12, నవంబర్ 2022, శనివారం

33 వ సామాన్య ఆదివారం

 33 వ సామాన్య ఆదివారం

     మలాకీ 4:1-2

      2 తెస్స

      లూకా 21 :5 -19 

ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క రెండవ రాకడను గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క రోజు దేవుని యొక్క మహిమాన్వితమైన రెండవ రాకడ గురించి కూడా ఈ దివ్య గ్రంథ పఠనాలు తెలుపుచున్నవి. అదేవిధంగా మన యొక్క జీవిత అంత్యకాలము గురించి కూడా బోధిస్తున్నాయి. ఈనాడు మనందరం కూడా ముఖ్యంగా ధ్యానించుకోవలసిన అంశములు ఏమిటంటే:

1. మరణం

2. తుది తీర్పు

3. పరలోకం

4. నరకం

ఎందుకంటే దివ్య పఠనాలు అంత్య  దినముల గురించి బోధిస్తున్నాయి. మన యొక్క మరణం తరువాత ఏమి అవుతుందో అనే  విషయాలు గురించి తెలుపుతున్నాయి.

ఈనాటి మొదటి పఠనంలో  మలాకీ ప్రవక్త రాబోతున్న దేవుని యొక్క రోజు గురించి తెలుపుచున్నారు. ప్రభు యొక్క రోజున దుర్మార్గులు శిక్షించబడతారు అని, అదే విధంగా దేవుని యెడల భయభక్తులు కలిగి నీతివంతమైన జీవితం జీవించేవారు రక్షించబడతారు అని ప్రవక్త తెలుపుచున్నారు. 

మలాకీ ప్రవక్త యొక్క పరిచర్య కాలంలో యూదా ప్రజలు అవినీతికరమైన జీవితంలో జీవించేవారు. చాలా సంవత్సరాలు బాబిలోనియ బానిసత్వంలో ఉన్నవారు అక్కడ ప్రజల యొక్క ఆచారాలను అక్రమ మార్గాలను అనుసరిస్తూ, అవినీతి కరమైన జీవితంను తిరిగి వచ్చిన తరువాత కూడా కొనసాగించేవారు. వారు మంచికి చెడుకు మధ్య ఎలాంటి భేదం లేకుండా జీవించేవారు, నైతిక విలువలు మరచిపోయారు, ప్రజలతో పాటు యాజకులు కూడా అదే విధమైన అవినీతి మార్గాలను అనుసరించేవారు, తప్పును ఖండించలేదు అందుకనే ప్రవక్త దేవుని యొక్క హెచ్చరికలను తెలుపుచున్నారు. వారి యొక్క అవిశ్వాసనీయతకును, అవినీతికిని అదే విధంగా అన్యులతో వివాహ బంధంకు దేవుని యొక్క శిక్ష వస్తుందని మలాకీ ప్రవక్త హెచ్చరించారు.

 కొంతమంది విశ్వాసహీనులు అన్ని విధాలుగా ఎదుగుతుంటే, సుఖసంతోషాలు అనుభవిస్తుంటే, కొంతమంది విశ్వాసులు మాత్రము వారి యొక్క మంచి జీవితంకు ప్రతిఫలంగా కష్టాలు అనుభవిస్తూ జీవించే సందర్భంలో యావే  దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా తెలుపుచున్నారు, దేవుని యొక్క రోజు వచ్చుచున్నది అప్పుడు ఆయన అవిశ్వాసులను శిక్షించి విశ్వాసులను రక్షిస్తారని పలికారు. ప్రభువు వచ్చే రోజుకు మనం సిద్ధంగా ఉండాలి ఆయనతో పాటు పరలోకం చేరుటకు మనం ఈ లోకంలో ఉండగానే మంచి జీవితం జీవించాలి. నీతిమంతులుగా మనం ఈ లోకంలో కొన్ని కష్టాలు బాధలు అనుభవించినప్పటికీని ప్రభువు యొక్క దినమున మనకు రక్షణ లభిస్తుంది. ప్రభు యొక్క దినము ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతినిత్యం సిద్ధంగా ఉండాలి.

దేవునికి విశ్వాస పాత్రులుగా జీవించే సమయంలో మనకు సహనం ఉండాలి, వినయం ఉండాలి, ప్రేమ ఉండాలి. గత వారం చదివిన మొదటి పఠనం  2 మక్క 7:1-2,9-14 ఒక తల్లి, ఏడుగురు సోదరులు, విశ్వాస పాత్రులుగా జీవించారు. దేవుని యెడల సహనం కలిగి జీవించారు మనం కూడా ఈ భూలోకంలో ఉన్నంతకాలం వరకు మంచినీ చేస్తూ, పాటిస్తూ జీవించాలి. అవినీతి లేకుండా నీతితో జీవించాలి. దేవుని యొక్క ఆజ్ఞలకు బద్ధులై జీవించాలి.

గర్వంతోను పాపంలోనూ నైతిక విలువలు లేకుండా జీవించే వారికి దేవుని శిక్ష వస్తుందని మలాకీ ప్రవక్త పలికారు. ఆ శిక్ష ఎంత కఠినంగా క్రూరంగా ఉంటుంది అని ప్రభువు తెలుపుచున్నారు ప్రవక్త ద్వారా. సమస్తమును దేవుడు చూస్తారు కాబట్టి ఆయన వచ్చు రోజున దృష్టులకు  దేవుని నుండి శిక్ష, మంచి వారికి దేవుని నుండి రక్షణ వస్తుంది.

మంచిని, చెడును, పాపమును, పుణ్యమును, విశ్వాసమును, అవిశ్వాసమును అనుసరించుట అన్ని మన మీదనే ఆధారపడి ఉన్నాయి, కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు మనందరం ఒక మంచి జీవితం జీవించాలి.

ఈనాటి రెండవ పఠనములో  పౌలు గారు అందరిని పరిచేసే వారిగా ఉండమని తెలుపుచున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ జీవించాలి అని పౌలు గారు పలికారు. దేవుని యొక్క రెండవ రాకడ జరుగును కాబట్టి అందరూ ప్రభువునికోసం  పనిచేస్తూ ఆయన యొక్క రాకడకు సంసిద్ధత కలిగి జీవించాలి. కొందరు ప్రభువు యొక్క రాకడ త్వరలో వస్తుందని ఏ పని చేయకుండా ఉన్న సందర్భంలో పౌలు గారు తెస్సలోనియ  ప్రజలను కష్టపడి పని చేయమని పలుకుచున్నారు.

పనిచేయని వాడు భోజనమునకు అనర్హుడు అని పౌలు గారు తెలుపుచున్నారు. సృష్టి ప్రారంభంలోనే దేవుడు ఆదామును పనిచేయుటకు ఏదోను తోటలో ఉంచారు - ఆది 2-15.

అదేవిధంగా ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న వారిని తన తోటలో పనిచేయుటకు యేసు ప్రభువు కొందరిని పంపిస్తున్నారు - మత్తయి 20:1-16.

ఎవరైతే పనిచేయకుండా సోమరులుగా ఉంటున్నారో  దేవుడు వారిని శిక్షిస్తున్నారు - మత్తయి 25:26.

ప్రభువు మనందరినీ కూడా సృష్టించినది ఎందుకంటే ఆయన యొక్క రాజ్యం కొరకు పని చేయుటకు. కాబట్టి సోమరులుగా జీవించకుండా కష్టపడి పని చేస్తూ జీవిస్తూ ప్రభువు యొక్క రాకడ కోసం ఎదురు చూద్దాం.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు కూడా అంత్య  దినముల గురించి బోధిస్తున్నారు. సువిశేష మొదటి భాగంలో యేసు ప్రభువు యేరుషలేము దేవాలయం యొక్క పతనం గురించి బోధిస్తున్నారు. యూదులకు యేరుషలేము దేవాలయం చాలా ప్రత్యేకమైనది. యేరుషలేము  దేవాలయమును సొలోమోను రాజు క్రీస్తుపూర్వం 960 సంవత్సరంలో నిర్మించారు, దానిని బాబిలోనియులు 586 బిసి లో ధ్వంసం చేశారు, తరువాత జెరుబాబేలు మరియు ప్రవాసం  నుండి తిరిగి వచ్చిన యూదులు మరలా నిర్మించారు (536-516 BC).

మరలా యేరుషలేమును సుందరంగా హేరోదు మహారాజు నిర్మించారు (20 BC - AD 64) అంత సుందరంగా అలంకరించబడిన యేరుషలేము దేవాలయంను రోమియు 70 (AD) సంవత్సరంలో ధ్వంసం చేశారు.

ఎంతో గొప్ప దైవ యేరుషలేము సైతం ధ్వంసం చేయబడినది అదే విధంగా మన యొక్క జీవితం కు ఒక అంతము అనేది ఉంటుంది, కాబట్టి మన జీవితాలను దేవుని రాకడ కొరకు సంసిద్ధత కలిగి ఉండాలి. మన యొక్క జీవిత అంతం పరలోక జీవితం కు ప్రారంభం కావాలి.

ప్రతి ముగింపు కు ఒక నూతన ప్రారంభం అనేది ఉంటుంది, మనకు భూలోక జీవితం ముగిస్తేనే పరలోక జీవితం ప్రారంభం అవుతుంది. మనలో పాపము ముగిస్తేనే, పుణ్య జీవితం ప్రారంభం అవుతుంది. మనలో ద్వేషం అంతరిస్తేనే, ప్రేమ ప్రారంభమగుచున్నది. మనం ఈ లోకంలో మరణిస్తేనే పరలోకంలో జన్మిస్తం. అదే విధంగా మన చదువులు ముగిస్తే మనం ఉద్యోగం ప్రారంభిస్తాం. ఒక తల్లి యొక్క పురిటి నొప్పులు ముగిస్తేనే బిడ్డకు జన్మనిచ్చుట ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కటి చివరికి చేరుతుంది ముగించబడుతుంది కాబట్టి మనం ప్రతిదానికి సంసిద్ధత కలిగి ఉండాలి.

ఎప్పుడు ఏమి సంభవించును ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతి రోజు మనం సిద్ధంగా ఉండాలి. కాలం కాదు ముఖ్యం సూచనలు స్నేహాలు  కాదు ముఖ్యం మనం ప్రతిక్షణం ప్రభు యొక్క రాకడ కోసం సంసిద్ధత కలిగి ఉండాలి.

ప్రభువు చివరి ఘడియలు అని తెలుపుచున్నారు ఈ చివరి ఘడియలు బహుశా సైతాను  యొక్క చివరి ఘడియలు పాపం యొక్క చివరి గడియలు ఈ చివరి ఘడియలు ముగిస్తే దేవుని క్రొత్త గడియలు ప్రారంభమవుతాయి.

ఈ సువిశేష రెండో భాగంలో ప్రభువు సువార్త సేవ గురించి బోధిస్తున్నారు. సువార్త పరిచర్య చేసే సందర్భంలో అనేక రకాలైన కష్టాలు ఎదురవుతాయి యుద్దాలు సంభవిస్తాయి, అనేక రకాలైన హింసలు ప్రారంభమవుతాయి వీటన్నిటిని చూసి భయపడవలదు అని ప్రభువు తెలుపుచున్నారు. ప్రభు యొక్క పునరుద్దానం తరువాత అనేకమంది ప్రజలు సువార్త సేవకులు హింసించబడ్డారు. శ్రీ సభ ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రభువు యొక్క అనుచరులు సేవకులు అనేక రకమైన కష్టాలు శారీరక అంశలు అనుభవిస్తున్నారు అయినా కానీ వారు దేవుని కొరకు మరణించారు.

యేసుప్రభు అందరినీ కూడా సాక్షులుగా ఉండమని తెలుపుచున్నారు. ఎలాగా మనం దేవునికి సాక్షులుగా జీవించగలుగుతున్నాం.

1. మన యొక్క మంచి జీవితం ద్వారా ఆ ప్రభువునకు సాక్షులుగా జీవిస్తాం.

2. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుట ద్వారా.

3. దేవుని కొరకు ప్రాణత్యాగం చేయుట ద్వారా.

4. దేవుని యొక్క సువార్త పరిచర్య చేయుట ద్వారా.

5. దేవుని యొక్క ప్రేమను పంచుట ద్వారా

6. ఇతరులకు సహాయం చేయుట ద్వారా మనం ప్రభువుకు సాక్షులుగా జీవిస్తాం.

మన యొక్క కుటుంబ సభ్యులు కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు ఎందుకంటే ఒకరు యేసు ప్రభువు కొరకు జీవిస్తూ ఇంకొకరు అన్య దైవాల కొరకు జీవిస్తే అక్కడ విభేదాలు వస్తాయి.

అదేవిధంగా ఒకే కుటుంబంలో ఉన్నవారు సత్యం కొరకు జీవించినప్పుడు ఇంకొకరు అసత్యం కొరకు జీవించినప్పుడు కుటుంబాలలో విభేదాలు తలెత్తుతాయి.

ఏమి జరిగినా కానీ ప్రభువుకు సాక్షులుగా ఉండాలి మనందరం కూడా విశ్వాసంలో కృంగిపోకూడదు. కష్టాలు బాధలు వస్తాయి అయినప్పటికీని ప్రభువు మనతోనే ఉంటారు.

మన దేవుడు మనతో ఉండే దేవుడు అన్ని సమయాలలో మనతోనే ఉంటారు కాబట్టి విశ్వాసం కోల్పోకుండా దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి దేవునికి సాక్షులుగా ఉండాలి.

మన యొక్క విశ్వాస జీవితంలో సహనం కోల్పోకూడదు ఎందుకంటే సహనం సమస్తమును జయించును.

ప్రభువు రోజు కొరకు మనందరం సిద్ధంగా ఉండాలి దేవునికి సాక్షులుగా ఉండాలి.

FR. BALAYESU OCD

33వ సామాన్య ఆదివారం

 

33 సామాన్య ఆదివారం

మలాకీ 4: 1-2

 2 తెస్స 3: 7-12

 లూకా 21: 5-19


నీతిగల జీవితం మరియు దేవుని రాజ్యానికై కృషి

 

మొదటి పఠనం:

పండితుల అంచనాల ప్రకారం మలాకీ గ్రంథం క్రీ. పూ. 460 సంవత్సరంలో యిస్రాయేలు ప్రజలు బాబులోనియా ప్రజలు యెరూషలేము దగ్గరలో, చేరువలో ఉన్నప్పుడు లేదా బాబులోనియా ప్రవాసం నుంచి తిరిగి వస్తున్న సమయంలో వ్రాసారు అని చెప్పవచ్చు. యూదా ప్రజలు క్రీ. పూ. 460 - 450 సంవత్సరంలో బాబులోనియా ప్రవాసం నుండి యెరూషలేము తిరిగివచ్చి, నేలమట్టం చేసిన వారి దేవాలయాన్ని హగ్గయి ప్రవక్త మరియు జెకర్యా ప్రవక్తల సహాయంతో పునఃనిర్మిస్తారు. యూదా ప్రజలు తిరిగి వచ్చిన సమయానికి వారికి రాజులు, మరియు నాయకులు లేరు, కానీ ప్రధాన అర్చకులు లేదా యాజకుల పాలన ఉండేది. యూదా ప్రజలు యెరూషలేము తిరిగి వచ్చిన సమయానికి, వారికి ఆస్తిపాస్తులు లేవు, సంపదలు లేవు, తినడానికి తిండి కూడా లేదు. ఎందుకంటే బాబులోనియా రాజు అంతా నాశనం చేశాడు. యూదా ప్రజలు దేవాలయాన్ని నిర్మించినా కూడా పూర్వ వైభవాన్ని వారు పొందుకోలేదు. దేవుడు వారికి ఎలాంటి మేలులు చేయలేదు. ఎందుకంటే వారు బాబులోనియా ప్రవాసంలో ఉన్నప్పుడు వారందరు కూడా మలినమయ్యారు, అపవిత్రమయ్యారు, దైవత్వాన్ని కోల్పోయారు.

ఏవిధంగా అంటే అన్యులతో వివాహమాడి అపవిత్రులయ్యారు. ఎదోమీయులను, అరబ్బీయులను వివాహమాడి పవిత్రతను కోల్పోయారు. అందువలన, దేవుడు వారికి మేలులు చేయడం లేదు. కారణము చేత విశ్వాసము కోల్పోయిన యాజకులు మరియు ప్రజలు ఇక మేమెందుకు దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుడిని ఎందుకు ఆరాధించాలి, మా బాగోగులు మేము చూసుకుంటాము అని వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మలాకీ ప్రవక్త దేవుని వార్తగా వారితో విధంగా పలుకుతున్నారు.

గర్వాత్ములు, దుష్టులు గడ్డివలె కాలిపోవుదురు. కానీ దేవుని యెడల భయభక్తులు చూపువారిపై దేవుని రక్షణము ఉదయించే సూర్యునివలే ఉండును, ఆరోగ్యము కలుగును, మరియు పంటలు కూడా బాగా పండును. అని నాటి మొదటి పఠనంలో చూస్తున్నాం. అదేవిదంగ దేవుని ఆజ్ఞలను పాటిస్తే మనము జీవము బడయుదుమని , పాటించకపోతే నాశనం అవుతామని వచనాలలో చూస్తాం. (ద్వితీ 4: 1, 5: 32-33, సిరా 35: 16-18, 21-22).

అదేవిదంగ దేవుని ఆజ్ఞలను పాటించడమే నరుని ప్రధాన ధర్మం (ఉప 12: 13-14). మొదటి పఠనం ద్వారా మనం గ్రహించవలసినది,

Ø నీతిగల జీవితం లేదా ప్రభువుకు ప్రియమైన జీవితాన్ని జీవిస్తే ఆశీర్వదించబడతాము.

Ø అపవిత్ర జీవితాన్ని, అబద్ధపు జీవితాన్ని జీవిస్తే నాశనానికి గురి అవుతామని అర్ధమవుతుంది.

 

సువిశేష పఠనం:

కొందరు ప్రజలు మాత్రం దేవాలయపు రాళ్ళ అందాన్ని చూచి, దేవునికి అర్పించబడిన వస్తువుల అందాన్ని చూసి మిగుల సంతసించుచున్నారు. దేవాలయపు అందానికి ప్రాముఖ్యతనిస్తున్నారే కానీ అందులో ఉన్న దేవుడిని మాత్రం నిరాకరిస్తున్నారు. వారి హృదయాలు మాత్రం కపటముతో, క్రోధముతో నిండియున్నవి. మనం కూడా మనకు ఉన్న సంపదలను చూసి మురిసి పోతుంటాం. అందమైన కార్లు, ఫోన్, పెద్ద పెద్ద భవనాలే మనకు సర్వస్వము అనుకుంటుంటాం. నిజమైన విలువైన సంపద, శాశ్వత సంపద క్రీస్తు ప్రభువే అని మర్చిపోతుంటాం

ఈనాడు మనమందరం విలువైన సంపదను గుర్తించాలి, సంపద ద్వారా కలుగు ఫలములను ఆస్వాదించాలి. లోకంలో మంచి వారును, చెడువారును ఇద్దరూ ఉంటారు. ఉదా: పొలములో గోధుమలు చల్లినప్పుడు గోధుమలతో పాటు, పిచ్చి మొక్కలు కూడా వస్తాయి. కానీ రెండు పెరిగిన తరువాత కోతకాలపు రోజున గోధుమలను గిడ్డంగులలో వేసి, పిచ్చి మొక్కలను కాల్చివేసిన విధంగా ప్రభువు రాకడ కూడా అదేవిధంగా ఉండును. తీర్పు దినమున విధంగానే పుణ్యాత్ములను, పాపాత్ములను వేరు చేస్తారు. సువిశేష పఠనంలో చూస్తున్నాం అసహజమైనటువంటి విషయాలు. గొడవలు, హింసలు మరియు క్రూరమైన జీవితం కుటుంబంలో సంఘంలో ప్రతిచోటా, విధమైన జీవితం సువిశేష పఠనం తెలియజేస్తున్నది. కుటుంబాన్ని, సంఘాన్ని విభజించువారు మన మధ్యలోనే ఉంటారు, వస్తుంటారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అని పలుకుతున్నారు.

ఒకవేళ అలాంటి వారి మాటలు విని, మీరు మీ సమయాన్ని విశ్వాసాన్ని కోల్పోతే దేవుని రక్షణ మీరు పొందుకోలేరు, అంతే కాకుండా దేవుని పట్ల సహనాన్ని కోల్పోతే ప్రాణాలు కోల్పోతారు అని సువిశేషం మనకు తెలియజేస్తుంది.

సువిశేషం ద్వారా మనం గ్రహించవలసిన విషయాలు:

Ø లోకపు బాహ్యపరమైన అందాలకు, విషయాలకు మనం ప్రాధాన్యత ఇవ్వకుండా హృదయమనే ఆలయంలో నివసించే దేవుడికి, దేవుని కుమారునికి మనమందరం ప్రాధాన్యత ఇవ్వాలి.

Ø మరియు కుటుంబము, సంఘమును విభజించే వారు మనతోనే ఉంటారు, కాబట్టి వివేకముతో, సహనము కలిగి జీవించమని సువిశేషం కోరుతున్నది.

రెండవ పఠనము :

పునీత పౌలు గారు తెస్సలొనిక ప్రజలకు సోమరి పోతులుగా జీవించకుండా, ప్రభువు రాజ్యం కొరకు కృషిచేయమని, కష్టపడమని తెలియజేస్తున్నారు. ఏవిధంగా అంటే పౌలు గారి జీవితమునే ఉదాహరణగా చూపిస్తున్నారు. పౌలు గారు చేసిన కృషి, త్యాగముల వలనే క్రైస్తవ జీవితం లేదా క్రీస్తు ప్రభుని చాలా వరకు చాటి చెప్పారు.

అలా దేవుడి రాజ్యాన్ని వ్యాపింపచేసిన వారికి, ఆరాజ్యం కోసం కృషి చేసే వారికి మాత్రమే దేవుని రాజ్యంలో చోటు దక్కుతుందని తెలుపుచున్నారు.

పని చేయని వాడు భోజనానికి అనర్హుడు” అంటే పరలోక భోజనం అని అర్ధం.

కాబట్టి రెండవ పఠనం ద్వారా మనం గ్రహించ వలసిన విషయం ఏమిటంటే సోమరి పోతులుగా ఉండకుండా దేవుని రాజ్యానికి కృషి చేయమని తెలుపుచున్నది.

మనలో కూడా మంచిగా, నీతిగా జీవించే వారు ఉంటారు. అలాంటివారు విశ్వాసాన్ని సహనాన్ని కోల్పోవద్దు. మనలోకూడా సోమరిపోతులవలె, నిర్లక్ష్యపు జీవితాన్ని జీవించేవారు ఉంటారు. అలాంటివారు మారుమనస్సు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని యొక్క శిక్షకు గురికాకూడదు.

చివరిగా మూడు పఠనాల ద్వారా తల్లి తిరుసభ మనందరినికూడా నీతిగల జీవితాన్ని జీవించమని మరియు దేవుని పట్ల సహనంతో, భయభక్తులు చూపుతూ జీవించమని, దేవుని రాజ్యానికై కృషి చేయమని కోరుకుంటుంది.

 

బ్రదర్ . సుభాష్ OCD

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...