20, ఫిబ్రవరి 2021, శనివారం

తపస్సు కాల మొదటి ఆదివారం

  

ఆదికాండము 9: 8-15 , 1 పేతురు 3: 18-22, మార్క్ 1:12-15

ప్రియా దేవుని బిడ్డలారా ,సహోదరి సహోదరులారా , ఈనాడు మనం  తపస్సుకాల మొదటి  ఆదివారాన్ని కొనియాడుతున్నాము.  ఈనాడు  తల్లి  తిరుసభ  మన జీవితములో మార్పు, మరియు  హృదయ పరివర్తన గురించి  ధ్యానించ  ఆహ్వానించుచున్నది. తపస్సు కాలము యొక్క  ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మానవుడు  తన చేదు క్రియలను, ఆలోచనలను , మాటలను  వదలి , మంచి  క్రియలవైపు , మంచి జీవితం, మంచి  ఆలోచనలవైపు మరియు  మంచి మాటలవైపు మరలడం.  అదే పలు  పశ్చాత్తాప, ఉపవాస మరియు  త్యాగ క్రియల ద్వారా తన  నడవడికను క్రీస్తులో నూత్నికరించుట.  ఈనాటి  సువిశేషంలో  క్రీస్తు ప్రభువు  హృదయ పరివర్తనకు ఆహ్వానము పలుకుచున్నాడు. కాలము  సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది. హృదయ పరివర్తన చెంది , సువార్తను విశ్వసింపుడు. (మార్కు :1, 15) అని ఆహ్వానిస్తున్నారు. 

మార్పు : 

మానవజీవితములో  మార్పు  అనేది సహజము.  లోకములో  ప్రతి  వస్తువు, ప్రతి విషయము మారుతు  ఉంటుంది.  మారాలి కూడా. ఎందుకంటే  మార్పులోనే అందము, ఆనందము ఉంటుంది.  అందుకే అంటారు, పాతోక  రోత , క్రొత్త ఒక వింత అని. కనుకనే మానవుడు ప్రతి విషయములోను కూడా  కొత్తదనం కోరుకుంటూ ఉంటాడు.  దైనందిన  జీవితములో కానివండి వ్యాపారములో కానివండి. ,భోజన పదార్థములో కానివ్వండి. ప్రతి  విషయములో కుడా  మార్పుదే విజయము. లోకములో అన్నింటిలోనూ మార్పు , క్రొత్తదనం  కోరుకుంటాడు మానవుడు . దానికి తగినట్లే  క్రొత్త క్రొత్త  విషయములను కనిపెడుతూ ఉంటాడు. ఈ మార్పు  అనే  సూత్రంతోనే  అన్నింటిలోనూ అభివృద్ధి  చెందుతూ ఉన్నాడు. 

 

ఈనాడు  టెక్నాలజీ  పెరిగింది , రక్త  సంభందాలు తగ్గినవి .  ఆస్తు పాస్తులు  పెరిగాయి , బంధుప్రీతి తగ్గినది. వస్తు వినియోగమపెరిగినది. మనిషి విలువ తగ్గినది, క్షణభంగురమైన , అశ్వాశత విషయములపై  ఆసక్తి పెరిగినది, శాశ్వత విషయములగు దేవుడు , ఆత్మ , ఆనందము, సంతోషం, ప్రేమ సహవాసము అను విషయములపై శ్రద్ద తగ్గినది.

ప్రియా దేవుని బిడ్డలారా మనం ఒకసారి  ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎక్కువ  దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాము, లోకములో ఉన్న వాస్తువులకా లేక జీవిత మార్పుకా . 

ప్రేమ - హృదయ పరివర్తన 

నోవా కాలంలో మానవుడు ఘోరమైన  పాపంలో  జీవిస్తున్న సమయములో దేవుడు  కోపించి  మానవుని నాశనం  చేయాలనీ జలప్రళయమును పంపించాడు.  చివరకు నోవా కుటుంబ సభ్యులు  మాత్రమే  రక్షించబడ్డారు, ఈ యొక్క  పతనాన్ని  చూచి దేవుడు మనసు మార్చుకొని నోవాతో ఒడంబడిక  చేసుకుంటున్నాడు.  అది ఏమిటంటే  ఇక ఎన్నడూ ఇటువంటి ముప్పును పంపనని ఆది ఖాండము 9:11 . అలాంటి గొప్ప దేవుడు  మానసు మార్చుకొని  తన ఏకైక  కుమారుణ్ణి మన రక్షణార్థమై పంపియున్నాడు యోహాను3:16. మరి మనము ఎందుకు  హృదయ పరివర్తన చెందలేకున్నాము. 

చివరిగా ఈ తపస్సు కాలములో తరచుగా వినపడే మాటే ఇది .. హృదయ పరివర్తనలే కుండా  మనిషికి పర లోక రాజ్యములో తావులేదు. చక్కని గులాబీ పువ్వు చుట్టూ బోలెడన్ని ముల్లుంటాయి. గులాబీ కోయాలంటే మన చేయి ముల్లులలను ధాటి వెళ్ళాలి. అదే విధముగా పరలోకరాజ్యములో శశ్వతానందం పొందాలంటే  హృదయ పరివర్తన తప్పనిసరి. 

కాబట్టి  ఈ తపస్సు కాలము మొత్తము కూడా దేవుని వాక్యాన్ని  ఆలకిస్తూ , పాటిస్తూ ,మన జీవితలను చిగురింప  చేయమని ప్రార్థనచేద్దాం '. 

 

బ్రదర్ అబ్బదాసరి రత్నరాజు ఓ  సి డి 

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...