28, జూన్ 2021, సోమవారం

పద మూడవ సామాన్య ఆదివారం


సో, జ్ఞాన 1 : 13  - 15 , 2 : 23  - 24 
2 కొరింతి ౮: 7 , 9 , 13  - 15 
మార్క్ 5  : 21  - 43

క్రీస్తునాదునియందు  ప్రియమైనటువంటి సహోదరి సహోదయులారా ఈ నాడు మనమందరం కూడా పదమూడోవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేచించియున్నాము, ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలను మనం ధ్యానించినట్లైతే ఇవి ముఖ్యముగా మానవునియొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన రెండు అంశాల గురించి మనకు తెలియజేస్తున్నాయి అవి ఏమిటంటే మరణము నుండి జీవమును మరియు అనారోగ్యం నుండి ఆరోగ్యము. ఈ రెండు అద్భుతాలు కూడా దేవుని యొక్క శక్తి ద్వారానే జరుగుతున్నటువంటివి మరియు అయన యొక్క హస్తం మనలను తాకటం ద్వారా ఈ యొక్క అద్భుతాల్ని మనం పొందుతున్నామని ఈ నాటి పఠనములు మనకు తెలియజేస్తున్నాయి.
ముందుగా మనం మరణము నుండి జీవమును చిసినట్లైతే మరణమనేది చనిపోయిన వ్యక్తిని తప్ప మగత అందరిని ఆడిపిస్తుంది కానీ జననం మాత్రం పుట్టిన వ్యక్తిని ఏడిపిస్తూ మిగతా అందరిని కూడా సంతోషపరుస్తుంది. ఎందుకంటే దేవుడు ఈ యొక్క లోకాని సృష్టించినప్పుడు అన్నిటిని కూడా సమానంగా సృష్టించియున్నాడు. అంతేకాక తాను సృష్టించిన దానిని అటువంటి స్వార్థం లేకుండా సృష్టించియున్నాడు. ఆలా సృష్టించడమే కాకుండా ఈ యొక్క సృష్టి కలకలం తన యొక్క ఆదీనంలో వుంచుకోవాలనుకున్నాడు కానీ దేవుడు సృస్టించనటువంటిది ఒకటి ఉంది అదే మరణము. ఈ యొక్క మరణం అనేది మనువుడు కొనితెచ్చుకున్నాడు.
మరణము
మరణం అనేది అవ్వ ద్వారా ఆదాముల పాపం ద్వారా ఈ యొక్క లోకానికి వచ్చింది, దేవుడు సృష్టించినపుడు మరణమనేది ఈ యొక్క లోకంలో లేదు, ఈ యొక్క మరణం ఎప్పుడు మానవులోకి వచ్చిందంటే మానవుడు ఎప్పుడైతే  దేవునికి వెతిరేకంగా తిరిగి పాపపు జీవితమును ఎంచుకున్నాడో అప్పుడే  మానవుల యొక్క జీవితంలోకి మరణమనే పదం సంభవించింది. ఈ యొక్క మరణం అనేది మానవుని యొక్క జీవితంలో చివరి గడియ అన్నమాట ఎందుకంటే మరణం అనేది నీటిపై ఉన్నటువంటి బుడగ వంటిది అది ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి తెలియదు అదే విధంగా మానవునియొక్క జీవితంలో కూడా మరణమనేది ఎప్పుడు సంభవిస్తుందో మానవునికి తెలియకుండానే వస్తుంది. 
ఈ యొక్క మరణం ఎక్కడ నుండి వచ్చిందని మనం గమనించినట్లయితే ఇది సాతాను యొక్క అసూయవల్ల అంటే కాకుండా దీనికి మూలకారకుడు ఆ సాతాని. ఈ యొక్క మారానని మనం మొదటి పఠనములో చిసినట్లైతే 1 : 13 వ వచనంలో దేవుడు మరణమును సృష్టించలేదు, ప్రాణులు చనిపోవుట చూసి అయన సంతసింపడు అని. ప్రియా దేవుని బిడ్డలారా మానవులు చనిపోవుట దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే తాను సృష్టించిన సృష్టిలో వినాశనకరమైనది అది లేదు. అంతేకాకుండా దేవుడు సృష్టించిన విధానాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆ ప్రాణి మరణించదు. ఎందుకంటే దేవుడు సృష్టించిన దానిని ఎల్లపుడు తన యొక్క అధీనములో ఉంచుకోవాలని అనుకున్నాడు అంటే కాకుండా భౌతిక మరణానికి దూరంగా ఉంది తన యొక్క నిత్యా జీవితములో జీవించాలని మానవులందరికీ కూడా తన యొక్క జీవమును ఇచ్చి వున్నాడు. కానీ మానవుడు మాత్రం దేవుని యొక్క ప్రణాలికను ప్రక్కన పెట్టి సాతాను యొక్క అడుగు జడలో నడిచాడు.
ఈ యొక్క పాపా జీవితం ఎక్కడ నుంచి వచ్చిందయ్యా అని మనం ధ్యానించినట్లైతే ఇది పాత నిబంధనలో అవ్వ అధములనుంచి వచ్చింది, ఆ యొక్క పాపమే ఇప్పటి వరకు కూడా మానవుని విడిచిపెట్టటం లేదు.
అసలు ఈ యొక్క మారానని ఎవరు తెచ్చారంటే సాతాను, సాతానుకు మరియు మారానని కి సంభందం ఏమిటి అని చుస్తే, దవుడు మరియు మానవులు ఏవిధంగానైతే సమానంగా జీవిస్తున్నారో అంటే కాకుండా మానవుడు దేవునికి అనుగుణంగా జీవిస్తున్నాడని చుసిన సాతాను, ఎలాగైనా దేవుని మరియు మానవుని వేరు చేయాలనుకున్న చేదు ఆలోచనతోటి పన్నాగం పొంది మానవుని ఈ యొక్క లోక ఆశలకు బానిసగా చేసి పాపని ఈ యొక్క లోకం లోనికి ప్రవేశపెటింది. ఈ యొక్క పాపం ద్వారా మానవుని దేవునికి దూరం చేసి ఈ యొక్క ఆత్యాద్మిక మరణానికి కారకుడయ్యాడు. 
ఈ విధంగా సాతాను చేసిన పనికి ఈ యొక్క లోకంలోని మానవ జాతికి ఆధ్యాత్మిక మరణం సంభవించి దేవుడు ఇచ్చినటువంటి నిత్యా జీవ భాగ్యాన్ని కోల్పోయారు. ఈ యొక్క ఆద్యద్మిక మరణం ఏమిటి అంటే మానవుడు తన స్వార్థం కొరకు తాను బాగుండాలన్న ఆలోచనతోటి ఇతరులను నాశనం చేసి పాపముల ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక మారానని కొని తెచ్చుకున్నాడు.
మరణం అనేది మూడు రకాలు 
1 ) మానవునికి మరణం తథ్యం 
2 ) మరణము పాప ఫలితమే 
3 ) ఆధ్యాత్మిక మరణము
జీవము 
దేవుడు సృష్టించినపుడు మానవుని, జంతువులను అన్నిటిని కూడా జీవముతోనే సృష్టించియున్నాడు, ఈ యొక్క జీవం ద్వారా మానవునికి అంతం లేదు.
మనము మొదటిపఠనములో చుసిన విధంగా మృత్యువును దేవుడు కలిగింపలేదు, సాతాను అసూయా వలన అది లోకం లోనికి ప్రవేశించియున్నది అని మనకు మొదటి పఠనము స్పష్టం చేస్తోంది. కానీ జీవం ప్రసాదించగల శక్తి యేసు ప్రభువుకు ఉందని సువార్త పఠనం తెలియజేస్తుంది.
మరణం తరవాత జీవం పొందినవారిని మన చూసినట్లయితే నూతన నిభందనలో నలుగురి వ్యక్తులు  ఉన్నారు వారు  ఎవరు అంటే   
1 ) యాయిరు కుమార్తె 
2 ) నాయిని విధవరాలి కుమారుడు 
3 ) లాజరు 
4 ) దొర్కా 
1 ) యాయిరు కుమార్తె :- యాయిరు అనే వ్యక్త్తి  ప్రార్థన మందిర అదేక్షుడు యేసు వద్దకు వచ్చి, యేసు పాదాలపైపడి మరణావస్థలో ఉన్నటువంటి తన కుమార్తెను స్వస్థత పరచడానికి తన ఇంటికి యేసును రమ్మని ప్రాధేయపడ్డాడు, తన యొక్క విశ్వాసాన్ని చూసినటువంటి యేసు తన యొక్క ఇంటికి వెళ్లి బాలిక యొక్క గదిలోనికి ప్రవేశించి మరణించినటువంటి బాలికను చాయి పట్టుకొని "తలీతాకుమీ" అన్నారు, దాని అర్థం ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అర్తం. వెంటనే బాలిక లేచి తన పడకపైనుంచి దిగి తనకేమి జరగనట్లుగా వ్యవహరించింది. ఎందుకంటే లెమ్మంటా అనేది పునరుతనా జీవనానికి సమానం ఈ యొక్క జీవం అనేది యేసుక్రీస్తు యొక్క పునరుత్తానికి గుర్తు.
కాబ్బటి ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవులమైన మనమందరం కూడా విశ్వాసంతో జీవిస్తామో అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడని ఈ నటి పఠనములు మనకు తెలియజేస్తున్నాయి.
                                                                                                               - BR. JOHANNES

19, జూన్ 2021, శనివారం

12 వ సామాన్య ఆదివారం

 


యోబు: 38 : 1 , 8 - 11

2 కొరింతి 5 : 14 - 17

మార్క్ 4 : 35 – 41

 

క్రీస్తునాధునియందు ప్రియా సహోదరి సహోదులారా ఈనాడు మనమందరం 12 సామాన్య ఆదివారం లోనికి ప్రవేశించియున్నాము. నాటి మూడు దివ్య పఠనములను మనము ధ్యానించినట్లైతే, ఎవరైతే దేవుని యందు మరియు క్రీస్తుయందు విశ్వాసం ఉంచుతారో అటువంటివారికి ఎన్ని కష్టాలు, ఇబందులు, ఆటంకాలు వచ్చిన కూడా వారి యొక్క విశ్వాసమే వారిని రక్షిస్తుందని, మరియు దేవుడు వారికీ తోడుగా ఉంటాడని నాటి మూడు పఠనాలు తెలియజేస్తున్నాయి.

నాడు మనమందరం మన యొక్క జీవితాలను ఒక పడవ ప్రయాణంలాగా సాగించాలి ఎందుకంటే పడవ యొక్క ప్రయాణం ఒక తీరం వరకు కాదు, పడవ యొక్క ప్రయాణం అనేది అది దానియొక్క గమ్యాన్ని చేసుకునేంతవరకు, ఎందుకంటే ఎప్పుడైతే మన జీవితాలను యొక్క పడవ ప్రయాణంలాగా రెండు విషయాలను గమనించాలసింది మరియు చేయాలసింది.

1 . మనం చేప్పట్టిన దానిని కొనసాగించలేక చేతగానితనంగా తిరిగి మరల వెన్నకి రావటం.

2 . మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించి ఒక అంకిత భావంతో మరియు కష్టపడి మన యొక్క గమ్యాన్ని చేరుకోవటం.

ఇందుట్లో మూడో మార్గం అనేది లేదు ఎందుకంటే మూడో మార్గం ఉంది అంటే అది మనయొక్క వినాశనం యందుకంటే పడవ ఏవిధంగానైతే తన యొక్క గమ్యాన్ని చేరుకోలేక మరియు తిరిగి వెన్నక్కి రాలేక మార్గం మధ్యలో నశించి పోతుందో అదే విధంగా మన యొక్క జీవితం కూడా అదే విధంగా జరుగుతుంది.

మానవుని యొక్క జీవితం నీటిలో ఉన్నటువంటి పడవవంటిది, ఇక్కడ మనకు జీవితం అనగానే గుర్తుకు రావలసింది ఏమిటంటే జీవితం అనేది ఒక అద్భుతం. జీవితం అనేది సాగుతూ ఉండాలి తప్ప ఒక్క సరిగా ఆగిపోకూడదు, ఒక్క సరి ఆగిందా అంతటితో మన జీవితం నీటిలో కూలిపోయినటువంటి పడవ వంటిది.

ఒక్కసారి మనం జీవితాన్ని సాగించినాము అది ఇలాగె సాగాలి తప్ప, ఓటమి వచ్చిందని బాధపడకుండా ఓడిపోయిన పర్వాలేదు కానీ అయొక్క ఓటమితో మనయొక్క జీవితం ముగిసిపోకూడదు.

అందుకే ఈనాటి మొదటి పఠనము మనకు తెలియజేస్తుంది (యోబు 38 : 10) లో చూస్తున్నాము, దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే సముద్రము గీత దాటాడు, అయన ఆజ్ఞతోనే గర్జించు సముద్రం కూడా శాంతించును అని (మార్క్ 5 : 39) లో చూస్తున్నాము. ఏవిధంగానైతే ఆకాశంలో ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు పిల్లలు బయపడి తమ తండ్రి లేదా తల్లి దగ్గరకు పరుగెట్టుకొని వస్తారో, అదేవిధంగా ఈనాటి సువిశేష పఠనంలో (మార్క్ 5 : 38) లో శిస్యులు తుఫానును చూసి ప్రాణ భయంతో భయపడుతూ యేసు వద్దకు పరుగెట్టుకొని వచ్చి మేము చనిపోవుచున్నాము అని చెప్పినపుడు.

యేసు ప్రభు లేచి గాలిని శాంతింపుము అన్ని సముద్రంతో చెప్పినపుడు అది శాంతించింది, అప్పుడు ప్రభు వారితో ఇట్లు అనుచున్నాడు మీరింత భయపడితీరేలా? మీకు విశ్వాసం లేదా? అన్నదానిని మనం గమనించినట్లయితే శిష్యులు అల్ప విశ్వటంతో ఉన్నపుడు వారు తుఫాను గాలికి భయపడ్డారు. అంతే కాకుండా లోక రక్షకుడు వారితో ఉన్నాడని వారు, లోకాని తాను సృష్టించి తన ఆదీనంలో ఉంచుకున్నాడని, తన హస్తం వారిపై ఉన్నాడని తెసిలి కూడా, వారికీ వచ్చిన సమస్య గురించి వారు అందుకు ఆలోచించాలి మరియు భయపడాలి. దేవుడు మనతో ఉన్నపుడు మనం దేనికి కూడా బయపడకూడదని ఈనాటి నాలు మనకు తెలియజేస్తున్నాయి.

పూర్వ నిభందనములో చూసినట్లయితే విశ్వాసమునకు తండ్రి ఐనటువంటి అబ్రహం గారు. తన ప్రాణం కొరకై తన భార్య అయినటువంటి సారాను తన చెల్లి ని రాజుతో చెప్పి తన ప్రాణాలను కాపాడుకోవాలని అనుకున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహంతో ఉన్న కూడా తాను ఈయొక్క లోకానికి సమందించినటువంటి మానవునికి భయపడుతూ తనకుంటువంటి విశ్వాసాన్ని కోల్పోవడం మనం చూస్తున్నాము. కానీ తండ్రి దేవుడు మాత్రం అబ్రాహామును విడువలేదు. తనయొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా తిరిగి సారాను అబ్రాహామునకు అప్పగించటం మనం చూస్తున్నాము.   

అదే విధంగా ఈనాటి సువిశేష పఠనంలో చూస్తున్నాము శిష్యుల యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా వారికీ తిరిగి విశ్వాసాన్ని యేసు ప్రభు దయచేయటం మనం చూస్తున్నాము.

కాబట్టి మన యొక్క జీవితంలో మీ జరుగుతుందని మనం శిష్యుల వాలే  కంగారు పడకూడదు, ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క హస్తన్ని  మనతో ఉంచుతున్నారు, అందుకే (రొమాన్స్ 8 : 31) లో చూస్తున్నాము క్రీస్తు మనతో ఉండగా ఇంకెవరు మనకు వెతిరేకంగా నిలుస్తారని. మనమందరం కూడా భయంతో జీవించకుండా విశ్వాసంతో జీవించాలని ఈనాటి సువార్త పఠనంలో చూస్తున్నాము. క్రీస్తు నిద్రిస్తున్నకాని నిజానికి యేసు క్రీస్తుకు తెలియకుండా లోకంలో మీ జరగదు.

మనము అనేక సార్లు లోకంలో ఉన్నటువంటి అనేక ప్రాణులకూ కానీ, మనుషులకు గాని బయపడుతుంటాము, ముఖ్యంగా కొన్ని మన జీవితాలలో వస్తున్నటువంటి సందర్భాలలో ఈవన్నీ కూడా వచ్చేది మనతో దేవునిపై విశ్వాసం లేనందువల్లనే, ఎందుకంటే విశ్వాసంలేనిదే మనము మీ చేయలేము. ఎప్పుడైతే మనం విశ్వాసంతో జీవిస్తామో అప్పుడే మనకున్నటువంటి భయం అనేది తొలగిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా ఈనాడు మనమందరం కూడా అయొక్క దేవాతి దేవునికి మొరపెట్టుకుందాం మనలో గొప్ప విశ్వాసాన్ని దయచేయమని మరియు క్రీస్తుపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలని కోరుకుందాం.

   by .Br . JOHANNES

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...