31, డిసెంబర్ 2021, శుక్రవారం

నూతన సంవత్సరము

నూతన సంవత్సరము
                                                                               పఠనములు:సంఖ్యా:6 :22-27,   గల : 4;4-7,లూకా;2:16-21

         ఈనాడు మనమందరము నూతన సంవత్సరములోనికి అడుగెడుతున్నాము. ఈనాడు మనమందరము నూతన సంవత్సరములోనికి అడుగెడుతున్నాము. ఈ నూతన సంవత్సరములో మనము ఈలోకంలో జరుగు విపత్తులను చూచి భయపడనక్కరలేదు. నాజీవితములో ఏమిజరుగుతుందోఅని దిగులుచెందనక్కరలేదు.నేనిప్పడిదాకా పాపపుజీవితాన్ని జీవించాను అని కుమిలిపోనక్కరలేదు. కానీ దేవునియందు విశ్వాసము కలిగి జీవించు. దేవునియందు నమ్మకము కలిగి నాజీవితములో ఏమిజరిగినా అంతా దేవుడే చూసుకుంటాడని నీవు విశ్వసించినట్లయితే, నీవు ఈలోకంలో దేనికీ భయపడనక్కర లేదు. నీవు భయపడేది ఎవరికయ్యా అంటే, నిన్ను సృష్టించిన దేవునికి, నీకు రక్షణ నిచ్చిన దేవునికి.
      ఈనాడు మనమందరము మూడు పండుగలను జరుపుకొనుచున్నాము. అవి:1 .మరియమాత మాతృత్వ పండుగ.2 .యేసుప్రభువు యొక్క నామకరణ పండుగ.3 .నూతన సంవత్సరం.
      1. మరియమాత మాతృత్వ పండుగ:
            మరియ మాత యొక్క మాతృత్వపండుగను ఈలోక నలుమూలల ప్రతియొక్క కాథోలికుడు జరుపుకుంటారు.సాధారణముగా,కాథోలికులైన మనము మరియ మాత అనగానే,దేవునియొక్క తల్లి అని, నిష్కళంక మాత అని, దేవునియొక్క సంకల్పానికి తలయొగ్గి, విశ్వసించి,దానిని తన జీవితములో నెరవేర్చిన గొప్ప తల్లి అని మనందరికీ తెలిసిన విషయమే.అయితే ఈనాడు మనము ఎందుకు ఈ పండుగను జరుపుకొనుచున్నాము,దాని ప్రాముఖ్యత ఏమిటని తెలుసుకుందాము.
          పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల జీవితములో మనము చూసినట్లయితే, ఫరోరాజు బానిసత్వములో పడి మ్రగ్గిపోతూ, కన్నీరు కారుస్తూ, ఇక దేవుడేమాకు దిక్కు అని ఆ దేవాతి దేవునికి మొరపెట్టినపుడు వారి గోడును ఆలకించి వారి రక్షణకు దాస్యవిముక్తికొరకు మోషే ప్రవక్తను ఎన్నుకొని అతని ద్వారా వారికి దాస్యవిముక్తిని కలుగజేస్తున్నాడు.
       నోవా కాలములో పాపము పండిపోయినది. దేవుని మరచిపోయి వారికి ఇష్టంవచ్చినట్లు జీవిస్తున్న సమయములో నోవాప్రవక్తను ఎన్నుకొని అతని ద్వారా రక్షణను కలుగజేయాలని తన సంతతినుండి ఒక నూతన జీవితాన్ని పునర్నిర్మిస్తున్నాడు.
         యాకోబు పనెండుమంది కుమారులలో చిన్న కుమారుడైనటువంటి ఏసోపును దేవుడు ఎన్నుకొని అతని ద్వారా వారికి దాస్యవిముక్తిని కలుగజేస్తున్నాడు.ఆహార కొరతను తొలగించి వారికి కావలిసిన సదుపాయాలను సమకూర్చి వారిని నూతన ప్రదేశమునకు తీసుకొనివెళ్ళి అక్కడ వారికి నివాస స్థలమును ఏర్పాటుచేస్తున్నారు. ఇలా ఎంతోమంది ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజుల ద్వారా దేవునియొక్క ప్రణాలికను నెరవేరుస్తున్నారు.
          మరి నూతన జీవితమునకు, రక్షణ ప్రణాళికకొరకు డేడు మరియమాతను ఎన్నుకొని ఆమె ద్వారా యేసుప్రభువును ఈలోకానికి పరిచయము చేసి అతని ద్వారా పాప ప్రక్షాళననూ, నూతన జీవితమును కలుగజేస్తున్నాడు.దీనిద్వారా అంధకారములోవున్న ప్రతియొక్క వ్యక్తి  నూతన వెలుగును చవిచూస్తున్నారు.
అయితే మరియమాత యేసుప్రభువు తల్లిగా దేవుని యొక్క ప్రణాళికతో గర్భము ధరించి మనందరికీ తల్లిగా మారింది. మరి ఆమె గర్భం ఈలోగా సంభందమైన గర్భం కాదు. కానీ పరలోక సంభందమైన గర్భం. ఎందుకంటే ఈలోకంలో గర్భం ధరించాలి అంటే, రెండుమనుషుల కలయికవల్ల కలుగుతుంది. కానీ మరియమాత మాత్రం ఇలాకాకుండా దేవునియొక్క సహకారముతో, దేవునియొక్క తోడ్పాటుతో ఈలోకంలోవున్న ప్రతిఒక్క ప్రజలకు దేవునియొక్క ప్రేమనూ, తనయొక్క స్నేహాన్ని తెలియజేయడానికి మనతోనివాసమును ఏర్పరచుకోవడానికి గర్భమనే ప్రధషయాన్ని ఎన్నుకొని మరియమాత ద్వారా ఈలోకములోకి అడుగెడుచున్నాడు.
     మరియమాత యొక్క గర్భంపవిత్రమైన గర్భం.
    మరియమాత యొక్క గర్భం సృష్టికర్తను మోసిన గర్భం.
    మరియమాత యొక్క గర్భం ఈలోకానికి ప్రేమను చవిచూపించిన గర్భం.
     మరియమాత యొక్క గర్భం రక్షణను తీసుకొనివచ్చిన గర్భం.
       మరియమాత యొక్క మాతృత్వానికి గల కారణాలు:
1 . ఇది దేవునియొక్క సంకల్పము:
        యెషయ ప్రవక్త ప్రవచనాల ద్వారా దేవుడు రానున్న ఇమ్మానుయేలుగురించి తెలియజేస్తున్నాడు.ఈ ఇమ్మానుయేలు ఒక యువతి గర్భంధరించడముద్వారా ఈలోకానికివస్తాడు. "యువతి గర్భవతియై ఉన్నది.ఆమె కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును" (యెష:7 :14 ) అని తెలియజేస్తున్నాడు. ఇది కేవలము దేవుని సంకల్పమే కానీ ఏ ఇతరమైన వ్యక్తులనుండికాదు. "ఇమ్మానుయేలు" అనగా దేవుడుమనతోవున్నదని అర్ధం. ఆదేవుడుమనతోవుంటే అన్నీ మనతోవున్నట్లే. అప్పడిదాకా దేవునియొక్క ఎడబాటును చూసిన వారు ఇప్పుడు అదేదేవుని ద్వారా ఆయనయొక్క స్నేహబంధాన్ని చూస్తారు. అందుకేఇది దేవుని ప్రణాళిక మరియు దేవునియొక్క సంకల్పము. యెష:27 :21 లో చూస్తే, "అదిగో! భూలోకవాసులు చేసిన పాపములను గాంచి వారిని దండించుటకుగాను,ప్రభువు తన నివాసము నుండి వేంచేయుచున్నాడు చూడుడు" అని పలుకుచున్నాడు.అయితే ఇప్పుడు అయన ఈలోకమునకు వచ్చేది ఖండించుటకుకాదు- ప్రేమించుటకు. శిక్షించుటకు కాదు-రక్షించుటకు. శపించుటకుకాదు-దీవించుటకు. యోహా:౩:17 -18  :"దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనేకాని,దానిని ఖండించుటకు పంపలేదు.ఆయనను విశ్వసిన్హువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియె ఉన్నాడు.ఏలయన, దేవుని ఏకీక కుమారునినామమున అతడు విశ్వాసముంచలేదు". ఇది దేవునియొక్క సంకల్పము.
2. మరియ మాత అంగీకరణ:
        గాబ్రియేలు దేవదూత మరియమాతదగ్గరకువచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపుర్ణురాలా! నీకు శుభము.నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు.ఆ శిశువుకి యేసు అని పేరు పెట్టుము( లూకా :1 :28 , 31 )అని అన్నప్పుడు ఆమె దేవుని సంకల్పానికి తలవొగ్గి నీమాట చొప్పున నాకు జరుగునుగాక అని అంగీకరించింది (లూకా :1 :38 ). ఎప్పుడయితే మరియ మాత దేవుని యొక్క మాటను అంగీకరించిందో అప్పుడే ఈలోకంలో దేవునియొక్క రక్షణ ప్రణాళిక ప్రారంభమైనది. 
అయితే, ఆమె అంగీకారానికి గల కారణాలు:
   2 .1. మరియమాత యొక్క విశ్వాసము:
        పు.II జాన్ పౌలు పోపుగారు ఇలా అంటారు: "విశ్వసించు ప్రతి ఒక్కరికి మరియ మాత ఒక ఒక ఆదర్శముగా నిలిచింది.అందుకే మనంకూడా ఆమెవలె విశ్వాసాన్ని వెదకాలి".మనము ఈలోకంలో ఎంతోమందిని విశ్వసించి  వారి బాటలోనే నడుస్తుంటాం.ఉదా: డాక్టర్లు, అధికారులు, స్నేహితులు,ఉపాధ్యాయులు. ఇలాఎంతోమందిమాటలువింటూవుంటాం. కానీ ఒకరోజు వారుమానాల్ని మోసము చేయవచ్చు. కానీ దేవుడుమాత్రము అలాకాదు.  ఆయనను మనము నిజంగా విశ్వసిస్తే,మనకోసం ఏదయినా చేస్తాడు.చివరికి తన ప్రాణాన్ని సహితము మన కోసం ధారపోస్తాడు. మరియ మాతకు దేవునిపైన అచెంచలమైన విశ్వాసము ఉన్నది.ఆ విశ్వాసము మూలముననే ఆ దేవాతి దేవుడిని ఈలోకమునకు తీసుకొని రావడానికి తన గర్భమును దేవునికి సమర్పించింది.
     మరియ మాత యొక్క విశ్వాసము వినయముతో కూడుకున్నది.ఎందుకంటే, ఈ వినయమునుండే విశ్వాసము వస్తుంది.వినయము లేకపోతే విశ్వాసము రాదు.అందుకే, నీమాట ప్రకారము నాకు జరుగును గాక అని విశ్వాసముతో వినయముగా దేవదూతతో పలికింది.
    మరియ మాత విశ్వాసముతో అంగీకరించింది.
    మరియ మాత వినయముతో అంగీకరించింది.
    మరియ మాతప్రేమతో అంగీకరించింది.
    మరియ మాత తనను తాను సమర్పించుకుంటూ అంగీకరించింది.
    అదే విధముగా, మరియ మాత ధైర్యముగా అంగీకరించింది.


2. యేసు ప్రభువు యొక్క నామకరణ పండుగ:
            ఈనామకరణ పండుగను జరుపుకొను చున్నామంటే ఆనాడు మరియ మాత, జోజప్ప గారు మోషే ధర్మశాస్త్రము ప్రకారము చిన్నారి బాలయేసును దేవాలయములోకి తీసుకొనివచ్చి నామకరణము చేస్తూ అతనికి యేసు అని పేరు పెడుచున్నారు (లూకా:2 :21 ). ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి, ఆ బాలుడు గర్భము నందు పడక పూర్వము దేవదూత సూచించునట్లు "యేసు" అని పేరు పెట్టిరి.
యేసు అంటే హీబ్రు భాషలో యెహోషువ అని అంటారు మరి దీని అర్ధం రక్షణ. "దేవుడు రక్షిస్తాడు". అయితే యేసు అనగా రక్షకుడు అని అర్ధం. ఈ ఏయూ ప్రభువే మనలను రక్షించేది. మోషే ఆజ్ఞ ప్రకారము "ఏ స్త్రీ అయినా ప్రసవించి మగబిడ్డను కనిన యెడల తాను ఋతుమతి అయినప్పటికీ ఏడున్నాళ్ళు శుద్ధిని కోల్పోవును.ఎనిమిదవనాడు శిశువునకు సున్నతి చేయవలయును" లేవి:13 :1 .మరియమాత మోషే చట్టమును తూచా తప్పకుండా పాటించినదని ఇదిఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే, మరియమాత కూడా యేసుప్రభువును దేవాలయమునకు ఎనిమిదవరోజు తీసుకొనివెళ్ళి నామకరణాన్ని చేస్తూ, యేసుప్రభువుని దేవునికి అంకితము చేస్తుంది. నిర్గ :13 :1 లో చూస్తే,ప్రభువు మోషేతో ఇట్లనుచున్నాడు:"ఇశ్రాయేలీయులలో పుట్టిన తొలిచూలి బిడ్డలనెల్ల నాకుమాత్రమే అంకితము చేయవలయును".ఈనాడు మనము మరియా మాత కూడా చిన్నారి బాలయేసును దేవాలయములో సమర్పిస్తూ, నామకరణము చేస్తుంది. యేసుప్రభువుయొక్క నామమును మనము చూస్తే,
   యేసునామములో శక్తివుంది.
    యేసునామములో ముక్తివుంది.
    యేసునామములో రక్షణ ఉంది.
    యేసునామములో స్వస్థత ఉంది.
ఈనామము ఈయనకుతప్ప ఎవరికీ ఇవ్వబడలేదు.ఆనామమునకు అందరూ మొఖాళ్లు వంచి వినతులు కావలెను." ఆయనకు అన్ని నామాములే కంటే ఘనమగు నామమును ప్రసాదించెను"(ఫిలి:2 :9 ). పరలోక, భూలోక పాతాళలోకములయందలి సమస్తజీవులునూ క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులుకావలెను"(ఫిలి:2 :10 ).అయన నామమును విశ్వసించు ప్రతివారు రక్షణ పొందుతారు.
2.1. యేసు అనగా పాపములనుండి రక్షించువాడు:
నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను.అయన క్రీస్తు ప్రభువు. మరి ఈయనను ఎవరైతే రక్షకుడని తెలుసుకుంటారో వారు రక్షణ పొందుతారు.దేవుడంటున్నాడు: నేనీ పాపులను పిలువా వచ్చితిని కానీ,నీతిమంతులను పిలుచుటకు రాలేదు మత్త :9 :13 .
         వ్యభిచారము పట్టుబడిన స్త్రీని తన పాపాలనునుండి రక్షించాడు (యోహా :8 1 -11 ).
         పక్షవాత రోగిని స్వస్థపరిచాడు.  "కుమారా! ధైర్యము వహింపుము. నీపాపములు పరిహరింప బడినవి"(మత్త:9 :2 ).
         సిలువపైఉన్నదొంగను క్షమించాడు. నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉందువు" (లూకా :23 :43 ).
2.2. యేసు అనగా రోగములను నయంచేసేవాడు:
      యేసుప్రభువు తన జీవితములో ఎంతోమంది యొక్క జీవితములను మార్చాడు. ఎంతోమందిని స్వస్థపరిచాడు. 
 ఉదా: సీమోను అత్తకు స్వస్థత (లూకా :4 :38-39).
            కుష్టు రోగికి స్వస్థత : (లూకా :5:12-13)
            మూగ చెవిటివానికి స్వస్థత (మర్కు:7:37).
           యాయీరు కుమార్తెకు స్వస్థత (మార్కు :5:41).
  3. నూతన సంవత్సరము:
        నూతన సంవత్సరము నూతన జీవితానికి గుర్తు.క్రొత్త ఆశలతో,క్రొత్త ఆశయాలతో మన జీవితాలను చిగురింపచేయడానికి ప్రయాస పడే సమయము ఈ నూతన సంవత్సర సమయము.ఇంకో విధముగా చెప్పాలి అంటే,గడిచిపోయినా సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ,రాబోవు సంవత్సరానికి స్వాగతము పలకాలి. ఈనాటి మొదటి పఠనంలో చూస్తే,యాజకులు ప్రజలను ఏవిధముగా దీవించాలి అని దేవుడు మోషేప్రవక్తకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు దేవుడు ప్రజలను యాజకులద్వారా దీవిస్తున్నాడు? దేవుడే స్వయముగా ప్రజలను దీవించవచ్చుకదా అని మనకు ఆలోచన రావచ్చు. కానీ, దేవుడు ఒక జాతిని పూర్తిగా ఎన్నుకొని అయన ప్రేమ వారిలోకి కుమ్మరించి ఆ ప్రేమ వారు చవి చూచునట్లు చేయుచున్నాడు. 
మరి కాథోలికులైన మనము ఎందుకు దేవాలయములో మన జీవితమును ఆరంభిస్తున్నాము? ఎందుకంటే,కాలములు,య్యుగములు దేవునియొక్క ఆధీనములో వున్నవి కాబట్టి (దాని :2 :21 ). నూతన సంవత్సరము దేవుని సన్నిధిలోవుండి, ఆయననామమును స్మరించుకొంటాము దీవెన కరము. ఉదా: హిజ్కియా రాజు తన రాజ్యాన్ని దేవాలయములోనే ప్రారంభించాడు. అందుమూలముననే అయన మూడు మేలులను పొందాడు.

 అవి:    1 . పాడిపంటలు సంవృద్ధిగా పండుతాయి.
             2. శత్రువులమీద విజయము కలుగును.
             3. మరణించిన తరువాత నిత్యజీవపు భాగ్యమును దయచేస్తాడు. 
ప్రతిరోజు మనల్నిమనం దేవునికి సమర్పించుకోవాలి.అప్పుడే నీకు ఇవనీ వర్ధిల్లుతాయి. దీనికి దేవునియొక్క తోడ్పాటు ఎంతో అవసరము. 
అందుకే ఈనాడు నూతన సంవత్సరమునాడు మనమందరము దేవుని సన్నిధిలో చేరి ఆ దేవాతి దేవుడిని స్తుతించడానికి ఆరాధించడానికి, గణపరచడానికి వచ్చివున్నాము. అదేవిధముగా,మనయొక్క కోరికలను దేవునికిసమర్పించి అవి మనజీవితములో నెరవేరాలని ప్రార్ధన చేస్తాము.
     ఈనాడు ఈనూతన సంవత్సరము లాగా నువ్వునేను నూతనముగా ఉండాలి అంటే, రెండు కార్యాలు మనము చేయాలి. అవి:
1. మనల్నిమనం దేవునికి సమర్పించాలి:
          ఈలోకంలో ఎంతోమంది ఎన్నోవస్తువులకు, అధికారాలకు,ధనమునకు,చెడ్డ ఆలోచనలకూ, చెడ్డ వ్యసనాలకు,వారిని వారు సమర్పించుకుంటారు.దాని ఫలితముగా వారి జీవితములో నిజమైన శాంతి సమాధానములు కరువగుచున్నాయి. వారి కుటుంబాలలో ప్రేమలేకుండా పోతుంది.ఒకరినొకరు అర్ధం చేసుకోలేక పోతున్నారు.ఉదా; ధనవంతుడు ధనమునకు లోబడి దైవారాజ్యమున సంపదను కోల్పోయాడు.జాలితో తిరిగి వెళ్లి పోయాడు.
   ఎన్నడూ నువ్వునేను కూడా లోకాశాలకు మనల్నిమనం సమర్పించుకుంటే ఈ ధనవంతుడిలాగా మనంకూడా నిత్యముఉండే సంపదను కోల్పోతుంటాము.దానిద్వారా శాంతిసమాహాదానాలు మనలో కరువవుతాయి.కాబట్టి,మనల్ని మనము దేవునికి సమర్పించుకొని అయన అజ్ఞాను సారము నడుచుకోవాలి. పశ్చాత్తాప హృదయముతోదేవుని చేరాలి. విశ్వాసముతో దేవునికి ప్రార్ధన చేయాలి. తప్పిపోయిన కుమారుడివలె పాత జీవితమును విడిచిపెట్టి ఒక క్రొత్తజీవితమును ప్రారంభించాలి.
2. కృతజ్ఞతా భావముతో కలిసి జీవించాలి:
          దేవుడు మనజీవితములో ఎన్నో గొప్ప గొప్ప మేలులు చేసి ఉన్నాడు.నెలనుండిమట్టిని తీసుకొని మనిషిగాచేసి,దానిలో జీవము పోసి తన పోలికలో సృష్టించుకొని,తనతోపాటు నివాస స్థలమును ఏర్పరచుకొని, తన ప్రేమను ప్రతిక్షనం చూపిస్తూ, చివరికి మనందరికోసం ఆ కలువారి సిలువలో గోరతి గోరంగా మరణించి మూడవనాడు తిరిగిలేచి,ఎంతోమంది జీవితాలను మార్చాడు.
ఉదా : పదిమంది కుష్టురోగులు.
    ఈ పదిమంది కుష్టురోగులలో ఒక్కడే వెనుకకు తిరిగి వచ్చి ఆ దేవునికి కృతజ్ఞత తెలిపాడు.దీనిమూలముననే,మిగతా తొమ్మిది మంది కంటే ఎక్కువగా  అందరి సమక్షంలో గొప్పవానిగా పరిగణించబడ్డాడు. ఈనాడు నువ్వు నేను కూడా దేవునికి కృతజ్ఞతా భావముతో జీవించాలి.
         కాబట్టి ఈ నూతన సంవత్సరములో మనమందరము ఒక నూతన జీవితానికి నాంది పలకాలి. ఎందుకంటే, ఈ నూతన సంవత్సరములో నువ్వు నేను కూడా నూతన సంవత్సరములో మరియా మాత ఏవిధముగానైతే,తనను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకొని, ఆ దేవాతిదేవుని ఈ లోకమునకు తీసుకొని వచ్చింది. ఈ నాడు నీ విశ్వాసము కూడా మరియమాతవిశ్వాసమువలె ఉండాలి. అదేవిధముగా మరియ మాత మరియు జోజప్ప గారు ఏవిధమిగానయితే  బాలయేసును దేవాలయములో మోషే ధర్మశాస్త్ర ము ప్రకారము బాలయేసును సమర్పించి,నామకరణము చేసియున్నారో, అదేవిధముగా ఒక తల్లి తండ్రిగా పిలువబడుచున్న మీరు మీ పిల్లలను ఎసైప్రభువువలె దేవాలయములో సమర్పించి అయన అడుగుజాడలలో నడిపించడానికి ప్రయత్నము చేయాలి. ఇంకా ఈ నూతన సంవత్సరములో దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నిద్దాము. ఆమెన్.

Br. Sunil Mario Nandigama
  
      
 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...