు. మరలా ఆయనను గ్రనాథ మఠ పెద్దగా ఎన్నుకొన్నారు. 1584 సంవత్సరాలలో స్పెయిన్ దేశంలో చాలా పెద్ద కఠినమైన కరువు కాలం, ముఖ్యముగా అందలుసియా ప్రాంతం చాలా కఠినమైన కరువును అనుభవించినది. అన్నీ గ్రామలనుండి ప్రజలు గ్రనాధకు రొట్టెలను అడగడానికి వచ్చేవారు. వచ్చేవారి మీద పునీత యోహాను గారికి తన గురువు క్రీస్తువలె కనికరపడి , ఆయనే పెద్ద మఠాన్ని నడుపుటకు వేరె వారిమీద ఆదరపడుతున్నప్పటికి ధారాళంగా అదిగినవారందరికి సహాయం చేశారు. మొదట సాధ్యమైనంత మందిని మఠాన్ని నిర్మించడానికి వారిని ఉపయోగించుకొని వారికి ఉద్యోగం ఇచ్చారు. కరువు కాలంలోనే మఠాన్ని నిర్మించారు. ఉదారవేత్తల నుండి సమీకరించిన డబ్బుతో కావలసిన ధాన్యాన్ని కొని , మఠానికి వచ్చిన వారిని ఎవరిని కాలి చేతులతో పంపలేదు. సమయంలోనే  యోహను గారు  ఆధ్యాత్మిక గీతం మీద వివరణ రాస్తూ ఉన్నారు. ఎక్కడ  దాగి ఉంటివి అనే భాగం మీద రాశారు. మరియు ఇదే సమయంలో  ఆయన శిష్యురాలు అన్న గారికోసము  ప్రేమ జీవ జ్వాల మీద కూడా వివరణ రాస్తున్నారు. డిసెంబర్ 1584లో ప్రొవిన్సియల్  ఫా. జెరోమ్ గారు మలాగ వద్ద మఠం స్థాపించడానికి నిర్ణయించి తాను స్వయంగా అక్కడకు వెళ్లలేక పునీత యోహాను గారిని అందలుసియా  వికార్ ప్రొవిన్సియల్, మరియు గ్రనాధ మఠ పెద్దగా  గా పంపడం జరిగింది. పునీత యోహను గారు మఠ స్థాపకులైనా సన్యాసినులతో వెంటనే ప్రయాణం మొదలు పెట్టారు. ఫెబ్రవరి ,17 తేదీన 1585 అక్కడకు చేరుకున్నారు. పునీత జోజప్ప గారి పేరున మఠాన్ని స్టాపించారు. పునీత సిలువ యోహను గారు దివ్య బలి పూజ అర్పించారు.

లిస్బన్ వద్ద సభ ఎన్నికలుయోహను గారెని అందలుసియా వికారు ప్రొవిన్సియల్ చేయుట

పునీత సిలువ యోహను గారు గ్రనాథ మఠ పెద్దగా ఉన్నప్పుడు సభ మూడవ ఎన్నికలు జరిగినవి. ఇవి లీస్బోన్ వద్ద జరిగినవి. 1585లో మే 11   జరిగినవి. ఫా. నికోలస్ సభ రెండవ ప్రొవిన్సియల్ గా ఎన్నిక అయ్యారు. నలుగుగు నూతనముగా ఎన్నికయిన ప్రొవిన్సియల్ సలహాదారుల్లో రెండవ సలహాదారుడు పునీత యోహాను గారు. నికోలస్ గారు జెనీవా నుండి వచ్చిన వెంటనే  అందరిని పస్ట్రాన  వద్ద అక్టోబర్  17 సమావేశ పరచారు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలలో సభను నాలుగు భాగాలుగా ఏర్పరిచారు. నాలుగు భాగాలను నలుగురు ప్రొవిన్సియల్ సలహాదారులు పాలిస్తారు. వాటిలో అందలుసియాను పునీత యోహను గారు ప్రొవిన్సియల్ సలహదారునిగా పాలిస్తారు. సలహా దారులకి ఇప్పుడు ఎక్కువ ఆధికారం ఉంది. ఎందుకంటే జెరోమ్ ప్రొవిన్సియల్ ఉన్నప్పుడు ఆయన వారిని నియమించారు. కానీ ఇప్పుడు వీరు ఎన్నుకోబడ్డారు.  పునీతుడు పసత్రాన నుండి గ్రనాధ కు వచ్చిన తరువాత 13 మఠాల పర్యవేక్షణ ఆయన  మీద పడింది. వాటిలో 7 పురుషులవి 6 స్త్రీలవి. మఠాలను పునీత యోహను గారు తరచూ వాటిని దర్శించి కావలసిన చేసేటివాడు. వారి జీవిత విధానం పరిశీలించి లోపాలను గుర్తించి వారి మార్గాలను సరిచేసేవారు. ఒక మఠాన్ని దర్శించిన సమయంలో మొదట అక్కడ దేవాలయం లోనికి వెళ్ళి దివ్య సత్ప్రసాద మందసం ముందు ప్రార్థన చేసి , ఎవరైనా అస్వస్థతతో బాద పడినట్లయితే ముందు వారిని పరామర్శించేవారు.  

సేగోవియా , కోర్దోబ మఠాల స్థాపన మరియు సేవియ్యే ను దర్శించుట

పునీతుని శిష్యురాలు అన్న గారు ఆమె భర్త గారి విల్లు అమలు చేయడానికి యోహను గారి సలహాను తీసుకొని సేగోవియా లో నిష్పాధుకా  కార్మెల్ సభ మఠాన్ని స్థాపించడానికి నిశ్చయించుకున్నారు. పునీత యోహనుగారు ప్రొవిన్సియల్గా ఒప్పుకోని ఫా.గ్రెగోరిని మఠ స్థాపనకు ఆదేశించారు.  పునీత యోహను గారు చెప్పినట్లుగా ఫా. గ్రెగోరి గారు చేసి 1586,మే 3 మఠాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమయములో పునీతుడు కారవాక ను దర్శించడానికి వెళ్లారు. ఇక్కడ మఠ పెద్దగా తన శిష్యరాలు అన్న ఆల్బర్ట్  అనే ఆమె ఉండేవారు. ఆమె పునీత యోహను గారితో  కారవాకలో  పురుషుల మఠం లేకపోవడం గురించి మాటలాడింది. 1586 సంవత్సరం  ఫెబ్రవరి లో పునీత యోహను గారు కారవాక  నుండి పెనుఎలా మఠానికి వచ్చాడు. అక్కడ శ్రమల కాలం మొత్తం అక్కడే ఉన్నారు. అక్కడ నుండి వారంలో మూడు సార్లు వాక్య పరిచర్యకు కాలి నడకమీద వెళ్ళి అలానే నడక మీదనే వచ్చేవాడు.  అక్కడ భోజనం కూడా తీసుకునే వాడు కాదు.  పెనుఎలా నుండి కోర్డోబ కు వెళ్ళాడు. అక్కడ ఒక ఇంటిని మఠానికి ఇచ్చారు. ఆనందంగా తీసుకొని, 1586 లో  మే  నేల  18 తేదీన  మఠాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత  మఠానికి పస్త్రన లో తన శిష్యుడుగా ఉన్న ఫా. అగస్టీన్ ను  మఠ పెద్దగా చేసి యోహనుగారు  సేవియ్యే వెళ్లారు. సేవియ్య లో ఉన్న సన్యాసినులు అనుకూలమైన స్థలం లో లేరు. పునీత తెరెసా గారే ఆమె కోరికలకు అనుకూలముగా ఉండే స్థలం చూడలేకపోయింది. కాని ఇప్పుడు వారికి ఒక మంచి ఇల్లు దొరికింది ప్రొవిన్సియల్ ప్రతినిధి వారిని ఇంటిలో చేర్చారు.

పునీతున్ని ప్రొవిన్సియల్ గారు మాద్రిద్కు పిలుచుట

 ప్రొవిన్సియల్ గారు తన ప్రతినిధులను, 1586 లో  ఆగస్ట్ 13 తేదీన  మాద్రిద్ రావాలని పిలువగా యోహను గారు మార్గ మద్యలో తోలేదో వద్ద అనారోగ్యానికి గురయ్యారు కనుక మాడ్రిడ్ వెళ్లలేక పోయాడు. తాను కోలుకున్న తరువాత తన మఠానికి వెళ్ళాడు. ఆయన గ్రనాధ వెళ్ళగానే ఫా. నీకోలాస్ గారు అక్కడి మఠ పెద్ద అయిన అన్నమ్మ గారి ని మాద్రిద్ తీసుకురమ్మని ఆదేశించారు. ఆమె అక్కడ క్రొత్త మఠానికి పెద్దగా ఉండలని ప్రొవిన్సియల్గారు కోరుకున్నారు. పునీత యోహను గారు వినయ పూర్వకముగా వెళ్లారు. తరువాత ఆయన అక్కడనుండి మంచా ఏయల్ వెళ్ళి అక్కడ అక్టోబర్ 12 క్రొత్తహత మఠాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ నుండి ఫా. జెరోమ్ గారు గువల్కజర్ వద్ద  ఒక క్రొత్త మఠాన్ని అంగీకరించారు,మార్చి 24,1585 లో  డానిలోనికి ప్రవేశించారు.  కానీ డానికిక్ సంభందించిన కొన్ని పనులు మిగిలిపోగా, వాటిని పూర్తి చేయడానికి ప్రొవిన్సియల్ గారు పునీత యోహను గారెని వాటిని పూర్తి చేయవలసినదిగా పంపారు. అక్కడి మఠ వాసులు ఎంతో ప్రేమగా పునీతున్ని ఆహ్వానించారు. ఎటువంటి సమస్య లేకుండా పునీతుడు పని పూర్తి చేశారు. 1586,నవంబర్  చివరిలో  పునీతుడు బుహాలన్సే కి నూతన మఠాన్ని స్థాపనకి వెళ్లారు. అక్కడ ఉండగా ప్రొవిన్సియల్ దగ్గర నుండి మాద్రిద్ రావలసినదిగా ఆదేశించారు. ఉదయాన్నే పునీతుడు మాద్రిద్ కు ప్రయాణం అయ్యాడు. అక్కడి నునిద వెళ్ళే ముందు ఫా. దీయగో గారెని కారవాకలో మఠాన్ని స్థాపించ వాలసినదిగా ఆదేశించారు.  దీని గురించే కరవాక  మఠ పెద్ద అన్నమ్మగారు  పునీతునితో మాట్లాడినది. 1586, డిసెంబర్ 18   ఫా. దీయగో గారు మఠాన్ని స్వాదినపరుచుకున్నారు.

బయదొలిద్  వద్ద సభ చర్చలు మరియు ఎన్నికలు

యోహాను గారు మార్చి మొదటి 1587 మార్చి మొదటి వరకు మాడ్రిడ్ లోనే ఉన్నారు. అక్కడ నుండి కారవాక వద్ద మఠ పెద్ద ఎన్నిక   పర్యవేక్షణకై అక్కడకు వెళ్లారు. ఆయన ఎన్నిక రోజు దివ్య పూజ బలిని అర్పించగా అక్కడి సన్యాసినులు ఆయన చుట్టూ  ఒక వెలుగును చేసేము అని చెప్పారు.  ఇది నిజమా లేక వారు బ్రమ పడుతున్నమా? అని వేరె చోటనుండి వారు చూసిన  అలానే వారికి కనిపించింది అని చెప్పారు. కారవాక నుండి ప్రొవిన్సియల్ గారి పిలుపు మేరకు బయదోలీద్కు వెళ్లారు. అక్కడ ఏప్రిల్ 7 ప్రొవిన్సియల్ ఎన్నికలకు సిద్దపరచి 17 ఎన్నికలు జరిపారు. మరలా గ్రనాధ మఠ పెద్దగా ఎన్నిక అయ్యారు. ఆయన మరలా బలవంతముగానే బాధ్యతను తీసుకున్నారు. అవి అయిపోయిన తరువాత యోహనుగారు గ్రనాధకు వెళ్ళడం జరిగినది. అక్కడి  మఠ వాసులు చాలా ఆనందముతో పునీత యోహాను గారెని తమ పెద్దగా ఆహ్వానించారు. ఇప్పుడు ఆయన వరుసగా  మూడవ సారి వరుసగా మఠ పెద్దగా ఎన్నుకోబడ్డారు. ఆయన మఠాన్ని కట్టడం పూర్తి చేసి, దానికి నీటి సదుపాయం ఏర్పాటు చేసి, ద్రాక్ష తోట నాటి దానిని అన్నీ సభ మఠాలకు ఆదర్శమూగ చేశారు.

నిష్పాధుకా కార్మెల్ సభ మొదటి సాధారణ చర్చ మరియు ఎన్నిక

1588, జూన్ నెలలో పునీత యోహాను ,  ప్రొవిన్సియల్ గారి ఆజ్ఞ ప్రకారం మాడ్రిడ్ లో పాల్గొన్నారు. 5 సిక్టస్  పోపుగారు    నిష్పాదుకా కార్మెల్ సభ్యులు మరియు   కఠిన  నియమావళి  తగ్గించిన కార్మెల్ సభ సభ్యుల మధ్య పూర్తిగా విడిపోయే విధంగా జులై 10 తేదీన 1587 లో పోపు గారు ఆదేశం ఇచ్చారు.  ఆదేశాన్ని అమలు చేయడానికి అప్పుటి ప్రొవిన్సియల్ ,నలుగురు సలహదారులైన వారిని పిలవడం జరిగినది. ఇది ఏవిధంగా ఇది అమలు చేయాలో చర్చించడానికి జూన్ 10 తేదీ ,1588 లో మాడ్రిద్ దగ్గర కలవడం జరిగింది.  పోపు గారు నుండి వచ్చిన ఆదేశం చదివిన తరువాత దానిని అమలు చేయడానికి పూనుకున్నారు. దాని ప్రకారం 6 గురు సలహాదారులు ఉండాలి. వారిలో సిలువ యోహను గారెని మొదటి వానిగా ఎన్నుకున్నారు.అదే విధంగా ఆయనను సేగోవియా మఠానికి పెద్దగా ఎన్నుకున్నారు. మఠాన్ని ఆయన శిష్యురాలు అన్నమ్మ గారు ఏర్పాటు చేసింది.  ఆయన సేగోవియకు ఆగస్ట్ నెల మొదటిలో వెళ్ళి తన పనిని మఠాన్ని మంచి ఆరోగ్యకర స్థానంలో పుననిర్మించి  ప్రారంభించాడు. సమాయములోనే పునీతుని తల్లి మెదిన దేల్ కంపోలో మరణించారు. ఆమె అక్కడే జీవించేది. తెరేసా గారు ఆమెకు కావాలిసినవి అన్నీ వారే సమకూర్చాలి అని చెప్పింది. అదే విధంగా వారు ఆమెకు కావలసినవి అన్నీ సమకూర్చారు. కెథరీన్ అల్వేరేస్ చనిపోయినప్పుడు వారితోటి అక్కడ సమాధి చేయబడింది. మఠం   ఆమె దేహాన్ని పొందటం ఒక ఆభరణంగా భావించింది. ఎందుకంటే ఆమె జీవితం అంత గొప్పది. ఆయన అక్కడ మొదటి పూజ చేసిన తరువాత ఆమెను చూడలేదు.

ఫా. నికోలస్ సభలో నూతన పరిపాలన విదానం ప్రవేశ పెట్టుట

  విధానం లో ఏడుగురు సభ్యులు ఒక కమిటిగా చేసి వారి ముందుకు ఒక మఠం లో జరిగిన అన్నీ విషయాలను, ముఖ్యముగా వారి లోపాలను , చివరికి చిన్న చిన్న సమస్యలను కూడా  వారి ముందుకు తీసుకురావాలి. క్రొత్త విధానం సభలో పురుషుల మరియు స్త్రీల విభాగాలలో  చాలా అలజడి సృష్టించింది. వారి చిన్న చిన్న  తప్పులు ఒకరి ముందుకు కాకుండా  ఏడుగురు సభ్యులు కమిటీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడలేదు.  ఇటువంటి పరిస్థితిలో వారు సహయం కోసం సభ బయట అర్థించారు. నియమానికి ఎక్కువగా బాధ పడిన వారిలో ముఖ్యలు దైవ భక్తురాలు మాడ్రిడ్ మఠపెద్ద అయిన అన్నమ్మ గారు. ఆమె ధ్రుష్టిలో సన్యాసినులు ఒక పెద్ద యొక్క ఆధీనంలో ఉండాలి కాని ఇలా అనేకమంది చేతులలో కాదు. ఆమె మర్మోల్ అనే గురువు గారెతో ఒక లేఖను పోపు గారెకి పంపింది. మర్మోల్ జెరోమ్ గ్రశీయన్ గారి బంధువు.  పోపు గారు మఠ వాసులుకు అనుకూలంగా ఒక నిర్ణయాన్ని పంపించారు. సన్యాసినులు చేసిన పనిని  ఫా. నికోలస్ చాలా అవమానముగా భావించి   తన సలహా కమిటీని అత్యవసరముగా పొలిచి విషయమును ఏమి చేయాలి అని తన సలహా కమిటీని కోరాడు. మీటింగ్ లో వారు ఇక అప్పటినుండి సన్యాసునులతో తమకి సంభందం లేదని వారికి అప్పటినుండి ఆధ్యాత్మిక తోడ్పాటు , మరియు వారి దార్శనికత ఉండవని నిర్ణయించారు.   సభ సన్యాసినుల పట్ల ఇది చాలా కఠినమైన నిర్ణయం. పెంతకోస్తు పండుగ రోజు మాడ్రిడ్ లో ఫా. నికోలస్ మరియొక చాప్టరు నిర్వహించక అక్కడ సన్యాసినులు మరియు ఫా. నికోలస్ మద్య సఖ్యత నెలకొంది. సిలువ యోహనుగారికి మరియు అం దైవ భక్తురాలు అన్నమ్మ గారెకి మధ్య ఉన్న స్నేహం కారణంగా అనేక మంది గురువులు సన్యాసినులలో తరహా ఆలోచన లేక విప్లవ దృక్పథం రావాడానికి యోహను గారే కారణం అని అనుమానించారు.   విషయాలు తెలిసి ఫా. నికోలస్ పునీత సిలువ యోహాను గారిని ఉన్న పళంగా   జూన్ నెల 1591 లో జరిగిన చాప్టర్ కు సేగోవియా నుండి పిలిపించాడు. పునీత సిలువ యోహను గారి మీద వారికున్న వ్యతిరేకతను వారు చాప్టర్ లో చూపించారు. నిష్పాదుకా కార్మెల్ సభ మొట్ట మొదటి సభ్యునికి ఎవరు తమ ఓటు వేయలేదు. ఎన్నికలు అయిన తరువాత జరిగిన వాదనలలో డిస్కషన్ లో పునీత యోహనుగారు నియమావళిలో  కొన్ని  నియమాలు  వెరే నియమాలకు వ్యతిరేకముగా ఉన్నవి అని చెప్పాడు.  అదే విధంగా జెరోమ్ గ్రషీయన్కు అనుకూలముగా మాటలాడాడు. మరియు  సభ సన్యాసినులతో ప్రేమగా ఉండవలసిన ఆవశ్యకత గురించి కూడా చెప్పారు. అప్పటివరకు  పునీత యోహను గారి మీద అనుమానపడిన వారు, ఎప్పుడైతే యోహనుగారు సన్యాసీనుల పట్ల ప్రేమగా ఉండాలి అని అన్నారో, వారి అనుమానాలు ఋఢీ  అయినవి అని వారు  భావించారు. ఫా. నికోలస్ , సన్యాసీనులకు  ఖండనగా  పునీతున్ని  ప్రొవిన్సియల్ గా తీసివేశారు. అప్పుడు పునీతుడు ఆయనను పెనుఎలా మఠానికి తనను పంపమని కోరాడు. అది సభలో చాలా కఠినమైన మఠం. 1591 జులై లో పునీతుడు పెనుఎలా వెళ్ళాడు. అక్కడ ఉన్న మఠ వాసులు చాలా ప్రేమగా పునీతుని ఆహ్వానించారు. మఠ పెద్ద పునీతుని శిష్యుడు. కనుక ఆయన మరల తన గురువు గారి దగ్గర శిష్యరికం చేయవచ్చు అనుకున్నాడు. ఆయన పేరు దీయగో ఆఫ్ ఇంకార్నెషన్. పునీతుని ఆరోగ్యం తన నిష్టలతో చాలా వరకు క్షీణించింది.  అప్పడే కౌన్సిల్  ఆయనను  ఇండీస్ వెళ్ళమని కబురు పంపింది.  వెంటనే పునీతుడు తనతో పాటు వచ్చేవారిని సిద్దము చేయమని రాయడం జరిగినది, కానీ ఒక విష జ్వరం తో పునీతుడు జబ్బున పడ్డాడు. ఇది తెలుసుకున్న ప్రొవిన్సియల్ ఆంటోనియో హెరోదియా పెనుఎలా లో కంటే బయేజ లేక ఉబెద లో వైద్య సదుపాయం మెరుగుగా ఉండవచ్చు అని రెండు ప్రదేశాలలో ఏదో ఒకటి  ఎంచుకోమని కోరాడు. పునీతుడు ఉబెద కు పంపమని కోరాడు. 1591 సెప్టెంబర్ 31   పునీతుడు ప్రయాణం ప్రారంభించారు అది చాలా కష్టం తో కూడిన ప్రయాణం.

ఉబెద మఠ పెద్ద కాఠిన్యం -

 పునీత సిలువ  యోహను గారు  అందలుసియా  ప్రొవిన్సియల్ గా ఉన్నప్పుడు ఇద్దరు గురువులు గొప్ప ప్రసంగీకులుగా పేరుగాంచి ఉన్నారు. వారీలో  ఫా. దీయగో ఒకరు,  పునీత యోహను గారు ఆయన్ను తన మఠ క్రమ శిక్షణను ఉల్లంఘించి ఎక్కువ సమయాన్ని బయట ఉండటానికి ప్రాధాన్యం ఇస్తున్నాడని ఆయనను హెచ్చరించినందుకు ఆయన పునీతుని మీద చాలా పగ పెంచుకున్నాడు.  ఆయన డెఫినిటర్ అయిన తరువాత కొంతమంది మఠ వాసులు జీవితాలను వారి ప్రవర్తనను పరిశీలించడానికి ఒక  కమీటీ ఏర్పడిన తరువాత దీయగో అనే డెఫినిటర్  పునీతుని ప్రవర్తన గురించి  ఆరాతీయడం ప్రారంభించాడు తనం పని కాకపోయినా కానీ తనకు ఉన్న పగతో పునీతుని సభ నుంచి  బయటకు పంపాలని చూశాడు. మరియొక గురువు ఫ్రాన్సిస్ క్రీసొస్తం అనే గురువును కూడా పునీతుడు క్రమ శిక్షణ గురించి హెచ్చరించి ఉన్నాడు. అతను కూడా పునీతుని మీద పగతో ఉన్నాడు. కానీ పునీతుడు గురువు ఉబెద మఠ పెద్ద అని తెలిసికూడ కష్టాలను కోరి అక్కడ ఉండటానికి వెళ్ళేడు. పునీతుడు పెనువేలో నుండి ఉబెద వెళ్ళిన ప్రయాణం చాలా కష్టతరమైంది. ఒక మఠ వాసితో కలిసి పునీతుడు కాలి  నడకన వెళ్ళాలి అనుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం సహకరించక ఆయను గాడిద మీద తీసుకెల్లవాలసి వచ్చింది. ఉబెద వెళ్ళేసరికి పునీతుడు చాలా అనారోగ్యానికి గురిఅయ్యాడు. మఠ పెద్ద పరిస్థితిలో ఉన్న పునీతుని చూసి కూడా చలించలేదు. ప్రయాణం పునీతుని ఆరోగ్యం ఇంకా క్షీణించింది. మరుసటి రోజు పునీతుని పాదం మీద 5 కంటే ఎక్కువ రక్తం స్రవించే గాయాలు అయ్యాయి.  అది చూసిన వైద్యుడు మార్టిన్ ఇయారఎల్  అక్కడి మాంసం తీసియడం తప్ప వేరొక మార్గం లేదు అని అది తీసివేయగా కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయి. కాని  ఇవి అన్నీ చూసికూడా సాధారణంగా ఇచ్చే వైద్య సాదుపాయం కూడా అతను కల్పించలేదు.  కొంతమంది స్త్రీలు పునీతుని గురించి తెలిసి ఆయన వాడిన బట్టలు గాయలుకు కట్టిన బట్టలు శుద్ది చేయడానికి సిద్దపడి చేస్తుండగా అది తెలుసుకున్న వెంటనే  మఠ పెద్ద ఫ్రాన్సిస్ వారిని అది చేయడాన్ని నిషేధించాడు.  అది సభ పేదరికానికి వ్యతిరేకం అని చెప్పాడు అటువంటి వాటిని అనుమతించాలేను అని చెప్పాడు. అదే విధంగా మఠ పెద్ద ఎవరు తన అనుమతి లేకుండా పునీతుని పరామర్శించడాన్ని నిషేధించాడు. పునీతుడు  ఎవరిని కాలవడాన్ని సంతోష పడుతాడో వారికి అనుమతిని ఇవ్వలేదు. చివరికి  పునీతునికి సహయముగా ఉన్న వానినికూడ తన పని నుండి తప్పించాడు. దానికి ఫా. విధేయించినప్పటికి అప్పటి ప్రొవిన్సియల్ గారెకి సమాచారాన్ని అందించాడు.

పునీతుని కోసం ప్రొవిన్సియల్  రావడం

ఆంటోనియో  హెరోడియా  పునీతుని పరిస్థితిని గురించి తెలిసి,    బెర్నార్డ్ అనే గురువుగారు పంపించిన సమాచారం తెలుసుకొని,   అది విన్న వెంటనే  ఉబెదకు వచ్చారు.   మఠ పెద్ద, పునీతుని పట్ల వ్యవహరించిన విధానానికి చాలా బాధ పడి  మఠ పెద్దను ఖండించి,  పునీతిని చూడటానికి వెళ్ళాడు. అప్పుడు  పునీతుడు ఉన్న గదిని వేరె సహచరులు పునీతుని  పరామర్శించడానికి  తెరిచి ఉంచారు.  తరువాత ఆయనన మఠపెద్ద,    మఠ తలుపులును పునీతుని ప్రజలందరూ చూడటానికీ తెరువమని చెప్పారు.  ఫా. ఆంటోనియా  హెరోడియా కొద్ది రోజులు అక్కడ ఉండి వెళ్లిపోయారు. ఆయన రాక మఠ పెద్ద మనసు పునీతుని పట్ల మారింది, అని మిగిలినవారు కూడా గ్రహించారు. దాని తరువాత మఠ పెద్ద పునీతుని క్షమాపణ అడిగి మఠాన్ని నడుపుటకు తన సలహాలు కూడా అడిగారు.

పునీతుని మరణం

అక్కడ  1591 సెప్టేంబర్  చివర నుండి నిష్కలంక మాత పండుగ వరకు అక్కడ ఉన్నారు.  పునీతుని  చూస్తున్న వైద్యుడు  ఆయన ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాడు అని చెప్పడం జరిగింది.   వార్తను ప్రొవిన్సియల్  గా ఉన్నటువంటి ఒకప్పటి పునీతుని సహచరుడు ఆంటోనియో హెరోడియా కు చెప్పేరు. ఆయన వెంటనే అక్కడకు చేరుకున్నాడు. వారంలో పునీతుడు, రోజు ఏమిటని వారిని అడిగాడు. గురువారం ఆయన అనారోగ్య సమయంలో, అతనితో పాటు  ఉన్న బర్తలోమియో అనే గురువును తన తలగడ క్రింద ఉన్న సంచి తీసుకొని దానిలో ఉన్న పత్రాలను కాల్చివేయమని అడిగారు. గురువారం సాయంత్రం దివ్య సత్ప్రసాదం తీసుకు వచ్చినప్పుడు పునీతుడు వారి అందరినీ, తాను ఏమైనా చెడు మాతృకను చూపించినట్లయితే క్షమించమని అడిగి,  వారిలో మఠ పెద్ద లేడని గ్రహించి ఆయనను కూడా పిలిచి తనను క్షమించమని అడిగారు. దానికి గురువు కూడా తన తప్పులను క్షమించమని, తాను చాల కఠినముగా ప్రవర్తించినందుకు క్షమించమని కోరారు. అప్పుడు దివ్య సత్ప్రసాదం స్వీకరించారు. పునీతుడు  మఠ పెద్దను చివరిగా తనను, సభ వస్త్రంతోనే  సమాధి చేయాలని కోరాడు. అదే ఆయన తన జీవితం లో కోరుకున్నది అయ్యి ఉండవచ్చు. తన వస్తువులను మిగిలిన సన్యాసులు కోరగా తనకు సంబంధించినవి మొత్తం మఠ పెద్దకు చెందుతాయని, ఆయనను అడగమని చెప్పారు. శుక్రవారం, ఆంటోనియో హెరోడియా పునీతిని చూడటానికి వచ్చారు. ఆయనను చూడటానికి పునీతుడు ఆనందపడినప్పటికి తనకు ఉన్న నొప్పి వలన ఆయనతో మాట్లాడలేకపోయారు. 11:30 గం. లకు  పునీతుడు అందరికి పిలవమని చెప్పాడు. అందరూ వచ్చిన తరువాత చనిపోతున్న ఆత్మ కొరకు ప్రార్థించారు. వారు 12 గం లకు ప్రార్థనకు  గంట కోట్టగా పునీతుడు నేను పరలోకంలో  ప్రార్థిస్తాను అని చెప్పి తన చేతిలో ఉన్న సీలువను ముద్దుపెట్టుకొని వారి వైపు చూసి కళ్ళు మూసుకొని నా ఆత్మను నీ చేతులలో అప్పగిస్తున్నాను అని కళ్లుమూసుకున్నారు. దేవుడు ఆయనను డిసెంబర్ 14, 1591  శనివారం ఉదయం తీసుకున్నారు. అప్పుడు ఆయనకు 50 సంవత్సరాలు.  28 సంవత్సరాలు  కార్మెల్ సభలో జీవించారు.

పునీతుని దేహం కోసం గొడవలు

 

ఉదయాన్నే పునీతుని దేహాన్ని దేవాలయంలోనికి  సమాధి చేయడానికి తీసుకొని వచ్చారు. అక్కడి ప్రజల, గురువులు, సన్యాసులు   అందరూ దేవాలయానికి పునీతుని చివరి సారిగా చూడటానికి వచ్చారు. తరువాత తొమ్మిది నెలలకు సమాధి తెరవగానే పునీతుని దేహం  పాడు కాకుండా అలానే ఉంది. పెనసొల కు చెందిన అన్నమ్మ గారు , ఆమె సోదరుడు లూయిస్ గార్లు వికార్ జెనెరల్  గారు ఫా. నికోలస్ గారి దగ్గర నుండి దేహాన్ని ఉబెద నుండి సేగోవియా తీసుకుపోవడానికి అనుమతిని తీసుకున్నారు. కాని అది సాధ్యం పడలేదు, ఎందుకంటే వారి అనుమతి  కేవలం మిగిలిన ఎముకలను మాత్రమే తీసుకుపోవడానికి, కాని పునీతుని దేహం చెక్కు చెదరలేదు. కనుక  మరల దేహాన్ని ఆక్కడ తిరిగి పెట్టడానికి ముందు అక్కడ మఠ పెద్ద అన్నమ్మ గారికి ఇవ్వడానికి ఒక ఏలు తీసుకున్నారు.  మరల తొమ్మిది నెలలు తరువాత ఉబెద నుండి పునీతుని ఎముకలను తీసుకుపోవడానికి వచ్చారు. కానీ  వారు అంతకుముందు స్థితిలో అయితే చూశారో మరలా అదే విధంగా   దేహం ఉంది. వారు దేహాన్ని  అక్కడ నుండి తీసుకొని వెళ్లారు. అప్పుడు మర్తోస్ వద్ద వారిని అక్కడ ప్రజలు అడ్డగించారు. వారు మాద్రిద్ వచ్చిన తరువాత, అక్కడ కార్మెల్ సన్యాసినుల వద్ద భద్రంగా ఉంచారు. అక్కడ అన్నమ్మ ఒక మోచేతిని ఆయన గుర్తుగా తీసుకున్నారు.  దానిని సేగోవియా కు తీసుకెళ్లారు. పునీతుని దేహాన్ని మాద్రిద్  లో సభ సన్యాసినులు ఎంతో గౌరవముగా చూసారు.  సేగోవియా లో గురువులు పునీతుని దేహాన్ని ఎంతో గౌరవంగా స్వీకరించారు. చాలా మంది ప్రజలు 8 రోజులు పునీతుని దేహాన్ని చూడటానికి వచ్చారు.  పునీతుని  దేహాన్ని ఉబెద నుండి దొంగిలించారు అని తెలుసుకున్న ఉబెద వాసులు చాలా బాధపడి రోము నగరానికి వారి ప్రతినిధులను పంపి పోపు గారి నుండి మరల పునీతుని దేహాన్ని ఇప్పించాలి అని పంపారు.   8 క్లేమెంట్ పోపుగారు , ఉబెద బిషప్  మరియు సేగోవియా  బిషప్   ,  సభ పెద్దలు కలిసి   రెండు నగరాల్లో   శతృత్వం లేకుండా ఉబెదకు  పునీతుని కాళ్ళు, చేతులు, సేగోవియకు  తల మొండెం ఇవ్వడం జరిగింది. అన్నమ్మ ఒక మోచేయిని గుర్తుగా తీసుకుంది. పునీత సిలువ యోహను గారిని గౌరవించడానికి కారణం, ఆయన ద్వార అనేక  అధ్బుతాలు జరగడం. సిలువ యోహను గారు 1674 లో ధన్య జీవిగా ప్రకటించబడ్డారు. 13   బెనెడిక్ట్  పాపు గారు పునీతునిగా , డిసెంబర్ 27  ,1726 లో  ప్రకటించారు. 1926  లో  తీరుసభ పండితునిగా ప్రకటించారు.

 

 

 Rev.Fr. Amruth OCD

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...