పు. చిన్నతెరేసమ్మగారు
1.జీవితం
పు.
చిన్న తెరేసమ్మ
గారు యూరోపు
కాండమునందుగల ఫ్రాన్సు
దేశము నందు
ఆలెన్స్లో నగరంలో
జన్మించారు. ఈమె
అలెన్సోలో జన్మించింది
కానీ లిస్యునగరంలోనే
ఎక్కువకాలం ఉన్నారు.
అందుకే ఈమెను
లిసియు నగరి
తెరెసా అని
అంటారు.
తల్లి
దండ్రులు:
లూయిస్
మార్టిన్ 1823 ఆగష్టు
22న బోర్డియు
అనే పట్టణములో
జన్మించాడు. ఈయన
ఫ్రాన్సు దేశములో
ఉన్నత అధికారి
కుటుంబానికి చెందినటువంటివాడు.1850
లో అలెన్సో నగరం
చేరి ఇల్లు
కట్టుకొని గడియారం
వృత్తిని ప్రారంభించాడు.
తల్లి: సెలిగ్వేరిన్
1831 డిసెంబర్
23 జన్మించారు. ఈమె
కూడా మిలిటరీ
పరిసరాలలో పుట్టిపెరిగిన స్త్రీయే.
ఈమె
కుట్టు అల్లిక పనిలో
ఎంతో నైపుణ్యం
కలిగిన వ్యక్తి.
దానితో లేసులు
తాయారు చేసే
వృత్తిని చేపట్టారు.
అయితే పనిలో
వీరు ఎదురుపడినపుడు
ఒకరినొకరో చూసారు.
వారి నాలుగు కల్లు
క్షణాల్లో కలిసిపోయాయి.
ప్రేమలో
పడ్డారు. సెలి
యే ఆయనకు
భార్య అని
నిశ్చయించుకొని మూడు
నెలలు తిరగకుండానే
వివాహం నిశ్చయించుకున్నారు.
జులై
13 ,1858 లో వివాహం
అలెన్సోలో జరిగింది.
అప్పుడు సెలి
వయసు 27, మార్టిన్
వయసు 35. 1873 జనవరి
2 వ తేదీన
తెరెసా తొమ్మిదవ
పుత్రికగా జన్మించింది.
జన్మించిన రెండు
వారాలకే కష్టాలను
అనుభవించాల్సి వచ్చింది. బాల్యం
లోనే నలుగురు
పిల్లలను కోల్పోయిన
జ్ఞాపకాలను
గుర్తుచేసుకొని కనీసం
ఈమెనైనా రక్షించు
కోవాలనే తపనతో.తెరిసా ను
పెంపుడు తల్లికి
అప్పగించింది.రెండు
నెలల తరువాత
మరల ఆమెను
అలెన్సో కి
తీసుకొని వచ్చింది.
అక్కడ తన
తల్లితో మరియు
తన అక్కలతో
సంతోషంగా జీవించింది.
1877 లో
ఆమె తల్లి
మరణించింది. తరువాత
నవంబర్ 16 న
అక్కడినుండి వేరే ప్రాంతానికి
వెళ్లారు. 1881 అక్టోబర్
3 న బెనెడిక్టైన్
పాఠశాలకు వెళ్ళింది. 1883
పవిత్రాత్మ పండుగ
రోజున మరియమాత
మధ్యస్థ ప్రార్థన
ద్వారా స్వస్థత
పొందింది.
1888 ఏప్రిల్
తొమ్మిదవ తేదీన
ఆమె పదిహేను సంవత్సరాల
ప్రాయములో కార్మెల్
మఠవాసంలో చేరింది.
1890 సెప్టెంబర్
8 న ప్రధమ
మాటపట్టు స్వీకరించి,
పదహారు రోజుల
తరువాత ముసుగును
తీసుకున్నది. 1893 లో
నోవిసులకు తర్ఫీదునిచ్చుటకు
అర్హురాలయింది. 1894
జులై 29 న
తండ్రి మరణించాడు. 1897
జులై 8 న
తెరెసా అస్వస్థతకు
గురైనది.
1897 సెప్టెంబర్
30 న 7:30 నిమిషాలకు
గురువారం నా
ప్రభువా! నేను
నిన్ను ప్రేమిస్తున్నాను,
అని తన
పెదాలపై చక్కని
చిరునవ్వుతో మరణించింది. కార్మెల్
ఆచారం ప్రకారం
శుక్రవారం నుంచి
అధివారంవరకు ఆమెను
గదిలో వుంచారు.అక్టోబర్
4 న లిస్యు
నగర సమాధుల
స్థలంలో వుంచారు.
"నేను చనిపోవడం
లేదు. మరో
జీవితంలోకి ప్రవేశిస్తున్నాను.
మరణం తరువాత
రాబోవు ఈ
గొప్ప జీవితం
మొదలు కానుంది"
అని ఫ.బెల్లియర్
గారికి వ్రాసింది. 1923 ఏప్రిల్
29 న పదకొండవ
భక్తినాధ పోపు
గారు తెరిసాకు
ధన్యురాలుగా
ప్రకటించారు. 1925
మే 17 న
ఆమెను పునీతరాలుగా ప్రకటించారు.
1927 డిసెంబర్
1 న రెండవ
జాన్ పాల్
పోపు గారు
ఈమెను డాక్టర్
అఫ్ హి
చర్చి గా
ప్రకటించాడు.
2. ఆమె
రచనలు :
1. జీవిత
చరిత్ర 2. రెండువందల
ఉత్తరాలు వ్రాసింది.3.
ఏబది నాలుగు
పద్యాలు రచించింది. 4.
ఎనిమిది కధలు
వ్రాసింది. 5.
ఇరువదికొక్క ప్రార్ధనలు
రచించారు.
3
. తెరిసాకు కుటుంబంతో
వున్న అన్యోన్య సంబంధం:
తెరెసా యొక్క తల్లి దండ్రులు పిల్లలపై ఎంతో శ్రద్ధ చూపించేవారు.తన తల్లి నుంచి నష్టపోయిన మమతానురాగాలు ఏవిధంగానైనా నష్టపోరాదని వాంచిన్చేడిది. ఎందుకంటే తల్లి దండ్రుల పెంపకం పైనే బిడ్డలా వ్యక్తిత్వం, స్వభావాలు ఆధారపడి ఉంటాయి.
తెరెసా తొమ్మిదవ పుత్రికగా జన్మించి ఇంట్లో తల్లి దండ్రుల మరియు అక్కల యొక్క ప్రేమానురాగాలు ఎప్పుడు చవిచూస్తుండేది. తన తల్లికి తెరెసా ప్రాణంగామారింది. తెరెసాను అందరు దేవదూతల భావించేవారు. తెరెసా తన తల్లిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండెడిది కాదు. కానీ తన తల్లి మరణానంతరము ఆమెయొక్క భాద్యతలను తన అక్క అయినటువంటి పౌలిన్ స్వీకరించింది. తెరిసాకు ఇతరులతోకంటే తన కుటుంబంతో గడపడానికే ఇష్టపడేది. తన పెద్దక్క అన్ని పనులు చేసేది. ప్రార్ధన నేర్పించేవారు,
తల దువ్వే వారు, పాఠాలు నేర్పించేవారు. ఇలా ఆమె చిన్నమ్మ లాగానే ఉండేది. తన తండ్రి తెరెసాను మాత్రం ఒక రాణి లాగా చూసుకునేవాడు. ఎక్కువ సమయం ఆమెతోనే గడిపేవాడు. కానీ పౌలిన్ కార్మెల్ మఠానికి వెళ్తున్నప్పుడు తెరెసా ఎంతో ఏడ్చింది. ఆమె ఎడబాటును తట్టుకోలేక పోయింది. ఇలా తెరెసాకు తన కుటుంబముతోవున్న సంభంధం వివరించరానిది,
వర్ణించలేనిది.
4 .కార్మెల్ మఠములో చేరాలన్న తృష్ట:
తన అక్క పౌలిన్ కార్మెల్ లో చేరిన తరువాత ఈమె తొమ్మిది లేక పది సంవత్సరాల అమ్మాయి.పౌలిన్ చెప్పే మాటలను ఎంతోశ్రద్దగా విని చెవులు కోసుకునేది. పౌలిన్ మతాల ద్వారా కార్మెల్ జీవితం సర్వాంయేసుప్రభుని కొరకు అర్పించబడిన ఒక గొప్ప జీవితం అని తెలుసుకుంది. కానీ పౌలిన్ తెరెసాతో ఇది నీకు అసాధ్యం అని చెప్పి నపుడు ఆమెలోవున్న కోరిక ఎక్కువైనది.మే ఏడవ తేదీన మంచిపాపసంకీర్తనం చేసి దివ్యాసప్రసాదమును లోకొన్నది..దాని ఫలితంగా ఆమె మనసులో ప్రశాంతత నెలకొన్నది. అప్పటినుంచి కార్మెల్ మఠములో చేరాలని నినాయించుకుంది. అప్పుడు తెరెసావయసు 12 సంవత్సరములు మాత్రమే.
ఒకరోజు ఆదివారము దేవాలయమునకు వెళ్లినపుడు తెరెసా సిలువపై ఉన్న యేసుప్రభువుని చూసింది.ఆ కరుచున్న రక్తాన్ని పట్టుకునేవారులేరు.అప్పుడు ఆరక్తంతో ఎంతోమంది ఆత్మలను శుద్ధపరిచి,
రక్షించాలని గొప్ప వాంఛకలిగింది."నాకు దాహం వేస్తుంది"
అన్న యేసు యొక్క మాటలు ఆమెను కుదిపేశాయి.అనడు సమారియా స్త్రీ నే నాకు దాహం వేస్తుంది త్రాగుటకు నీరివ్వు అన్న మాటలు దేవుడు ఆమెతోఅన్నట్లు అనిపించింది. దీనితో కార్మెల్ లో చేరాలనే కోరిక మరింత పెరిగింది.1887
మే 29 సాయంత్రం తన తండ్రితో చెప్పినపుడు అతడు ఒప్పుకున్నాడు. కానీ తన మామ అయినటువంటి ఇసిడోర్ గ్వారిన్ ది తో చెబితే ఒప్పుకోలేదు.అప్పుడు తెరెసా గేస్తేమనే తోటలో యేసు ప్రభువు పడిన భాద పడింది. తరువాత ఆమె ప్రార్థన ఫలితం మరియు తన అక్క పౌలిన్ ప్రార్థన ఫలితం అతడు ఒప్పుకున్నాడు.తరువాత కార్మెల్ మఠానికి అధిపతియైన మఠాధిపతి దగ్గరకు వెళ్ళింది.అప్పుడు అతడు 21 సంవత్సరములు వచ్చువరకు చేరకూడదు అన్నాడు.కానీ నియమం ప్రకారం 16 సంవత్సరాలే.అదేవిధంగా అక్కా గురువు కూడా వ్యతిరేకమే.తండ్రి బ్రతిమాలినా ఒప్పుకోలేదు.తారు వాత ఆమె పోపు గారిని కలవాలని నిశ్చయించుకుంది.1887 లో 13 వ సింహరాయలు పోపుగారియొక్క స్వర్ణ జుబిలీకి వెళ్లి అక్కడ ఆయనను కలిసే టప్పుడు అతని ముందు మోకరించి పాదలకు నమస్కరించింది.తరువాత పోపుగారు తన చేతిని ఇస్తుంటే తెరెసా ఆచేతులను గట్టిగ పట్టుకొని తనకోరిక విన్నవించింది. అప్పుడు అతను పీఠాధిపతులు చెప్పినది చెయ్యి అని చెప్పాడు.ఇతి లిస్యులో
"యూనివర్స్" అనే దిన పత్రికలో వార్త వచ్చింది. చివరిగా 1888 క్రిస్మస్ కు తొమ్మిది రోజుల ముందు మంచిగా ఉత్తరాన్ని తయారుచేసి పంపించింది.అందులో ఇలా వ్రాస్తుంది:
"తండ్రిగారా! నది చిన్నవయస్సే,
నిజమే, కానీ దేవుడు నన్ను పిలచుచున్నాడు".
క్రిస్టమస్ అయినా మూడురోజులతరువాత లెటర్ వచ్చింది.కానీ మదర్ ఘోన్సాగా గారు మూడు నెలల తరువాత అనుమతినిచ్చారు. ఎందుకంటే పౌలిన్తె ముందే ఆమెకు చెప్పింది. ఎందుకంటే ఆ మూడునెలలు తపస్సు కాలము ప్రారంభమవుతుంది.అప్పుడు ఉపవాసాలు తపో క్రియలు చేయాలి అందుకే ఇలా చేసారు. తెరెసా మాత్రం క్రిస్టమస్ కి ముందు కార్మెల్ లో చేరాలని కోరిక కానీ అనుమతి లేదు. ఇది తెలిసిన తెరెసా ఎంతో బాధపడింది. అయినాకానీ ఇంట్లోనే అన్ని తపోకర్యము చేసి ఈ మూడు నెలలు తనకు తాను శారీరకంగా,
మానసికంగా సంసిద్ధం చేసుకుంది. 4
. తెరిసాకు వున్నా రెండు లక్ష్యాలు:
5 .1. పాపాత్ములను రక్షించడం:
ఒకరోజు వార్త పత్రికలో ఒక జుగుప్సాకరమైన వార్త వచ్చింది. అది ప్రసిద్ధి గాంచిన హేన్రి ఫ్రాన్సిస్ గురించి. ఇతను ఎన్నో నరహత్యలు చేసాడు ఎందర్నో చీదరించాడు.1887
జులై 9 న అతని కేసు తెరిచినప్పుడు అఃడికి మరణ శిక్ష విధించారు.ఇతనికి దైవమంటే ఏమిటో తెలియదు.తెరెసా ఇతనికోసం ప్రార్ధించడం మొదలు పెట్టింది. ఇంకా తన అక్కలను ప్రార్ధన సహాయము అడిగినది. ఆమెయొక్కతపో క్రియలకు గాను, ప్రార్థనలకు గాను అతడు మరణించబోయే రోజు అక్కడ వున్న గురువుదగ్గర వున్న సిలువను తీసుకొని పశ్చాత్తాపంతో ముద్దుపెట్టుకొని మరణించాడు.ఇది తెలుసు కున్న తెరెసా ఎంతో సంతోషంన్ని పొందింది.."నాకు దాహం వేస్తుంది" అన్న యేసు యొక్క మాటలు ఆమెను కుదిపేశాయి.అనడు సమారియా స్త్రీ నే నాకు దాహం వేస్తుంది త్రాగుటకు నీరివ్వు అన్న మాటలు దేవుడు ఆమెతోఅన్నట్లు అనిపించింది.
5 .2.
గురువుల పుణ్య జీవితం కొరకు ప్రార్థించడం:
తెరెసా గురువులతో ఎంతో దగ్గరగా వుంది జీవించింది. వారి పనులు పూజలు చేయడం, పాపసంకీర్తనలను వినడం,గురుత్వ భాద్యతలను నిర్వర్తించడం. వీటన్నిటిని చూసి గురువులు నిజంగా దేవదూతలలాంటి వారు అని భావిం చింది. అవిలాపురి థెరెసామ్మగారు గురువులకొరకు ప్రార్ధించమంటే ఏంటో అర్థం కాలేదు.కానీ ఇప్పుడు ఆమెకు అర్ధం అయింది. ఆమె ఇలా వ్రాస్తుంది:"ఎందరో పుణ్యాత్ములైన గురువులతో కలిసి జీవించాను. వారి గురుత్వం వారిని దేవదూతలు మించిన స్థానానికి అధిరోహించిన, వారు ఎప్పటికి మానవులే.ఆ మానవ బలహీనతలు వారిని వీడవు". అంటే తెరెసా గురుబుల బలహీనతలను కూడా గమనించగలిగింది.అందుకే ఆమె జీవితాన్ని పాపాత్ములకోసమేకాక గురువుల పవిత్రతకు కూడా సమర్పించింది.
6. తెరిసాకు మరియమాతపై ఉన్న విశ్వాసం:
చిన్న తెరెసా యొక్క కుటుంబములో మరియ మాత పైన ఎంతో భక్తిని విశ్వసమును సాలిగివున్నారు. అందుకే వీరి పేర్లకు ముందు మరియ అని తప్పకుండ ఉండేలా చూసుకునేవారు. తెరెసా మే,13 ,1883 పవిత్రాత్మ పండుగ రోజున తెరెసా అనారోగ్యపు పాలయినది.నొప్పి తట్టుకోలేక మూలుగుతూ వుంది.అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మేరీ మాత స్వరూపము ముందు మోకరించి ప్రార్ధన చేస్తున్నప్పుడుతెరిసా కూడా తన చూపును ఆ స్వరూపం పైన లగ్నము చేసింది.వెంటనే మూలగడంతగ్గించిది. ఆమెలో గొప్ప అద్భుతం జరిగింది.ఆమెకు మేరీ మాత స్వరూపము ఎన్నడూ కనిపించనంతటి సౌందర్యముగా కనిపించింది.ఆలా ఆప్యాయముగా చూస్తుంది.పెదాలపై చిరునవ్వు ఉంది. ఆ చిరున్నవ్వు తెరెసాయొక్క హృదయాన్ని తాకింది.వెంటనే నెప్పులన్నీ పోయాయి. అప్పటి నుంచి మరియ మాత లాగా నీమాట చొప్పున నాకు జరుగును గాక అని తనను తాను సమర్పించుకున్నది.
7. తెరిసాకు దివ్య సప్రసాధనాదునిపై ఉన్న భక్తి:
తెరెసా తన జీవితములో దివ్యసప్రసాద నాధునికి ఎంతో ప్రాధాన్యత నిస్తుంది. తెరెసా
1884 మే 8 న దివ్య సప్రసాధనాదుని స్వీకరించింది. దీనికిగాను ఆమె ప్రతిరోజు ప్రార్ధనలు, తపో కార్యములు, ఉపవాసాలు చేస్తూ,తనను తాను సంసిద్ధత చేసుకునేది. దీని ద్వారా సప్రసాదముయొక్క ప్రాముఖ్యతను, దాని అంతరార్థమును తెలుసుకుంది. దీనికి గాను మూడు రోజులు వాడకంలో పాల్గొని, యేసు ప్రభువుని ఎంతత్వరగా స్వంతం చేసుకుందామని మే 7 వ తేదీన మంచి పాప సంకీర్తనము చేసి,తన మనసును ప్రశాంతముగా, స్వచ్ఛముగా మలచుకొని,ఆయనను స్వీకరించింది. తెరాసా ఇలా వ్రాస్తుంది: “యేసునాధుని మొదటి ముద్దు ఎంత మధుర మైనది! అది ఎంతో ప్రేమను ఇచ్చిన ముద్దు నేను ఎంతగానో ప్రేమింపబడినట్లు అనుభవించాను.అప్పుడు ఒకరినొకరు ముక్కా మూకీ చూసుకొని,ఇకనుండి మనం వేరు వేరు కాదు కానీ ఒక్కటే శరీరంలా మారారు”.తెరాసా సముద్రములో ఓ నేటి బిందువు వాలే దేవునిలో ఐక్యమైనది. ఆమె పు.పౌలు గారి వలె ఇకనుండి నేను కాదు , నాలో జీవించేది యేసువె అని భావించింది. ఈ భక్తి తన చిన్ననాటి నుండి తన తల్లి దండ్రులు,అక్కలనుండి అలవరచుకున్నది.తెరెసా 1888 ఏప్రిల్ 9 న కార్మెల్ లో చేరిన రోజు ముందుగా దివ్య సప్రసాదం ముందు మోకరించి పూర్తిగా సమర్పించి అయన కోసం జీవించింది. ఆమె ప్రతి రోజు గంటలతరబడి దివ్య సప్రసాద నాధునికి ప్రార్థన చేస్తుండేది.
8 .కార్మెల్ మఠములో తెరాసా ఎదుర్కొన్న వివిధ సవాళ్లు:
1888 ఏప్రిల్ 9 న తెరెసా కార్మెల్ కు వెళ్తున్న రోజున కుటుంబము బంధువులు కలిసి దివ్యభళీ పూజను సమర్పించి, విందు చేసారు. అంతముగిసినతరువాత అక్కడఉన్నటువంటి అందరిమూకలలో నీళ్లు తిరగడం ప్రారంభించాయి.అది చూసి తన దుఃఖం లోపలే దాచుకొని వారితో, నేను చనిపోవడానికి వెళ్తున్నానా ఏంటి? అని తనలో తాను అనుకొన్నది. వారందరికీ వీడ్కోలు పలుకుతూ కన్నీరు కారుస్తూ కౌగిలించుకుంది.తండ్రి దగ్గరకు వచ్చే సరికి కాళ్లపై పడి ఆశిర్వాదాన్ని కోరింది. తన ప్రియా చిన్నారిని దీవించు అని ప్రాధేయ పడినది. అప్పుడు మార్టిన్ ఆమెను కౌగిలించుకొని,తన కన్నీళ్లతో,ముఖానంతటిని తడిపి వేసింది.
కార్మెల్ లో చేరిన తరువాత తెరెసా ఎన్నో కష్టాలకు గురయ్యేది.ముందుగా చలి కాలములో గదిని వేడిచేయడానికి ఏమి ఉండేది కాదు. ఇక్కడి ఇళ్లల్లో వేడిచేసి మార్గం లేదు.దీని కారణముగా తెరెసా ఎన్నోసార్లు అ స్వస్థతకు గురైయ్యేది.
ఇంకా ఆమెను చూసి చిన్నపిల్లగా ప్రవర్తిస్తుంది అనుకొన్నారు కానీ ఆమె పెద్ద వారికి కలిగిన ఆలోచన నైపుణ్యత కలిగి ఉన్నవి.
పనుల విషయములో తెరెసా తన వయసుకు మించి చేసేది.ఆమెకు పనులల్లో కొంత సడలింపులు కలిగే అవకాశ ఉన్న కానీ ఆమె ఎప్పుడు అందరిలాగానే మంచిమనసు కలిగి వుంది. తన తండ్రి 65 వ సంవత్సరంలో ఆరోగ్యం క్షినించి పోవుటచే ఎంతో బాధపడుతూ ఉండేది. ఇది ఇలావుంటే మదర్ గోన్స్గా తరచు తెరిసాపై కఠినంగా ప్రవర్థించేది. ఆమెను ఛీదరించినవారిని కూడా ప్రేమించిన తెరెసమ్మ తెరెసామ్మ. ఇంకా ఒకసారి మదర్ గోన్సా గారు అనారోగ్యముతో బాధపడుచున్నప్పుడు,
తెరెసా మరియు మరియొక సిస్టర్ ఇద్దరు కలిసి తాళం చెవికోసం వెళ్తున్నప్పుడు అది వేరే సిస్టర్ చేతి నుండి పడినపుడు ఆ శబ్దానికి నిద్రిస్తున్నటువంటి మదర్ గారు లేచినపుడు ఆ సిస్టర్ తెరెసా మీదకు నెట్టినప్పుడు ఒక్క మాటకూడా అనకుండా ఆ నిందను ఒక మధురమైన చిరునవ్వుతో తనపైన వేసుకొన్నదే కానీ సమర్ధించలేదు.దీనివల్ల తెరెసా ఈ ప్రపంచాన్ని గెలిచినంత సంతోషపడినది. ఒక రోజు తన తోటి వారితో కలిసి బట్టలను బండకేసి బాదు చున్నప్పుడు, ఆ మురికి నీళ్లు చింది తెరెసా ముఖంపై బొట్లు బొట్లుగా పడుచున్నపుడు, ఆమె కోపపడకుండా, తుడుచుకోకుండా, మౌనం వహించింది. ఒక వేళా తుడిస్తే ఆమె ఏమైనా భాధపడుతుందా అని అలాగేవుంచి ఆ భాధను దేవునికి సమర్పించింది. దాని ద్వారా పాపులను నరకాగ్ని నుండి రక్షించమని వేడుకుంది. అప్పుడు ఆ మురికి నీళ్లు ముఖంపై ముత్యాలు వాలుచున్నట్లు అనిపించింది.ఆ సిస్టర్ ఉతికిన తరువాతే అక్కడినుండి వెడలిపోయింది.
ఎన్నోసారులు సిస్టర్ లు తెరిసాకు చద్దికూరలు వడ్డిస్తుండేవారు.అందుకు గాను తెరెసా ఎప్పుడు,మంచము పట్టేవారు. తుది మాటపట్టు ఎంతో ఘనంగా జరుగుతుందు.కానీ తెరిసాకు మాత్రంకన్నీరుతో నిండిపోయింది. ఒక వైపు తండ్రి రావలిసింది. కానీ అనారోగ్య రీత్యా మార్టిన్ రాలేక పోయాడు.ఇదొక భాద అయితేమరొకటి ఆమెకు కలిగింది.అదేమిటంటే,
రావలిసిన మఠాధిపతి అనారోగ్యం కారణంగా రాలేక పోయాడు. ఇది ఆమెను ఎంతగానో బాధపెట్టింది.ఇలా ఆమె జీవితములో ఎన్నో కష్టాలు, భాధలు వున్న,ఆమెమాత్రం పైకి చిరునవ్వులని కురిపిస్తూ, వారిని వారితప్పులను క్షమిస్తూ,ప్రార్ధన చేసేది.
9. పునీత. చిన్న తెరెసమ్మ గారు చేసిన వ్రత వాగ్దానములు:
1890 వ సంవత్సరము సెప్టెంబర్ లో సన్యాసం జీవిత వ్రత వాగ్దానములను (సన్యాసం జీవిత మాటపట్టు) స్వీకరించి పూర్తిగా కార్మెల్ సభ సభ్యురాలుగా మారే సమయం. అయితే అవి 1. కన్యత్వం 2. విధేయత.3. దారిద్రయం.
1.
కన్యత్వం:
కన్యత్వం నే ఈ వాగ్దానం ద్వారా తన శరీరాన్ని మరియు హృదయాన్ని సమర్పిస్తారు. అయితే తెరెసామ్మ గారు ఈ వ్రతాన్ని తీసుకునేటప్పుడు తన హృదయములో ప్రధమ స్థానం దేవునికే గాని, మరో వ్యక్తికి గాని,మరో వస్తువుకి గాని ఆ ప్రధమ స్థానాన్ని ఇవ్వను. ఎటువంటి మచ్చ లేకుండా నిర్మలమైన శరీరముతో,స్వచ్చమైన హృదయముతో నన్ను నేను దేవునికి,మరియు అయన సేవకి అంకితము చేసుకుంటాను. అని దృఢ నిశ్చయముతో ఈ వాగ్దానాన్ని చేసింది.
2.విధేయత:
ఈ విధేయత అను వాగ్దానము ద్వారా తన మనస్సుని దేవునిపైన లగ్నము చేసి, తన జీవితాంతము దేవునికి మరియు సభయొక్క నియమాలకు తలవొగ్గి జీవిస్తానని ప్రమాణము చేసింది. తెరెసామ్మ గారు కార్మెల్ లో అడుగేసినప్పటినుంచి తన సభలో ఉన్నటువంటి మతపెద్దలకు మరియు అందులో వుండే ప్రతివ్యక్తికి విధేయతచుపిస్తు తన జీవితము ద్వారా యేసుప్రభువు చూపిన విధేయతను వారికి కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఆమె జీవించినంతకాలము ఎవరికీ అవిధేయతను చూపలేదు. ప్రతిక్షణం విధేయత చూపిస్తూ జీవించింది.
3.దారిద్రయం:
ఈ వాగ్దానము ద్వారా నాకు దేవుడు ఉంటే చాలు.అయన నాకు స్వంతమయితే నాకు ఎట్టి కొరత ఉండదు అని చాటి చెప్పే దినం. అయితే దీనికి గాని ఆమె ఇంటిదగ్గరనుంచి వచ్చేటప్పుడు తన కిష్టమయిన వాటినన్నిటిని విడిచిపెట్టి వచ్చింది.అంతే కాదు మఠంలో ఎవరికయినా దుస్తులు అవసరముస్తే వెంటనే తన దగ్గర వున్న వస్త్రములను వెనుతిరిగి చూడకుండా ఇచ్చేది. అయితే ఈ వాగ్దానము ద్వారా తనను తాను పూర్తిగా దేవునికి చిన్నబిడ్డలాగా సమర్పించుకొని అయన అడుగు జడలలో నడిచింది.
ఈ మూడు వాగ్దానములు సన్యాసం జీవితానికి పునాదులు.ఇవి లేనిదే సన్యాసం జీవితం లేదు.
10. కార్మెల్ లో పు. చిన్న తెరెసామ్మ గారు చేసిన వివిధ సేవలు:
కార్మెల్ లో తెరెసా జీవితం అక్కడ వున్న సిస్టర్లకు ఎప్పుడు ఏదోఒక సేవ చేస్తూ గడిపింది. తన ఖాళీ సమయాన్ని ఎప్పుడు ఆమెకోసం ఆమె సంతోషం కోసం వినియోగించుకోలేదు కానీ ఎప్పుడు ఇతరులకు వెచ్చించేది. ఒక రోజు ఆ మఠములో సిస్టర్ కు సహాయం చేయడానికి ముందుకొచ్చింది. కానీ ఆ సిస్టర్ ఎప్పుడు తన దగ్గరకు వచ్చే వారిమీద చేదుగా చెబుతుండేది.అయినా కానీ ఆమెను భోజన శాలకు తీసుకొనిపోయి కుర్చిలో సరిగ్గా కూర్చోబెట్టి వచ్చింది. తరువాత ఆ సిస్టరుగారు చపాతీని తుంచుకోలేకపోతే అది గమనించి వెంటనే వెళ్లి చపాతీని ముక్కలు ముక్కలుగా చేసి ఆమెకందించింది. ఇలా ఎన్నోసార్లు ఎంతోమందికి విసుగుచెందకుండా సహాయం చేసింది. ఇతరుల బట్టలను తీసి ఇస్త్రీ చేసి వారికందించడము,
గిన్నెలుకడిగేసమయములో తోడుగావుండి,వారికి తోడ్పడటం, పూజా వస్త్రములను శుభ్రపరచడం లాంటి పనులు చేస్తుండేది. ఇలా ఎన్నోరకాలుగా ఎంతోమందికి విసుగు చెందకుండా సేవలందిస్తుండేది.
11. పు. చిన్న తెరేసమ్మకు కలిగిన వివిధ దర్శనములు:
తెరెసా మే,13 ,1883 పవిత్రాత్మ పండుగ రోజున తెరెసా అనారోగ్యపు పాలయినది.నొప్పి తట్టుకోలేక మూలుగుతూ వుంది.అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మేరీ మాత స్వరూపము ముందు మోకరించి ప్రార్ధన చేస్తున్నప్పుడుతెరిసా కూడా తన చూపును ఆ స్వరూపం పైన లగ్నము చేసింది.వెంటనే మూలగడంతగ్గించిది. ఆమెలో గొప్ప అద్భుతం జరిగింది.ఆమెకు మేరీ మాత స్వరూపము ఎన్నడూ కనిపించనంతటి సౌందర్యముగా కనిపించింది.ఆలా ఆప్యాయముగా చూస్తుంది.పెదాలపై చిరునవ్వు ఉంది. ఆ చిరున్నవ్వు తెరెసాయొక్క హృదయాన్ని తాకింది.వెంటనే నెప్పులన్నీ పోయాయి. అదేవిధంగా ఒక రోజు తెరెసా కార్మెల్ మఠములో తనకిచ్చినటువంటి గార్డెన్లో పనిచేస్తునపుడు,
తనకు ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు, అప్పుడు తెరెసా అతనిని పేరే అడిగినపుడు అతడు తిరిగి నీపేరు ఏమిటని అడిగినపుడు ఆమె అతనికి ఇలా జవాబిచ్చింది:"నేను బాలయేసుయొక్క చిన్న తెరెసా"
అని. అప్పుడు ఆబాలుడు
"నేను తెరెసా యొక్క బాలయేసును" అని అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆమెకు అర్ధం అయ్యింది,
అది ఎవరోకాదు సాక్షాత్తు బాలయేసువే అని. ఇంకొక సరి తెరెసా తన గదిలో తన గోడకువున్న యేసుప్రభువు పరిశుద్ధ ముఖమునకు ప్రార్ధన చేస్తుండగా అతడు తెరెసాతో మాట్లాడినట్లు తాను అద్భుతాన్ని చూసినట్లు తాను చెబుతుంది.
12. పు. చిన్న తెరేసమ్మ గారు బోధించిన ప్రవచనములు:
ఒకసారి అక్క అయినటువంటి పౌలిన్ తెరెసా చివరి రోజులలోమాట్లాడుచున్నపుడు,
తెరెసా ఆమెతో ఎలా అంటుంది:నా ప్రియుల చిన్న చిన్న కోర్కెలను తీర్చడం, మరియు ఇతర వరములను కురిపింప చేయక పోతే స్వర్గంలో నేనెలా సంతోషంగా ఉండగలను?అంతే గాక 'తప్పక తిరిగి వస్తా....
భూమిపైకి..."
అని ఎన్నో వాగ్దానాలు చేసింది. ఇంకా నా భాద్యత ఇప్పుడే మొదలవుతుంది.నేను ప్రేమించినట్లే,ఇతరులు కూడా దేవుని ప్రేమించునట్లు చేయడమే నా కర్తవ్యం.నా చిరు మార్గాన్ని చిన్నారి ఆత్మలకు బోధించాలి. ప్రభువు గనుక నా కోర్కెలను,నా అభిలాషలను మన్నిస్తే, ప్రపంచం అంతమయ్యే వరకూ నా స్వర్గాన్నంతా భూమిపైనే మంచిని చేయడానికి గడుపుతాను. ఇది నా తీవ్ర వాంఛ. ఇంకా ఆమెకు పునీతురాలు కావాలని, గురువుకావాలని, ఈలోకమంతా అపోస్తులుగా తిరిగి దేవుని రాజ్యం గురించి బోధించాలని, రక్త సాక్షులవలె దేర్యంగా విశ్వాసముగా జీవించాలని ఎప్పుడూ అంటుండేది.
13. పు. చిన్న తెరేసమ్మ గారి యొక్క చివరి క్షణములు:
1897 జూన్ నెలదాక బాగానే వుంది,కానీ జూన్ ఆరవ తేదీ నుంచి కష్టాలు మొదలయ్యాయి. తెరెసాయొక్క ఆరోగ్యం కొద్ధికొద్దిగా క్షీనించడం మొదలయ్యింది.నోటివెంట రక్తం ఆగలేదు,ఇంకా కొన్నిసార్లు ముక్కునుండికూడా కారడం ప్రారంభించింది. ఇలా జరుగుచున్నప్పుడు ఆమె యొక్క మరణం దగ్గర పడుచున్నదని ఎంతో సంతోషపడింది. పాపసంకీర్తనం చేసింది. అవస్ధ అభ్యంగనము కూడా ఇవ్వమని కోరింది. జులై 9 న ఆమె గది నుండి అనారోగ్యులకీ ఉండే గదిలోనికి వెళ్ళింది. అందరూ ఆమెపై జాలి పాడుచున్నా ఆమె మాత్రం సంతోషంగా చిరునవ్వు ముఖంతో ఉండేది. తన దగ్గరకు వచ్చినవారిని ఎప్పుడూ నవ్విస్తూఉండేది. ఇది చూసి వారు నివ్వెరపోయేవారు. దొంగవలె వచ్చు ఆ గడియ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుండేది. భాధలు అధికమవుచున్నాయి తలకూడా నొప్పితో బద్దలవుచున్న అనుభవం. అది సెప్టెంబర్ 29 బుధవారం. తెరెసా కష్టంగా గాలి పిలుస్తుంది.అందరి ఆశలు నశించాయి.ఆరోజు గురువు పాపా సంకీర్తనం విన్నాడు. అతడు ఎంతపరిశుద్దమైనదీ ఆత్మ! అనుగ్రహములతో పరిపూర్ణమైనది అన్నారు. తారు వాత ఇద్దరు అక్కలు ఈమెను విడనాడటం లేదు. మరుసటి దినం దివ్యపూజ చూసింది.సెప్టెంబర్ 30 మధ్యాహ్నము స్వయంయా ఎవరిసహాయం లేకుండా మంచం నుంచి లేచింది. నేను మరణించెను ఇప్పుడు బాగానే వున్నాను అనితన అక్కలకు చెప్పింది. తనరెండు చేతులను తన అక్కల చేతులలో ఉంచుతూ,"మన ప్రభువు సిలువపై మరణించింది ఎంతో వేదనతో అయినా ప్రేమ కొరకే అంతా భరించాడు. అదే ప్రేమ కొరకే మరణించాడు. నాది కూడా అదే అనుభవం"
అని పలికింది. సాయంత్రం 7:
30 ప్రాంతములో అంతిమ శ్వాస చిరునవ్వుతో నిండిన ముఖముతో ప్రశాంతముగా విడిచింది. మూడు రోజులు గుడిలోవుంచి,
అక్టోబర్ 4 వ తేదీన లిస్యూ నగర సమాధుల స్థలంలో భూస్థాపితం చేశారు.
14. పు. చిన్న తెరేసమ్మగారు చూపిన చిన్నారి బాట:
పు. చిన్న తెరేసమ్మ గారు ఈ లోకములో జీవించింది ఇరువది నాలుగు సంవత్సరాలే కానీ ఆమె జీవితము ఎంతో నిగూఢమైనది,
ఎంతో పవిత్రమైనది. ఆమె కనుగొనిన బాట “చిన్నారి బాట”. జీవించిన జీవితము వెలకట్టలేని జీవితము. ఆమె ప్రేమలేకుండా ఏపనీ చేయలేదు. ఆమె జీవించిన జీవితము దేవుని యొక్క ప్రేమకొరకే. ఆమె ప్రార్ధనలు పాపులను రక్షించడానికి, మరియు గురువుల పరిశుద్ధత కొరకు. ఆమె జీవితము ఎంతోమందికి ఆదర్శం. ఆమె చిరునవ్వులో ఏదో తెలియని రహస్యం ఉంది. ఆమె చేసిన ప్రతిఒక్క పనిలో ఏదోఒక త్యాగం తన ఇష్టాలన్నీ దేవునికి వదిలేసి దేవునియొక్క ఇష్టాలను ఆమె స్వీకరించింది. ఆమె సిస్టర్సు కు సహాయం చేసినా,
ఇతరుల తప్పులను క్షమించినా, తనను ద్వేషించిన వారిని చిరునవ్వుతో వారి హృదయాలను గెలిచినా అది కేవలము అది దేవుని యొక్క మహిమకొరకే చేసింది. పు. చిన్న తెరేసమ్మ గారు చూపిన ఈ చిరుమార్గం ఆమెలో ఉన్నటు వంటి అపారమైన ప్రేమ అనంత మైన విశ్వాసం, నమ్మిక, నిన్ను నన్ను ప్రతిఒక్కరిని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ఆమెకోరిక అందర్నీ పరలోకవారసులుగా మార్చాలన్నదే ఆమె యొక్క ధేయం. కనుక పు. చిన్నతెరేసమ్మ గారి వలె మనము కూడా జీవించుటకు ప్రయత్నిదాం. ఆమెన్.