4, జూన్ 2022, శనివారం

పెంతుకోస్తు మహోత్సవం(2)

పెంతుకోస్తు మహోత్సవం
అ. కా. 2 ;1-11
1 కొరింతి 2;3-7,12-13,
యోహాను 20;19-23

ఈరోజు తల్లి శ్రీసభ పెంతుకోస్తు పండుగను కొనియాడుతుంది. ఈరోజును వివిధ రకాలుగా పిలువవచ్చు .  శ్రీసభ ప్రారంభమైన రోజు అని,  పవిత్రాత్మ  శిష్యుల పై వేంచేసి వచ్చిన రోజు అని క్రీస్తునందునికి సాక్షులుగా జీవించమని కోరిన పండుగ. 

Pentecost అనే మాట గ్రీకు నుంచి వచ్చింది. గ్రీకు భాషలో దీనిని Pentekoste  అంటారు.  అనగా 50 వ రోజు అని అర్ధం.

పాస్కా  పండుగ అయిన 50   రోజుల తరువాత జరుపుకునే ఒక విలువైన  పండుగ.  క్రీస్తు ప్రభు యొక్క  పునరుత్తానం అయిన 50 రోజులకు  క్రైస్తవులు భక్తి విశ్వాసంతో జరుపుకునే పండుగ ఇది.
ఈ పండుగను యూదులు కృతజ్ఞత పండుగగా  జరుపుకునే  వారు.    దేవుడు ఇచ్చిన పంటలకు గాను కృతజ్ఞత తెలుపుతూ దేవుని యొక్క గొప్ప కార్యాలు  తలుచుకొని చేసే పండుగ ఇది .

ఈరోజు తల్లి శ్రీసభ పుట్టిన రోజు ఎందుకంటే పవిత్రాత్మ  శక్తిని  పొందుకున్న  తరువాతనే శిష్యులు భహిరంగ సువార్త ప్రకటన చేశారు. దేవుని యొక్క  ఆత్మను స్వీకరించిన అపోస్తులు  భయం విడనాడి దేవుని యొక్క  రక్షణ  ప్రణాళికను కొనసాగించారు. యేసు ప్రభు శిష్యులకు వాగ్దానం చేసిన విధంగా ఆదరణ కర్తను వారి చెంతకు పంపించారు.    మనందరికీ పవిత్రాత్మ రాకడ ఎంతగానో  ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది.

ఈనాటి  మొదటి పఠనములో  పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తుల మీదకి  వేంచేసిన  విధానాన్ని చదువుకుంటున్నం మరియతల్లి  శిష్యులందరు  ఒక గదిలో వుండగా ప్రార్ధించే సమయంలో  పవిత్రాత్మ  దేవుడు వారి మీదకి  దిగి వచ్చారు. 

అప్పటివరకు వరకు భయంతో వున్నారు ప్రాణాలు అరచేతులో పెట్టుకొని జీవించారు  కానీ ఎప్పుడైతే  పవిత్రాత్మను స్వీకరించారో  వారి జీవితములే మారిపోతున్నాయి . బలహీనులు బలవంతులు అవుతున్నారు భయంతో వున్నవారు  ధైర్యవంతులు అగుచున్నారు . 

పవిత్రాత్మ అగ్నిజ్వాలలు రూపంలో శిష్యుల మీదకి  దిగివచ్చారు. యెరుషలేములో సువార్త ప్రారంభించిన సమయంలో అక్కడ దాదాపు   16 భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వారందరు కూడాప్రవచనాలు  వారి యొక్క  సొంత భాషలోనే వింటున్నారు  ఇది కేవలం పవిత్రాత్మ యొక్క పనియే  .(అపో 2 ;9 -10 ). 

బాబెలు గోపురం వల్ల పలు భాషల అడ్డు గోడలు కూలి  పోయాయి .దీని ద్వారా యేసు ప్రభు సందేశం  అందరికి చెందింది దానిని అందరు అర్ధం చేసుకుంటారు అని తెలుస్తుంది  అన్నీ భాషలో దేనువుని సందేశం వింటున్నారు అంటే  ఎన్నుకొన్న  జాతి  , ప్రజా ,అంటూ ప్రత్యకంగా  లేరు అందరూ  కూడా దేవుందని ప్రజలే  దేవుని రాజ్యంలోకి నడరు పిలువా పడినవారు   ఎవరు కూడా ప్రత్యకంగా నియమింప పడిన వారు కాదు అందరు కూడా దేవుని యొక్క సొంత  ప్రజలే .

పవిత్రాత్మను స్వేకరించి తరువాతనే  శిష్యులు  సాక్షులుగా మరి తమ యొక్క  ప్రాణాలు సైతం  దేవునికి ఇవ్వాలి అనుకున్నారు .పెంతుకోస్తు  పండుగ పాత నిబంధన  గ్రంధంలో కూడా చూస్తుంటం  పాత  పెంతుకోస్తు  పండుగకు   క్రొత్త పెంతుకోస్తు  పండుగకు  దెగ్గర సంభందం ఉంది . 

పాత పెంతుకోస్తు పండుగ  సీనాయి పర్వతము దగ్గర  దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను సూచిస్తుంది .ప్రభు  సినాయ్  పర్వతం పైకి వేంచేసి వచ్చినపుడు ఆ పర్వతం మీద ఉరుములు  మెరుపులు  మేఘాలలో  యెహువె  దేవుడు శిష్యులమీదకి  దిగి వచ్చారు . (నిర్గమ 19 ;16 -18 )

నూతన నిబంధన  గ్రధంలో కూడా  శిష్యులమీదకి పవిత్రాత్మ  వేంచేసినపుడు బలమైన గాలులు వచ్చాయి .పవిత్రాత్మను  పవిత్ర  గ్రంధంలో వివిధ చిహ్నాలతో పోల్చుతారు.  

-అగ్నితో 
- పావురంతో 
- గాలితో 
- నీటితో

గ్రీకు భాషలో ఉపిరికి  ఆత్మకు  ఒకే పదాన్ని   ఉపయోగించారు  ఊపిరి దేవుని ఆత్మకు గుర్తు దేవుని జీవానికి  గుర్తు. దేవుడు మట్టితో  చేసిన  మానవ రూపంలోకి  తన జీవం ఊది తొలి మానవ వ్యక్తిని సృష్టించి  క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడు పవిత్రాత్మ  అనే  శ్వాసనుది క్రొత్త జీవితం  ప్రసాదించారు.

పవిత్రాత్మను  అగ్నితో  పోలుస్తారు అగ్ని దేవుని స సాన్నిదికి  గుర్తు  అగ్ని అని తనలాగా  మార్చుకుంటుంది  అలాగే  పవిత్రాత్మ అందర్నీ తనలాగా  మార్చుకుంటుంది  అగ్ని దహించును  అలాగే  పవిత్రాత్మ   మన  పాపాలను  దహించి  మనకు  పవిత్రాత్మను  దయచేస్తుంది. 
  
అగ్ని క్రొత్త జీవాన్ని పుట్టిస్తుంది, రగిలించుకుంటుంది. పవిత్రాత్మ కూడా శిష్యులలో  క్రొత్త జీవాన్ని పుట్టించారు. అప్పటివరకు భయంతో మరణించిన వారిలో క్రొత్తజీవం నింపారు. 

అగ్ని  వెలుగును  ఇస్తుంది  దరి చూపుతుంది  అదే విధంగా  పవిత్రాత్మ  దేవుడు   శిష్యుల యొక్క  అంధకారం  అనే  అజ్ఞానం  తొలగించి దేవా జ్ఞానం  అనే వెలుగును  నింపారు .
 
పవిత్రాత్మ శిష్యులకు దారి  చూపించారు     ఎటుయైపు   వెళ్ళి సువార్తను  ప్రకటన చేయాలో తెలిపారు  .

రెండొవ పఠనంలో  పౌలు గారు  ఆత్మ  స్వభావం గురుంచి తెలిపారు  
         
1 .ఆత్మ అందర్నీ  ఒకే  సమాజంగా  ఐక్యపరుస్తుంది
ఆత్మ ప్రత్యేక అనుగ్రహాలను దయచేస్తారు. వాటిని అందరూ పొందుకుంటారు. 
౩ ఆత్మ పరిచర్యకు  ఎన్నుకొంటుంది  సేవకు వారిని పంపిస్తారు

జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరు సువార్త సేవకు అర్హులే. 
పవిత్రాత్మ దేవుడు మనందరినీ క్రీస్తు శరీరంలో ఐక్యపరచి మనలను ముందుకు నడిపిస్తారు.  
సువార్త పఠనంలో కూడా యేసు ప్రభువు శిష్యులకు పవిత్రాత్మను ఒసగి వారిలో ధైర్యం నింపుచున్నారు. వారిలో క్రొత్త జీవం దయ చేశారు. ప్రపంచమంతటా తిరిగి సువార్త సేవచేయుటకు వారిని పంపిస్తున్నారు. 

ఈరోజు పవిత్రాత్మ దేవుని పండుగ కాబట్టి పవిత్రాత్మ చేసే వివిధ పనుల గురించి ధ్యానిద్దాం. 
1 . పవిత్రాత్మ  మనకు సహాయం చేస్తారు - రోమా 8 : 26 
2 . పవిత్రాత్మ  మనల్ని నడిపిస్తారు - యోహాను 16 : 13 
3 . పవిత్రాత్మ  మనకు బోధిస్తారు - యోహాను 14 : 26  
4 . పవిత్రాత్మ  మనతో మాట్లాడతారు - దర్శన 2 : 7 
5 . పవిత్రాత్మ  మనకు బయలు పరుస్తారు - 1  కొరింతి 2 : 10 
6 . పవిత్రాత్మ  మనకు సూచనలిస్తారు - అ. కా. 8 : 29 
7 . పవిత్రాత్మ  క్రీస్తుకు సాక్షమిస్తారు - యోహాను 15 : 26 
8 . పవిత్రాత్మ  మనల్ని శాంతి పరుస్తారు - అ. కా. 9 : 31 
9 . పవిత్రాత్మ  మనల్ని పిలుస్తారు - అ. కా. 13 : 2 
10 . పవిత్రాత్మ  మనలను దైవంతో నింపుతారు - అ. కా. 4 : 31 
11 . పవిత్రాత్మ  మనల్ని బలపరుస్తారు - ఎఫెసీ ౩: 16 
12 . పవిత్రాత్మ  మనకోసం ప్రార్ధిస్తారు - రోమా 8 : 26 
13 . పవిత్రాత్మ  మన ద్వారా సువార్త పరిచర్య చేస్తారు - 2  పేతురు 1 : 21 
14 . పవిత్రాత్మ  సత్యంకు సాక్ష్యమిస్తారు - రోమా 9 : 1 
15 . పవిత్రాత్మ  మనకు ఆనందం దయచేస్తారు - 1 తెస్స  1 : 6 
16 . పవిత్రాత్మ  మనకు స్వేచ్ఛనిస్తారు - 2 కొరింతి 3 : 17 
17 . పవిత్రాత్మ  విధేయించుటకు సహకరిస్తారు - 1  పేతురు 1  : 22 
18 . పవిత్రాత్మ  మనల్ని క్రీస్తు చెంతకు నడిపిస్తారు - దర్శన 22 : 17 
19 . పవిత్రాత్మ  మన జీవితాలను మార్చుతారు - 2  కొరింతి 3 : 18 
20 . పవిత్రాత్మ  మనలో జీవిస్తారు - 1 కొరింతి 3 : 16 

పవిత్రాత్మ మనకు స్వేచ్ఛ నిస్తారు - రోమా 8: 32
పవిత్రాత్మ  మనలను నుతనికరిస్తారు - తీతు 3: 5
పవిత్రాత్మ  మనలో ఆత్మీయ ఫలములను దయచేస్తారు - గలతి5:22-23
పవిత్రాత్మ  మనకు వరాలు దయచేస్తారు - 1 కొరింతి 12:8-10
పవిత్రాత్మ  మనల్ని  ముందుకు తీసుకొనివెళ్తారు - రోమా 8:14 
పవిత్రాత్మ  మనల్ని  నిరపరాధులు చేస్తారు - యోహాను  16:8
పవిత్రాత్మ  మనల్ని  పవిత్ర పరుస్తారు - 2 తెస్స  2:13
పవిత్రాత్మ  మనల్ని  ధృడంగా ఉండేలా చేస్తారు - అ. కా. 1:8
పవిత్రాత్మ  మనల్ని   ఐక్య పరుస్తారు - ఎఫెసీ 4:3- 4
పవిత్రాత్మ  మన మీద దేవుని ముద్ర వేస్తారు - ఎఫేసి 1:13
పవిత్రాత్మ  మనల్ని  తండ్రి చెంతకు నడిపిస్తారు - ఎఫేసి 2:18
పవిత్రాత్మ  మనకు సహనం  దయచేస్తారు - గలతి 5:5
పవిత్రాత్మ  సైతాను శక్తులను పారద్రోలుతారు 

పవిత్రాత్మ దేవుడు మనకు అనేక విధాలుగా దీవెనలు ఒసగుతుంటారు. మనం కూడా పవిత్రాత్మను పొందినవారం కాబట్టి సువార్త సేవ చేస్తూ దేవుని ప్రేమను పంచుదాం.
 
పవిత్రాత్మ   దేవుని యొక్క పాత్ర:
పవిత్రాత్మ దేవుడు మనందరినీ దేవుని నివాస స్ధలం చేశారు. మన హృదయంలో ఉండేలాగా చేస్తారు. కొరింతి మనందరికీ శక్తిని ఇస్తారు. ఈలోక శక్తులను ఎదుర్కొని ముందుకు సాగుటకు, సైతాను  శక్తులను అధిగమించుటకు అదే విధంగా దేవునికి సాక్షులై ఉండుటకు దేవుడు వారికి శక్తిని దయచేస్తారు. 

పవిత్రాత్మ దేవుడు మనల్ని పవిత్ర పరుస్తారు. దివ్య సంస్కారాలు స్వీకరించుట ద్వారా మనల్ని పవిత్రపరుస్తారు.  

- జ్ఞానస్నానం ద్వారా మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తారు. 
- భద్రమైన అభ్యంగనం ద్వారా దేవునితో మరియు పొరుగువారితో సఖ్యపడేలా చేస్తారు.
- దివ్య సత్ప్రసాదం ద్వారా ఆధ్యాత్మిక భోజనం దయచేస్తారు. 
-గురుపట్టాభిషేకం మరియు వివాహం ద్వారా మనల్ని పవిత్రపరుస్తారు. 
దేవుని విషయాలు బోధించి మనల్ని పరలోకానికి చేర్చుతారు. 
మన యొక్క బాధలను వింటారు. మనకు ఊరటను దయచేస్తారు. మన యొక్క ప్రార్ధనలు వింటారు, మనల్ని ప్రార్ధించేలా చేస్తారు. 
మనకి వరాలిచ్చి, ఫలాలను ఇచ్చి మనందరికీ కర్తవ్యం గురించి తెలుపుతారు. 

Rev. Fr. Bala Yesu OCD

పెంతెకోస్తు మహోత్సవము

పెంతెకోస్తు మహోత్సవము

 అ.కా. 2:1-11
1 కొరింతి 12:3-13
 యోహాను 20:19-23

క్రీస్తునాధునియందు ప్రియమైన సహొదరీ సహోదరులారా! ఈనాడు తల్లి తిరుసభ పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడుచున్నది. నిజానికి పెంతెకోస్తు పండుగ తల్లి శ్రీసభ పుట్టినరోజు. పెంతెకోస్తు పండుగరోజున పవిత్రాత్మ రాకడను కొనియాడుతున్నాము. నేడు పవిత్రాత్మ అగ్నిజ్వాలలుగా మానవాళిపైకి దిగివచ్చిన ఆనందదాయకమైయిన శుభదినం. పవిత్రాత్మ శ్రీసభను నిర్మించి, ప్రభువు ఒసగిన ప్రేషితకార్యాన్ని గుర్తుచేసి, ఆత్మవరాలతో అందరిని నింపి దైవసేవకు పిలిచిన రోజు. 
పెంతెకోస్తు అనునది యూదుల పండుగ. పెంతెకోస్తు అనగా “50  వ రోజు “అని అర్దం. యూదులు పాస్కా పండుగ అనంతరం ఏడు వారాల తరువాత అంటే  50 రోజుల తరువాత పెంతెకోస్తు పండుగను కొనియాడేవారు. ఇది యూదుల మూడు ప్రధాన పండుగలలో ఒకటి. యూదులు ముఖ్యంగా   కొతకాలము ముగియు సందర్భమున దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు ఈ పండుగను చేసేవారు. 

పెంతెకోస్తు - ప్రభుని వాగ్ధానము నెరవేరిన రోజు :
పెంతెకోస్తు పండుగను ప్రభువు చేసిన వాగ్ధానము నెరవేరిన రోజు అని కూడా పిలవవచ్చు.  క్రీస్తు ప్రభువు కలవరపడుచున్న  తన శిష్యులకు పవిత్రాత్మను అనుగ్రహిస్తానని వాగ్ధానం చేసియున్నారు. "నేను మిమ్ము అనాధలుగా వదిలి పెట్టను. మీతో ఎల్లపుడు ఉండుటకు మీకు ఒక ఆదరణ కర్తను పంపుదును" (యోహాను 14 : 16 ), "నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్లి మీకు ఒక ఆదరణ కర్తను పంపిస్తాను" (యోహాను 16 :7 ) అని ప్రభువు సువిశేషంలో వాగ్ధానమొనర్చినట్లు మనం చూస్తున్నాం. 
ప్రభువు తాను చేసినా ఆ వాగ్ధానము ఈనాటి మొదటి పఠనంలో నెరవేరడం మనం చూస్తున్నాం. పవిత్రాత్మ అగ్నిజ్వాలలు రూపంలో నాలుకల రూపంలో శిష్యులందరిపై క్రుమ్మరింపబడి, ప్రతి ఒక్కరు పవిత్రాత్మ శక్తి ధ్వారా అన్య భాషలలో మాట్లాడసాగిరి (అ. కా. 2 : 2 - 4 ). అక్కరికి వెళ్లిన ప్రతి ఒక్కరు శిష్యులు వారి వారి సొంత భాషలలో మాటలాడుట విని కలవరపడి, ఆశ్చర్యపోయిరి (అ. కా. 2 : 6 - 7 ). ఈ విధముగా ప్రభువు శిష్యులకు తాను వాగ్ధానము చేసిన పవిత్రాత్మను దయచేసారు. 

ఈనాడు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని రాకడను కొనియాడుతున్న మనమందరము ఆయనను గౌరవించాలి, ప్రార్ధించాలి, మరియు ఆరాధించాలి. మనం ఎన్నడును పవిత్రాత్మకు వ్యతిరేకముగా మాట్లాడకూడదు, ఏ  కార్యము చేయకూడదు.  

ఎందుకు పవిత్రాత్మకు వ్యతిరేకముగా మాట్లాడకూడదు? ఏ కార్యము చేయకూడదు? 
“ఎవ్వడేని మనుష్యకుమారునికి వ్యతిరేకముగా మాటలాడిన క్షమింపబడును గాని, పవిత్రాత్మకు వ్యతిరేకముగా పలికినవానికి ఈ జీవితమందైనను, రాబోవు జీవితమందైనను క్షమాపణ లభింపదు" (మత్తయి 12 : 31 - 32) అని క్రీస్తుప్రభువు చాలా స్పష్టముగా చెప్పుచున్నారు. హెబ్రీయులకు వ్రాసిన లేఖలో కూడా 'దయామయుడగు పవిత్రాత్మను అవమానపరచువాని  గతి ఏమవుతుందో, అతడెట్టి నీచమైన శిక్షార్హుడో' అని విచారించడాని మనం చూస్తున్నాం (హెబ్రీ 10: 29). కనుక త్రిత్వంలో ఒకరైనటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరున్ని మనం ఈనాడు గౌరవించాలి, ఆరాధించాలి. 

పవిత్రాత్మను పొందాలంటే మనం ఏం చేయాలి?

1 . హృదయ పరివర్తన చెందాలి :
పవిత్రాత్మను పొందాలంటే ప్రతిఒక్కరు  ముందుగా పాపం నుండి వైదొలగి హృదయ పరివర్తన చెందాలి. "మీరు హృదయపరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు నామమున జ్ఞానస్నానము పొందవలయును. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు" (అ. కా. 2 : 38 ) అని అపొస్తలుల కార్యంలో మనకు తెలియజేయబడుతుంది. అనగా, పవిత్రాత్మను పొందుటకు హృదయ పరివర్తనం అనేది ఒక ముఖ్యమైన వారధి లేదా ధ్వారం వలె ఉన్నది.

2 . దేవునియందు విధేయత :
పవిత్రాత్మను పొందుటకు రెండవదిగా మనం చేయవలసిన ముఖ్య కార్యము దేవునియందు విధేయత కలిగియుండాలి. "దేవుడు తనపట్ల విధేయత చూపువారికి అనుగ్రహించిన పవిత్రాత్మ.........." (అ. కా. 5 : 32 ). ఎవరైతే దేవునియందు విధేయత భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టివారికి ప్రభువు పవిత్రాత్మను అనుగ్రహిస్తారు. 

పవిత్రాత్మను పొందుటవలన కలుగు మేలు ఏమిటి ?

1 . పాపములను క్షమించు అధికారం?
ఈనాటి సువిశేషం ద్వారా  ప్రభువు ప్రతి ఒక్కరికి పవిత్రాత్మ పొందుట ద్వారా పాపములను క్షమించు అధికారమును ఒసగుచున్నారు. "ప్రభువు వారిమీద శ్వాస ఊది 'పవిత్రాత్మను మీరు పొందుడు.ఎవరి పాపములనైనను మీరు క్షమించి యెడల అవి క్షమించబడును; ఎవరి పాపములనైనను మీరు క్షమింపని యెడల అవి క్షమింపబడవు"(యోహాను 20 : 22 -23 ) అని ప్రభువు పలుకుచు మనకు పాపములను క్షమించు ఒక గొప్ప అధికారమును పవిత్రాత్మద్వారా ఒసగుచున్నారు. 

2 . దేవుని రాజ్యంలోకి ప్రవేశం:
పవిత్రాత్మ మనకు దేవుని రాజ్యంలోకి చేరడానికి ప్రవేశాన్ని కల్పిస్తుంది.  "ఒకడు ఆత్మ వలన, నీటి వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యోహాను 3 : 5 ) అని పరిసయ్యుడైన నికోదేముతో ప్రభువు పలుకుచున్నారు. పవిత్రాత్మను స్వీకరింపని యెడల మనకు దైవ రాజ్యంలో స్థాన ఉండదని నికోదేము ద్వారా ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. 

3 . దేవుని పుత్రులం:
 పవిత్రాత్మ ద్వారా మనమందరము దేవుని పుత్రులం అవుతాం అని పునీత పౌలు గారుతెలియజేస్తున్నారు. "దేవుని ఆత్మద్వారా నడుపబడువారు దేవుని పుత్రులు.......... దేవుని ఆత్మ ద్వారా మనం దేవుని 'అబ్బా! తండ్రీ!' అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని  సాక్షమిచ్చును (రోమా 8 : 14 - 16 ).

4 . మన బలహీలతలో సహాయపడును:
మన బలహీనతలో పవిత్రాత్మ మనకు సహాయపడునని పునీత పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖలో తెలియజేస్తున్నారు. "బలహీనులమైన మనకు పవిత్రాత్మ సహాయపడును. ఏలయన, మనం ఎట్లు ప్రార్ధింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా ఆత్మయే మన కొరకు దేవుని ప్రార్ధించును (రోమా 8 : 26 - 27 ). 
5 . జీవమును ఒసగును:
పవిత్రాత్మ మనకు జీవమును ఒసగును అని పవిత్ర గ్రంధము తెలియజేయుచున్నది. "క్రీస్తును మరణమునుండి  లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన, మీయందున్న తన ఆత్మ వలన మీ మర్త్య శరీరములకు కూడా జీవమును ఒసగును" (రోమా 8 : 11 ) అని పౌలు గారు పవిత్రాత్మ వలన కలుగు ఫలమును బోధిస్తున్నారు. 

కనుక క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా!  పెంతెకోస్తు పండుగ అనగా పవిత్రాత్మ రాకడను జరుపుకుంటున్న  ఈ శుభదినాన అందరము ఆ పవిత్రాత్మ  సర్వేశ్వరుడు మన యందు, మన కుటుంబాల యందు నివసిస్తూ, ఎల్లప్పుడూ మనలను ఆ ప్రభుని మార్గంలో నడిపిస్తూ, శాంతి సమాధానంతో మనలను నింపమని ఈనాటి దివ్యబలి పూజలో ప్రార్ధించుదాం. 

Br. Joseph Kampally 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...