30, అక్టోబర్ 2021, శనివారం

ముప్పది ఒకటవ సామాన్య ఆదివారము

 ముప్పది ఒకటవ సామాన్య ఆదివారము 

ద్వితి:6 :2 :6 , హెబ్రి:7 :23 -28 , మార్కు:12 :28 -34 

ఈనాటి దివ్య పఠనాలు  ఆజ్ఞల యొక్క అంతరంగాన్ని, మరియు వాటి అర్ధాన్ని గురిం చి
తెలియజేస్తున్నాయి. అదే దైవ ప్రేమ,మానవ ప్రేమ అని  బోధిస్తున్నాయి.దానితోపాటు
దేవునియొక్క ఆజ్ఞలను మనం పాటిస్తే కలిగే ప్రయోజనాలు గురించి కూడా ఈనాటి పఠనాలు తెలుపుచున్నాయి. మనం దేవుడి చేత సృష్టించ బడినది దేవుడిని ప్రేమించడానికి అదే విధంగా దైవప్రేమను పొరుగువారితో పాటించడానికి. దేవునియొక్క ప్రేమను పొందాలి అంటే ఆయనయొక్క ఆజ్ఞలను, చట్టాలను తూచా తప్పకుండా పాటిస్తూ, మన పొరుగు వారిని కూడా ప్రేమించాలని, దానిద్వారా దేవునియొక్క ప్రేమను మనం పొందుతామని తెలిజేస్తున్నాయి.

 మొదటి పఠనము :

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వాగ్ధాతభూమిలో ఆజ్ఞలను
పాటించమని తెలుపుచున్నారు.ఇశ్రాయేలుప్రజలు వాగ్ధత భూమిలో వ్యక్తిగతంగా,సామూహికంగా పాటించవలిసిన నియమాల గురించి దేవుడు మరొకసారి తెలియపరుస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునియొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే, వారు కలకాలం  బ్రతుకుతారని, అయన ఏర్పరిచిన  ప్రదేశమునకు చేర్చబడతారని ఉపదేశిస్తున్నాడు. లేకపోతే కలకాలం బానిసత్వంలో మ్రగ్గిపోయి, దేవుని ప్రేమకు దూరముగా వుంటారు. అందుకే దేవుడు వారిని సంరక్షణమైన మార్గములో నడిపించడానికి,నిత్యజీవితమును దయ చేయడానికి దేవుడు ఏర్పరిచిన గొప్ప మార్గం. మోషే ఉపోద్గాతం ఏమిటంటే, దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో,పూర్ణ మనసుతో,పూర్ణశక్తితో ప్రేమించాలి అని. ఎందుకంటే, దేవునియొక్క గొప్ప శక్తిని తన కళ్ళతో చూసి, విశ్వసించిన వ్యక్తి. ఈదేవుని ద్వారానే మనకు రక్షణ అని తెలుసుకొని ఆయనకోసమే జీవించినవ్యక్తి ఈ మోషేప్రవక్త.

ప్రభువుని ప్రేమించుటయే ధర్మశాస్త్రముయొక్క సారాంశము.మొదటి పఠనము రెండవ
వచనంలోమోషేప్రవక్త ఇశ్రాయేలీయులతో అంటున్నాడు:మీరు దేవునికి భయ పడుదురేని,
అయన ఆజ్ఞలు శిరసావహిస్తారు.మనలో దైవభయం ఉన్నప్పుడే మనం దేవుని  యొక్క ఆజ్ఞలను పాటిస్తాం. ఆ దైవభయం లేకపోతే మనకు ఇష్టంవచ్చినవిధంగాఉంటాం. ఆదాము, అవ్వ దైవభయం కోల్పోయారు. అందుకే దేవునియొక్క ఆజ్ఞలనుపాటించలేదు.దైవభీతిగలవారు,దేవుని ఆదేశాల ప్రకారం జీవించేవారు ఎల్లకాలము సుఖసంతోషాలతో జీవిస్తారు. మనందరం కూడా, దేవుని యొక్క మాటలు ఆలకించి  ఆయనయొక్క ఆజ్ఞలను పాటిస్తే,మనకు అన్నీ క్షేమమే అని ప్రభువు తెలుపుచున్నారు. ఎప్పుడైతే మనము దేవుని ప్రేమిస్తామో అప్పుడే అయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తాము.దేవునియొక్క ఆజ్ఞలను పాటిస్తే,దేవుడు వారిని పాలు తేనెలు జాలువారి నేలమీద బహుగా అభివృద్ధి చెందుతారని తెలుపుచున్నారు.

    దేవునియొక్క ఆజ్ఞలను పాటిస్తే కలుగు లాభాలు:

1. మనము దీవించబడతాము. ద్వితి:11 :26 -27 .
2. దేవుడిని ప్రేమించి, అయన ఆజ్ఞలను పాటిస్తే,1,000 తరములవరకు దీవెన, కరుణను
 పొందుతాం -నిర్గ:20 :6 .
3. దేవుని మాటలను/ ఆజ్ఞలు పాటిస్తే, దేవుడు మనతో వుంటారు. - యోహాను:14 :23 .
4. దేవునియొక్క సంరక్షణ పొందుతాం. - లేవి:25 : 18 .
5. దేవుడు మనయొక్క స్నేహితుడు అవుతాడు. - సామె:15 :14 .
6. దేవునియొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా 
     -మన జీవితములో సంతోషం కనుగొంటాము.
     - దేవుని చేత దీవించబడతాము.
     -సమాదానం దొరుకుతుంది.
     - దేవుడు మన ప్రార్ధన ఆలకిస్తారు.
     -శాశ్వతజీవమును పొందుకుంటాం.
     -దేవుని ప్రేమను పొందుకుంటాం, విజ్ఞానాన్ని పొందుతాం.
     - మన జీవితములో పరిపూర్ణతను పొందుకుంటాం.
     - దేవునియొక్క సాన్నిధ్యం అనుభవించవచ్చు.
    - దేవునియొక్క స్నేహితులుగా ఉండగలుగుతాం.

సువిశేష పఠనము:
ఈనాటి మొట్టమొదటి వచనాలలో మనం చూస్తే,ధర్మశాస్త్ర బోధకుడు యేసుప్రభువును
సమీపించి, ప్రధానమైన ఆజ్ఞను తెలుసుకుంటున్నారు.అయితే వివిధ ప్రదేశాలలో ఈ ధర్మశాస్త్ర బోధకులు దేవుని సమీపించేది యేసుప్రభువును ఇరకాటంలో పెట్టడానికే.కానీ ఈనాటి ధర్మశాస్త్ర బోధకుడు మాత్రం తన ప్రశ్నకు జవాబు తెలిసిన తరువాత సంతోషపడుచున్నాడు. ఇతనిలో ఎటువంటి కల్మషము లేకుండా దేవునియొక్క అభిప్రాయం తెలుసుకుంటున్నారు. ఇదే మంచి భోధకులయొక్క లక్షణం.  యేసు ప్రభువు అతనియొక్క దేర్యానికి మెచ్చుకొంటున్నాడేకాని కండించడంలేదు. అతనిపై ఎటువంటి పక్షపాతం చూపించడంలేదు.

 ఈలోకంలో  రెండురకాల  ప్రేమలు  ఉన్నాయి. అవి: 

 1. దేవుని ప్రేమ . 2. మానవ ప్రేమ .

     1. దేవుని ప్రేమ : 

       దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిలో ప్రేమ ఆజ్ఞ మొట్ట మొదటిది. ఈ ఆజ్ఞలయొక్క సారాంశము ఏంటి అంటే,దేవునియొక్క నిత్యరాజ్యములోనికి ప్రవేశింపచేయడానికే. ఆనాడు ఆదాము అవ్వల ద్వారా తెగిపోయిన బంధాన్ని ఈనాడు తిరిగి నిర్మించడానికి ఈ ప్రేమ ఆజ్ఞను మనందరికీ బహుమానంగా ఇస్తున్నాడు.  అయితే మనం ఎందుకు దేవుడిని ప్రేమించాలి? 

 ఎందుకంటే, దేవునియొక్క ప్రేమ ద్వారా మనందరమూ అయన పోలికలోనే  మనందరినీ
  సృష్టించాడు. అయన తోనే నివాసము ఏర్పరచుకునేందుకు, ఆయనతోకలిసి జీవించుటకు
 తరువాత మోక్షం పొందుటకు అయన మనలను సృష్టించాడు.   దేవుని ఆదరణ పొందాలన్నా,
 అయనయొక్క ఆశీర్వాదాలు అందుకోవాలన్నా,అయన ప్రసాదించే అంతిమ బహుమానం
 అందుకోవాలన్న,ఆయనయొక్క ప్రేమఆజ్ఞను పాటించాలి. ప్రభువు అంటారు; మీరు నన్నుప్రేమిస్తే ఆ ఆజ్ఞలు పాటిస్తారని (యోహాను:14 :15 ).
యెష :49: 15-16 లో  చూస్తే , “తల్లి  నిన్ను  మరచినను  నేనునిన్ను  మరువను . నీపేరును
  నా  అరచేతిలో  వ్రాసితిని  అని  అంటున్నాడు ”. అది  దేవునియొక్క ప్రేమ. యోహా : 3:16: “దేవుడు  ఈ  లోకమును  ఎంతో  ప్రేమించి తన  ఏకైక  కుమారుని  మనకు ప్రసాదించెను ”. ఎప్పుడయితే మనమందరం దేవుని దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ 
మనసుతో,పూర్ణశక్తితో ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మన జీవితములలో గొప్పకార్యాలు  చేస్తాడు. పుట్టు గ్రుడ్డివాడయిన భర్తీమాయికి స్వస్థపరిచాడు. మరణించిన లాజరును తిరిగి లేపాడు. పాపా కూపములో జీవిస్తున్న మనుషులను పుణ్యమార్గమునకు నడిపించాడు. ఇది దేవుని యొక్క ప్రేమ.

  2.మానవునియొక్క ప్రేమ:

           ఈలోకంలో మానవులు వివిధప్రేమలకొరకు ప్రాకులాడుచున్నారు. ధనము,
అధికారము,మరియు వివిధవస్తువులమీద ప్రేమ కోసం ఎన్నో తప్పులను చేస్తూ, మనలను
 ప్రేమిస్తున్నటవంటి దేవుని ప్రేమను మాత్రం తెలుసుకోలేక పోతున్నాము. అయితే దేవుడు ఎందుకు పొరుగు వారిపై ప్రేమ కలిగి జీవించాలి అని బోధించాడు అంటే, ఆది:1 :26 లో చూస్తే, "దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను". ఇందుకుగాను దేవుడు తన పొరుగువారికి ప్రేమించామన్నాడు. ఈలోకంలో జీవిస్తున్న ప్రతిఒక్క వ్యక్తి దేవుని పోలికలోనే సృజింపబడ్డాడు. ఎలా సృజింపబడిన ప్రతిఒక్క వ్యక్తితన పొరుగువారిలో దేవుని చూడాలని ఆ దేవాతి దేవుని కోరిక.పు. చిన్నతెరెసామ్మ గారి జీవితములో చూస్తే, ఆమె జీవించినాన్నాలు, తన పొరుగు వారిలో దేవుణ్ణి చూసింది. అందుకోసమే తన పొరుగువారి ప్రేమను తననుండి ఎప్పుడు కోల్పోలేదు.

పు. మదర్ తెరెసా గారు అనారోగ్యులలో, అనాధలలో, చిన్నారిబిడ్డలలో దేవుని చూసింది. దానిఫలితం ఆమెయొక్క జీవితాన్నిసహితం వారికి సమర్పించి దేవుడినుంచి, మానవులనుంచి గొప్ప మన్నను పొందింది.   

-దానియేలు దేవుడిని ప్రేమించాడు. కాబట్టే ఆయనకు విధేయుడై జీవించాడు. 
-యోసేపుగారు (పాత నిబంధన) దేవుడిని ప్రేమించారు,కాబట్టే, అయన మాటలను పాటించారు.
-యేసు ప్రభువుగారు తన తండ్రిని ప్రేమించారు,అందుకే అయన తన తండ్రి యొక్క మాటలు
 పాటించారు.
- మరియ తల్లి కూడా అదేవిధంగా చేశారు.
 మనజీవితములో కూడా దైవంమీద ప్రేమవుంటే, తప్పనిసరిగా ప్రేమిస్తాం, దేవుని ఆజ్ఞలు
 పాటిస్తాం. మన రక్షకుడయినా యేసుక్రీస్తు కూడా తన జీవితాన్ని సహితం తన తండ్రి
 చిత్తానుసారం ఈలోకంలోవున్న ప్రతిఒక్కరికోసం సమర్పించ బడినది. దాని మూలముననే
ఈనాడు మనమందరము ఆ రక్షణను మన జీవి తములో ఆనందిస్తున్నాము. 


  రెండవ పఠనం:

ఈనాటి రెండవ పఠనంలో, యేసుప్రభువు తన ప్రేమకు నిర్వచనంగా తనను తాను మనందరి 
కోసం శాశ్వత యాజకునిగా మనకోసం సమర్పించుకున్నాడు. కావుననే యేసు ప్రభువు నిత్యము జీవించే వాడినని   తెలుపు చున్నాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి మోషే చట్ట ప్రకారము కాక తన ప్రేమ అనే చట్టముతో ఒక్కసారే  మనందరికోసం బలిగా సమర్పించి, మరణించి, తిరిగి మూడవనాడు లేచి, ఉత్తానమయ్యి, ఈనాడు నీకు నాకు కాపరిగావుంటూ, మనలను తన ప్రేమమార్గములోనడిపిస్తూ, నిత్యజీవితముఅను బహుమతిని దయచేస్తున్నాడు.

ఈనాడు మనమందరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి.నిజముగా నువ్వు నేను మన పొరుగు వారుని ప్రేమిస్తున్నామా? లేదా?. ఒకవేళ ప్రేమిస్తే, దేవుడు నీతో అనే మాట: "నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నాతండ్రివలన ప్రేమింపబడును.నేను వానిని ప్రేమించి,వానికి నన్ను తెలియపరుచుకొందును" (యోహా:14 :21 ).

 కాబట్టి, ఈనాటి దివ్య బలిపూజలో ఆ దేవాతి దేవునికి ప్రార్ధన చేదాం. మనం ఆ దేవాతిదేవుడిని ఏవిధంగానయితే   ప్రేమిస్తున్నామో, అదేవిధముగా మన పొరుగువారికి కూడా ప్రేమించుటకు మనకు మంచి హృదయాన్ని దయ చేయమని ఒకరినొకరు అర్ధం చేసుకొని జీవించునట్లు చేయమని పశ్చాత్తాప హృదయముతో ప్రార్ధన చేదాం. ఆమెన్.

Rev. Fr. Bala Yesu OCD, Br. Mario 



24, అక్టోబర్ 2021, ఆదివారం

30 వ సామాన్య ఆదివారము(2)

30 వ సామాన్య ఆదివారము(2)

ఈ నాడు మూడు పఠనాలు దేవుని యొక్క రక్షణ మరియు నూతన జీవితం గురించి తెలియజేస్తున్నాయి. తండ్రి ఐన దేవుడు తన ప్రజల పట్ల చూపిన అపారమైన ప్రేమ, ఒక తండ్రికి తన పిల్లపై ఏ విధంగా ఉంటుందో, మరియు దేవున్ని దృఢమైన విశ్వాసంతో ప్రార్థిస్తే మనకు కలిగే రక్షణ మరియు నూతన జీవితం, అనే విషయాలను మనము ఈ నాడు తెలుసుకుంటాము.

మొదటి పఠనము ధ్యానించినట్లైతే బాబిలోను దేశ బానిసత్వంలో మగ్గుచున్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక తండ్రిగా లేక తండ్రివల్లే విమోచించబోతున్నాడు. మరల వారికీ పూర్వ వైభవం దయచేస్తానని యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. కేవలం బాబిలోనియ నుండి మాత్రమే కాదు ప్రపంచం మొత్తం చెల్లా చెదురైనా వారిని తమ సొంత దేశానికి తరలిస్తున్నాడు దేవుడు. నేల అంచుల నుండి వారిని కొనివత్తును, గ్రుడ్డివారు, కృంటివారు, గర్భవతులు, ప్రసవించుటకు సిద్ధముగా ఉన్నవారను ఎల్లరును కలిసి మహాసముద్రంగా కలిసి వత్తురు. 

కాబ్బటి సంతసముతో పాదుడు, స్తుతిగానము చేయుడు. ఎందుకంటే ప్రభు తన ప్రజలను రక్షించెను. యిర్మీయా 31: 9 వారు ఏడ్పులతోను, ప్రార్థనతోను తిరిగి వత్తురు, ఎప్పుడైతే నువ్వు ఈ విదంగాదేవుని యొద్దకు తిరిగి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడని తెలియజేస్తున్నాడు. మనము దేవుని దగ్గరకు తిరిగి వస్తే మనలను అయన సొంత బిడ్డలుగా మార్చుకుంటాడని చెబుతున్నాడు. ప్రియా స్నేహితులారా ఒక్క మాటలో చెప్పాలంటే నేటి మొదటి పఠనము ద్వారా దేవుని యొక్క ప్రేమ తన ప్రజలపై ఒక తండ్రి వాలే ఉంటుందని తెలియజేస్తున్నాడు.

సువిశేష పఠనములో

ద్రుష్టి ప్రదానం చేసే అద్భుతం సంఘటన దానిలో పరమార్థాన్ని చూస్తున్నాము. మొదటి పట్టణములో యావే ప్రభువు గ్రుడ్డి వారి పట్ల చూపిన ప్రేమను నెరవేర్చు ప్రవచనం. యేసు అయన శిస్యులు, గొప్ప జనసమూహముతో యెరికో పట్టణం దాటి పోతున్నారు. అంటే ఎసరుసలేము పట్టణానికి సమీపంలో ఉన్నారని అర్థం. 

బర్తిమయి అనే గ్రుడ్డి వాడు త్రోవ పక్కన కూర్చొని బిక్షమడుగుకుంటున్నాడు అటువంటి దౌర్భాగ్యులకు ఆ కాలంలో ఆ దేశంలో  గుర్తింపు లేదు.

ఆ వ్యక్తి అక్కడ జనం యొక్క అలజడి విని దానికి కారణం అడగ్గా "నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమున వస్తున్నాడని ఒక వ్యక్తి చెప్పాడు" అది విన్న వెంటనే గ్రుడ్డి వాడు, దావీదు కుమారా యేసు ప్రభువు నన్ను కరుణింపుము అని యేసును పిలవడం మొదలుపెట్టాడు. బిగ్గరాగా పిలిచాడు. అక్కడ మనం గమనిస్తే అతని కేకలకు, ఆర్తనాదాలకు ప్రజల యొక్క గదమాయింపు మనం చూస్తున్నాము. చుట్టూ ఉన్న ప్రజలు ఆయన్ను నోరు మూసుకొమ్మని కోపగించుకున్నారు. గ్రుడ్డి వానికి ఆటంకంగా ఉన్నారు కానీ బర్తిమయిని ప్రజలు ఆపలేకపోయారు. పెద్ద పెద్దగా అరవగలిగాడు, అరిచాడు. లూకా 18 : 1-8 వితంతువు ప్రార్థన ద్వారా క్రీస్తు మనకు ఎల్లపుడు ప్రార్ధించండి, నిరుత్సహులు కాకాకండి అని తెలియజేశాడు. చాలాసార్లు మన ప్రార్థన వేడుకోలు ఆర్తనాదాలు ఇతరులకు వెర్రి కేకలుగా కనిపించవచ్చు. మరి నువ్వు నేను దేవుని బర్తిమయి లాగా బిగ్గరగా పిలువగలుగుతున్నామా లేదా?

మనం మన జీవితాలను పరిశీలించినట్లయితే ఎన్నో విషయాలు, వ్యక్తులు, వస్తువులు, మనలను యేసుప్రభువును సమీపించదానికి ఆటంకాలుగా ఉంటునాయి. 

కొన్ని సార్లు మనం ఇతరుల దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారు దేవుని సన్నిధికి వెళ్లకుండా, ప్రార్థన చేయనీయకుండా అడ్డు పాడతాం, ఆటంకాలు కలుగజేస్తాము. అందుకే మనకు ఉదాహరణగా బర్తిమయి తీసుకోవాలి ఎందుకంటే అతడు పట్టుదలతో ప్రార్ధించాడు, దానికి ఫలితం అంధకారాన్ని తొలగించి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. 

నువ్వు నేను  దేవుని పిలిస్తే క్రీస్తు కూడా మనలను అదే ప్రశ్న అడుగుతున్నారు! నీకు ఏమి కావాలి ధనమా, పేరు ప్రఖ్యాతలు, అందమా, ఆరోగ్యంగా లేక ఆయుషా. అందుకే నన్ను ని బిడ్డగా మార్చు ఈ ప్రశ్నకు జవాబు రెండొవ పట్టణములో చూస్తున్నాము, దేవుడు ప్రభువైన క్రీస్తు ప్రభు పలికిన మాటలు మనతోకూడా పలికితే, అది నాకు చాలు అని ప్రార్ధించాలి. ఏంటి ఆ మాట అంటే హెబ్రీ 5 : 5 లో నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవు నేను నీకు తండ్రి నైతిని. క్రీస్తు ప్రభుని భక్తి, వినయాల వల్లనా తండ్రి దేవుడు క్రీస్తు ప్రభుని ప్రార్థన ఆలకించెను అని వింటున్నాము. క్రీస్తు దేవుని పుత్రుడై వుండి కూడా మనకు ఒక గొప్ప సుమాతృకను ఇచ్చి ఉన్నాడు. 

బర్తిమయి దృఢమైన విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్ధించాడు, దేవుని కరుణ పొంది నూతన జీవితం పొంది  క్రీస్తును అనుసరించాడు. 

కాబ్బటి ప్రియా స్నేహితులారా మన దేవుడు మన అవసరాలు, బలహీనతలు ఏరిగినవాడు, కావున మన అందరిని ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని ప్రార్ధించి రక్షణ, నూతన జీవితం పొందుదాం! ఆమెన్.

Br.Suresh OCD

23, అక్టోబర్ 2021, శనివారం

30 వ సామాన్య ఆదివారం

30 వ సామాన్య ఆదివారం

 యిర్మియా 31:7-9 , హెబ్రీ 5: 1-6, మార్కు 10:46-52 

ఈనాటి దివ్య పఠనాలు దేవునికి తన ప్రజల పట్ల వున్న అమితమైన ప్రేమ, దయ, క్షమ అనే అంశములను గురించి బోధిస్తున్నాయి. 

తండ్రికి తన బిడ్డల పట్ల ఉన్న మమకారం ఎప్పుడు కూడా మరువనిది అని కూడా ఈనాటి పఠనాల ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఇస్రాయేలు ప్రజల మీద చూపిన గొప్ప ప్రేమ అర్థమగుచున్నది. 

తండ్రి దేవుడు ప్రజల యొక్క ఆధ్యాత్మిక అంధకారంను తొలగించి వారి యొక్క  జీవితములో సంతోషం అనే వెలుగు నింపుచున్నారు. 

దేవుడు యిస్రాయేలు  ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నారో 31 వ అధ్యాయం 1-4 వచనాలలో అర్థమగుచున్నది. 

దేవుడు ప్రతి సారి కూడా యిస్రాయేలు ప్రజలను నా ప్రజలు అని సంబోధిస్తున్నారు అలాగే నేను వారు దేవుడిని పలుకుచున్నారు. 

ఈ బంధం తండ్రి , బిడ్డల ప్రేమ బంధం విడదీయలేని బంధం, ఎందుకంటే ఎన్నిసార్లు యిస్రాయేలు ప్రజలు తండ్రిని  కాదని అన్య దైవములను పూజించినా ఆ తండ్రి తన బిడ్డలను మరలా ప్రేమిస్తూనే , క్షమిస్తూనే  ఉన్నారు. 

ఈనాడు మనం  విన్న మొదటి పఠనంలో  యిస్రాయేలు  పునరుద్ధరణకు సంబంధించి  దేవుడు చేసిన వాగ్ధానాలు వింటున్నాం. 

బాబిలోనియా బానిసత్వంలో ఉన్న యిస్రాయేలు ప్రజలను దేవుడు విముక్తి చేస్తారు. ఉత్తర దేశమైన బాబిలోనియా నుండి యిస్రాయేలు ప్రజలను  స్వదేశమైన యూదాకు తిరిగి రప్పిస్తారని తెలుపుచున్నారు. ఇక్కడ దేవుడు తన ప్రజలను ఇచ్చే  ఆ స్వేచ్ఛ గురించి , ఆయన తన ప్రజలకు ఇచ్చే సంతోషం గురించి ధ్యానించాలి. 

బానిసత్వంలో స్వేచ్ఛ లేదు, ఆనందం గా గడపడానికి సమయం లేదు, సమూహంగా దేవున్ని  ఆరాధించడానికి స్థలం లేదు. ఎటు చూసినా ఇబ్బందియే,  అంతగా బాధపడే ఒక స్థలం నుండి దేవుడు వారికి విముక్తి  చేస్తున్నారు. వారికి జీవాన్నీ సమృద్దిగా దేవుడు ఇస్తున్నారు. 

మళ్ళీ వారు సంతోషముగా యెరుషలేములో ఆరాధనాలు చేయవచ్చు ,  దేవుడు వారిని తన బిడ్డలుగానే గౌరవించారు. వారిలో ఆనందం  నింపారు. మరలా  ఒకసారి పూర్వ వైభవమును వారికి అందచేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాను తోడై వుంటా అన్నారు. 

దేవుడు అంటున్నారు 8 వ  వచనంలో నేల అంచుల నుండి వారిని కొనివత్తును అని, అంటే దేవుడు ఏ వ్యక్తిని కూడా మరిచి పోవటం లేదు. అందరిని కూడా స్వేచ్చా వంతులను మరియు తన బిడ్డలుగా చేయాలన్నదే,  దేవుని  యొక్క ఆశ.  ఇప్పటివరకు  బాధలలో ఉన్న గ్రుడ్డి వారు, కుంటివారు ,గర్భవతులు, సంతోషంగా తిరిగి ఒక మహా సమూహంగా వస్తారని ప్రభువు తెలుపుచున్నారు. దేవుడే స్వయంగా వారిని నడిపించుకొని వస్తారు. వారికి చేరువలో ఉంటారు. 

దేవుడు తన ప్రజలను నడిపించుకొని వస్తారు, వారిని చేయిపట్టి నడిపిస్తారు. ఆనాడు ఇదే యిస్రాయేలు  ప్రజలను ఎలాగైతే వాగ్దత్త భూమికి, సంతోష స్థలాలకు  నడిపించారో అదే విధంగా మరొక సారి ఈనాటి విశ్వాస యిస్రాయేలు  ప్రజలను కూడా అదేవిధంగా ప్రేమతో నడిపిస్తారు అని  యిర్మియా తెలుపుచున్నారు. 

వారు ఏడుపులతోను  ప్రార్ధనలతో తిరిగి వస్తారు. ఎందుకు ఏడుస్తారంటే ఆ దేవుని యొక్క గొప్పదైన ప్రేమను  జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు అవిశ్వాసులుగా జీవించిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తారు. అదేవిధంగా బానిసత్వంలో గడిపిన చీకటి సమయాలను గుర్తించుకుంటూ ఇప్పుడు దేవుడిచ్చిన గొప్ప స్వేచ్ఛను, ఆయన యొక్క అనంత ప్రేమను గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తారు. 

ఇంకొక విధంగా చెప్పాలంటే వారి యొక్క ఆనందం వల్ల కూడా ఏడ్చి ఉండవచ్చు. ప్రభువు అంటున్నారు వారిని తిన్నని మార్గమున నడిపింతును, అంటే ఇక  అన్య దైవముల వైపు  ప్రయాణం చేయరని మంచి వైపు, దేవుని వైపు మాత్రమే ప్రయాణం చేస్తారని,  వారి గమ్యం తప్పరని అర్ధం. దేవుడు నిర్ధేశించిన స్థానంకు వారు చేరుతారని అర్ధం. 

వారు కాలు జారీ పడిపోరు అంటున్నారు అంటే వారి పట్ల అంత శ్రద్దగా  ఉంటారని దీని యొక్క అర్ధం. యిస్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో దేవుడు మరొక సారి తన గొప్ప ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. ప్రజలు కూడా  దేవునికి సంతోషంతో కృతజ్ఞతగా పాటలు పాడుచున్నారు. 

రెండవ పఠనంలో దేవుడు యాజకుల యొక్క ఎన్నికను గురించి  వారి యొక్క  జీవితం గురించి బోధిస్తున్నారు. ప్రధాన యాజకుడు  జీవించిన విధంగా  ప్రతి యాజకుడు జీవించాలి. క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వం మిగతా లేవీయుల యాజకత్వం కన్నా  భిన్నంగా  ఉన్నది ఎందుకంటే  స్వయంగా  తండ్రి దేవుడే తన కుమారున్నీ ఈ పనికి నియమించారు. 

తండ్రికి -ప్రజలకు మద్య  ఒక నిచ్చెనలాగా ఉండుటకు, దేవుని యొక్క ప్రతినిధిగా నిత్య యాజకుడు క్రీస్తు ప్రభువు ఉన్నారు. ప్రతి గురువు కూడా దేవుని యొక్క ప్రతినిధే.  

ప్రతి యాజకుడు కూడా ప్రజల మధ్య నుండే ఎన్ను కొనబడిన వాడే . హెబ్రీ 5:1 , ద్వితీ 18:15 ఆయన కూడా సామాన్యుడే బలహీనుడే అయినప్పటికీ దేవుడు తనను ఎన్నుకొని, అభిషేకించి బలవంతున్ని  చేశారు. 

వారిని ఎన్ను కొన్నది ప్రజలను దీవించుటకు.  ద్వితీ 10:8, సంఖ్యా 6:24-26 

వారిని ఎన్ను కొన్నది వాక్యమును ప్రకటించుటకు. ద్వితీ 31:11 , మార్కు 16:15 

తన సేవ చేయుటకు, స్తుతించుటకు ఎన్నుకొనెను.  2 రాజుల దిన 29:11 

ప్రజల కోసం బలులను సమర్పించుటకు ఎన్ను కొనబడిన వారు.  2 రాజుల దిన 29:24 ప్రజల పాపముల కొరకే కాదు యాజకుడు బలులు సమర్పించేది,  తన పాపముల కొరకు కూడా. ఈ యొక్క యాజకత్వ పదవి దేవుడు ఇచ్చినదే, ఆయనకు విధేయులై జీవించాలి. 

ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభువు,  బర్తిమయి  అను అంధుడికి చూపునిచ్చే విధానం చదువుకుంటున్నాం. యేసు ప్రభువు  యెరుషమలేముకు  ప్రణయమయి వెళ్ళే సమయములో యెరికో మీదుగా వెళ్లుచున్నారు. 

జక్కయ్యది కూడా యెరికో పట్టణమే. యెరికో నుండి యెరుషలేము  వెళ్లుచున్నా ప్రభువు గూర్చి విని, పదే  పదే  ప్రాధేయపడి అడుగుచున్నాడు. 

ఈ బర్తిమయి  జీవితములో దేవుని మీద ఉన్న గొప్ప విశ్వాసం మనం అర్ధం చేసుకోవాలి.( లూకా 18:35-43.) క్రీస్తు ప్రభుని  గురించి  ఆయన యందు విశ్వాసం ఉంచుకున్నాడు . వినుట  వలన విశ్వాసం కలిగింది. వినుట  వలన మేలు కలుగుతుంది అని భావించాడు. క్రీస్తుని గురించి వినుట  వలన తన బాధలు పోతాయని నమ్మకం కలిగింది, క్రీస్తుని గురించి వినుట  వలన, పేదవారి పట్ల నిలిచే దేవుడు తనకి మంచి చేస్తారన్న నమ్మకం ఆయనలో కలిగింది. 

ఆయన ప్రేమ గురించి విని ఉండవచ్చు, దానితో ఆశ కలిగింది. బిక్ష గాడు సాధారణంగా చేసే పని ఏమిటంటే అడగటం, ప్రతి ఒక్కరినీ అడుగుతుంటారు. 

కొందరు బిక్ష గాళ్లు ఇవ్వకపోతే వదిలివేస్తారు. బర్తిమయి తనను ఎంతమంది ఆపినా సరే వదిలి వేయటం లేదు, పట్టు వీడటం లేదు. ఆయనకు బహుశా మత్తయి 7:7 వచనపు దేవుని మాటలు గుర్తుండవచ్చు. అందుకే వెంటనే అడుగుచున్నాడు. 

దేవుడు అనేక సార్లు మన జీవితం గుండా ప్రయాణం చేస్తారు. కాని చాలా సార్లు మనం అది గుర్తించము, బర్తిమయి దేవుడుండే స్థలంకు వెళ్లుచున్నారు. యోషయా 55:6 దేవుని కోసం అన్వేషించండి అని చెబుతుంది. బర్తిమయి మాత్రము యేసు ప్రభువును గుర్తించి, విని, పిలుస్తున్నాడు. వెంటనే ప్రభువు సమాధానము ఇస్తున్నారు.  యిర్మీయా 33:3 వాక్యంలో ప్రభువు అంటారు.  నీవు పిలుతువేని నేను జవాబిత్తును అని.  కీర్తన 34:6. మోషే పిలిచారు దేవుడు సమాధానం ఇచ్చారు. ఏలియా దేవున్ని పిలిచారు. ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు.(కార్మెల్ పర్వతంవద్ద). 

బర్తిమయి దెవున్ని పిలిచారు, ఆయనకు స్పందించారు, సమాధానం ఇచ్చారు. సుసన్న దేవున్ని పిలిచారు దేవుడు సమాధానం ఇచ్చారు. యిస్రాయెలు, దేవున్ని ఐగుప్తులో పిలిచారు  దేవుడు సమాధానం ఇచ్చారు.  బర్తిమయి  దేవుడిని కరుణించమని కోరుతున్నారు. తన యొక్క దీన స్థితియందు, దయ ఉంచామని అడుగుచున్నాడు. తన బలహీనత పట్ల, పాపముల పట్ల కనికరం కలిగి తనను ఆదుకోమని ప్రార్థిస్తున్నాడు. 

మనం కూడా దేవుడిని అడుగవలసినది, కరుణయే. ఆనాడు  యిస్రాయేలు ప్రజలు దేవుని కరుణ కొరకు ప్రార్థించారు. కాబట్టే వారికి దేవుడు మరల జీవితాన్ని ప్రసాదించారు. 

బర్తిమయిలో చూసే గొప్ప విషయం  ఏమిటంటే తనకు, దేవుని వరం పొందుటకు దేవుడిచ్చిన,  అవకాశమను చక్కగా వినియోగించుకుంటున్నారు. ఎవరు తనను ఆపినా సరే ఆగటం లేదు. 

బర్తిమయి క్రీస్తును మెస్సయ్య గా గుర్తించారు. అందుకే దావీదు కుమారా, అని సంబోధిస్తున్నారు. మనం అడిగే ప్రతిదీ, దేవునికి నచ్చితే, దేవుడు మనకు సహాయం చేయడానికి, మన చెంతకు వస్తారు. ప్రభువు బర్తిమయి ఆక్రందన విని ఆగిపోయాడు. ప్రభువు పిలుపు వినగానే బర్తిమయి తనపై వస్త్రం విడిచిపెట్టి  ప్రభువు వద్దకు పరుగు తీశారు. అప్పటి వరకు ఆ వస్త్రం తన పడక, దాని మీదే ఆధారపడి జీవించారు, అదియే తన ఆస్తి , ఎన్నో సంవత్సరాలుగా ఆ దౌర్భాగ్య స్థితిలో గడిపి ఉండవచ్చు, కానీ ఇప్పుడు క్రీస్తు చెంతకు రావటం వలన, ఆయన నూతన జీవితం, ప్రసాదిస్తారని గ్రహించి దుప్పటి వదలి వస్తున్నారు. క్రీస్తుతో జీవించాలి అంటే పాతది  వదలి వేయాలి. 

బర్తిమయి జీవితంలో మనం గుర్తించవలసిన కొన్ని విషయాలు 

1. క్రీస్తు ప్రభువును మెస్సయ్య గా గుర్తించట 

2. క్రీస్తు చెంతకు రావడం , విశ్వాసంతో పట్టు విడువకుండా  అడుగటం 

3. ప్రభుని యొక్క దయ , క్షమ కరుణ కోరుట 

4. క్రీస్తుని వెంబడించుట. 

ఈ రోజు  బర్తిమయి చూపుని అడిగిన విధంగా మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక అంధకారం తొలగించి మంచిని చూచేలా, మంచి చేసేలా ,మంచి చెంతకు వెళ్ళేలా చేయమని ప్రార్ధించుదాం. బర్తిమయి ఎంతకాలం గ్రుడ్డివాడో ఎవరికి తెలియదు ,ఆయన గ్రుడ్డివాడు కాబట్టి పట్టించుకునే వారు లేరు. బర్తిమయి, యేసుప్రభుని చూడకుండానే నమ్మారు. ఆయన ప్రభువు ఏ మార్గము గుండా వస్తారో ముందే తెలుసుకొని, అక్కడ కాచుకొని ఆయన కొరకు, ఆయన వచ్చే స్థలం వద్దకు వచ్చి ఎదురు చూస్తున్నాడు. 

చూడక నమ్మువారు ధన్యులు యోహను 20 : 29 . క్రీస్తు ప్రభుని, విని నమ్మే ధన్యులు ఎల్లప్పుడు దేవుడి యొక్క జీవమును , ఆశీర్వాదాలు పొందుతారు. యోహను 5:24 ,20:31,రోమి 10:9-10. బర్తిమయి క్రీస్తును తన రక్షకునిగా, తనకు విముక్తి కలుగచేసే వానిగా, తన నాయకునిగా గుర్తించి ఆయన్ను సంప్రదించారు. దేవున్ని భోజనం పెట్టమని ,సంపదలు ఇవ్వమని అడగలేదు కానీ అతి ప్రధానమైన దయ చూపమని అడుగుచున్నారు. ఆనాడు సుంకరి అడిగినది అదే లూకా 18:13-14 . 

By Rev. Fr. Bala Yesu OCD

16, అక్టోబర్ 2021, శనివారం

29 వ సామాన్య ఆదివారం (3)

 29 వ సామాన్య ఆదివారం  (3)

ఈనాటి దివ్య పఠనాలు: యెషయా:53 :10 -11, హెబ్రీ:4 :14 -16 ,మార్కు:10 :35 -45 

         ఈనాటి దివ్య  పఠనాలు నిజమైన నాయకునికి ఉండవలిసిన  లక్షణం గురించి భోదిస్తున్నాయి. 

    దేవుని యొక్క ప్రజలను నడిపించే నాయకుడు సంఘమును నడిపించే నాయకుడు అదేవిధంగా కుటుంబమును నడిపించే ప్రతియొక్క నాయకుడు ఎలాగ జీవించాలన్నది, ఎలాగ వారు ఇతరులకు సేవచేయాలన్న విషయం గురించి ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి.

    ఈనాటి మొదటి పఠనంలో, బాధామయ సేవకునియొక్క నాల్గవ గీతం గురించి యెషయా గ్రంధంలో చదువుకుంటున్నాం.

        ఈయెషయా గ్రంధం 52 :13 -53 :12 వరకు మనం ధ్యానించుకున్నట్లయితే, ఆ సేవకుడు దేవుని చిత్తమును నెరవేర్చుటకుపడిన బాధలను మనం వింటున్నాం.

సేవకుడు దేవునికొరకు అనేక రకాలైన అవమానాలు, నిందలు,శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా వున్నారు.ఆయన యొక్క భాధలలో దేవుణ్ణి విస్మరించలేదు, ఆయనయందు విశ్వాసం కోల్పోలేదు. ఈ బాధామయ సేవకునియొక్క నాల్గవగీతంలో దేవుడు తెలియజేస్తున్నారు ఎలాగ ఒక సేవకుడు జీవించాలి.సేవకునికి  దైవప్రజలమీద అధికారం ఇవ్వబడింది.ఆయన యొక్క అధికారం సేవచేయుటకు,మాత్రమే వినియోగించులున్నారు,కానీ, ఎలాంటి సుఖ సంతోషాలను పొందటానికి కాదు. ఈనాటి మొదటి పఠనంలో,ప్రభువు సేవకున్ని భాధాభరితున్ని చేయుట నా సంకల్పము అని అన్నారు (10 వ) ఇక్కడ దేవుడు సేవకునియొక్క జీవితంలో కష్టాలుఒసగినప్పుడు ఆకష్టాలను అయన ప్రేమతో స్వీకరించాడు.

ఈసేవకునిలో వున్న కొన్ని లక్షణాలు ఏమిటి;

1 .అయన తన దేవునియందు వినయము విధేయతను కనపరిచాడు.ఎందుకంటే, దేవుడు స్వయంగా ఈ సేవకుడు శ్రమలు పొందాలన్నపుడు ఆయన శ్రమలు అనుభవించుటకు తాను సిద్ధముగా వున్నానని,వినయమును,విధేయతను తెలియపరుస్తున్నాడు.- యెషయా:53 :7 .

2. ఆయన ఇతరుల కొరకు జీవించినవ్యక్తి.పరుల పాపపరిహారం కోసం తన జీవితమునే త్యాగం చేస్తున్నారు.ప్రజల యొక్క పాపములను తనమీద వేసుకొని వారికొరకు ప్రాణత్యాగం చేస్తున్నారు.ఈ సేవకునిలో వంద సంవత్సరాలు జీవించాలన్న ఆశలేదు. కానీ దేవుని కొరకు దేవుని ప్రజలకొరకు జీవించాలన్న మంచిమనస్సు ఉంది యెషయా:15 :13 .

3 . అయన ప్రేమించే సేవకుడు: అయన కేవలము ప్రేమవలన అయన జీవితమును పరులకోసం త్యాగం చేసారు.ఎన్ని భాధలు పొందినా,ఎంత హింసించినా,అయన మాత్రము నోరు విప్పలేదు.ఎంతో ప్రేమవుంటేనే అలాగ భరించగలిగి శ్రమలలో దేవుని సంతోషమును చూసిన సేవకుడు.పౌలు గారు చక్కగా వివరిస్తారు ప్రేమ సమస్తమును భరించును 1 కోరిం:13 :7 . పౌలు గారు చెప్పిన విధముగా ప్రేమకు సహనం ఉంది,వినయము ఉంది,అదేవిధముగా ఆ సేవకుని హృదయం దైవ ప్రేమ, మానవ ప్రేమతో నిండిఉంది.కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు.

4 . బాధామయ సేవకుడు దైవజ్ఞానము కలిగిన వ్యక్తి: ఈ సేవకునికి ప్రభువు యొక్క మనస్సు తెలుసు, ఆయన సంకల్పం తెలుసు.అందుకే ఆయన చిత్తమును నెరవేర్చుతూ,అన్నిటిని సహించుకొని,ముందుకు సాగారు.దేవుడుయొక్క ప్రతిమాట, ఆయన చిత్తం గ్రహించుకొని దాని ప్రకారము సేవ చేస్తూ,శ్రమల కాడిని మోసి,తన ప్రాణ త్యాగం చేసి అనేకమందియొక్క సంతోషమునకు కారణమయ్యారు.

5 .దేవుడుసేవకునికి ఇచ్చు ప్రతిఫలం : బాధామయ సేవకుడు తన కోసం పడిన ఏశ్రమనుకూడా తండ్రి దేవుడు మరచి పోలేదు.తన శ్రమలలో భాగస్తుడయ్యారు.తనకు తోడుగావున్నారు.ఆయనపట్ల సంతోషముగావున్నారు.ఎందుకంటే తన చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చారు. ఈ సేవకుడు ఎన్ని భాధలు అనుభవించాడో,దానికి అన్ని రెట్లు ఎక్కువగా అతడిని గొప్పవానిగా దేవుడు చేశారు.యెషయా :53 :12 .

ఇది గొప్ప ఆశీర్వాదం. దేవుని యొక్క ప్రేమ కాబట్టి మనం జీవితములో,కూడా కష్టాలు వస్తాయి, శ్రమలను ఎదుర్కోవాలి.అయితే వాటన్నిటిని ఈ బాధామయ సేవకుని వలే భరించాలి. ప్రతి శ్రమవెనుకాల ప్రతిఫలం దాగివుంటుంది.దేవుని కొరకు కష్టాలు అనుభవిస్తే,అవి తరువాత దీవెనలుగా మార్చబడతాయి.కాబట్టి ఈ సేవకునిలో వున్న లక్షణాలు మనం పాటించుకుందాం.

    రెండవ పఠనంలో రచయిత యేసు క్రీస్తు ప్రభునియొక్క యాజకత్వము గురించి భోదించారు.

    యేసుక్రీస్తు ప్రభువుయొక్క యాజకత్వం పాతనిభందనా గ్రంధంలో లేవీయుల యాజకత్వము కన్నా కొద్దిగా భిన్నముగా వుంటుంది. లేవియ గోత్రముకు చెందిన యాజకులకంటే,క్రీస్తుప్రభువుయొక్క యాజకత్వం గొప్పది.ఎందుకంటే,లేవీయులు దేవునికి బలులు మాత్రమే అర్పించే యాజకులు కానీ,క్రీస్తుప్రభువు తానే ప్రజలకోసం బలిగా అర్పించుకున్న గొప్ప యాజకుడు.లేవీయులు ఈ భూలోకములోవున్న దేవాలయములోకి మాత్రమే ప్రవేశించారు.(లేవి :16 :15 -17 ) కానీ యేసు ప్రభువు పరలోకమునుండి దిగివచ్చి, పరలోకంకు ఎక్కివెళ్లిన ప్రధాన యాజకుడు.

లేవీయులు అందరిని ప్రేమించుటలేదు, ఆపదలోవున్నవారిని ఆదుకొనలేదు ( మంచి సమరుయుని కథ) కానీ క్రీస్తుప్రభువు అందరినీ ప్రేమించారు, పేదలలో జీవించాడు,అందరిని దీవించాడు,అవసరంలో వున్న వారికి చేయూతనిచ్చారు. లేవీయులు సేవింపబడ్డరు,గౌరవింపబడ్డారు.కానీ క్రీస్తు ప్రభువు సేవచేసారు, సిలువ శ్రమలు అనుభవించారు.అందుకే క్రీస్తుప్రభువుని యాజక అగ్రగణ్యుడు అంటారు. మనం బలహీనతల యందు మనకు శక్తిని ఇస్తారు.అదేవిధంగా మనలాగా ఈ లోకంలో మానవునిగా జీవించి అన్నిటిలో కూడి,ఎటువంటి పాపం చేయని వారు మన ప్రధాన యాజకుడు. ఆయన మన బలహీనతలు తెలుసు కాబట్టి,మనల్ని  దేవుడు అర్ధం చేసుకుంటారు.సానుభూతి చూపుతారు, ఆదుకుంటారు,కాబట్టి ఆయన సన్నిధికి సమీపించి మనలను, మన పాపాలు క్షమించమని మొరపెట్టుకోవచ్చు.

         ఈ నాటి సువిశేష పఠనంలో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు అధికారం పట్లవున్నఆశని గూర్చి వివరిస్తున్నారు. నిజమైన అధికారమంటే తనను తాను తగ్గించుకుని, అందరికీ సేవచేయడమే అని క్రీస్తు ప్రభువు శిష్యులకు తెలుపుచున్నారు.

 పోయిన వారపు సువిశేష పఠనంలో ధన వ్యామోహమును గూర్చి వింటున్నాం.ఈ రెండు కూడా మానవుడిని, దేవుడికి దూరం చేస్తాయి.ఎందుకంటే ఎప్పుడు కూడా వారిమనస్సు, హృదయం వాటిమీదనే ఉంటుంది.వారు దేవుడిగురించి ఆలోచించుట చాలా తక్కువ. వ్యామోహం ఏదైనా సరే అది విశ్వాస జీవితానికి మంచిదికాదు.

   ఈనాటి సువిశేష పఠనంలో యేసుప్రభువు తన యొక్క మరణం గురించి ప్రస్తావించినప్పుడు,ఇద్దరు శిష్యులు మీ రాజ్యంలో మారు రెండు స్థానాలు ఇవ్వమని జెబాదాయి పుత్రులు యాకోబు,యోహాన్నులు అడుగుచున్నారు.

 వీరిద్దరూ కూడా యేసు ప్రభువు చేత ప్రేమింపబడినవారే, ఎందుకంటే,చాలా సందర్భాలలో వీరిని తోడుగా తీసుకొని వెళ్లుచున్నారు (యాయీరు ఇంటికి,తాబోరు కొండకు,గేస్తేమనే తోటకు).

  యేసు ప్రభువు మరణం గురించి, పునరుతానము గురించి చాలా సందర్భాలలో ప్రస్తావించారు.ఆయన శ్రమలను గూర్చి చెప్పిన ప్రతిసారి కూడా శిష్యులు ఉన్నారు. అయినాకూడా వారు గొప్ప అంతస్థు గురించి ప్రభురాజ్యములో కుడి, ఎడమ స్థానం గురించి ఆలోచనలుచేయసాగారు. శిష్యులు యేసుప్రభువు మరణిస్తారని ఆలోచనలేదు. కేవలం ఆయన రాజ్యంస్థాపిస్తారని అందరి యొక్క ఆలోచన. ఇక్కడ మానవుని యొక్క స్వభావం స్పష్టంగా కనపడుతుంది.

పేరుకోసం ,అధికారంకోసం,గుర్తింపుకోసం ఉన్నటువంటి మానవ వ్యక్తిత్వం అర్ధమవుచున్నది.

   యేసు ప్రభువు మొదటిసారిగా తనయొక్క మరణం గురించి ప్రస్తావించినప్పుడు,పేతురుగారు దానికి అభ్యన్తరం పలికారు. అప్పుడు ప్రభువు తన సేవకులుగా ఉండాలంటే సిలువను మోయాలి అని పలికారు (మార్కు:8 :24 ). ఆయన ఆలోచనలు సరిచేశారు.

    రెండవసారి తన మరణం గురించి చెప్పినపుడు శిష్యులలో ఎవరుగొప్పఅని ఆలోచనలు చేశారు.అప్పుడు చిన్నబిడ్డను చూపించి,గొప్పవారు కావాలంటే,చిన్నబిడ్డలాగా దేవునిపై నమ్మకం ఉంచి,ఆయన మీద ఆధారపడి జీవించాలి అని తెలిపాడు మార్కు;9 :35 . 

       మూడవసారి మళ్ళీ మరణం గురించి చెప్పినపుడు,ఇద్దరు శిష్యులు తన రాజ్యంలో కుడి ఎడమల స్థానాలను ఆశిస్తున్నారు. అప్పుడు ప్రభువు, గొప్పవారు కాదలిస్తే,వారు సేవకుడిగా ఉండాలని తెలుపుచున్నాడు (44 వ వచనం).శిష్యులు అధికారంకోసం ఆశిస్తే, ప్రభువు సేవాగురించి భోధిస్తున్నాడు. అధికారం ఆశపడుతూ,శ్రమలను వద్దనుకుని జీవింప ప్రయత్నిస్తే,ప్రభువు మాత్రము అనుదిన జీవితములో శ్రమలు అంగీకరించాలని గట్టిగా చెబుతున్నారు. నిజమైన గొప్పదనం అంటే, ఇతరులకు సేవకునిగా ఉండి సేవచేయుటకు అని ప్రభువు చెబుతున్నారు.

  యోహాను యాకోబు అడిగిన వరం సరియైనది కాదు.ఎందుకంటే అధికారవరమును అడుగుచున్నవారు దానికోసం వారి తల్లిని కూడా తీసుకొనివచ్చి అడుగుచున్నారు (మత్త:20 :20 -21 ).వారికి ఎంత అధికారఆశ అంటే, వారు అడిగితే ఆ అధికారం రాదూ అనుకోని తన తల్లి చేత అడిగిస్తున్నారు.సలోమి మరియమ్మ గారి సోదరి వరుస అవుతారు (యేసుప్రభువుకు పిన్ని/పెద్దమ్మ వరుస).ఇక్కడ శిష్యులు ఏమిఅడుగుచున్నారో,వారికి సరిగా అవగాహన లేదు.మనం కూడా కొన్నిసార్లు ఏమిఅడుగుతామో అవగాహన లేదు.వారు (యాకోబు/యోహాను ) తనకు దగ్గర బంధువులు అయినప్పటికీ, వారికి యేసు ప్రభువు వారికి ఎలాంటి పక్షపాతం చూపించలేదు.ఆయనకు అందరూ సరిసమానులే.ప్రభువు వారి మధ్యలో వారికి విభేదాలు రాకుండా ఇలా మంచి నిర్ణయం తీసుకున్నాడు.

   మనమైతే ఎప్పుడూ కూడా మనవారి గురించి ఆలోచిస్తుంటాం. ఏదయినా పదవి ఖాళిగా ఉంది అంటే వెంటనే అది మనం బంధువులకు వచ్చేలా చూస్తాం. కానీ ఇక్కడ ప్రభువు మాత్రం వీరికి ఎలాంటి అధికారం ఇవ్వటం లేదు.

  యాకోబు యోహానులు ఇద్దరు కూడా ఉన్నవారే,(మార్కు:1 :20 ) వారికి వున్న సంపదలవల్ల అధికారం కూడా కావాలి అనే స్వార్ధపు ఆలోచనలలో వున్నారు.అందుకే ప్రభువు వారి ఆలోచనలను సరిచేస్తున్నారు (యోహా :18 :16 ). ఈ ఇద్దరు శిష్యులు యేసుప్రభువు యొక్క శ్రమల యొక్క సవాళ్లు అంగీకరించారు.అవసరమయితే ఆయనకోసం యెరూషలేములో మరణించడానికైనా సిద్ధం అని అన్నారు. యాకోబు గారియొక్క మరణ చరిత్ర మనకు ఆయన క్రీస్తుకొరకు పొందినాశ్రమలు బాప్తిస్మము గురించి వివరిస్తుంది.యాకోబుగారు హేరోదు అగ్రిప్పచే శిరచ్చేదం పొంది  మరణించారు   (అపో:12:2).  

    యేసు ప్రభువుయొక్క శ్రమలలో భాగస్థుడై మరణించిన మొదటి శిష్యుడు.యోహానుగారు కూడా తన తోటి క్రైస్తవుల వేద హింసల్ని,తీవ్రభాధను పొందటమే గాక, దేశ బహిష్కారణకు గురయ్యారు.వీరిద్దరూ క్రీస్తు శ్రమలలో పాలుపంచుకొని,దేవుని మహిమను పొందారు. వారు అధికారం గురించి అడిగినప్పుడు, ఆలోచించారోలేదో కానీ క్రీస్తు ప్రభువుయొక్క పునరుతానము తరువాత ఆయన కోసం జీవించాలి, మరణించాలి,ఆయన సేవ నిస్వార్ధంతో  చేయాలనే దృఢసంకల్పం కలిగిన సేవకులు వీరు.యేసు ప్రభువు తన తండ్రియే అందరికీ తన రాజ్యంలో స్థానం ఇస్తారని ప్రభువు తనయొక్క వినయాన్ని, విధేయతను చూపుచున్నారు. క్రీస్తుప్రభువుకు ఈలోకంమీద సర్వాధికారం ఇవ్వబడినది. అయితే దానిని ఎప్పుడూ కూడా సొంతలాభంకోసం వినియోగించలేదు.

    ప్రభువు దృష్టిలో అధికారం ఇవ్వబడినది కేవలం సేవకే అని స్పష్టమవుచున్నది. ప్రభువు తాను చూపిన అధికారులను ఆదేశించి పలుకుచున్నారు.వారు ప్రజలపై ఎంత కఠినముగా ప్రవర్తిస్తున్నారో తెలియజేస్తున్నాడు. ఈ అధికారం పెత్తనం చెలాయించడాన్ని కాదు, కానీ అందరిలో ఒకడిగా ఉంటూ అందరికీ సేవచేయడమే, ఇదే నిజమైన గొప్పదనం అని తెలుపుచున్నాడు.

      గొప్పవారు కాదలిస్తే తనను తాను తగ్గించుకొని, ఇతరులను అంగీకరించి సేవచేయాలి అని భోధిస్తున్నాడు.ప్రథముడు కాదలిస్తే , బానిసగావుండాలి, ఎటువంటి పెత్తనం లేకుండా ఉండాలి అని భోధిస్తున్నాడు.

    మదర్ థెరెసా గారు తనను తాను తగ్గించు కొని అందరికీ సేవచేసారు. ఆసేవలో ప్రేమ, వినయం వున్నాయి.యేసుక్రీస్తు ప్రభువు నిజమైన సేవకునికి నిదర్శనం.ఆయన అందరికన్నా గొప్పవాడయినప్పటికీ, దేవుడైనప్పటికీ,తనను తాను తగ్గించుకున్నాడు.ఎవ్వరిమీద అధికారం చెలాయించలేదు. ప్రేమించాడు, తండ్రికి విధేయత చూపారు. పేదవారి పక్షాన పోరాడారు. అందరికీ సేవచేసారు.సిలువశ్రమాలు అనుభవించారు. శిష్యులపదాలు కడిగాడు.పేదవారిగా ఈలోకంలో జీవించారు.సుఖ సంపదలు విడిచిపెట్టారు.మనందరం కూడా క్రీస్తుప్రభువలె,సేవకు దూపం దాల్చి జీవించాలి.దేవుడిచ్చిన అధికారంతో ప్రేమిస్తూ,సేవచేస్తూ,దేవునికి దగ్గరగా జీవించాలి.మనం ఇతరులయొక్క శ్రేయస్సును కోరుకోవాలి. 1 కోరి:10 :24 , ఫిలి:2 :4 .

        అధికారం కేవలం సేవకుమాత్రమే కాబట్టి క్రీస్తు ప్రభువు వలే జీవించుటకు ప్రయత్నిద్దాము.ఆమెన్

Rev.Fr. Bala Yesu OCD

ఇరవై తొమ్మిదవ సామాన్య ఆదివారము(2)

 యెషయా 53:10-11                                                                            

హెబ్రీయులకు 4:14-16

మార్కు 10:35-45

 క్రీస్తునాధునియందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా!

ఈనాటి దివ్యగ్రంథపఠనాల ద్వారా తల్లి శ్రీసభ, నిజమైనటువంటి నాయకుడు లేదా అధికారి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అన్న అంశాలను గూర్చి తెలియ జేస్తుంది. దేవుని దృష్టిలో గొప్పనాయకుడు అంటే గొప్ప సేవకుడు. సేవకునిలా సేవ చేస్తూ ఇతరుల కొరకు తన జీవితాన్ని సైతం త్యాగం చేయగలిగేటటువంటివాడే దేవునియందు గొప్పవాడిగా పరిగణింపబడతాడు అని ఈనాటి వాక్యం మనకు బోధిస్తుంది.

పరలోక అధికారానికి, ఇహలోక అధికారానికి  వ్యత్యాసం

ఇహలోక నాయకత్వానికి, పరలోక నాయకత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. మనం గమనించినట్లయితే నేటి సమాజంలో అధికారం అనే వ్యామోహాన్ని ప్రతిఒక్కరిలో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో నాయకత్వం అంటే అధికారం. ఆ అధికారంతోనే సామాన్యుల మీద పెత్తనం  చెలాయించడం అన్న తలంపులతో ఉన్నాము. రాజకీయ నాయకులు అధికారం అనే పదవి కోసం ప్రజల చుట్టూ తిరిగి, ప్రజల అవసరాలు తీరుస్తాము అని ఎన్నో  వాగ్ధానాలు, హామీలు ఇస్తుంటారు. కానీ ఒక్కసారి వారు ఆ అధికార పదవిని దక్కించుకున్నాక వారు వారిని గెలిపించినటువంటి సామాన్యులను, చేసిన వాగ్ధానాలు ఏవి గూడ వారికి గుర్తుకురావు. అన్ని మర్చిపోయి, అధికారం, దనం అనే వ్యామోహం లో జీవిస్తుంటారు. ప్రజలు ఎన్నుకున్న నాయకున్ని గూడ వారు కలవడానికి వీలులేనటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాము. ఈ అధికార వ్యామోహం అనేది మనందరిలో ఉండవచ్చు. అందరూ సేవచేయడానికి నాయకులమవ్వాలని అనుకుంటారు కానీ ఎక్కువగ వారి అధికారం చేత సేవించబడుటకే నాయకులు అవుతుంటారు. ఇటువంటి వ్యామోహం ఎప్పటినుంచో మానవాళి స్వభావం లో ఉంది. ఆదాము అవ్వ ఇద్దరు గూడ దేవుని లాగ, దేవునికంటే గొప్పవారు అవ్వాలనుకున్నారు అని ఆదికాండము లో చూస్తున్నాము. ఇటువంటి అధికార వ్యామోహాన్ని గురించి ఈనాటి సువిశేష పఠనంలో వింటున్నాము.  కానీ పరలోక రాజ్యములో అందరూ సమానత్వం కలిగి దేవునియందు ఆనందంగా జీవిస్తారు అని పరిశుద్ధ గ్రంధంలో చదువుతున్నాము.

అధికార వ్యామోహం

క్రీస్తు ప్రభు శిష్యులలో  యోహాను మరియు యాకోబు లు ఇద్దరు పరలోక రాజ్యంలో క్రీస్తు తన సింహాసనంలో ఆసీనుడైనప్పుడు వీరికి తన కుడి, ఎడమ వైపులా ఉండుటకు అధికారాన్ని ఇవ్వమని కోరుతున్నారు. ఈ తలంపు శిష్యులందరిలో ఉండవచ్చు, కానీ వీరిద్దరు మాత్రమే తమ కోరికను క్రీస్తు నందు వ్యక్తపరిచారు. ఎందుకు వీరిద్దరే  ఆ కోరికను వ్యక్తపరిచారు అంటే క్రీస్తు చేత ప్రేమించబడ్డారు మరియు క్రీస్తు వారిని అన్నీ ప్రాంతాలకు తీసుకొని వెళ్లారు. క్రీస్తుప్రభువు వారి సమాజంలో బహిరంగంగా చేసిన గొప్ప అద్భుత కార్యాలను చూసి ఆయన తప్పకుండ రోమ్ సామ్రాజ్యానికి గొప్ప రాజు అవుతాడు అన్న దృఢ నమ్మకం వారికి కలిగింది. అందుకే వారు క్రీస్తుకి దగ్గరగ  మంచిగా జీవిస్తున్నారు. ఆవిధంగా అయినా మంచి హోదా వారికి దక్కుతుందని. అదేవిధంగా మనము ధ్యానించినట్లయితే పరిశుద్ధగ్రంథంలో చూస్తూ ఉన్నాము యోహాను, పేతురు మరియు యాకోబులు ముగ్గురు క్రీస్తుకి చాలా దగ్గరగ జీవిస్తూ ఆయనను ఎక్కువ వెంబడించి క్రీస్తు యొక్క మహిమాన్వితాన్ని కళ్లారా చూసియున్నారు. కాబట్టి అందుకే వారు క్రీస్తునందు దగ్గరగ  మంచివారిగా జీవించారు. ఆవిధంగా అయినా వారికి మంచి హోదా, అధికారం దక్కుతుందేమో అని. 

అదేవిధంగా మనము ధ్యానించినట్లయితే పరిశుద్ధగ్రంథంలో చూస్తూన్నాము యోహాను, పేతురు మరియు యాకోబులు ముగ్గురు గూడ క్రీస్తుకి చాలా దగ్గరగ జీవిస్తూ ఆయనను ఎక్కువగ వెంబడించి క్రీస్తు యొక్క మహిమాన్వితాన్ని కళ్లారా చూసియున్నారని లూకా సువార్త 9 : 28 -30  వరకు గల వచనాలలో చూస్తున్నాం. "ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించు చుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అను వారు". క్రీస్తు దివ్యరూపధారణ మొందిన తర్వాత మోషే ఏలీయా ప్రవక్తలు క్రీస్తుతో మాట్లాడటం వారు చూసిన అనుభవంతో ఈయన నిజంగా పరలోక రాజ్యానికి అధిపతి అని గ్రహించారు. అందుకే వారు క్రీస్తు యొద్దకు వచ్చి " మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనంపై ఆసీనులైనపుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని మార్కు 10 : 37  లో చదువుకొనియున్నాము. కానీ పరలోక రాజ్యం ఇహలోక రాజ్యమువలె అధికారాలతో గాక అందరూ సమానత్వం కలిగి ఉంటారని ఆ సమయంలో వారు తెలుసుకోలేకపోయారు.

గొప్పవాడు అంటే గొప్ప సేవకుడు

అందుకనే క్రీస్తు ప్రభు తన రాజ్యములో గొప్పవారిగా ఉండాలంటే ఏ వింధంగా జీవించాలి అని తెలియజేస్తున్నారు. గొప్ప నాయకుడు లేదా గొప్ప అధికారి అంటే సేవ, త్యాగం అనే లక్షణాలు కలిగినటువంటి  గొప్ప సేవకుడు అని మత్తయి శుభవార్త 20 : 26 - 27 వచనాలలో  ప్రభువు పలుకుతున్నాడు. "మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండ వలెను".   అందుకు గొప్ప ఉదాహరణ క్రీస్తు ప్రభువు అని ఈ నాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త పలుకుల ద్వారా మనం వింటున్నాము. ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు బానిసలుగా ఎన్నో కష్టాలు బాధలు పడుతున్నటువంటి సమయంలో వారికి ఆశ, ఊరట, దైర్యం కలిగేలా వారికి రక్షణ బడయుటకు బాధామయ సేవకుడు అంటే ప్రభుని సేవకుడు, రక్షకుడు రాబోతున్నాడు అని ప్రవచిస్తున్నాడు.

బాధామయ సేవకుడు {ప్రభుని సేవకుడు}

బాధామయ సేవకుడు మనందరి బాధలను, పాపాలను తన మీద వేసుకొని తన రక్తాన్ని చిందించి  మనలను రక్షింతును అని యెషయా ప్రవక్త తెలియపరుస్తున్నారు. ఆ బాధామయ సేవకుడు తన తండ్రి సంకల్పం ప్రకారం మన పాపములకొరకు నలిగిపోయి తాను అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానం కలిగించును. ఆయన తండ్రి సంకల్పము ప్రకారం బాధా భరితునిగా, తనను తాను పాపపరిహారబలి చేసి, పెక్కుమంది దోషములను భరించును, అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. ఆ విధముగా ప్రభుని సేవకుడు ఆనందమొంది తన తండ్రిచేత గొప్పవానిగాను ఘనులలో నొకనిగా గణింపబడును అని తండ్రి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలుకుచున్నాడు. ఈ ప్రవచనాలు అన్ని గూడ క్రీస్తు ప్రభువు జీవితంలో నెరవేరాయి. మత్తయి 20:28 లో క్రీస్తు ప్రభువు తన తండ్రి సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. "మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను".

గొప్పవానిగా [సేవకునిగా] రెండు ముఖ్య లక్షణాలు

క్రీస్తు అనుచరులమైన మనం పరలోకరాజ్యములో దేవుని యందు గొప్పవారిగా ఉండాలంటే ముందు ఒక గొప్ప సేవకుని వలె జీవించాలి,  క్రీస్తువలె మనం గూడా ఇతరులకు సేవ చేస్తూ మన ప్రాణాలను గూడా త్యాగం చేయుటకు సిద్ధంగా ఉండాలి అని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. క్రీస్తు సేవకునిగా జీవించడం అంటే అంత సులువైనది కాదు. అందుకే ఈనాటి సువిశేషంలో ప్రభువు ఇద్దరి శిష్యులను రెండు ముఖ్య లక్షణాలను గూర్చి అడుగుతున్నాడు. అవి 1 . నా పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని. దీనికి అర్థం నేను పొందబోయే శ్రమలను బాధలను మీరు గూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారా అని. అందుకు వారు చేయగలం అని సమాధానమిస్తున్నారు. నిజానికి వారు ఆ సమయంలో అర్థం చేసుకోలేకపోయారు. ఎప్పుడైతే వారు క్రీస్తుని సిలువపై మరణించడం చూసారో అప్పుడే వారికి క్రీస్తు చెప్పిన మాటలకు అర్థం తెలిసింది. ఆ తర్వాత వారు నిజమైనటువంటి క్రీస్తు సేవకులుగా, సేవ చేసి క్రీస్తుకి మాట ప్రకారం క్రీస్తు కొరకు వారి ప్రాణాలు సమర్పించి క్రీస్తు లో బాగస్తులయ్యారు. 2 . రెండవది నేను పొందబోవు బప్తిస్మమును మీరును పొందగలరా? అని. బప్తిస్మము అనగా మన పాపపు జీవితానికి మరణించి క్రీస్తులో నూతనంగా జీవించడం. అంటే తనను తాను త్యజించు కొని తన సిలువని ఎత్తుకొని క్రీస్తుని అనుసరించడం. ఈ రెండింటిని శిష్యులందరు వారి జీవితాలలో పాటించి పరలోక రాజ్యంలో గొప్పవారిగా పరిగణింపబడ్డారు.

యోబు గారు గూడా ఒక మంచి సేవకునివలె దేవుని యందు విశ్వాస పాత్రుడుగా జీవించాడు. ఆయనకు ఎన్నో శోధనలు బాధలు ఎదురయ్యాయి అయినప్పటికీ తాను దేవునియందు విశ్వాసం కోల్పోకుండా నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదనుయావే దేవుడే ఇచ్చెను యావే దేవుడే తీసికొని పోయెను, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. అని జీవించాడు. అదేవిధంగా ఎందరో పునీతులు తమ జీవితాలను త్యజించుకొని వారి సిలువను ఎత్తుకొని ప్రభుని మార్గములో సేవకులుగా జీవించి ఈనాడు దైవ రాజ్యంలో దేవునితో కలసి జీవిస్తున్నారని మనందరం విశ్వసిస్తున్నాము. మరి ఈనాడు క్రైస్తవులుగా మన గొప్పతనం దేనిలో చూపిస్తున్నాము? పరలోకంలో పొందబోయే జీవితాన్ని మరచిపోయి ఇహలోక జీవితమే శాశ్వతమైనది అన్న భ్రమతో, ధనం, అధికారం అనే వ్యామోహంతో జీవిస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు ప్రకారం అధికారం అంటే సేవ. ఆ సేవ లో వచ్చే బాధలను కష్టాలను ఎదుర్కొనుటకు కావలసిన శక్తీ ఉందా అని ప్రశ్నించుకోవాలి.

ప్రధానయాజకుడు

క్రైస్తవులమైన మనందరం ఎటువంటి బాధలకు కష్టాలకు బయపడి లొంగిపోకుండా ఉండమని ఈ నాటి రెండవ పఠనములో చూస్తున్నాం. ఎందుకంటే బలహీనులమైన మనలను బలపరుచుటకు మన ప్రధానయాజకుడు క్రీస్తు ప్రభువు మనకు మధ్యవర్తిగా తోడుగా ఉన్నాడు. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు. మనవలె ఆయన అన్ని విధాలుగా శోధింపబడియు, పాపం చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. ఆయన యందు దృఢమైన విశ్వాసం కలిగి జీవించెదము. ఆయన తన అనుగ్రహమును మనకు దయచేయును అని హెబ్రీయులకు రాసిన లేక 4 : 14 - 16 లో  చూస్తున్నాము.

కనుక క్రైస్తవులమైన మనం అనుదిన ప్రార్థన ద్వారా క్రీస్తువలె సేవకులకు సేవకులవలె జీవించుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయమని ప్రార్థిస్తూ ఆవిధంగా జీవించుటకు ప్రయత్నించుదము.

ఎందుకంటే గొప్పతనానికి క్రైస్తవ మార్గం ఏమిటి అంటే, సేవ.

పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమెన్.

By Br. Vijay Talari OCD

9, అక్టోబర్ 2021, శనివారం

28 వ సామాన్య ఆదివారము(3)

28 వ సామాన్య ఆదివారము(3)

మొదటిపఠనము:  విజ్ఞానము లోకములో దొరికే సంపదలకంటే గొప్పదని బోధిస్తుంది

రెండవ పఠనము: దైవ  వాక్కు  మహా  శక్తి కలది.

సువిశేషపఠనము:నిత్యజీవితముఅంటే ఏమిటి?దానినిచేరుమార్గమేమిటని  బోధిస్తుంది.

మొదటిపఠనము:

నాటి మొదటిపఠనములో సోలోమోను రాజు లోకములో జ్ఞానము కంటే గొప్పది ఏది కాదని తెలుసుకొని ప్రార్ధన ద్వారా దాన్ని పొందుతున్నాడు, అవి సింహాసనమైతేనేమి, రాజ్యాధికారం అయితేనేమి, సిరి సంపదనైతేనేమి, బంగారమైతేనేమి, ఆరోగ్యమైతేనేమి, సౌందర్యమైతేనేమి. ఎందుకంటె జ్ఞానము సమస్త ప్రశస్త వస్తువులను బహు సంపదలను గూడా తెచ్చును. అయితే జ్ఞానము వలన లాభమేంటి?.

1 దేవుని యొక్క పవిత్రతను,సత్సబంధ ప్రేమను తెలియజేస్తుంది. మోషే ప్రవక్త దేవునితో ముఖ్య ముఖి మాట్లాడాడు.

2 విజ్ఞానము దేవునినుండి వచ్చు బహుమానము ( యిర్మీయా 29 :11 )

3.విజ్ఞానము అంటే దేవునికి భయభక్తులు చూపడమే ( యోబు 28 :28 )

ఇది ఎలా వస్తుందంటే? దైవభయము వలన. “దైవభీతి విజ్ఞానమునకు మొదటిమెట్టు” (కీర్తన :111 :10) దేవునియొక్క జ్ఞానము మనల్ని మనం ఎలా  రక్షించుకోవాలో నేర్పిస్తుంది.

దేవునియొక్క జ్ఞానము గొప్ప గొప్ప విషయాలను మనకు తెలియజేస్తుంది.

 దేవునియొక్క జ్ఞానము విధేయతను,విశ్వాసమును నేర్పుతుంది.

దేవునియొక్క జ్ఞానము దేవునియొక్క నిగుడమైన ప్రేమను గూర్చి తెలియజేస్తుంది. ఎందుకంటే జ్ఞానము ఈలోకమునుండి కాక, సాక్షాత్తు దేవునినుండి వస్తుంది.అందుకనే ఈనాడు సొలొమోను రాజు  దీనికోసం ప్రార్ధన చేసింది. జ్ఞానము ద్వారానే అతడు తన రాజ్యాన్ని ఎంతో గొప్పగా పరిపాలించగలిగాడు. అయితే  ఈనాడు నువ్వు నేను ఈలోకసంపదలకు కాక, ఆశాలకోసంకాక, పరలోకం కోసం, పరలోకంలో వున్న దేవుడికోసం వెదకాలి. అప్పుడే మనకు గొప్ప బహుమానం కలుగుతుంది. యిర్మీయా :29: 11 లో, "నేను మీ క్షేమము కొరకు ఉద్దెశించిన పధకములు నాకు మాత్రమే తెలియును. నేను మీ అభివృద్ధినే కానీ, వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని"అని అంటున్నాడు. అయితే బంగారు భవిష్యత్తు నీకు నిత్యజీవితము చేకూర్చేది.

  సువిశేష పఠనములోచూస్తే:

 యేసు ప్రభువు యోర్దాను నది నుండి యెరూషలేము ప్రదేశానికి వెళ్లుచుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి అయన ఎదుట మోకరించి,సద్భోధకుడా! నిత్య జీవితం పొందుటకు నేనే మి చేయాలి అని అడిగినపుడు,దేవుడియొక్క ఆజ్ఞలను పాటించమని పలికాడు. అప్పుడు యువకుడు మాటలకు నా చిన్ననాటినుండే ఇవన్నీ పాటిస్తూనే వున్నాను అని సంతోషముగా పలికాడు. అప్పుడు యేసు ప్రభువు అతని వంక ప్రేమతో చూసి,నీకు ఉన్నదంతా వెచ్చించి,పేదలకు దానం చేసి,అటు పిమ్మట నన్ను అనుసరింపుము.పరలోకమందు నీకు ధనము చేకూరును, అని అనెను. కానీ యువకుడు అధిక సంపదలు గలవాడగుటచే మొఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు.

  ఇక్కడ  యువకుడియొక్క జీవితాన్ని క్లుప్తంగా పరిశీలించినట్లయితే:

 1. అజ్ఞల యొక్క అంతరంగాన్ని కనుగొన లేక పోయాడు

2. లోక వ్యామోహాల ఊబిలో పడిపోయాడు

3. దేవుని యొక్క పిలుపును తిరస్కరించాడు.

4. మొఖము చిన్నబుచ్చుకొని వెళ్లిపోయాడు. 

 

1. ఆజ్ఞల యొక్క అంతరంగాన్ని కనుగొనలే పోవుట:

    దేవుడు మోషే ప్రవక్తద్వారా  ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలలో నిగూఢమైన  పరమార్థం గురించి  అర్ధంచేసుకోలేక పోయాడు. ఆజ్ఞలు రెండువిషయాలగురించి తెలియజేస్తున్నాయి.

1. దేవున్ని ప్రేమించుట

2. మానవుని ప్రేమించుట.

 ముందుగా అతడు యేసుప్రభువు ఆజ్ఞలను పాటించు అని అడిగినపుడు ధైర్యముగా, సంతోషముగా నేను అన్నీ పాటిస్తున్నాను అని చెప్పా గలిగాడే కానీ వాటిలో నిగుడతను తెలుసుకోలేకపోయారు, ఇంకా అర్ధం చేసుకోలేక పోయాడు. ఆజ్ఞలను దేవుడు మనకెందుకిచ్చాడంటే, దేవుడిని , మన పొరుగువారికి ప్రేమించడానికే.

2 . ఈలోక వ్యామోహాలలో పడిపోయాడు:

          యువకుడు ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు కానీ, అది  ఇచ్చినటువంటి దేవుడిని కాదు. అందుకే నీకున్నదంతా వెచ్చించి,పేదలకు దానము చేయుము, అటు పిమ్మట నన్ను అనుసరింపుము అన్నపుడు దేవుని యొక్క పిలుపును గ్రహించలేక , అర్ధం చేసుకోలేక బాధపడుతూ,మోహమును త్రిప్పుకొని వెళ్లి పోయాడు.

ఉదా:

   లూకా:12 :16 -20 లో ధనవంతుడి జీవితాన్ని మనం చూస్తే, తనకోసం, తన స్వార్థంకోసం ,కొట్లను నిర్మించి దానిలో సంపదలను కూడబెట్టి ఓనా ఆత్మమా తినుము, త్రాగుము, స్తుతించుము.  అప్పుడు దేవుడతనితో,ఓరీ! అవివేకి రాత్రికే నీ ప్రాణములు తీసుకొనిపోబడును.అప్పుడు నీవు కూడబెట్టిన డబ్బు ఎవరికీ చెందును అని అనెను. ఇంకా లూకా :16: 19-24 లో. ధనవంతుడు లాజరుగూర్చి తెలుపబడుతుంది.వీరిద్దరు జీవించిన జీవితం ద్వారా ధనవంతుడు నరకాగ్నిలోకి పోతే, లాజరు పేదవాడు మాత్రం అబ్రాహాము ఒడిలోకి చేర్చబడ్డాడు. దేవుని దృష్టిలో లాజరు గొప్పాజీవితాని జీవించాడు కానీ, ధనికుడు కాదు. ఎందుకంటే తనప్రక్కనే ఉన్నటువంటి లాజరును పట్టించుకోకుండా తన ఇష్టానుసారం జీవించి, దేవునియొక్క కోపాగ్నిపాలయ్యాడు.

  పు.మత్తయి:27:24లోఅంటారు,"ఈలోకంలోసంపదలుకూడబెట్టుకోవలదు.చెద పురుగులు,త్రుప్పు వానిని తినివేయును.దొంగలు కన్నమువేసి దోచుకొందురు" అంటున్నాడు. అయితే ధనవంతుడు మరియు యువకుడు దాచుకొనినట్లు మనంకూడా దనాన్ని కూడబెట్టుకున్నచో,అది మనము దక్కకుండా ఇతరులవశమవుతుంది.సామెతలు:  27: 24 "ధనం శాశ్వతంకాదు, సంపదలు కలకాలం నిలువవు". ఇక్కడ మనము ఉదాహరణకు పు.మదర్ తెరెసా గారిని తీసుకుంటే,ఆమె ఈలోకములో దనాన్ని కూడబెట్టుకోక పరలోకరాజ్యములో కూడబెట్టింది. కాబట్టే ఆమెను ఈనాడుమదర్అని పిలుస్తున్నాము.

 అసలు నిత్యజీవితంఅంటే ఏమిటంటే,పరలోకం. మరి పరలోకాన్ని చేరాలంటే ముందుగా:

1.యేసు ప్రభువునందు విశ్వాసం కలిగి జీవించాలి:

యోహా 3: 36: "కుమారుని విశ్వసించువాడు నిత్యజీవమును పొందును". అంటే ఎవరైతే యేసుప్రభువునందు అచంచలమైన  విశ్వాసమును కలిగి జీవిస్తారో. సువిశేషపఠనములో యువకుడు సద్భోధకుడా! అని సంభోదించాడు కానీ, యేసు ప్రభువును దేవునిగా అంగీకరించలేదు.

2. తండ్రి చిత్తానుసారం జీవించాలి:

  మత్తయి:7: 21 "ప్రభూ! ప్రభూ! అని సంభోధించువాడు పరలోకములో ప్రవేశింపరు. కానీ,తండ్రి   చిత్తానుసారముగా వర్తించువాడే పరలోకమున ప్రవేశించును". మన సాధారణ జీవితములో ఎన్నో తపోక్రియలు చేసినా,దేవునికి గొప్పగా మొరపెట్టినా కానీ తండ్రి చిత్తానుసారం జీవించకపోతే వ్యర్ధము.  

. మారుమనస్సు పొందాలి:

   మత్తయి:18:3 మీరు పరివర్తన చెంది,చిన్నబిడ్డలవలే రూపొందిననే తప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను". అని దేవుడు పలుకుచున్నాడు. ఇక్కడ చిన్నబిడ్డలంటే,దేవునియందే ఆధారపడి జీవించేవారు.ఈలోకవస్తువులమీద ఆధారపడుతూ జీవించేవారుకాదు. అయితే యేసుప్రభువు యువకుడు జాలితో, మొఖమును చిన్నబుచ్చుకొని వెనుతిరిగి వెళ్తున్నప్పుడు తన శిష్యులతో ధనవంతుడు పరలోకరాజ్యమున ప్రవేశించుటకంటె, ఒంటె సూదిబెజ్జములో దూరిపోవుట సులభ తరము అని తెలియజేస్తున్నాడు. అంటే వారు పరలోక రాజ్యానికి ఎంతో దూరముగా వున్నారని, వారు ఎప్పటికి చేరబోరని తెలియజేస్తున్నాడు.

4. క్రీస్తుకొరకు జీవించాలి:

  ఉదాహరణకు శిష్యులజీవితాన్ని మనం చూస్తే,వారు మొదట వారిస్వార్ధం కోసం జీవించినా కానీ తరువాత క్రీస్తుకొరకే జీవించి మరణించడానికయినా వెనకంజ వేయలేదు. అది వారు మనకు చూపించిన గొప్ప ఆదర్శవంతమయిన జీవితము.

      అయితే ఈనాడు శిష్యులు మరి మేమంతా విడిచిపెట్టి వచ్చి మిమ్ము అనుసరించితిమి అని అంటున్నపుడు యేసుప్రభువు :నా నిమిత్తము అన్నదమ్ములను,అక్కచెల్లెలను, భార్యలను, పిల్లలను,భూములను విడిచిపెట్టి నన్ను అనుసరించు వాడు వాటిని అధికముగా తిరిగి పొందును.అని అంటున్నాడు. అయితే ఇక్కడ పూర్తి సమర్పణా జీవితం కలిగి జీవించాలని భోధిస్తున్నాడు. సమర్పణా జీవితం ద్వారా,దేవుడికి పూర్తిగా సమర్పించుకొని చేసుకొని, ఆయనను విశ్వసించి, అయన చిత్తానుసారము నడుస్తూ, మారుమనస్సు కలిగి ఆయనకొరకే జీవించాలి. అదే మననుండి దేవుడు కోరుకునేది. 

  అయితే ఈనాటి రెండవ పఠనము ద్వారా దేవుడు మనకు దేవుని వాక్కు యొక్క శక్తిని గూర్చి తెలియజేస్తుంది. ఇక్కడ, దేవుని యొక్క వాక్కు జీవమును,చైతన్యమైనది.అది రెండంచుల కత్తికంటే పదునైనదని తెలియ జేస్తుంది. ఉదా హరణకు :దేవుడు ఈలోకాన్ని సృష్టించినపుడు తన వాక్కు ద్వారా సృష్టించాడు. తన వాక్కు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి విడిపించాడు. ఎడారిలో ఆకలిగా వున్నప్పుడు తన వాక్కు ద్వారా మన్నాను కలుగజేసి వారి ఆహారాన్నితీర్చాడు. కుమారుడైన యేసుప్రభువు, తన వాక్కు ద్వారా ఎంతోమందిని దీవించాడు. తన వాక్కు ద్వారా ఎంతోమందిని స్వస్థపరిచాడు.తనవాక్కు ద్వారానే ఎంతోమంది మరణించిన వారిని తిరిగి లేపాడు. ఇలా ఎన్నోరకాలుగా, దేవుడు తన వాక్కు ద్వారా ఎన్నో ఎన్నెన్నో గొప్పమేలులు, గొప్పకార్యాలు చేసాడు. అయితే వాక్కు అయినటువంటి యేసుప్రభువుని విశ్వసించి, ఆయనతోపాటు ఐక్యతకలిగి జీవించాలి. అప్పుడే వాక్కు మన హృదయములోకి చొచ్చుకొనిపోయి,మనలో ఉన్నటువంటి పాప కలంకములను, చెడు జీవితాన్ని, అవిశ్వాసపు జీవితాన్ని, రెండంచుల ఖడ్గములాగా వీటన్నిటిని ఛేదించుకొనిపోయి, నూతన జీవితాన్ని మనకు ప్రసాదిస్తుంది. 

    కాబట్టి మనమందరము అయన వాక్యానుసారము జీవిస్తే, దాని ఫలితం నిత్యజీవితాన్ని మనం సంతోషముగా పొందగలం. అయితే, దేవుని వాక్కు నందు విశ్వాసము కలిగి జీవించాలి .అప్పుడు నీవు దేవునికి వినయము కలిగి,ఆయనతో కలిసి సిలువదారిలో ప్రయాణిస్తావు. అది నిన్ను నన్ను దేవునితో ఐక్యపరిచి, ఒక్కటిగా చేసి,నిత్యజీవితములో పాలుపంచుకొనునట్లు చేస్తుంది.ఎందుకంటే దైవవాక్కు ద్వారా పాతనిభందనలో సృష్టిని సృష్టించాడు. వాక్కు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశమునకు నడిపించి రక్షణను కల్పించాడు. అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చాడు. మరణించినవారికి జీవాన్ని ఒసగాడు. అంత శక్తి దేవుని  యొక్క వాక్కుకి కలదు. ఎందుకంటే, కాబట్టి మన జీవితములో దేవునియొక్క వాక్కుని మన హృదయములోకి స్వీకరించి, స్వీకరించిన వాక్కుని అనుసరిస్తూ,నిత్యజీవితపు మార్గములో ప్రయాణించాలి. అప్పుడే మన జీవితానికి ఒక పరమార్ధం ఉంది. ఎందుకంటే, కాబట్టి మన జీవితములో దేవునియొక్క వాక్కుని మన హృదయములోకి స్వీకరించి, స్వీకరించిన వాక్కుని అనుసరిస్తూ,నిత్యజీవితపు మార్గములో ప్రయాణించాలి. అప్పుడే మన జీవితానికి ఒక పరమార్ధం ఉంది. కాబట్టి ఈనాటి దివ్య బలిపూజలో వాక్కుదారిఅయిన యేసు ప్రభువునియందు విశ్వాసము కలిగి జీవిద్దాం.ఆమెన్.

 

 -   బ్ర.నందిగామ. జోసెఫ్ మారియో 

 

 

 

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...