29, ఏప్రిల్ 2023, శనివారం

పాస్కా 4 వ ఆదివారం

 పాస్కా 4 వ ఆదివారం

అపో 2:14,36-41

1 పేతురు 2:20-25

యోహాను 10:1-10

పాస్కా నాల్గవ ఆదివారంను మంచి కాపరి ఆదివారం అని పిలుస్తారు. ఈనాటి దివ్య పఠనాలు కూడా కాపరి యొక్క బాధ్యతలను గురించి తెలుపుచున్నాయి.

తల్లి శ్రీ సభ మనందరినీ మంచి కాపరులుగా ఉండుటకు పిలుస్తుంది, కాపరి తన మందతో ఏ విధంగానైతే సన్నిహిత సంబంధం కలిగి జీవిస్తుంటాడో అదే విధంగా మనం కూడా కాపరి అయిన దేవునితో ఒక మంచి మందగా కలిసి జీవించాలి.

ప్రజల యొక్క నాయకుడు గొర్రెల కాపరి వంటి వాడు, అతడు/ఆమె తన మందను సన్మార్గంలో నడిపించాలి.

ఈనాటి మొదటి పఠనం లో  పెంతుకోస్తు పండుగ రోజున అపోస్తులు చేసిన బోధనల గురించి వింటున్నాం, యూదయ ప్రజలను ఉద్దేశించి శిష్యులు యేసు ప్రభువును గురించి తెలిపారు, పేతురు గారు మరియు మిగతా శిష్యులు ప్రజల సమూహంలో నిలబడి ధైర్యంగా యేసు ప్రభువును గురించి ప్రకటిస్తున్నారు.

మొదటి పఠనం లో మనం రెండు ప్రధానమైన అంశాలు గ్రహించాలి:

1. హృదయ పరివర్తనం

2. బప్తీస్మమును స్వీకరించుట

ఏసుప్రభును అన్యాయంగా సిలువ మరణంకు గురిచేసారని కానీ యేసుని దేవుడు క్రీస్తుగా రక్షకునిగా నియమించారు అని బోధించారు.

అపోస్తుల యొక్క బోధన వినగానే అందరూ చేసిన తప్పిదమునకు పశ్చాత్తాప పడ్డారు, వారు యేసు ప్రభువు విషయంలో ఎంత తప్పిదనం చేశారో గుర్తించారు, అందుకని శిష్యులను ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుచున్నారు. అందుకే పేతురు గారు హృదయ పరివర్తనం చెంది పాప పరిహారం కై యేసు క్రీస్తు నామమున జ్ఞాన స్నానం పొందమని తెలిపారు.

- నాతాను దావీదు తప్పు చేసిన తీరును చెప్పిన విధంగా యూదులు చేసిన తప్పు పేతురు తెలిపారు.

- పేతురు గారు యూదులును జ్ఞాన స్నానం పొంది దేవుని మందలో చేరమని తెలుపుచున్నారు. యూదులు దేవుని యొక్క స్వరం ఆలకించి అనుసరించారు కాబట్టి వెంటనే హృదయ పరివర్తనం చెందుటకు ఇష్టపడ్డారు.

బాప్తిస్మము  విశ్వాసులకు ఒక క్రొత్త గుర్తింపును ప్రసాదిస్తుంది. బాప్తీస్మం కొత్త జీవితంను ప్రసాదిస్తుంది, మనలో ఉన్న పాపమును తొలగించి మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తుంది.

పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం పొందినప్పుడు మనం పాపము నుండి శుద్ధి చేయబడుతున్నాం.

పెంతుకోస్తు తరువాత శిష్యుల యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే యేసు ప్రభువు యొక్క మరణం పునరుత్థానం గురించి ప్రకటించుటయే.

దేవుని యొక్క ఆత్మను పొందిన తర్వాత వారు ధైర్యంతో నింపబడిన కాపరులుగా తయారవుతున్నారు అందుకనే మరణంకు హింసలకు భయపడటం లేదు.

శిష్యులకు అప్పచెప్పిన బాధ్యతలను వారు సక్రమంగా నెరవేరుస్తున్నారు. దేవుడు మనల్ని కూడా కాపరులుగా ఎన్నుకున్నారు మరి మనం ఏ విధంగా మన బాధ్యతలను నెరవేర్చుతున్నాము.

ఈనాటి రెండవ పఠనం లో  ఒక క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉండాలో తెలుపుచున్నారు, హింసలను ఏ విధంగా భరించాలో తెలుపుచున్నారు.

చాలా సందర్భాలలో మనం తప్పు చేయకపోతే శిక్షను అనుభవించుటకు సిద్ధంగా ఉండము, కానీ దేవుని మందమైన  మనం తప్పు చేయకపోయినా శిక్షను అనుభవించినట్లయితే దానిని ఓర్పుతో సహించమని పేతురు గారు తెలుపుచున్నారు.

వాస్తవానికి ఇది చాలా కష్టం కానీ మన కాపరి అయిన యేసు ప్రభువు ఆయన ఎటువంటి తప్పిదము చేయలేదు ఎల్లప్పుడూ ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే జీవించారు, ప్రజలకు బోధించారు, మేలు చేశారు, అద్భుతాలు చేశారు, మరణించిన వారికి జీవం ఇచ్చారు, అనారోగ్యాలతో స్వస్థత ఇచ్చారు, ఎంత మేలు చేసినప్పటికీని ఆయనను అన్యాయంగా సిలువ వేశారు.

ఆయన ఎట్టి పాపమూ చేయలేదు. ఎన్నడును అసత్యపు మాటలు పలకలేదు. ఆయనను శపించిన వారిని శపించలేదు అయినా కానీ ప్రభువును ఘోరమైన సిలువ మరణంకు గురి చేశారు, కాబట్టి అన్యాయంగా శిక్షణ పొందితే దానిని ఓర్పుతో భరించమని ప్రభువు తన యొక్క జీవితం ద్వారా తెలిపారని పేతురు గారు బోధించారు.

పేతురు గారు పలుకుచున్నారు అన్యాయంగా శిక్షను పొందిన వారు ఓర్పుతో భరిస్తే వారు ఆశీర్వదించబడతారు అని తెలిపారు.

- యోసేపు అన్యాయంగా శిక్షించబడ్డాడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు - ఆది 37,39

- దానియేలును అన్యాయంగా సింహపు బోనులో వేశారు దేవుని చేత రక్షించబడ్డారు.

- మోషే ప్రవక్తను కూడా అన్యాయంగా నిందించారు కానీ దేవుడు గొప్పవానిగా దీవించారు - నిర్గమ 5-21,14:11

- సమూయేలు ప్రవక్తను కూడా వద్దన్నారు - 1 సము 8:5

అయినా దేవుడు తన్ను దావీదును అభిషేకించే ప్రవక్తగా ఎన్నుకున్నారు.

కొన్ని కొన్ని సందర్భాలలో మనం పని చేసే చోట జీవించే చోట ప్రయాణం చేసే చోట అన్యాయంగా మనల్ని మాటలు అంటుంటారు అయినా మనం వాటిని ప్రేమతో సహించాలి.

- ఏసుప్రభు అన్నారు నిన్ను ఒక్క చెంప మీద కొట్టిన వానికి  రెండవ చంపను కూడా చూపించమని ఇది క్రైస్తవ జీవితం.

క్రీస్తు ప్రభువు ఈ లోకానికి మంచి నాయకుడిగా, ఒక మంచి సామృత్తికను  ఇచ్చారు, కాబట్టి మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలి ఆయన వలే తప్పు చేయకపోయినా శిక్షను అనుభవించుటకు సిద్ధంగా ఉండాలి.

మనల్ని మనం సమర్థించుకొనకుండా దేవుని కొరకు అన్నియును సహనంతో భరించాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. తొలి క్రైస్తవ సంఘం అన్యాయంగా అనేక హింసలకు గురి అయినది వాటిని అన్నింటి వారు ఎంతో సహనంతో భరించారు. కావున దేవుని యొక్క శ్రమలలో భాగస్తులైనంతవరకు సంతోషిస్తూ ప్రభువు కొరకు అన్యాయంగా శిక్షించబడినప్పటికీ ధైర్యంతో ముందుకు సాగిపోదాం.

ఈనాటి సువిశేష పఠనం లో  యేసు ప్రభువు గొర్రెల కాపరి అని అదేవిధంగా గొర్రెలు పోవు ద్వారము కూడా యేసు ప్రభువు అని తెలుపుచున్నారు.

పవిత్ర గ్రంథంలో దేవుడిని వివిధ రకాల రూపాల్లో పోలికలతో చెప్పబడ్డారు.

- ప్రభువును కరుణామయుడని

- ప్రేమాస్వరూపియని

- సత్య స్వరూపి అని

-మంచి కాపరి అని వివిధ రకాల పోలికలతో నామాలతో వ్యక్తిగత అనుభవమును బట్టి పోల్చి చెప్పబడ్డారు.

మంచి కాపరి అనేటువంటి మాటను పాత నిబంధన గ్రంథ రచయితలు అలాగే నూతన నిబంధన గ్రంథ రచయితలు ఇద్దరును ప్రభువు యొక్క జీవితంలో ఉద్దేశించి వినియోగించారు.

- సృష్టి ప్రారంభం నుండి దేవుడు కాపరిగా ఉంటూ తన ప్రజలను నడిపించారు అందుకే దావీదు రాజు అన్నారు ప్రభువే నాకు కాపరి ఇక నాకు ఏ కుదువ ఇవ్వు లేదు - కీర్తన 23:1.

పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు యావే  దేవుడు గొర్రెల కాపరి అనే ప్రవక్తలు బోధించారు.

ఏఎస్కేలు ప్రవక్త 34వ అధ్యాయంలో యావే దేవుడు ఎలాంటి కాపరియో తెలుపుచున్నారు - యేహెస్కెలు 34:15-16.

దావీదు రాజు కీర్తనల గ్రంథంలో యావే  దేవుడు మంచి కాపరి అని తెలుపుచున్నారు - కీర్తన 77:20,79:13,97:7,95:7

యావే దేవుడు తన ప్రజలను ముందుకు నడిపించిన మంచి కాపరి ఆమోసు  ప్రవక్త జకరయ్య ప్రవక్త మరియు యెషయా  ప్రవక్తలు కూడా యావే  దేవుని మంచి కాపరి అని సంభోదించారు - యెషయా 40:11,49:9-10

యావే  దేవుడు తన మందను మేపే బాధ్యతలను తన యొక్క సేవకులకు అప్పచెప్పారు.

మోషే అహరోను ద్వారా యావే దేవుడు తన మందను నడిపించారు - కీర్తన 72:21

యెహోషువా ప్రవక్త ద్వారా తన మందను ముందుకు నడిపించాడు. తరువాత న్యాయాధిపతులను, నాయకులను, రాజులను ఎన్నుకొని వారిని ఇస్రాయేలు ప్రజలకు కాపరులుగా చేశారు. అయితే అందరూ కాపరులు సత్యంతో, నీతిగా పనిచేయలేదు, కొందరు కాపరులు తమ స్వార్థం కోసం జీవించారు. అందుకే యావే దేవుని తన కుమారుడైన క్రీస్తు ప్రభువు మనకు మంచి కాపరిగా ఈ లోకానికి అందజేశారు.

- ఏసుప్రభు మంచి కాపరి - 10:12.

పాలస్తీన దేశంలో కాపరి అంటే నిస్వార్థ సేవకు ప్రేమకు త్యాగం కు నిజాయితీకి ఒక మంచి ఉదాహరణ.

ఏసుప్రభు తన యొక్క సువార్త పరిచర్యలో అనేకసార్లు గొర్రెల మందలను గురించి గొర్రెల కాపరుల గురించి తెలిపారు.

ఆయన కాపరిలేని గొర్రెల మందలా ఉన్న వారిని చూసి జాలితో చలించిపోయారు -  మార్కు  6:35.

తప్పిపోయిన గొర్రెలను వెతికారు - లూకా 15:3-7.

సువార్త సేవకు శిష్యులను పంపించేముందు యేసు ప్రభువు శిష్యులతో నేను మిమ్ము తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలే పంపిస్తున్నాను అని పలికారు - మత్తయి 7:15

- ఏసుప్రభును మంచి కాపరి  అని పిలుస్తున్నాము ఎందుకంటే : 

1. ఆయన తన మందను పచ్చిక బయళ్ల వద్దకు నడిపించారు, వారిని పరలోకము వైపుకు నడిపించారు ప్రజలను సంతృప్తి పరిచారు.

2. గొర్రెల కొరకు తన యొక్క ప్రాణం నువ్వు త్యాగం చేశారు.

3. దెబ్బ తగిలిన ప్రతి గొర్రెను మంచిగా చూసుకొని, వాటికి అందజేయవలసిన ప్రేమను అందజేశారు.

4. ఏసుప్రభువు గొర్రెలకు ముందుగా నడిచారు అన్నింటిలో వారికి ముందుగా వెళ్లారు.

5. తప్పిపోయిన గొర్రెల కొరకు వెతికారు.

6. తన మందను క్రమశిక్షణలో నడిపించారు.

7. ఆయన సానుభూతి కలిగిన కాపరి.

8. ఆయన ప్రేమించే కాపరి తన మందను ఎప్పుడూ ప్రేమించారు.

9. తన మంద యొక్క శ్రేయస్సు కొరకు పనిచేసే కాపరి.

10. తన యొక్క మందను క్షుణ్ణంగా తెలుసుకున్న మంచి కాపరి తనకు తన మందకు చాలా దగ్గర బంధం ఉంది.

- ఏసుప్రభు తనను తాను గొర్రెలు పోవు ద్వారము అని పిలుస్తున్నారు.

- ద్వారము మనం లోపలికి ప్రవేశించుటకు సహాయపడుతుంది, మనం కూడా పరలోకం రాజ్యం లోపలికి ప్రవేశించాలంటే అది కేవలం ఏసుక్రీస్తు ద్వారానే సాధ్యం.

- దేవుని దరి చేరాలంటే ఆయన ద్వారా మనం ప్రవేశం పొందాలి ఆయన దేవునికి మనకు మధ్యవర్తి - ఎఫెసి 2:18

- మనం ఆయన మందలోని బాగాస్తులైన వారితో ఆయన యొక్క స్వరమును ఆలకించి ఆయన్ను వెంబడిస్తాం.

మొదటి పఠనం లో  యూదులు అపోస్తుల యొక్క స్వరమును ఆలకించి మంచి మార్గంలో నడుచుకున్నారు, మనం కూడా దేవుని యొక్క స్వరమును ఆలకించి జీవిస్తే తప్పనిసరిగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం.

ఈరోజు మనం కాపురుల కొరకు ప్రార్థించాలి, అభిషేకించబడ్డవారు కాపరులే, దేశ నాయకులు కాపరులే, తల్లిదండ్రులు కాపరులే, ఉపాధ్యాయులు కాపరులే, ప్రతి ఒక్కరూ కాపరులే, కాబట్టి మనకు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి.


FR. BALAYESU OCD

22, ఏప్రిల్ 2023, శనివారం

3వ పాస్కా ఆదివారం

 

3 పాస్కా ఆదివారం

. పో.  2: 14, 22-28

1 పేతురు 1: 17-21

లూకా 24: 13-35

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుడు తనను విశ్వసించే ప్రజలకు ఎప్పుడు చేరువలోనే ఉంటారు అని తెలుపుచున్నాయి. మన జీవితంలో మనం ఎట్టి పరిస్థితులకు లోనైనాకానీ పునరుత్తాన దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. దేవుడి గురించి ఎవ్వరైతే తాపత్రయ పడుతుంటారో, వెదకుతుంటారో, ఆయన సాన్నిధ్యంతో జీవించాలని భావిస్తారో వారికి ప్రభువు అతి సమీపంలోనే ఉంటారు అనే విషయం గురించి మనకు ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి.

ఈనాటి మొదటి పఠనంలో పేతురు గారు చేసిన మొదటి పునరుత్తాన భోధన గురించి వింటున్నాం. అపొస్తలులు యేసు ప్రభువు యొక్క పునరుత్తానం తరువాత అదే విధంగా దేవుని యొక్క పవిత్రాత్మను పొందిన తరువాత సువార్త ప్రకటన చేయుట మనం వింటున్నాం.  పవిత్రాత్మను పొందిన తరువాత వారిలో భయం పోయినది అందుకనే వారు బహిరంగంగా సువార్తను అధికారుల మధ్య సమూహాల మధ్య బోధించారు.

వారు బోధించిన అంశం ఏమిటంటే యేసు ప్రభువును అన్యాయంగా సిలువ మరణంకు గురిచేశారు అయినా కానీ దేవుడు మాత్రం తన కుమారున్నివిడిచి పెట్టలేదు ఆయన్ను మరణమును గెలిచేలా చేశారు.  యేసు ప్రభువు తన యొక్క అద్భుతాలు ద్వారా, మహాత్కారాల ద్వారా తన యొక్క బోధనల ద్వారా తానే యేసయ్య అని తెలిపారు. అయినప్పటికిని అది గ్రహించక ఆయన్ను మీరు సిలువ శిక్షకు గురి చేశారు, ఆయన మరణంకు కారణం అయ్యారు అని తెలిపారు.

యేసు ప్రభువును తన తండ్రి ఎన్నడును విడిచిపెట్టలేదు అని పేతురు గట్టిగా  ప్రకటించారు. తండ్రి తన కుమారున్ని ఎన్నడూ విడిచిపెట్టరు. ఎందుకంటే ప్రభువు అంటున్నారు "తల్లి మరచినా నేను నిన్ను మరువను అని" యెషయా 49 : 15 . మనల్ని మరచిపోని దేవుడు మరి తన కుమారున్నిఏ విధంగా మరువగలడు, మరవడు. సత్యమును గ్రహించిన అపోస్తులు ప్రభువు యొక్క పునరుత్తానం గురించి గట్టిగా ప్రకటించారు.

నాటి మొదటి పఠనంలో పేతురు గారు దేవుడు అందరిని తన ప్రజలుగా స్వీకరిస్తున్నారు అని తెలుపుచున్నారు. మొదటిగా యూదులను మార్చి, తరువాత అన్యులకు సువార్త ప్రకటన చేసి వారిని  తన బిడ్డలుగా స్వీకరిస్తారు అని ప్రభువు పలుకుచున్నారు.  యూదులు యొక్క విశ్వాసాన్ని బలపరచుటకు, వారిని యేసు ప్రభువు వైపు తిప్పుటకు పేతుటకు పేతురు గారు వారిని తన యొక్క పరిచర్య ద్వారా బోధించిన విధానం తెలుసుకుంటున్నాం.

ఈనాటి రెండవ పఠనంలో పేతురు గారు మనందరినీ దేవుడి యందు భయభక్తులు  కలిగి జీవించమని కోరుచున్నారు. పేతురు గారు ఆనాటి యూదులను అదే విధంగా హృదయ పరివర్తనం చెందిన అన్యులను దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి  భయభక్తులతో జీవించమని కోరుచున్నారు.

ప్రభువు యొక్క మరణం అనేది దైవ ప్రణాళిక అని పేతురుగారు పలికారు.  ప్రభువు యొక్క రక్తం చేత మనం పాప విముక్తులముగా చేయబడ్డాం. నిష్కళంక గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మనం పవిత్ర పరచబడ్డాం, స్వతంత్రులముగా చేయబడ్డాం. కావున ఆయన యందు ఎల్లప్పుడూ, విశ్వాసం ఉంచి మంచిగా  జీవించమని పేతురు గారు  పలుకుచున్నారు.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు ఎమ్మావు మార్గంలో శిష్యులకు ఇచ్చిన దర్శనం గురించి వింటున్నాం. ఇద్దరు శిష్యులు యేసు ప్రభువు యొక్క మరణం తరువాత యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామంకు వెళ్లే సమయంలో దేవుడు వారితో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గ్రహించాలి.

1. దేవుడు నీ బాధలో  నీకు తోడుగా వుంటారు. ఇద్దరి శిష్యులు ప్రభువు యొక్క మరణమును తట్టుకోలేకపోయారు, నిరాశలో వున్నారు, రాజును  కోల్పోయాము అనే బాధలో వున్నారు. ఆయన్ను గొప్ప నాయకుడిగా, రాజుగా భావించారు. రోమా చక్రవర్తుల నుండి స్వేచ్ఛను దయచేసి వ్యక్తిగా భావించారు అయితే వారి యొక్క ఆలోచనలకు బిన్నంగా ఆయన మరణించారు. అలాంటి తట్టుకోలేనటువంటి స్థితిలో వున్న వారికి ప్రభువు దర్శనం ఇస్తున్నారు.

-   శిష్యులు యేసు ప్రభువు యిస్రాయేలు ప్రజలను ఉద్ధరిస్తాడని, తన రాజ్యాన్ని స్థాపించి ప్రజలకు శాంతి సమాధానాలు సిరిసంపదలు దయ చేస్తాడని వారు ఎంతగానో ఎదురుచూశారు. అయితే అదేమి జరగలేదు. యేసు మరణంతో శిష్యుల యొక్క ఆశలు వమ్ము అయ్యాయి.

-  అంతా కోల్పోయాము, అంతా అయిపోయింది అని జీవచ్ఛవాలుగా ఎమ్మావు గ్రామానికి వెళ్లుచున్న శిష్యులను ప్రభువు కలుసుకుంటున్నారు.

-   దేవుడు తనను వెంబడించే వారిని విడిచిపెట్టరు. శిష్యులు ఎమ్మావు గ్రామముకు వెళ్లే దారిలో వారి యొక్క సంభాషణ యేసు ప్రభువు గురించియే అందుకే ప్రభువు అంటారు "ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడివుంటారో అక్కడ నేనుంటానని" - మత్తయి 18 : 20 .

- మార్గమధ్యన వారి సంభాషణ అంత దేవుని గురించియే అందుకే వారి మధ్యకు దేవుడు వస్తున్నారు.

- వారు అంతగా  దేవుడి గురించి సంభాషిస్తున్నారంటే ఎంతగా ఆయన్ను miss  అయ్యామని వారు భావిస్తున్నారో మనం అర్ధం చేసుకోవాలి.

- మన జీవితాలలో మన భాదల్లో వున్నప్పుడు దేవుడు మనకు కూడా తోడుగా వుంటారు అది మన యొక్క తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు లేదా ఇతరుల ద్వారా కావచ్చు దేవుడు మనల్ని ఎన్నడు విడిచిపెట్టారు.

2. మన దేవుడు ప్రయాణించే దేవుడు: పూర్వ నిబంధన గ్రంధంలో యావే దేవుడు యిస్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విముక్తులను చేసి, వారితో పాటు ఎడారి గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసే సందర్భంలో ఆయన మహిమను, స్వభావమును వెల్లడిచేశారు. ఆయన యొక్క సాన్నిధ్యమును అనుభవించేలా చేశారు.

- అదే విధంగా ఈనాటి సువిశేషంలో యేసు ప్రభవు కూడా శిష్యులతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో వారికి అనేక విషయాలు తెలుపుచున్నారు.

- ప్రభువు తన ప్రజలతో నడుస్తూ తన యొక్క  గొప్పతనమును వెల్లడించుకుంటున్నారు.

-  సృష్టి  ప్రారంభంలో దేవుడు ఆదాము, అవ్వతో నడిచారు. దేవుడు నోవాతో నడిచారు, ఏనోకుతో నడిచారు. ప్రభువు వారితో నడిచే సందర్భంలో అది సామాన్యమైన నడకకాదు అది. యొక్క నడక వారిని బలపరిచే నడక, నేర్పించే నడక, ధైర్యం నింపే నడక కావున మన కూడా గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుడు కూడా మనతో పాటు నడుస్తుంటారు. ఆయన సర్వమును గుర్తించి ఆయన మాట ప్రకారం మనం జీవించాలి.

3. మన దేవుడు మన యొక్క అవసరతలను పట్టించుకునే దేవుడు.

-   ఆయనకు ప్రతి ఒక్కరి అవసరతలు తెలుసు అందుకే వారిని ఆదుకుంటారు.

-  గ్రుడ్డివారిని అవసరతలు తెలుసు

-  పక్షవాత రోగి అవసరం తెలుసు

-  అనారోగ్యుల అవసరాలు తెలుసు

-  విశ్వాసులు అవసరాలు తెలుసు

అందుకే వారిని ఆదుకుంటారు. అదే విధంగా ఇద్దరి శిష్యుల అవసరం కూడా తెలుసు అందుకే వారిని ఆదుకుంటారు.

4. మన దేవుడు ఐక్య పరిచే దేవుడు: ఇద్దరి శిష్యులను మిగతా శిష్యులతో దేవుడు ఐక్యపరుస్తున్నారు.

- ప్రభువును రొట్టె విరుచుట యందు గుర్తించిన శిష్యులు వెంటనే మిగతా శిష్యుల వద్దకు పరుగెత్తుకొని వెళ్లారు.

- యేసు ప్రభువు మరణంతో మనల్ని తండ్రితో ఐక్య పరిచారు.

- ప్రభువు తొలి సంఘస్థులను ఐక్య పరుస్తున్నారు. అలాగే దేవుడు వివాహం ద్వారా స్త్రీ పురుషులను ఐక్యం చేస్తున్నారు.

5. మన దేవుడు కనువిప్పు కలుగచేసే దేవుడు.

- ఇద్దరి శిష్యులు మొదట్లో యేసు ప్రభువును గుర్తించలేదు కానీ ఆయన స్థాపించిన దివ్య సత్ప్రసాదస్థాపన రోజున చేసిన కార్యమును శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. వారి కనువిప్పుకు కారణం అయ్యారు.

- తప్పిపోయిన కుమారుడి కనువిప్పు అయ్యేలా చేశారు.  యొక్క రోజున దేవుడు అన్ని సమయాలలో మనకు తోడుగా ఉంటారని గుర్తించి ఆయన్ను విశ్వసించాలి.

 Fr. Balayesu OCD

15, ఏప్రిల్ 2023, శనివారం

పాస్కా 2వ ఆదివారం

పాస్కా 2వ ఆదివారం

అ. కా. 5: 12-16

దర్శ 1: 9-11, 12-13, 17-19

యోహాను 20 : 19 - 31

ఈరోజు తల్లి శ్రీసభ దివ్యకారుణ్య పండుగను కొనియాడుచున్నది. ఈరోజు దివ్య పఠనాలు కూడా దేవుని యొక్క దయా, కరుణ గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క కరుణ చల్లని చూపు అందరికి అవసరం దాని ద్వారానే మనం ప్రభువు యొక్క అనుగ్రహాలు పొందుచున్నాము, బ్రతుకుచున్నాం.

దివ్య కారుణ్య పండుగ భక్తి పునీత పౌస్టీనా ద్వారా ప్రారంభమైంది. ప్రభువు ఆమెకు ఏప్రిల్ 30 , 2000 లో ఇచ్చిన దర్శనంలో ప్రభువు ఆమెతో ఈ విధంగా అన్నారు "మానవజాతి, నమ్మకంతో తన కరుణను ఆశ్రయిస్తే వారికి శాంతి లభిస్తుందని" తెలిపారు. పరిశుద్ధ రెండవ జాన్ పాల్ పాపుగారు ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రకటించారు. పరిశుద్ధ ప్రాన్సిస్ పాపుగారు దీనిని అధికారికంగా జరుపుకోవాలని తెలిపారు.

పౌస్టీనా గారికి దేవుడు మూడు ముఖ్యమైన బాధ్యతలను అప్పజెప్పారు.

1 . ఆత్మల కోసం ప్రార్ధించుట : దేవుని యొక్క అనంతమైన కరుణకు ఈ ఆత్మలను సమర్పించి వారి కొరకు ప్రార్ధించుట

2 . ఈ ప్రపంచముకు దేవుని యొక్క గొప్ప మనస్సు, కారుణ్య మనస్సు తెలియజేయుట.

3 . దేవుని యొక్క కరుణ చాటుట, విశ్వాసమును ప్రకటించుట దేవుని ప్రేమను విశ్వసించుట అంటే ఆయన యొక్క కరుణను విశ్వసించుటయే కాబట్టి ఈ రోజు దేవుడు మనకు చూపిస్తున్న కరుణ మనం ధ్యానించుకోవాలి.

యేసు ప్రభువు యొక్క దివ్య కారుణ్య picture మనం చూస్తే రెండు రకాలైన కిరణాలు కనబడతాయి. ఎర్రని కిరణాలు - దేవుని యొక్క రక్తంకు గుర్తు. ఆయన రక్తం చిందించటం ద్వారా మనం రక్షించబడ్డాం అని అర్ధం. తెల్లని కిరణాలు మన యొక్క జ్ఞానస్నానంకు గుర్తు. జ్ఞానస్నానం ద్వారా దేవుని బిడ్డలుగా చేయబడుతున్నాం. పవిత్రులుగా చేయబడుతున్నాం.

ఈనాటి మొదటి పఠనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యుల ద్వారా చూపిన కరుణ గురించి తెలియజేస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారికి ప్రభువు తన యొక్క అనంత కరుణను చూపిస్తున్నారు. 15 వ వచనంలో పేతురుగారి నీడపడినా చాలు మేము స్వస్థత పొందుతాం అనే అంత గొప్ప విశ్వాసం ప్రజలలో చూస్తున్నాం. ఇలాంటి ఒక విశ్వాసం గెన్నేసరెతు ప్రజలలో కూడా చూస్తున్నాం. కేవలం యేసు ప్రభువు యొక్క అంగీని తాకితే చాలు మేము స్వస్థత పొందుతాం అని అనుకున్నారు. మత్తయి 14 : 34 - 36 .

దేవుని యొక్క దీవెనలు, కరుణ పొందటానికి ప్రజలు తమ జీవితాలను తాము సంసిద్ధం చేసుకొని వున్నారు. విశ్వాసమును కలిగి వున్నారు. యెరూషలేములో సొలొమోను మంటపం దగ్గర వున్నా విశ్వాసులు పేతురు గారిలో పవిత్రాత్మ శక్తి ఉందని గ్రహించారు. ఆయన దేవుని శిష్యుడని తెలుసుకున్నారు, ఆయనకు స్వస్థత నిచ్చే శక్తి వుందని గ్రహించారు.

పేతురు గారు బలహీనుడు, యేసు ప్రభువును మోసం చేశారు అయినా సరే ఆయనలో అంత శక్తి ఎలా దాగివుంది ఆయన తన జీవితమును మార్చుకున్నాడు. హృదయ పరివర్తనం చెందాడు, పవిత్రాత్మ శక్తిని పొందాడు, దేవుని చిత్తం ప్రకారం జీవించారు అందుకే దేవుని యొక్క స్వస్థత పరిచే శక్తి ఆయనకు వచ్చింది ఇది దేవుని యొక్క అనుగ్రహం. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే మనంలో విశ్వాసం ఉండాలి.

ఈనాటి రెండవ పఠనంలో పునీత యోహాను గారు తనకు వచ్చిన దర్శనం గురించి తెలుపుచున్నారు. పునరుత్తానుడైన క్రీస్తు ప్రభువు యొక్క దర్శనం గురించి పలుకుచున్నారు. పునరుత్తానుడైన క్రీస్తు ప్రభువు తాను సజీవుడని, మృత్యు లోకమునకు అధికారి అని తెలుపుచున్నారు. ఈ పఠనం ద్వారా ప్రభువు తానే విశ్వాధిపతి అని తెలుపుచున్నారు. ఈ లోకంలో ఎదురయ్యే కష్టాలకు ఇబ్బందులకు కృంగిపోక దైవశక్తి మీద ఆధారపడి జీవించమని కోరుచున్నారు.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు చూపిన కరుణ గురించి తెలుపుచున్నారు. శిష్యులకు కరుణ చూపించి యేసు ప్రభువు తన యొక్క సువార్త బాధ్యతలను అప్పజెప్పుచున్నారు. దేవుని యొక్క అనంత ప్రేమ, కరుణ, క్షమ గురించి తెలియజేయుటయే ప్రభువు శిష్యులకు అప్పజెప్పిన బాధ్యత .

యేసు ప్రభువు తన శిష్యులకు దేవుని యొక్క కరుణ కొనసాగించుటకు క్షమించే వరం చేస్తున్నారు. ఈ సువిశేషంలో ప్రభువు చాలా విషయాల గురించి బోధిస్తున్నారు. యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు దర్శనం ఇచ్చి వారిని బలపరుస్తున్నారు. ఎందుకు ప్రభువు వారిని బలపరుస్తున్నారంటే ఒక్కసారి మనం చూసిన దానిని, గ్రహించిన దానిని, విన్న దానిని గట్టిగా ప్రకటించగలం. పేతురు గారు అంటారు మా కనులారా చూసిన దానిని చెవులారా వినిన దాని గురించి ప్రకటించకుండా ఉండలేదు అని అ.పో. 4 : 20

శిష్యులు దేవున్ని గురించి తెలుసుకున్నారు కాబట్టియే తరువాత అంత గొప్పగా ప్రభువు గురించి ప్రకటించగలిగారు. యేసు ప్రభువు ఉత్తానమైన తరువాత ఇది ఎనిమిదవ రోజు అయితే శిష్య్లఅందరు కూడా భయంతో వున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు క్రీస్తే నాయకుడు అని అనుకున్నారు. ఆయన వారి వెన్నెముక అని, రాజు వారు భావించారు. వారందరి యొక్క ఆలోచనలకు బిన్నంగా క్రీస్తు ప్రభువు మరణించారు.

యుద్ధంలో రాజు చనిపోతే సాధారణంగా సైనికులకు భయ వేస్తుంది అదే విధంగా అప్పటివరకు ధైర్యంగా వున్నశిష్యులు క్రీస్తు మరణంగా ధైర్యంగా కోల్పోయారు. క్రీస్తే వారి ధైర్యం, క్రీస్తే వారి శక్తి, క్రీస్తే వారి నమ్మకం అన్నీ కోల్పోయిన సందర్బంలో ప్రభువు వారికి ధైర్యంనిస్తున్నారు. భయపడే వారికి దేవుడు ఎప్పుడూ ధైర్యంనిస్తున్నారు. అదేవిధంగా వారికి తోడుగా నిలబడుచున్నారు.

- మోషే ఫరో వద్దకు వెళ్ళుటకు భయపడ్డాడు

- యెషయా భయపడ్డాడు - 41 : 10

- యిర్మీయా భయపడ్డారు

- శిష్యులు భయపడ్డారు

వారందరికీ దేవుడు ధైర్యంనిస్తున్నారు, వారిని బలపరుస్తున్నారు.

యూదులు ఎప్పుడు ప్రాణహాని కలుగచేస్తారా అని భయాందోళనతో వున్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి వారందరు ఒకే చోట బిక్కి బిక్కి మంటు లోపల దాగుకొని ఉంటున్నారు. గురువును కోల్పోయిన భాధ, ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రభువు వారి యొక్క అవసరత గుర్తించి వారి యొక్క అలజడి మనస్సులను, జీవితాలను ప్రశాంతంగా ఉంచుటకై మొదటిగా వారికి కావలసిన శాంతిని ఒసగుతున్నారు.

మన జీవితంలో మొదటిగా దేవుని వరం ఏం కావాలో అది దేవుడు ఇస్తారు.

చేతులను ప్రభువు ప్రక్కకు చూపుచున్నారు. దీని ద్వారా దేవుడు తనను తాను శిష్యులకు ఎరుక పరచుకుంటున్నారు. గాయపడిన చేతులను అదే విధంగా మేకులుదించిన చేతులు చూసినప్పుడు వారి నమ్మకం ఇంకా ఎక్కువైంది. వారికి సంతోషంగా తిరిగివచ్చింది. కోల్పోయినది తిరిగి పొందారు. చేతులు పక్కకు చూపటం అనేది ఆహ్వానంకు కూడా గుర్తు శిష్యులను దేవుడు తన చెంతకు ఆహ్వానిస్తున్నారు అని ఆదం. భారముచే అలసిసొలసిన సమస్త జనులారా........ మత్తయి 11 : 28. తన చెంతకు శిష్యులను ఆహ్వానిస్తున్నారు.

యేసు ప్రభువు శిష్యులను వేద ప్రచారంకై పంపిస్తున్నారు. తండ్రి కుమారుని పంపినవిధంగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని అంటున్నారు 21 వ వచనంలో.

తండ్రి కుమారున్ని - రక్షించుటకు పంపారు

- ప్రేమించుటకు

- క్షమించుటకు

- సేవ చేయుటకు

- తండ్రి చిత్తమును తెలియజేయుటకు

- విధేయత చూపుటకు

- త్యాగ జీవితం జీవించుటకు

- నిస్వార్ధ సేవ చేయుటకు

తండ్రి, పవిత్రాత్మల జీవితమును తెలియజేయుటకు పంపిన విధంగా మిమ్మల్ని కూడా పంపిస్తున్నాను అని అంటున్నారు. ఆయన యొక్క శిష్యులుగా మనందరం కూడా క్రీస్తు ప్రభువు జీవించిన విధంగా జీవించాలి. వారిని పంపించేటప్పుడు యేసు ప్రభువు శ్వాసను ఊది పవిత్రాత్మను ఒసగుచున్నారు.

- దేవుడు ఆదాముకు శ్వాసను ఊది జీవమిచ్చారు (ఆది 2: 7)

- ఏలియా ప్రవక్త వితంతువు కుమారునికి దేవుని ప్రవచన శ్వాసను ఊది జీవం ఇచ్చారు (1 రాజు 17: 21 - 23)

- ఎండిన ఎముకలకు దైవవాక్కును ప్రకటించి జీవాన్ని ఇచ్చినట్లుగా (యెహెఙ్కేలు 37: 9 - 10) శిష్యులకు దేవుడు శ్వాసను ఊది జీవమిచ్చారు.

- శ్వాసనూదటం ద్వారా దేవుడు మరలా శిష్యులలో నూతన జీవం నింపుచున్నారు.

మొదటి తల్లిదండ్రులు పాపం చేయటం ద్వారా శాంతి సమాధానాలు నశించాయి. దేవునికి మానవునికి మధ్య బంధం తెగిపోయింది. దేవునికి దూరమయిన మానవున్ని క్రీస్తు ప్రభువు తండ్రి చెంతకు చేర్చుతున్నారు. మానవునిపై తన శ్వాసను ఊది నూతన సృష్టిని, నూతన మానవున్ని రూపొందిస్తున్నారు. ఆదిలో మానవుడు కోల్పోయిన శాంతిని ఇప్పుడు క్రీస్తు తన శిష్యులకు కలుగజేస్తున్నారు. ఈ శాంతి ఆ శిష్యులు ప్రజలందరికి అందజేయాలి.

శాంతిని ప్రతి ఒక్కరు కలిగివుండాలి కోరుకుంటాం. ప్రశాంతగా ఉండాలి, కోరుకుంటారు చాలామంది దేశాల మధ్య శాంతి కావాలనుకుంటాం రాష్ట్రాల మధ్య కుటుంబాల మధ్య మతాల మధ్య శాంతి కావాలనుకుంటాం. కాబట్టి మొట్ట మొదటిగా వ్యక్తి గతంగా మన శాంతియుతంగా ఉండాలి అప్పుడే అది ఇతరులకు అందజేయవచ్చు.

దేవుని యొక్క శాంతి, కరుణ తెలియజేయుట కోసమే శిష్యులకు ప్రభువు క్షమించే అధికారమును ఇస్తున్నారు. పాపం చేసిన వారి శాంతిగా జీవించలేదు అందుకే వారిని ఆ పాపబంధం నుండి విముక్తులను చేసి శాంతిగా జీవింపచేయుటకు వారికి దేవుడు పాపమన్నింపును దయచేస్తున్నారు. క్షమాపణ లేకుండా శాంతికి మనుగడలేదు.

యేసు ప్రభువు శిష్యులకు దర్శనం ఇచ్చిన సందర్భంలో తోమాసు గారు లేరు. ఆయన ప్రభువును చూస్తేగాని నమ్మను అనే అవిశ్వాసంలో వున్నాడు. తోమాసు గారు మొదటిలో అవిశ్వాసిగా ఉంటున్నారు. ఆయన జీవితం గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఒక ధైర్యవంతుడు అని తెలుస్తుంది ఎందుకంటే శిష్యులందరు భయపడి లోపల ఉంటే తోమాసు గారు మాత్రం బయట ధైర్యంగా వున్నాడు - యోహాను 11 : 16 .

మన గురువు భాధను తట్టుకోలేక ఒంటరిగా ధ్యానిస్తున్నారు. దేవుడిని వ్యక్తి గతంగా చూడాలనుకున్నాడు. వక్తిగత అనుభవం కావాలనుకున్నారు. తోమాసు గారు యేసు ప్రభువు చేతిలో వ్రేళ్ళు పెడితేనే నమ్మను అని అన్నారు కానీ అది చేయలేదు, ప్రభువుని విశ్వసించారు.

విశ్వసం వివిధరకాలుగా వస్తుంది:

- వినుట వలన విశ్వాసం కలుగుతుంది ( రోమా 10 : 17 )

- శిష్యులు ఖాళీ సమాధి చూసి విశ్వసించారు ( యెహాను 20 : 8 )

- యేసు ప్రభువు పిలిచినప్పుడు మరియ మగ్దలేనమ్మ విశ్వసించింది ( యోహాను 20 : 16 )

- శిష్యుల దర్శనం వల్ల విశ్వసించారు ( 20 వ వచనం)

- క్రీస్తును చూడటం వల్ల తోమాసు గారికి విశ్వాసం పెరిగింది (25 వ వచనం)

ఆయన సందేహాలను అధిగమించగలిగాడు క్రీస్తును తన దేవునిగా గుర్తించాడు. యేసు ప్రభువు సజీవునిగా లేచారని గుర్తించారు. యేసు ప్రభువే రక్షకుడని తెలుసుకున్నాడు. తోమాసు గారికి దేవుడు తన కరుణ తెలియజేశారు. తోమాసు గారు క్రీస్తు యొక్క అనుభూతి ద్వారా తాను సువార్త సేవకై వివిధ ప్రాంతాలకు వెళ్లుచున్నారు. ప్రభువు మనందరితో కూడా చూడక నమ్మేవారు ధన్యులని పిలుస్తున్నారు. కొన్ని సందర్భాలలో మనం ఆధారాలు వుంటేనే నమ్ముతాం. ఎంతమంది చెప్పిన తోమాగారు వినలేదు, చేతిలో వ్రేళ్లు పెడితేగాని ఆధారాలు వుంటేగాని నమ్మను అని అన్నారు. అయినా ప్రభువు వారికి దర్శనం ఇస్తున్నారు, ఆయన్ను కరుణిస్తున్నారు.

దేవుని కరుణ మన మీద వున్నట్లే మనం కూడా కరుణ, జాలి, దయ, ప్రేమ కలిగి జీవించాలి. దేవున్ని తెలుసుకొని జీవించాలి.

Fr. Balayesu OCD

9, ఏప్రిల్ 2023, ఆదివారం

Resurrection of the Lord

Resurrection of the Lord

Acts of the Apostles 10: 34,37-43

Colossians 3:1-4 or 1 Corinthians 5:6-8

John 20:1-9

Dear Brothers and Sisters, Resurrection is the greatest feast of our faith because our christian life is formed on the basis of Resurrection and our faith is deeply rooted and finds its meaning in the Resurrection. Resurrection is important because:

  1. Resurrection is the basis of our faith: because in the beginning the only teaching of Apostles was the Resurrection. That's why St. Paul says if Christ is not risen, our preaching and faith is in vain. The resurrection proves that Jesus is God. Jesus is the lord, he is risen.
  2. Resurrection is a victory
  • It is victory over death, because death could not contain Jesus, death has no authority over Jesus
  • It is a victory over Sins, because sins could not separate him from God the Father and washed away all the sins away through his blood and death.
  • It is a victory over satan, because through obedience Jesus defeated the satan tricks and the disobedience of man.
  1. Resurrection is a Fact : it is a historical and faith event. In the Gospel, we have proof of an empty tomb and the disciples’s experience as a sign of the Resurrection of Jesus. They saw, they understood and they believed. Until then, they failed to understand his words and the scriptures but now everything is clear to them.
  2. Resurrection is a moment of total change : In The first reading we see Peter proclaiming and sharing his individual relationship and experience of knowing Jesus. The disciples, who once feared, lied and scattered, suddenly became courageous and now filled with joy, with conviction began to bear witness to Jesus who died on the Cross and is now alive, risen from the dead. In the second Reading also, St. Paul who persecuted Christians had an experience of Risen Jesus, this experience brought about a total change in St. Paul’s life. It gave him a new life and a new mission. We see he becomes a great apostle using all his time and energy to share and help others to know, love and follow Jesus the Risen Lord. Resurrection filled them with Joy and Courage in their lives.
  3. Resurrection guarantees an everlasting hope and resurrection : Jesus defeated death and rose victoriously, and he already said I am the resurrection and the Life, this way Jesus assures us that all our worries, pains, sorrows and fears will vanish one day because we will also be resurrection to be in his presence.

Dear brothers and sisters, Mary Magdalene, the disciples, and St. Paul all have seen, understood, believed and began to proclaim that “I have seen the Lord”. This is what evangelisation is all about, sharing the experience of having seen the lord and inviting them to have the same experience. Today, we have a mission to share our joy of resurrection, the real presence of Jesus, to bring hope and encouragement to the world, to bring change and transformation in the lives of the people. And to prepare everyone teaching the path of Jesus for that day of our reunion with our almighty God.

Fr. Jayaraju Manthena OCD

6, ఏప్రిల్ 2023, గురువారం

 

ఏడవ పదం


"అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృస్యుడాయెను. మూడు గంటల వరకు దేశమంతటా చీకటి క్రమమును. దేవాలయపు తేరా నడిమికి చినిగెను. అపుడు యేసు బిగ్గరగా, "తండ్రీ! నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. అని పలికి ప్రాణము విడిచెను." (లూకా 23:44-46)

రక్షకుని వేదన మరియు బాధలు అంతం అవుతున్నాయి, అతను ఘోరమైన శారీరక, మానసిక బాధలను భరించాడు, అతను క్షమించమని ప్రార్థించాడు, స్వర్గపు గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాడు, మనకు తన స్వంత తల్లిని ఇచ్చాడు, మన ఆత్మల కోసం దాహంతో, తండ్రీ దేవుని ఎడబాటుని అనుభవించి, సమాప్తమైంది అని ప్రశాంతంగా ప్రకటించి, చివరకు, యేసు మహిమాన్వితంగా తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించారు. ఇది మనందరికీ ఉజ్వల భవిష్యత్తును తెరిచేందుకు  అద్భుతమైన మరియు ఆశీర్వాద క్షణం. ఇది త్రిత్వైక సర్వేశ్వరుని  ఐక్యత వైపు చూపుతుంది మరియు ఆ ఐక్యతలో మనము కూడా బాగస్తులం అనే ఆశను, అవకాశాన్ని తెలియచేస్తుంది.

 

దేవాలయపు తెర చినుగుట

ఈ సందర్భంలో దాని అర్థం మరియు ప్రాముఖ్యత ఏమిటి:

     క్రీస్తు యొక్క వెలుగు ద్వారా చీకటి శక్తులు ఓడిపోయాయి అని

     క్రీస్తు యొక్క విజయం ద్వారా మరణపు శక్తి ఓడిపోయింది అని

     క్రీస్తు యొక్క దైవత్వం ద్వారా దుష్ట శక్తులు ఓడిపోయాయి అని సూచిస్తుంది.

క్రీస్తు విమోచన ద్వారా దేవుడు మరియు ప్రజల మధ్య సంపూర్ణ మార్గం తెరవబడింది మరియు ఇది అన్ని దేశాల ప్రజలందరికీ దేవుని దయ ప్రవాహం ప్రసరిస్తుంది.

 

ఈ పదాలు కీర్తన 31:5 నుండి మెస్సయా గూర్చి ఉన్న ప్రవచనం, ఇది తండ్రికి ఆత్మవిశ్వాసంతో లొంగిపోవడాన్ని తెలియజేస్తుంది.

1. సంతోషకరమైన బాంధవ్యము

అన్నింటిలో మొదటిది, ఈ పదం తండ్రి అయిన దేవునితో గల  సంబంధం యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. పాపం మరియు బాధల బరువు కోసం యేసునీ  ఒక క్షణం విడిపోయినప్పటికీ, ఇప్పుడు ఆ సమయం ముగిసింది. తండ్రి ఎప్పుడూ తనతో ఉంటాడని యేసుకు తెలుసు. మన పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు మనకు ప్రత్యక్షంగా ఉన్నాడు. ఈ మాట ద్వారా యేసు వ్యక్తం చేసిన సంతోషం ఇదే.

2. విశ్వాసం మరియు నమ్మకం వ్యక్తపరిచే  పదం

రెండవది, "నేను అప్పగిస్తున్నాను" అని యేసు చెప్పినప్పుడు, ఎవరికైనా అప్పగించడం అంటే ఒకరి సంరక్షణ, రక్షణ మరియు శ్రేయస్సు మరొకరి చేతిలో ఉంచబడిందని సూచిస్తుంది. మరొక వ్యక్తిపై నమ్మకం ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి యేసు తన ఆత్మను అప్పగించడం ద్వారా తన తండ్రిపై తనకున్న నమ్మకాన్ని మరియు తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమాస్తాలకు  తన విధిని తెలియజేస్తాడు.

3. పునఃకలయిక(సమర్పణ, మరల కలుసుకొనుట)

చివరగా, యేసు త్రిత్వంలో భాగమైనప్పటికీ, శాశ్వతమైన  ప్రేమపూర్వక సంబంధాన్ని కలిగి ఉన్నపటికీ, అయితే అతను తనను తాను తగ్గించుకొని, తన మహిమను పక్కనపెట్టి మరియు తన చివరి శ్వాస వరకు కట్టుబడి, ఇప్పుడు తండ్రి చిత్తానికి పూర్తిగా కట్టుబడి మరియు నమ్మకంగా ఉండి, అతని చిత్తాన్ని పూర్తి చేసి, క్షమాపణ మరియు మోక్షాన్ని ప్రసాదించాడు. , యేసు తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించి నమ్మకంగా తన ప్రాణ త్యాగమర్పణ చేస్తున్నారు. దీని ద్వారా మరల ఆ త్రిత్వంలో ఏకమౌతున్నారు.

 

మన జీవిత సాయంకాలం:

యేసు ఈ మాటలను నమ్మకంగా ప్రార్థించడం ద్వారా మరియు తన జీవితపు చివరి ప్రకటనగా తండ్రి అయిన దేవునిపై వీరోచిత విశ్వాసానికి గొప్ప నమూనాగా మిగిలిపోయాడు.

మరణానికి మించిన జీవితం తండ్రితో ఉందని అతనికి తెలుసు, కాబట్టి తండ్రితో జీవితాన్ని స్వీకరించడానికి ఈ మానవ జీవితాన్ని వదిలివేద్దాం.

మరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ, యేసు స్వచ్ఛందంగా తన జీవితాన్ని విడిచిపెట్టాడు మరియు తండ్రితో సంబంధం కలిగి ఉన్న ఆనందాన్ని చూశాడు, తన ఆత్మను తండ్రికి అప్పగించాడు.

 

మనము యేసుతో ప్రార్థిద్దాం "తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను"

 

 

The Seventh Word

" It was now about the sixth hour, and darkness came over the whole land until the ninth hour,  for the sun stopped shining. And the curtain of the temple was torn in two.  Jesus called out with a loud voice, 'Father, into your hands I commit my spirit.' When he had said this, he breathed his last." (Luke 23:44-46)

 

The agony and the sufferings of the Savior are coming to and end, he has endured physical, emotional sufferings beyond one can bear, he prayed for forgiveness,  granted a great privilege of heaven, gave us His own Mother, thirsted for our souls, experienced even separation from God the Father, having calmly declared the fulfilment of the will and finally, Jesus gloriously bows his head and hands over His spirit to the Father. This was a glorious and blessed moment because it opened a bright future for all of us. This points towards the unity of the Trinity and calls for union with the Trinity as the Crucifixion renders Hope to all.

Temple Curtain Torn

What is the meaning and significance of it in this context:

     The power of darkness is defeated by Christ’s Light

     The power of death defeated by Christ’s Victory

     The power evil is defeated by Christ’s Divinity

An absolute pathway is opened between God and People through Christ’s redemption and also it signifies the outpouring of God’s mercy to all the people of all the nations.

 

These words are prophetic statements from  Psalm 31:5 which expresses the confident surrendering of oneself to the Father.

1. A Word of Joy of relationship

First of all the word expresses the joy of relationship with God the Father. Although Jesus for a moment experienced a separation for the weight of sin and suffering, now the time is over. Jesus knows that Father is always with him, no matter how the situation is, God is present to us.  This is the Joy expressed by Jesus through this word. 

2. A Word of Confidence and Trust

Secondly, when Jesus says “ I commend”, it means to entrust to someone signifies that the care, protection and well being of someone is kept in the hands of another. This can take place when there is trust in another person. So by commending His Spirit Jesus expresses His trust in his Father and his destiny to the Father's everlasting arms.

 

3. A Word of Surrender and Reunion

Finally, Jesus is part of the Trinity having a loving relationship for eternity however He humbled himself, set aside his glory and obeyed till his final breath and now having remained fully committed and faithful to Father’s will and completed His will,  granting forgiveness and salvation thus, Jesus dies confidently entrusting his spirit into the hands of his Father and is reuniting with the Father and The Spirit.  

At the evening of our life:

     Jesus by praying these words confidently and as a final declaration of his life remains a great model of heroic faith in God the Father.

     He is aware that there is life with the Father beyond death, so let’s go of this human life to embrace Life with Father.

     Even in the face of death, Jesus voluntarily relinquished his life and witnessed the joy of relating with Father, entrusting his spirit to the Father.

Let us pray with Jesus "Father, into your hands I commit my spirit"

 

 FR. JAYARAJU MANTHENA OCD

 

 

 

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...