29, జులై 2023, శనివారం

17th Sunday in Ordinary Time Year A

 

17th Sunday in Ordinary Time Year A

INTRODUCTION

Dear brothers and sisters, two significant questions arise from the readings of the day: What is invaluable and indispensable ; how to attain and sustain it. Thus, Today’s readings drive our attention to the fact that if there is anything that we should consider  invaluable and indispensable most in this life it must be God because He is that Eternal Wisdom that was revealed to Solomon;  He is the Eternal Treasure and Pearl that fills the hearts of those who encounter him with an inexplicable joy.

The readings are thus meant to help us retrace our steps and to reinvest our energies to searching for God, attain Him and to be ready to lose ourselves for Him in order to sustain Him. Because when we consider something invaluable, we spend our time and energy to pursue it no matter the amount of hurdles on the way, we face, we withstand and we achieve. So, What can we give up today as an exchange for God? This is the question particularly that requires a sincere response from each one of us.

  1. The Element of Surprise:

“Ask something of Me and I will give it to you.” This was a surprise request from God to King Solomon God which the king had not expected. Even Jesus said, Ask and It will be given to you.  Thus God revealed himself as a caring father who is ready to give from his infinite riches to his children. This was in fact to fulfil the promise made to David by God. On the other hand Solomon too surprised God with the type of request he made. He requested for wisdom which he considered primary.

In the Gospel, we are presented with the parables of the buried treasure and that of the costly pearl. Jesus elsewhere said, Seek and you will find it. In the first parable  The treasure stumbled upon, it was a moment of great opportunity, while the pearl was discovered through a lengthy search, referring to the fruit of one’s hard labour; but in both instances, the farmer and the Merchant were filled with Surprise as well as joy.  Whether the opportunity comes, because of our Parents (in the case of Solomon), or unplanned opportunity or as the result of one’s effort. Life is full of surprises, we never know God can surprise us through different means.

  1. The Will to Sacrifice:

When Solomon says, “Give Your servant an understanding heart to judge Your people and to distinguish right from wrong,” he does not ask for strength, nor for riches, nor for a good life for himself, nor for triumph over his enemies.  Instead, King Solomon seeks wisdom, a capable mind to be Just and understanding in order to serve the people.

The two finders in the Gospel, there was no second thought in them. They immediately perceived the incomparable value of what they found and resolved to lose everything  to acquire them. But why would Solomon not ask for riches and strength and why would farmer and merchant need to sell everything? As St. Augustine said, What counts is that one must lose something in order to have it. The scriptures tell us that when one truly comes in contact with the richness and beauty in God, he will certainly start anew by renouncing the old self and emptying whatever false treasure he had been living with; the things that are incompatible with the new life. Yes, when we discover Jesus and his vision of life, everything else becomes secondary.

This is exactly what St. Paul meant when he said: “I count everything as loss because of the surpassing worth of knowing Christ my Lord. For his sake I have suffered the loss of all things and count them as nothing, in order that I may gain Christ” (Philippians 3:8). Therefore, King Solomon, the farmer and the merchant tell us one thing, that we need to be aware of what is invaluable and primary in our life and family, and be ready to lose all other secondary, unnecessary appliances that burden us.

  1. The Sublime Joy:

We see dear brothers and sisters, God blessed Solomon beyond limits, with an unlimited blessing. Along with the gift of wisdom, he was blessed with riches, strength and peace in the kingdom and with other foreign kingdoms. His reign was considered a golden age and unprecedented prosperity for the nation of Israel.

The farmer and the merchant, both were filled with deep-seated joy that spurred their subsequent actions. They are overwhelmed that they have discovered what he was looking for.

Jesus is that Eternal Wisdom, Treasure and the Pearl whoever possesses him, will subsequently possess the eternal Joy and richness of blessings .

Dear Brothers and sisters,  Some of us might find God through miraculous events in our life, like the treasure stumbled upon by the farmer. There are others who have to go through nights of labour like Peter in Luke chapter 5, passing through rough experiences of life until we finally encounter him at the dawn of the day, similar to the lengthy search by the merchant.

However, we are chasing false treasures such as money, status or pleasure, and often, we are locked into regrets over the past, or focused too much on the future. As a result, the enriching present passes us by, and the treasure is never discovered. Thus, the really valuable pearl of life, family, present moment and God above all is not found. Therefore, we need to have a heart to sacrifice, but Jesus is not asking us of an extraordinary thing. No! He is only concerned with that particular thing; that false treasure we hold high esteem needs to be eliminated. Jesus tells us today that we’ve got to exchange them for God because they are the things that render us ‘scrabs’ in the net of God instead of good fish.

Let us always remember that Heaven, the Blessing, the love of God, the wisdom, treasure and the pearl is within the reach of all of us, as the second reading puts it   “all things work for good for those who love God.” Let us use our time and energies to go in search of that treasure and help others in their search.

 

 FR. JAYARAJU MANTHENA OCD

 

 

 

 


28, జులై 2023, శుక్రవారం

17 వ సామాన్య ఆదివారం

 17 వ సామాన్య ఆదివారం

1రాజులు 3:5,7-12

 రోమా 8:28-30

 మత్తయి 13:44-52

ఈనాటి దివ్య గ్రంథణాలు పఠణాలు క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని యొక్క విలువ తెలుసుకొని ఆయనను కలిగి ఉండుటయే ముఖ్యమైన సంపదని మనకు బోధిస్తున్నాయి. మనందరి యొక్క అనుదిన జీవితంలో ఎన్నో అంశాలలో మనం ఏది ఉత్తమము, ఏది సరైనదో దానిని మాత్రమే ఎంచుకొని దాని కొరకు జీవిస్తూ ఉంటాం అదేవిధంగా క్రైస్తవ జీవితంలో ఈ లోక సంపదల కన్నా పేరు ప్రతిష్టల కన్నా, ఆస్తిపాస్తులు కన్నా, అధికారం కన్నా, దేవుడే విలువైన వారు అని తెలుసుకొని వారిని కలిగి ఉంటే వారి జీవితంలో దేవుడు అంతయు సమకూరుస్తూ ఉంటారు. అందుకే దావీదు రాజు కీర్తనల గ్రంథం 23 వ అధ్యాయం 1 వచనంలో ప్రభువే నాకు కాపరి ఇక నాకు ఏ కొదమయు లేదు అని పలుకుతూ ఉన్నారు. 

దేవుడు తన జీవితంలో ఉంటే చాలు ఈలోక సంబంధమైనవి ఏవి కూడా తనకు అక్కరలేదు అనే అంశాన్ని దావీదు రాజు తెలుపుతున్నారు. ఆయన జీవితంలో తెలుసుకొనటువంటి సత్యం ఏమిటంటే దేవుడి కన్నా విలువైనది ఏదీ లేదు ఆయన కలిగి ఉంటే సమస్తము కూడా అందచేయబడుతుంది అని విశ్వసించాడు. ఆయన విశ్వసించిన విధంగానే దేవుడు అన్నియు సమకూర్చాడు ఎన్నో విజయాలు ప్రసాదించారు. ఈనాటి మొదటి పఠణంలో సొలోమోను రాజు యావే దేవుడిని వివేకమును, ప్రసాదించమని కోరుతున్నారు. తన తండ్రి తర్వాత ఇశ్రాయేలు ప్రజల రాజ్య బాధ్యతను స్వీకరించిన సొలోమోను రాజు ఆ ప్రజలను నడిపించుటకు తనకు కావలసినటువంటి జ్ఞానమును అడుగుచున్నారు. 

యావే దేవుడు సొలోమోను రాజుకు కలలో దర్శనమిచ్చిన సందర్భంలో సొలోమోను యొక్క వయసు దాదాపు 20 సంవత్సరాల ప్రాయం అలాంటి చిన్నతనంలో ఒక గొప్ప ప్రజలను నడిపించుటకు తన యొక్క జ్ఞానము సరిపోదని తెలుసుకొని దేవుని మీద ఆధారపడుతూ ఆయన దేవుని యొక్క వివేకము,  విజ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నారు. సొలోమోను రాజు దేవుడిని సంపదలు అడగలేదు పేరు ప్రతిష్టలు అడగలేదు, శత్రువుల యొక్క నాశనాన్ని అడగలేదు, దీర్ఘాయుష్షును అడగలేదు కానీ కేవలం ఆయన అడిగినది వివేకం మాత్రమే. మంచి చెడులు తెలుసుకొని ప్రజలను సన్మార్గంలో నడిపించుటకు దేవుని యొక్క జ్ఞానం అడుగుతున్నారు ఆయన యొక్క కోరికలో నిస్వార్థం ఉన్నది. సొలోమోను అడిగినటువంటి వరము దేవునికి ప్రీతికరమైనది ఎందుకంటే ఆయన తన యొక్క ప్రజల మేలుకొరకై యొక్క వరం అడుగుతున్నారు. ప్రజల యొక్క అభివృద్ధి కొరకై, రక్షణ కొరకై అడుగుతున్నాడు కాబట్టి దేవుడు ఈ యొక్క గొప్ప కోరికను తీరుస్తూ ఉన్నారు. 

దేవుడు ఎంతటి గొప్ప వివేకమును దయ చేస్తున్నారంటే 12వ వచనంలో తెలియచేస్తున్నారు నీ ముందటి వారిలో గాని నీ తరువాత వారిలో గాని ఎవ్వరికీ లేని వివేకమును విజ్ఞానమును నీకు ప్రసాదించును అని ప్రభువు తెలియచేస్తున్నారు. దేవుడు ఎవరికీ ఇవ్వనటువంటి గొప్ప వరాన్ని సొలోమోను రాజుకు దయ చేస్తున్నారు. ఒక విధముగా చెప్పాలి అంటే సొలోమోను రాజు విజ్ఞానము విలువైనది అని తెలుసుకున్నారు అందుకనే దానిని సంపాదించుట కొరకు, ధనమును, పేరును ,అధికారమును అన్నియు త్యాగం చేసుకున్నారు. 

అన్నిటికంటే విజ్ఞానానికి, వివేకానికి సొలోమోను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మంచి చెడ్డలను తెలుసుకునే విచక్షణా జ్ఞానంతో ప్రజల యొక్క అవసరాలను మొత్తం అర్థం చేసుకొని దేవుని చిత్తానుసారంగా ఇశ్రాయేలు ప్రజలను సొలోమోను పరిపాలించ కోరాడు అందుకే దేవుడు అతడు కోరిన వరాన్ని కోరిన వెంటనే దయచేశారు. మన జీవితంలో కూడా జ్ఞానము విలువైనదని తెలుసుకొని ఆ జ్ఞానము కొరకు దేవుడిని అర్థించాలి. ఈనాటి మొదటి పఠణం ద్వారా సొలోమోను ఏ విధంగా అయితే మంచిది కనుగొని,ఎన్నుకున్నారో అలాగే మన జీవితంలో కూడా ఏది విలువైనది అని తెలుసుకొని దానిని పొందుకోవాలి.

ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో అలాగే దేవుని యొక్క ఉద్దేశానుసారంగా పిలువబడిన వారికి అంతయు మేలుయే జరుగును అని తెలుపుతున్నారు. మొదటిలో వారు కష్టాలను అనుభవించినప్పటికీ  చివరికి వారి జీవితంలో అంతా మంచే జరుగును. పౌలు గారు దేవుని చేత పిలవబడిన వారికి మేలు కలుగును అని తెలుపుతున్నారు దానికి ముఖ్యమైన ఉదాహరణ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఏసేపు గారి జీవితమే. ఆయన జీవితము మొదట కష్టాలతో కూడుకున్నది ఐగుప్తు దేశంలో మొదటిలో కష్టాలు అనుభవించారు జైల్లో ఉన్నారు అయినప్పటికీ దేవుడు అతడిని ఎన్నుకుంటున్నారు అతడే ఐగుప్తు ప్రజలకు ప్రధానమంత్రిగా నియమింపబడుతున్నారు అలాగే కరువు కాలంలో ఆయనే భోజనమును పెట్టేటటువంటి ఒక అన్నదాత గా ఉంటున్నారు మొదటిలో ఆయన కష్టాలు అనుభవించినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉండుటవలన అంతయు మంచియే జరిగినది. అదేవిధంగా పౌలు గారు కూడా మొదటిలో ఏసుప్రభు యొక్క సువార్తను బోధించేటటువంటి సందర్భంలో తన సొంత వారి దగ్గరకు వెళ్లి సువార్త ప్రకటన చేసినప్పుడు తనను అంగీకరించలేదు తాను కూడా కష్టాలు అనుభవించారు కానీ తర్వాత ఆయన అన్యులకు సువార్త ప్రకటించినప్పుడు వారు దానిని అంగీకరించారు మొదట్లో ఆయన కూడా కష్టాలు అనుభవించారు. దేవుడు తనకు తోడుగా ఉండటం వలన ఆయనకు మేలు ఏ జరిగింది అందుకే ఆయనను అన్యుల అపోస్తులుడు అని పిలుస్తూ ఉంటారు. దేవుడు పిలిచిన వారిని నీతిమంతులుగా చేస్తున్నారు అలాగే వారు తన యొక్క మహిమలో పాలుపంచుకొని జీవించేటటువంటి ఒక గొప్ప అర్హతను ప్రభువు దయచేస్తున్నారు వారి యొక్క జీవితంలో కష్టాలు అనుభవించినప్పటికీ కూడా దేవుడిని కలిగి ఉండుటవలన వారి జీవితంలో దేవుడు మేలులు చేస్తూ ఉన్నారు.

ఈనాటి సువిశేష పఠణంలో ఏసుక్రీస్తు పరలోక రాజ్యం గురించి మూడు ఉపమానముల ద్వారా తెలుపుతూ ఉన్నారు. దాచబడిన ధనము అను ఉపమానములో ప్రభువు ఒక వ్యక్తి తాను పొలములో పనిచేసే సమయంలో విలువైన సంపదను కనుగొని దానిని ఏ విధముగా పొందారు అనే అంశమును తెలుపుతూ ఉన్నారు. ఆ కాలంలో ప్రజలు డబ్బులు దాచుకోవటానికి ఇప్పుడున్నటువంటి బ్యాంకులు ఉండేవి కాదు మరియు ప్రజలు దొంగలకు, దోపిడీ దారులకు, యుద్దాలకు, భయపడి తమ యొక్క సంపదలను భూమిలోనే దాచి పెట్టేవారు. కొంతమంది దాచిన స్థలంలో ఆ ధనమును మళ్ళీ తీసుకొని వెళతారు మరి కొంతమంది ఆ ధనాన్ని మళ్లీ వెలికి తీసేవారు కాదు బహుశా ఆ స్థలం మరిచిపోవటంవల్ల లేకపోతే వారు మళ్ళీ అక్కడికి రాకపోవటం వల్ల. కాలక్రమేన అది పరుల కంట పడుతుంది మనం ఈరోజు చదివిన ఉపమానంలో ఒకడు భూమిని దున్నేటువంటి సమయంలో అచట పాతిపెట్టబడినటువంటి ధనమును కనుగొంటున్నారు. అది తన సొంత భూమి కాదు కనుక ఆయన తనకు ఉన్నది మొత్తం కూడా అమ్మి  ఆ పొలమును కొనుగోలు చేస్తున్నారు. ఈ యొక్క వ్యక్తి తాను అనుకోని రీతిగా సంపదను కనుగొన్నాడు కనుగొన్నటువంటి సంపదను పొందుటకు తన దగ్గర ఉన్నది మొత్తం కూడా హెచ్చించి ఆ యొక్క పొలమును తన సొంతం చేసుకున్నారు. ఆ సంపదయే విలువైనది అని గ్రహించిన ఈ వ్యక్తి తన దగ్గర ఉన్నది మొత్తం కూడా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఇది విలువైనదిగా భావించారు. అదే విధముగా రెండవ ఉపమానంలో ఒక వర్తకుడు ఆణిముత్యముల కొరకు వెదకుచున్నాడు వెదకినటువంటి వ్యక్తి ఒక ఆణిముత్యం దొరకగానే తన దగ్గర ఉన్నది మొత్తం కూడా అమ్మి వేసి ఈ యొక్క ఆణిముత్యమును తన సొంతం చేసుకుంటున్నారు. 

ఈ రెండు ఉపమానములలో ఒక అంశమును ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అదేమిటంటే కనుగొనుట దాచబడిన ధనము ఉపమానములో ఒకడు ధనమును కనుగొంటున్నారు ఆణిముత్యం యొక్క ఉపమానములో వర్తకుడు ఆణిముత్యం కనుగొంటున్నాడు. వీరిద్దరూ కూడా వారు కనుగొన్నది ముఖ్యం అని అలాగే అవి విలువైనవి అని తెలుసుకొని వాటిని పొందుకోవటం కోసమై వారి దగ్గర ఉన్నది మొత్తము కూడా త్యాగం చేశారు ఎందుకంటే వారు కనుగొన్నది వారితో ఉంటే దానికన్నా ఇంకా విలువైనది ఏమీ కూడా అవసరం లేదు అని వారు తెలుసుకున్నారు కాబట్టి అందుకనే వారి దగ్గర ఉన్నది మొత్తం కూడా అమ్మి వేసి ఒకరు పొలమును కొంటున్నాడు రెండవ వ్యక్తి ఆణిముత్యమును కొంటున్నారు. ఇద్దరు కూడా ఎంతో శ్రమించారు మరీ ముఖ్యంగా వర్తకుడు ఆణిముత్యం కోసం వెదికకాడు. ఈ సువిశేష భాగంలో మనము గమనించవలసిన విషయం ఏమిటంటే వెదికిన ప్రతి వారికి కూడా దొరుకును అనే సత్యమును దేవుడు వెల్లడిస్తున్నారు. పునీత ఎడిత్  స్టెయిన్ గారు సత్యం కోసం వెదికారు వెతికిన సత్యమును ఆమె క్రీస్తు ప్రభువే అని పునీత అవిలాపురి తెరిస్సమ్మ గారి పుస్తకములో తెలుసుకున్నారు. చాలామంది విశ్వాసులకు వెదికిన చోట దేవుడు దొరికి ఉన్నారు.

అలాగే కొంతమందికి దేవుని యొక్క అనుగ్రహం వలన ఉచితముగా దేవుడే తన యొక్క వరములను వెదకకపోయినా ఇస్తారు దానికి నిదర్శనమే దాచబడిన ధనము కనుగొన్న వ్యక్తి జీవితం. ఇది కేవలము దేవుని యొక్క ఉదారతయే. మన యొక్క జీవితంలో కూడా విలువైనది పొందాలి అంటే మనం కూడా కొన్ని త్యాగం చేసుకోవాలి. కొన్ని విడిచి పెట్టాలి. మరీ ముఖ్యముగా దేవుడిని కలిగి ఉండాలి అంటే పాపమును విడిచి పెట్టాలి అలాగే గర్వమును, వ్యసనములను అన్నిటిని కూడా వదిలిపెట్టినప్పుడే విలువైన సంపద అయిన దేవుడిని మనము కలిగి ఉంటాము. మొదటిగా మనందరం కూడా తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ఈ లోక సంపదల కన్నా అధికారం కన్నా పేరు ప్రతిష్టల కన్నా దేవుడే ఉంటే చాలు ఇంక ఏదీ కూడా అవసరం లేదు అని. ఏసుప్రభు తన యొక్క శరీర రక్తముల గురించి చెప్పినప్పుడు చాలామంది ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయారు కానీ పేతురు మాత్రము ఏసుప్రభు తో ఉంటే చాలు ఇక ఏది కూడా అవసరము లేదు అని మేము ఎక్కడికి పోలేము నిన్ను విడిచిపెట్టి అని అన్నారు ఎందుకంటే ఆయన ఏసుప్రభు యొక్క గొప్పతనమును, విలువను తెలుసుకున్నారు అందుకనే ఆయనను కలిగి ఉంటే చాలు ఇక ఏది కూడా అవసరం లేదు అని భావించాడు. 

మూడవ ఉపమానములో ఏసుప్రభు పరలోక రాజ్యమును మంచి చేపలు చెడు చేపలు పడిన వలతో పోల్చి చెప్తున్నారు అంటే మంచి వారు చెడ్డవారు కూడా అందరూ దేవుని యొక్క రాజ్యమునకు చెందినవారే కానీ అంత్యకాలమున ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవించరో వారిని పరలోకము నుండి వేరు చేస్తారు నిత్య శిక్షకు వారు గురి అవుతారు అని ప్రభువు తెలియచేస్తున్నారు. దేవుడు మనకు ఇచ్చినటువంటి జ్ఞానము వరములను బట్టి మంచి మార్గములను ఎన్నుకుంటూ దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ మనందరం జీవిస్తే తప్పనిసరిగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం లేకపోతే చెడు చేపల లాగా దేవుని యొక్క రాజ్యము నుండి పంపి వేయబడి శిక్షకు అర్హులవుతాం కాబట్టి మనందరికీ దేవుడు ప్రసాదించినటువంటి ఆత్మీయ వరములు ద్వారా విలువైనటువంటి దేవుని కలిగి మనము మంచి జీవితము జీవించాలి.

Fr. Bala Yesu OCD

22, జులై 2023, శనివారం

పదహారవసామాన్యఆదివారం

సొ.జ్ఞాన 12:13,16-19

రోమ 8:26-27

మత్తయి 13:24-43

                                                                                                                    బ్రదర్. సుభాష్. . సి. డి 

 

మొదటిపఠనం: దేవుడుతానున్యాయంమరియుదయగలదేవుడిగాచూపిస్తున్నాడు.

దేవుడు తన ప్రజలు పశ్చాత్తాపపడాలని ఎదురు చూస్తున్నాడు, దేవుడు తన ప్రజలు నీతిగా జీవించాలని కోరుకుంటాడు. దేవుడు తన ప్రజలకు నీతిమంతమైన జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛనిచ్చాడు.

మళ్లీమళ్లీ పాపంచేయడం మరియు తప్పుచేయడం మానవత్వం, దయ మరియు క్షమించడం దైవత్వంఅని మొదటిపఠనం వివరిస్తుంది. దేవుడు న్యాయమైన మరియు దయగలతండ్రి, అతను ప్రతిఒక్కరినీ సమానంగా చూస్తాడు. ఆయన మనందరికీ రక్షణపొందే అవకాశాన్ని కల్పిస్తాడు. మరియు ఎవరైనా దేవునిశక్తిని అనుమానించినప్పుడు, దేవునిశక్తి వివిధమార్గాల్లో ప్రజలకు చూపబడుతుంది. మానవులనుఖండించడానికిదేవునికిఅధికారంఉంది, కానీ ఆయన ఇంకా మనల్ని ఓపికగా భరిస్తున్నాడు.

Vs.19. దేవుడు తన ప్రజలు పశ్చాత్తాపపడుటకు వేచియుండుట మరియు ఆయన వారిని క్షమించుట మనము చూస్తాము. అలాగే దేవుడు మనలను కూడా తానుచేసినట్లుగాఒకరినొకరు క్షమించాలని కోరుకుంటున్నాడు. తన ప్రజలు నీతిగా జీవించాలని ఆయన కోరుకుంటాడు. దయ మరియు క్షమాపణవంటి దేవుని లక్షణాలను కలిగి ఉండమని ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు.

మంచిచేసేవారు దేవుని బిడ్డలని మరియు చెడుచేసేవారు సాతాను బిడ్డలని తెలియచేస్తున్నారు .

కావున దేవుడు మనలను తన మంచిబిడ్డలుగా ఉండమనికోరుచున్నాడు

 

కీర్తన: 86:5-6,9-10,15-16 : ఇది దయకోసం దేవునికి ప్రార్థన.

 

రెండవ పఠనం: ఆత్మ మనకొరకు దేవునితో విజ్ఞాపన చేస్తుంది.

స్వభావరీత్యా మానవులు బలహీనులు, పాపంవైపు సులభంగా పడిపోతారు. మనము తరచుగా పాపపుఉచ్చులో పడిపోతాము, మన సోదరులను ప్రేమించడంలో విఫలమవుతాము, ఇతరులను క్షమించడంలో విఫలమవుతాము, మరొకరి అవసరంలో మనం కనికరంచూపడంలో విఫలమవుతాము.

కానీ ఆత్మ అలాంటి వారందరికీ సహాయం చేయడానికి మరియు అవసరమైనది చేయడానికి సహకరిస్తుంది అని పునీత పౌలుగారు చెపుతున్నారుఆత్మమనలోఉంది, మన తరపున తండ్రికి విజ్ఞప్తి చేస్తుంది మరియు దేవుణ్ణి తండ్రి అని సంభోదించుటకు వీలు కల్పిస్తుంది. కాబట్టి మానవులుగా మనం శరీరానికి వ్యతిరేకంగా, మన కోరికలు మరియు స్వార్థపూరిత వైఖరితో పోరాడుతామని పౌలుగారు చెపుతున్నారు. మనం యేసు ద్వారా మనతండ్రికి ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ నిజానికి మనలో మూలుగుతూ ఉంటుంది. మరియు యేసుక్రీస్తుద్వారా మనం ప్రార్థనలో ఏది అడిగినా తండ్రి అయిన దేవుడు మనకు సమాధానం ఇస్తాడు లేదా దయచేస్తాడు అని పునీత పౌలుగారు చెపుతున్నారు.

సువిశేషం:ఈ సువార్తపఠనం గత ఆదివారం యేసు చేసిన ప్రసంగం యొక్క కొనసాగింపు.

నేటి సువార్తలో, యేసు పరలోక రాజ్యం గురించి వివరించడానికి మూడు ఉపమానాలు చెప్పాడుయేసు జన సమూహంతో ఉపమానాలుగా ఎందుకు మాట్లాడతాడో మరియు శిష్యులకు విత్తువాడు యొక్క ఉపమానాన్ని ఎందుకు వివరించాడో కూడా తెలియచేస్తుంది.

మొదటి ఉపమానం పరలోకరాజ్యం విత్తువాడు (దేవుడు)తో పోల్చబడిందని చెబుతుంది. మరియు పొలమును ప్రపంచం తోపోల్చారు, మరియు మంచి విత్తనాలను గోధుమలతో (దేవునిబిడ్డలుగా) మరియు చెడువిత్తనాలను కలుపు మొక్కలతో (సాతానుబిడ్డలుగా) శత్రువును (చెడు)గా పోల్చారు.

ఇక్కడవిత్తువాడు కలుపు విత్తనాలను పొలములో చల్లెనా?

లేదు. కానీ ఒక శత్రువు అసూయతో అలాచేశాడు.

దేవుడుచెడ్డవారినిసృష్టించాడా?

లేదుకానీ దుర్మార్గుడు సాతాను చెడును మంచిదని చూపించడం ద్వారాప్రజలను ప్రలోభపెట్టడం లేదా ప్రజలను పాపపు మార్గాన నడిపిస్తున్నాడు .ప్రజలు చెడు వైపు ఎందుకు మొగ్గుచూపుతారు,  ఎందుకంటే

-చెడు ఆకర్షణీయంగా ఉంటుంది.

- చెడు ప్రలోభపెడుతుంది.

- చెడు అందంగా కనిపిస్తుంది.

-చెడు మంచివలె నటిస్తుంది.

సుఖాలు, శక్తి,  లేదా సంపద మొదలైన వాటి రూపంలో చెడు మానవుడిని ప్రలోభపెడుతుందిఅయితే, గోధుమలు మరియు కలుపుమొక్కలు కలిసి పెరుగుతాయి మరియు పంటలను సేకరించేవరకు అవి గుర్తించబడవు. అదేవిధంగా ప్రపంచంలో మంచివ్యక్తులు (దేవునిబిడ్డలుగా) మరియు చెడ్డవ్యక్తులు (చెడుబిడ్డలుగా) కలిసిజీవిస్తారుతుది తీర్పు వరకు ఏది మంచి మరియు చెడు అనేది గ్రహించబడదు.

విత్తువాడు చివరి వరకు ఓపికపట్టి. గోధుమలు మరియు కలుపుమొక్కలను వేరుచేస్తాడు. అలాగే దేవుడు కూడా చాలా ఓపికగా ఉంటాడు, చెడ్డ వ్యక్తులు మంచి వారిగా మారాలని ఎదురుచూస్తాడు. మరియు తీర్పు రోజున అతను మంచి మరియు చెడులను వేరుచేస్తాడు. మంచి వ్యక్తులు దేవునిబిడ్డలుగా అవుతారు మరియు వారు పరలోక రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారు. మరియు చెడుప్రజలు చెడుబిడ్డలుగా,  నిత్య నరకాగ్ని వారికి వారసత్వంగా ఉంటుంది.

ఉపమానం దేవుని సహనాన్ని మరియు దీర్ఘశాంతాన్ని నొక్కి చెబుతుంది, ఎందుకంటే అతను గోధుమలు మరియు కలుపు మొక్కలను రెండింటినీ పంట వరకు కలిసి పెరగడానికి అనుమతించాడు, ఇది చివరి తీర్పు  మరియు పశ్చాత్తాపానికి ప్రతీక.

ఎదుగుదల మరియు ఫలవంతం: విశ్వాసుల జీవితాల్లో ఆధ్యాత్మిక వృద్ధి మరియు ఫలవంతమైన ప్రాముఖ్యతను ఉపమానం వివరిస్తుంది.ఇది గోధుమల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది, నిజమైన విశ్వాసం మరియు నీతివంతమైన జీవనం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది.

రెండవ ఉపమానం ధ్యానించి నట్లయితే, దేవుని రాజ్యం ఆవగింజలాంటి దని, అది ఒకపెద్ద చెట్టుగా మారి ఆకాశ  పక్షులకు ఆశ్రయం అవుతుంది. క్రైస్తవమతం యొక్క విశ్వాసం ప్రారంభంలో చిన్నదికావచ్చు కానీ తరువాత అది పెరుగుతుంది మరియు అనేక మంది ప్రజలు, సంస్కృతులు మరియు దేశాలు, దేవుని ప్రేమను అర్థం చేసుకొనిదేవుని రాజ్యం మనం ఊహించిన దానికంటే భిన్నమైనదని గ్రహిస్తారు.దేవుని రాజ్యం దయ మరియు కరుణతో నిండి ఉంది అని గ్రహిస్తారు.

మనం నిద్రలో ఉన్నప్పుడు అంటే అజాగ్రత్తతో ఉంటె శత్రువు ఉద్దేశపూర్వకంగానే నాశనం చేయడానికి వచ్చి పొలంలో కలుపు మొక్కలను చల్లుతారు. అంటే మనం మెలుకువగా ఉండాలి లేదా మన చుట్టూ ఉన్నచెడు గురించి జాగ్రత్తలుతెలుసుకోవాలి. పునీత పేతురు గారు తన లేఖలలో నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1పేతురు 5:8).

కాబట్టి ఈ ఉపమానం మనలను ప్రార్థనలో అవగాహన కలిగి ఉండాలని బోధిస్తుంది. విఫలమవ్వకుండానిత్యమూ ప్రార్థన చెయ్యమనికోరుతున్నాడు. ఎందుకంటే సాతాను మనవెంటే పొంచి ఉంటుంది.

మూడవ ఉపమానం ద్వారా మనందరం కూడా పులిసిన పిండి వలె ఉండమని , మనం కుటుంబాల్లో మరియు సమాజాలలో, దేవుని ప్రేమ మరియు దయను వ్యాప్తిచేయడం లేదా ఇతరులకు మంచితనాన్ని పంచుకోవడంలో పులిసిన పిండిలాగా ఉండాలి. మనం కూడా భూమిపై దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలని ఈమూడుపఠనాలు మనల్నికోరుతున్నాయి.


పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...