19, నవంబర్ 2022, శనివారం

క్రీస్తురాజు మహోత్సవము

 

క్రీస్తురాజు మహోత్సవము 

                                                                                        2సమూ :5:1-3

కొలస్సి :1:12-20

లూకా :23:35-43

     పూజ్య గురువులు, ప్రియమయిన సహోదరీ, సహోదరులారా! ఈరోజు మన తల్లి అయిన తిరుసభ క్రీస్తురాజు మహోత్సవమును కొనియాడుతుంది. ముందుగా మీ అందరికి పండుగరోజు శుభాకాంక్షలు, దేవునియొక్క దీవెనలు.

     ఈపండుగను జరుపుకొనేటప్పుడు మనకు ఒక సందేశమురావచ్చు.అది ఏమిటంటే, మ్రానికొమ్ముల ఆదివారము క్రీస్తు ప్రభువును ఒక రాజుగా కొనియాడుతున్నాము. అప్పుడు యేసుప్రభువు యూదులకు ఒక రాజుగా యెరూషలేము నగరంలోనికి ప్రవేశించడం మనం చూస్తున్నాం.ఆసంఘటన యూదులకు మాత్రము యేసుప్రభువు ఒక  రాజుగా చిత్రీకరించడం జరిగినది.ఈక్రీస్తురాజు పండుగ ప్రపంచములోని రాజులకంటే, యేసుప్రభువు గొప్పవాడిగా, రాజులకు రాజుగా,ప్రభువులకు ప్రభువుగా, పండుగను జరుపుకుంటున్నాము. మనము చరిత్రను చూసినట్లయితే,మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత రాజులు తమ స్వార్ధముతో సొంత ప్రయోజనములకోసము, కీర్తి, పరువు ప్రతిష్ఠలకోసం వేరే దేశములపై తిరుగుబాటును మనం చూస్తున్నాం.దీనిని దృష్టిలో పెట్టుకొని, ప్రపంచములో శాంతిని నెలకొల్పడానికి పొప్ పయస్ XI quas primes (in the first).  దీని అర్ధం మొట్టమొదట విశ్వలేఖలో  రాజులందరూ క్రీస్తుప్రభువుని రాజులకు రారాజుగా, ప్రభులకు ప్రభువుగా,విశ్వసించి, ప్రపంచములో శాంతిని నెలకొల్పాలని ఈలేఖను రాసాడు.

  1. రాబోయే మెస్సయ రాజు:

2.క్రీస్తు ఎలా రాజు?

3.యేసు శాంతికరుడైన రాజు

 1.  రాబోయే మెస్సయారాజు:

         రాజు అనేవాడు ప్రజల బాధలనుండి రక్షించేవాడు. ప్రజలు నిర్భయముగా శాంతి సమాధానాలతో,పరిపాలన చేసేవాడు రాజు.ఇశ్రాయేలు రాజులు సరిగ్గా పరిపాలన చేయలేదు. కనుక రాజవ్యవస్థ కూలిపోయింది.ప్రవక్తలు భావికాలములో మెస్సయ్య నూతన రాజుగా వస్తాడని, ప్రవచనములను చెప్పారు. యెషయా ప్రవక్త ఇలా పలుకుతున్నారు: “మనకొక శిశువు జన్మించాడని చెప్తూ,అతని పుట్టుకను తెలియజేశాడు.అతడు నీతితో పరిపాలనము చేస్తాడు.అతని యేలుబడిలో ప్రజలు శాంతి సౌఖ్యముతో జీవిస్తారు. అతడు బేత్లెహేములో పుడతాడని చెప్పాడు.

  యిర్మీయా ప్రవక్త కూడా ఇలా అంటున్నాడు: “నేడు దావీదు వంశమునుండి నీతిగల రాజును ఎన్నుకొంటాను”(23:5).

జెకరియా ప్రవక్త కూడా ఇలా అంటున్నాడు:”తర్వాత దావీదు వంశానికి చెందిన సెరుబ్భాబేలు రాజ్య వ్యవస్థను పునరుద్ధరిస్తాడు అనుకొన్నారు. కానీ ఆశ నెరవేరలేదు. (8:9).

యెష:60:16, అన్య జాతుల రాజులు రాజుకు లొంగివుంటారు అని భావించారు.

  2.  క్రీస్తు ఎలా రాజు?:

          మత్త:2:6 లో ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు మెస్సయాను గూర్చి హేరోదు రాజుకి వివరించారు. “మెస్సయ్య రాజుగా జన్మిస్తాడని బేత్లెహేములో పుడతాడని వారి ముందుగానీ ప్రవక్తల ప్రవచనములు ద్వారా తెలుసు. కానీ, యేసు ప్రభువు ఇంత నిడారంబరముగా రాజభవనములకు దూరముగా పశువుల పాకలో యూదుల రాజుగా జన్మిస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ చిత్రముగా యేసు జన్మించినపుడు నిడారంబరముగా ఉన్నాడో, మరణ సమయములో కూడా అలానే వున్నాడు. రాజ్యములేదు, సింహాసనము లేదు, కిరీటము లేదు. ఆయనకు ఎదురయిన ప్రశ్న: “నీవు యూదుల రాజువా?” ఇది పిలాతు అడిగిన ప్రశ్న. మత్త:27:11    వచనములలో దానికి యేసు ప్రభువు సమాధానము: “నీవు అన్నట్లే". చిన్నమాటలో సత్యాన్ని గ్రహించాడు పిలాతు.ఆయన సిలువ పై భాగములోనజరేయుడైన యేసు యూదులరాజు అని రాయించి దానిని మార్చమని అడిగిన వారికి: “నేను రాసినదేమో రాసితిని.అని చెప్పి నోరు మూయించాడు. ఆయన జీవితములో ఆరంభములో వినబడిన    ప్రశ్న: “యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ?” జీవితాంతములో, వినిపించిన మాట నజరేయుడయినా యేసు యూదుల రాజు. అలాగయితే ఎన్నో సందేహాలు,మరి నీరాజ్యము ఏది నీ సింహాసనము ఏది? నీ సైన్యమేది? ప్రశ్నకు సమాధానం, నా రాజ్యము ఈలోక   సంబంధమయినది కాదు. ఎందుకంటే, అయన రాజ్యము ఈలోక  సంబంద్ధమయిందయితే, అది కాలానికి లోబడుతుంది, కొంతకాలమే ఉంటుంది. దావీదు రాజు సొలొమోను రాజు ప్రపంచాన్ని గడగడా లాడించిన అలెగ్జాండర్ వారి మనుగడ తరువాత కాలగర్భములో కలిసిపోయారు.మరియు మెసయ్య యూదుల రాజుగా జన్మించిన వాడుకూడా అలా కాల గర్భములో కలిసిపోవలసిందేనా? లేదు. అలా జరగడానికి వీలులేదు. ఎందుకంటే, క్రీస్తుపూర్వం ఏడువందల సంవత్సరములో యెషయా ప్రవక్త ప్రవచించాడు(9:7). అతని రాజ్యాధికారం విస్తరించును.

   అతని రాజ్యము సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనమును అధిష్టించి, నీతి న్యాయములతో అధికారము నేర్పుచూ,నేటినుండి కలకాలం వరకు పరిపాలనను చేయును. శాశ్వతముగా పరిపాలన చేయువాడు దేవుడు మాత్రమే. ఒక నిరపరాధి రక్తముతో తనకు సంబంధము కల్పించవద్దని చేతులు కడుగుకొనిన పిలాతు యేసును రాజుగా అంగీకరించాడు.అప్పుడే జన్మించిన బాలుని జ్ఞానులు రాజుగా అంగీకరించారు.ఫిలిప్పు, నిన్ను పిలువక పూర్వమే,నేను నిన్ను ఎరిగివున్నాను, అని యేసు అనగానే, నతానియేలు, నీవు దేవుని కుమారుడవు, యూదుల రాజువని తన విశ్వాసాన్ని ప్రకటించాడు.

3.యేసు శాంతికరుడైన రాజు:

      శాంతి అంటే,యుద్ధము లేకుండా వుండే వాతావరణము కాదు. ప్రజలు శాంతి సమాధానాలతో  జీవించడం.శాంతిని హీబ్రూ భాషలో షాలోమ్ అని అంటారు. దాని అర్ధం: “ప్రజా సంక్షేమం దేవునితో సమాధానము.మన సువార్తలో చూస్తున్నాం, దూతల సమూహము దేవుని అనుగ్రహమునకు పాత్రులైనవారికి శాంతి కలుగును గాక. దేవుని అనిగ్రహమును పొందు వారికి శాంతిని అనుగ్రహించడానికి బాలుడు (యేసుప్రభువు) జన్మించాడు. ఈయన ప్రధాన లక్ష్యం శాంతిస్థాపన. ఆనాటి కాలములో రాజకీయ పరిస్థితులలో మతపరమైన శాంతిస్థాపన చాలా అవసరం.  యేసు ప్రభువు ఉత్తానమైన తరువాత శిష్యులకు కనిపించి వారితో, "మీకు శాంతికలుగునుగాక" అన్నాడు. భయముతో, ఆందోళనతో  ఉన్న వారికి శాంతి సమాధానము చాలా అవసరం. వాటిని ప్రభువు తన శశిష్యులకు ప్రసాదిస్తున్నాడు.దేవుడు తప్ప మరెవ్వరూ ఇవ్వలేని తిరుగులేని శాంతి ఇది.

   తనతో సిలువ వేయబడిన దొంగలలో ఒకడు తన పాపక్రియలకుకారణము పశ్చాత్తాపపడి, యేసు దైవత్వాన్ని గుర్తించి, యేసూ, నీరాజ్యములో ప్రవేశించినపుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని ప్రాధేయపడ్డాడు. ప్రభువు తనతో, నేడే నీవు పరలోకములో ప్రవేశించెదవు. ఆవ్యక్తికి అట్టి వాగ్ధానము రాజులకు రాజుతప్ప మరెవ్వరు ఇవ్వలేరు.

మొదటి పఠనంలో: దావీదు దగ్గరకు ప్రజలు వఛ్చి నీవు మాకు  రాజుగా ఉండు అని ప్రాధేయ పడుతున్నారు. ఎందుకంటే, అతడు ఇతర రాజులతో యుద్ధము చేసి వారిని ఓడించి ఇశ్రాయేలు ప్రజలను గొప్పగా గెలిపించాడు. ఇది చూసిన, తెలుసుకొనిన ప్రజలు తన దగ్గరకు వచ్చి, నీవు మాకు రాజుగా ఉండు అని అడుగుతున్నారు.కానీ సువిశేషములో యేసు ప్రభువు సిలువమీద వున్నప్పుడు తనను ప్రజలు చూస్తున్నారు కానీ, దేవునిగా గుర్తించలేకపోయారు. ప్రధానార్చకులు తనను తాను రక్షించుకోమని హేళనచేశారు, అక్కడ ఉన్నటువంటి భటులు యేసు  ప్రభువుని   హేలనచేశారు. కానీ తనతోపాటు సిలువవేయబడిన దొంగవాడు మాత్రం దేవుని యొక్క మహిమను తెలుసుకొని రాజుగా స్వీకరించి, యేసుతో పలికిన మాట:యేసూ, నీవు నీ రాజ్యములో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకంనుంచుకొనుము" అని పలికాడు. అప్పుడు యేసు ప్రభువు,నీవు ఇప్పుడే నాతోపాటు పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు అని పలికాడు. అంటే ఈలోకంలో నీవు ఎన్ని పాపములు చేసినా దేవుని యందు విశ్వాసముకలిగి పశ్చాత్తాపముతో ప్రార్ధన  చేస్తే  దేవుడు తప్పక మన ప్రార్ధన ఆలకిస్తాడు. మన యేసు ప్రభువు ఎంతో మందిని స్వస్థ పరిచాడు, ఎంతోమందికి చూపును దయచేసాడు, ఎంతోమందికి నూతన జీవితమును ప్రసాదించాడు. ఎందుకంటే అయన మనల్ని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. అంతగా ప్రేమించే దేవాతి దేవుడవైన యేసు ప్రభువుని ఒక రాజుగా, దేవునిగా, అభిషిక్తుడుగా, సృష్టికర్తగా మనము స్వీకరిస్తున్నామా లేదా ని ఆత్మపరిశీలన  చేసుకోవాలి.

     చివరిగా, ఈపండుగరోజు మనమందరముకూడా  యేసును రాజుగా అంగీకరిస్తున్నామా? లేక అయన అధికారమునకు లోబడి ఉంటున్నామా? ఆయనకు విధేయత కలిగి జీవిస్తున్నామా?అని  ఆత్మపరిశీలన చేసుకుందాం! ఆమెన్ .

 

 

                                                                                                                                     By

Br.Simon

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...