19, నవంబర్ 2022, శనివారం

34 వ సామాన్య ఆదివారం

 34  వ సామాన్య ఆదివారం 

క్రీస్తురాజు  పండుగ 

2 సమూయేలు  5:1-3
కొలొస్సి  1:12-20 
 లూకా 23:35-43

నేడు తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు యొక్క మహోత్సవమును కొనియాడుచున్నది. 11వ భక్తి నాథ పాపుగారు ''క్రీస్తు రాజు పండుగను" 1925 వ సంవత్సరంలో ప్రకటించారు. ఈ లోకంలో అందరు పాలకులు తామంతట తాము గొప్పవారని భావించే సమయంలో, సర్వభౌమాధికారం, సామంతపాలనం పడిపోతూ ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నాస్తికత్వం ప్రవేశిస్తున్న సమయంలో క్రీస్తు ప్రభువు ప్రజలకు నిజమైన రాజు అని ఆనాటి 11వ భక్తి నాథ పాపుగారు తెలియజేశారు. దేవుడే నిజమైన రాజు, మానవ మాత్రులు కేవలం ఒక సాధనములే, క్రీస్తు ప్రభువు రాజు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, తండ్రితో పవిత్రాత్మతో కలిసి సృష్టిని చేసి పరిపాలిస్తున్న దేవుడు ఈ లోకం మీద సర్వాధికారం కలిగిన వ్యక్తి. సర్వము ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించబడినది, అందుకే ఆయనకు సర్వాధికారం ఇవ్వబడినది. మనందరి జీవితాలను రక్షించే రాజు క్రీస్తు ప్రభువు. ఆయన విలువైన తన రక్తమును ధారపోసి మనందరినీ కాపాడిన రాజు మన యొక్క జీవితంలో సంతోషం ఉండుటకు శాంతి ఉండుటకు తానే తన జీవం ఇచ్చి మనందరినీ కాపాడారు. ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభువు యొక్క రాజ్యం గురించి ఆయన పాలన గురించి ఆ రాజు యొక్క గొప్ప లక్షణాలు ధ్యానించుకుందాం.

నూతన నిబంధన గ్రంథంలో కూడా దేవదూత మరి అమ్మకు మంగళవార్త చెప్పే సమయంలో దేవదూత మరియమ్మతో దావీదు సింహాసనం ఆయనకు ఇవ్వబడుతుంది అని చెప్పారు. - లూక 1:32.

ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును అని అలాగే ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని చెప్పారు.

ముగ్గురు రాజులు బాల యేసును దర్శించుటకు వచ్చిన సమయంలో యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ అని అడిగారు - మత్తయి 2:2. ముగ్గురు రాజులు క్రీస్తును రాజుగా గుర్తించారు. ఏసుప్రభు తన యొక్క సిలువ శ్రమలు అనుభవించే ముందు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనను రాజుగా అంగీకరించి గొప్పగా నినాదాలు చేశారు ఆయన్ను మెచ్చుకున్నారు. లూక 19:38.

ప్రజలు క్రీస్తు ప్రభువును రాజుగా గుర్తించారు ఎందుకంటే ఆయన వారి కోసం పోరాడారు వారికి తోడుగా ఉన్నారు వారి బాధలలో పాలుపంచుకున్నారు అందుకే ఆయన్ను రాజుగా ప్రజలు గుర్తించారు.

ఫిలాతు కూడా ఏసుప్రభువును నీవు యూదుల రాజు వా అని ప్రశ్నించారు - యోహాను 18:33.

పిలాతు యేసు ప్రభువు యొక్క శిలువ మీద వ్రాయించిన మాటలు అవే నజరేతుడైన యేసు యూదుల రాజు.

చివరికి ఆయన రెండవసారి వచ్చేసరికి ఆయన మెఘారూడై వస్తారని చెప్పారు - మత్తయి 28:18.

ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువు రాజు అని తెలియజేసే అంశాలు ఏసుప్రభు కూడా సువార్తను ప్రారంభించిన సమయంలో మొదటిసారిగా పలికిన మాటలు కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది అని. క్రీస్తు ప్రభువు దేవుని రాజ్యమునకు రాజు, దేవుని రాజ్యం అంటే సమస్తము.

సాధారణంగా రాజు అంటే ఒక రాజ్యాన్ని పాలించేవాడు అని అర్థం ఆ రాజ్యానికి కొన్ని సరిహద్దులు ఉంటాయి. కొందరు వారసత్వం పరంగా రాజులవుతారు మరికొందరు ప్రజల యొక్క ఆదరాభిమానాల వల్ల రాజులవుతారు. ఏసుక్రీస్తు ప్రభువు మాత్రం దేవుడు అదే విధంగా ప్రజల చేత గుర్తించబడ్డా రాజు. ఆయన అధికారం కానీ ఆయుధాలు కానీ ధరించని రాజు ప్రజలపై ఆధిపత్యం చలాయించే రాజు కాదు వారికి స్వేచ్ఛనిచ్చే రాజు ఆయన యొక్క రాజ్యత్వం ఈ లోక సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనది.

1. దేవుని రాజ్యం ప్రేమ రాజ్యం- 

అందరినీ కూడా ప్రేమించిన గొప్ప ప్రేమామయుడు. ఆయన రాజ్యంలో కలహాలకు యుద్ధాలకు తావులేదు విభజనలకు తావులేదు అధికార వాంఛలకు తాగులేదు ఆయన కేవలం ప్రేమతో తన రాజ్యపాలన చేశారు.

- ప్రేమతో ప్రజల వద్దకు వచ్చారు ప్రేమతో ప్రజల కష్టాలు బాధలు పంచుకొన్నారు.

- ప్రేమ వలన సిలువ మోసారు ప్రాణత్యాగం చేశారు దైవ ప్రేమను మానవాళికి పంచినా రాజు క్రీస్తు ప్రభువు.

2. దేవుని రాజ్యం శాంతి రాజ్యం-

దేవునికి మానవునికి మధ్య పాపం చేయటం వలన ఏర్పడిన ఆ అగాధమును క్రీస్తు రాజు భర్తీ చేశారు. తన యొక్క జీవితం ద్వారా మరణా పునరుద్ధానం ద్వారా సమాధానమును ఏర్పరిచారు. తండ్రికి ప్రజల మధ్య శాంతిని సమకూర్చారు. కలవర పడే హృదయాలలో శాంతిని నెలకొల్పిన రాజు. ప్రజల మధ్య శాంతిని నెలకొల్పిన రాజు.

3. దేవుని రాజ్యం సంతోషకరమైన రాజ్యం-

యేసు ప్రభువు ఈ లోకంలోనికి సంతోషమును తీసుకొచ్చిన రాజు.

- ఆయన జన్మం తల్లిదండ్రులకు సంతోషమును తెచ్చింది.

- ఆయన జన్మం గొర్రెల కాపరులకు సంతోషం నిచ్చింది.

- ఆయన సేవ రోగులకు సంతోషం ఇచ్చింది.

- ఆయన సిలువ భారం పాపులకు రక్షణ అనే సంతోషం నిచ్చింది.

ఆయన పేదవారికి నేనున్నాను అనే ఒక భరోసానిస్తూ సంతోషం ఇచ్చింది ఆయన రాజ్యంలో సంతోషమే ఉంటుంది ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటారు. మన బాధలు పంచుకొని మన కుటుంబాలలో ఒక వ్యక్తిగా జీవిస్తూ మనలో సంతోషమును తీసుకొని వచ్చినా రాజు. దేవుని రాజ్యమును స్థాపించినది దేవుడే అందుకే అది పవిత్రమైనది శాశ్వతమైనది శాంతి కరమైనది సమాధానములతో కూడినది.

-సమస్త సృష్టి ప్రాణులపై క్రీస్తుకు ఆధిపత్యం ఉంది. ఆయన రాజ్యాధికారం రెండు రకాలుగా అర్థమవుతుంది:

1. ఆయన సహజ సిద్ధంగా ఆయన హక్కులు కలిగి ఉన్నారు

2. రక్షకునిగా తన ప్రాణం ఫణంగా పెట్టి సంపాదించుకున్నాడు రాజు రక్తం ద్వారా మనకు విముక్తి కలిగింది.

- ప్రజలు ఏసుప్రభువును రాజుగా భావించి అంగీకరించారు. రోమా రాజ్యంపై దండయాత్ర చేసి వారిని ఓడించి నూతన సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు అని వారు తలంచారు.

- ఆయన మాటల్లో ఆకర్షణ చూసి ఆయన ప్రవర్తనలో ఆయన యొక్క కార్యాలలో ప్రజలకు ఆ నమ్మకం వచ్చింది.

- ఆకలితో ఉన్నవారికి రొట్టె ముక్కలను ఇచ్చి పోషించారు చేపలతో వారిని సంతృప్తి పరుస్తారు అని గమనించిన ప్రజలు ఆయన్ను రాజును చేయాలని అనుకున్నారు.

- వారి బానిసత్వ బ్రతుకు నుండి కాపాడే రక్షకుడని వారికోసం పోరాడే రాజుని ప్రజలు విశ్వసించారు.

- ఏసుప్రభు చేసిన అనేక గొప్ప కార్యాలు ఆయన్ని రాజుగా అంగీకరించేలా చేసినవి.

- అయితే ఆయన రాజ్యం ఈ లోకం కు చెందినది కాదని స్పష్టంగా ఫిలాతుకు తెలియజేశారు. ఈ లోక రాజులు అధికారంతో అహంతో స్వార్థంతో స్వబుద్ధితో పరిపాలన చేసేవారు కానీ క్రీస్తు రాజు వారికి భిన్నంగా జీవించారు.

ఆయన ఆల్ఫా ఒమేగా - ఆదియు అంతమునైన రాజు.

1 . మన రాజు మనల్ని ప్రేమిస్తారు:

ఆయన తన ప్రజల మధ్య ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రేమిస్తారు.

- పేదలను ధనికులను ఒకే దృష్టితో ప్రేమించారు.

- సజ్జనులపై దుర్షనులపై ఒకే విధంగా వర్షంను సూర్యుణ్ణి కుమ్మరిస్తూ ప్రేమను చూపుతున్నారు.

- అందరినీ ప్రేమించారు.

- క్రీస్తు రాజు తన స్నేహితుల కోసం ప్రాణాలను అర్పించారు - యోహాను 15:13.

- దీనికి మించిన ప్రేమ వేరొకటి లేదు.

- రాజు మామూలుగా తన ప్రజలను యుద్ధం చేయటానికి తన కన్నా ముందుగా సైన్యం ను పంపిస్తారు కానీ మన రాజు తానే ముందుండి నడిపించారు.

- ఏ రాజు తన సైన్యం కోసం ప్రాణాలు సమర్పించారు కానీ క్రీస్తు రాజు తన ప్రాణాలు అందరికన్నా ముందుండి సమర్పించారు.

- ఆయన మనల్ని ప్రేమించారు కావున తనను తాను సమర్పించుకున్నారు.

-రెండవ పఠనం (దర్శన 1:5) క్రీస్తు మనల్ని ప్రేమించారు అందుకే మన పాపాల్ని కడిగి వేశారు.

- ఏ రాజు కూడా క్రీస్తు రాజు కన్నా ఉదార స్వభావి కాదు.

ఎందుకంటే ఆయన మనల్ని తన బిడ్డలుగా స్వీకరించారు జ్ఞాన స్నానం ద్వారా ఆయన మనతో తన జీవాన్ని పంచుకున్నారు.

- ఆయన తన యొక్క శరీర రక్తాలను తనతో పంచుకున్నారు దివ్యసప్రసాదం ద్వారా.

ఆయన తన యొక్క యాచకత్వమును మనకు ఇచ్చారు (దర్శన 1:6)

- దేవుడు మానవులను అమితంగా ప్రేమించారు కాబట్టే మనకు సహాయం చేశారు.

2. క్రీస్తు రాజు నమ్మదగిన/విశ్వసింపదగిన రాజు

రాజు న్యాయం చేస్తాడని చాలామంది వారిని సంప్రదిస్తారు కానీ కొందరు రాజులు అందరికీ న్యాయం చేయరు అందరు రాజులు కూడా విశ్వసింపదగిన రాజులు కారు. వాగ్దానాలు చేస్తారు కానీ నెరవేర్చరు.

- క్రీస్తు రాజు మాత్రము నమ్మదగిన రాజు తన మీద నమ్మకం ఉంచి తన చెంతకు వచ్చిన వారికి న్యాయం చేసే రాజు ప్రజల యొక్క అవసరాలల్లో తోడుగా ఉండి వారు అడిగిన వెంటనే సానుకూలంగా వారికి సహకరించి దీవెనలు ఇచ్చే రాజు.

- శతాధిపతి నమ్మకం వచ్చి అడిగాడు అప్పుడు క్రీస్తు రాజు తన సేవకుని ఇచ్చారు.

- భర్తీమయి నమ్మకంతో అడిగాడు - చూపు పొందాడు.

- కమనీయ స్త్రీ నమ్మి ఆశ్రయించినది ప్రభువు దీవెనలిచ్చారు.

- నమ్మకమును నిలబెట్టుకోవటం కూడా ఒక సత్యమైన వ్యక్తిత్వం కు గుర్తు.

3. క్రీస్తు రాజు అందరినీ కూడా గౌరవించే రాజు సాధారణంగా సమాజంలో రాజులు పేదవారికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వరు.

- ధనవంతులతో సమాజంలో పేరు ఉన్న వారితో సన్నిహితంగా ఉంటారు.

- క్రీస్తు రాజు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వమును గౌరవిస్తారు.

- ఆయన ధనికులను మాత్రమే కాదు చేరదీసింది పేదవారిని వితంతువులను అనాధలను అందరినీ కూడా గౌరవించారు.

- ఆయన పేదవాని స్నేహితుడిగా పిలువబడ్డాడు.

- సుంకరులతో పాపులతో కలిసి భుజించారు అది ఆయన యొక్క గొప్పతనం.

4. క్రీస్తు రాజు మన కుటుంబంలోని రాజు/మానవ కుటుంబం కు చెందిన రాజు

- క్రీస్తు రాజు మనుష్య కుమారుడు ఈ లోకంలోనే మానవ రూపం దాల్చారు.

- దానియేలు మనుష్యకుమారుని రాకడ గురించి చెప్పారు. దానియేలు 7:13. ఇవి క్రీస్తుని ఉద్దేశించి పలికిన మాటలు.

- ఆయన మనలో ఒకనిగా మానవ రూపం దాల్చి జీవించారు పేదవానిగా జీవించారు- మత్తయి 8:20.

- ఈ లోక సంబంధ రాజులు ప్రజల యొక్క బాధలు చాలా తక్కువగా జరిగి ఉంటారు కానీ క్రీస్తు రాజు ప్రజలతో సంచరించారు ప్రజల నడుమ జీవించారు తన పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకంలో మానవునిగా జన్మించి మనలాగే ఆకలి తప్పులు బాధలను సంతోషాలు కలిగి జీవించినా రాజు- హెబ్రి 4:15, మార్కు 10:12, యోహాను 4:7.

- క్రీస్తు రాజు ప్రతి ఒక్కరినీ కూడా చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నా రాజు. ఆయన మన కుటుంబానికి చెందిన రాజు అని చెప్పినప్పుడు మనకి ఆయనకు బంధం ఉందని అర్థం. మనం ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళం.

- మన కుటుంబంలోని రాజు కాబట్టి మనలను అర్థం చేసుకొని మనకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ను తొలగిస్తారు.

5. క్రీస్తు రాజు శక్తి కలిగిన రాజు:

క్రీస్తు ప్రభువుకు సైన్యం లేనప్పటికీ ఆయన శక్తి కలిగిన రాజు ఆయుధాలు లేవు అయినా సరే క్రీస్తు ప్రభువు రాజే.

- ఆయన మాటలలో శక్తి ఉంది

- ఆయన అంగీలో శక్తి ఉంది

- ఆయన స్పర్శలో శక్తి ఉంది

ఈ భూలోక రాజులను పరిపాలించే రాజు (దర్శన 1:5) ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు (దర్శన 19:16)

- రోమా చక్రవర్తులు/రాజులు వారే శక్తివంతులు అని అనుకున్నారు వారి యొక్క సైనిక బలంతో అంతా చేయించవచ్చు అని అనుకున్నారు వారు చెప్పింది జరుగుతుంది అని నమ్మారు. కానీ తొలి క్రైస్తవులను రాజు యొక్క విగ్రహాన్ని ఆరాధించమని చెప్పినప్పుడు ఆ క్రైస్తవులు ఆరాధించలేదు ఎందుకంటే క్రీస్తు నిజమైన దేవుడు ఏకైక రాజు అని వారు గ్రహించారు.

- క్రీస్తుకు సమస్తము ఇవ్వబడింది - మత్తయి 28:18, ఆయన రాజ్యంకు అంతమే ఉండదు- లూకా 1:33, దాని 7:13,14.

క్రీస్తు రాజు తన యొక్క శక్తిని అంతటినీ ఇతరుల మేలు కోసం వినియోగించారు.

క్రీస్తు ప్రభువు నిజమైన రాజు ముల్లకిరేటం ఆయన యొక్క రాజకిరేయటం సిలువయే ఆయన సింహాసనం కాబట్టి మనం క్రీస్తు రాజును మన జీవితాల రాజుగా గుర్తించి మనలను పాలించేలా సహకరిద్దాం.

- ఆయన రాజ్యంలో దొరికే శాంతి సమాధానం కోసం ప్రేమ కోసం జీవించూద్దాం.


FR. BALAYESU OCD

 


12, నవంబర్ 2022, శనివారం

33 వ సామాన్య ఆదివారం

 33 వ సామాన్య ఆదివారం

     మలాకీ 4:1-2

      2 తెస్స

      లూకా 21 :5 -19 

ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క రెండవ రాకడను గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క రోజు దేవుని యొక్క మహిమాన్వితమైన రెండవ రాకడ గురించి కూడా ఈ దివ్య గ్రంథ పఠనాలు తెలుపుచున్నవి. అదేవిధంగా మన యొక్క జీవిత అంత్యకాలము గురించి కూడా బోధిస్తున్నాయి. ఈనాడు మనందరం కూడా ముఖ్యంగా ధ్యానించుకోవలసిన అంశములు ఏమిటంటే:

1. మరణం

2. తుది తీర్పు

3. పరలోకం

4. నరకం

ఎందుకంటే దివ్య పఠనాలు అంత్య  దినముల గురించి బోధిస్తున్నాయి. మన యొక్క మరణం తరువాత ఏమి అవుతుందో అనే  విషయాలు గురించి తెలుపుతున్నాయి.

ఈనాటి మొదటి పఠనంలో  మలాకీ ప్రవక్త రాబోతున్న దేవుని యొక్క రోజు గురించి తెలుపుచున్నారు. ప్రభు యొక్క రోజున దుర్మార్గులు శిక్షించబడతారు అని, అదే విధంగా దేవుని యెడల భయభక్తులు కలిగి నీతివంతమైన జీవితం జీవించేవారు రక్షించబడతారు అని ప్రవక్త తెలుపుచున్నారు. 

మలాకీ ప్రవక్త యొక్క పరిచర్య కాలంలో యూదా ప్రజలు అవినీతికరమైన జీవితంలో జీవించేవారు. చాలా సంవత్సరాలు బాబిలోనియ బానిసత్వంలో ఉన్నవారు అక్కడ ప్రజల యొక్క ఆచారాలను అక్రమ మార్గాలను అనుసరిస్తూ, అవినీతి కరమైన జీవితంను తిరిగి వచ్చిన తరువాత కూడా కొనసాగించేవారు. వారు మంచికి చెడుకు మధ్య ఎలాంటి భేదం లేకుండా జీవించేవారు, నైతిక విలువలు మరచిపోయారు, ప్రజలతో పాటు యాజకులు కూడా అదే విధమైన అవినీతి మార్గాలను అనుసరించేవారు, తప్పును ఖండించలేదు అందుకనే ప్రవక్త దేవుని యొక్క హెచ్చరికలను తెలుపుచున్నారు. వారి యొక్క అవిశ్వాసనీయతకును, అవినీతికిని అదే విధంగా అన్యులతో వివాహ బంధంకు దేవుని యొక్క శిక్ష వస్తుందని మలాకీ ప్రవక్త హెచ్చరించారు.

 కొంతమంది విశ్వాసహీనులు అన్ని విధాలుగా ఎదుగుతుంటే, సుఖసంతోషాలు అనుభవిస్తుంటే, కొంతమంది విశ్వాసులు మాత్రము వారి యొక్క మంచి జీవితంకు ప్రతిఫలంగా కష్టాలు అనుభవిస్తూ జీవించే సందర్భంలో యావే  దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా తెలుపుచున్నారు, దేవుని యొక్క రోజు వచ్చుచున్నది అప్పుడు ఆయన అవిశ్వాసులను శిక్షించి విశ్వాసులను రక్షిస్తారని పలికారు. ప్రభువు వచ్చే రోజుకు మనం సిద్ధంగా ఉండాలి ఆయనతో పాటు పరలోకం చేరుటకు మనం ఈ లోకంలో ఉండగానే మంచి జీవితం జీవించాలి. నీతిమంతులుగా మనం ఈ లోకంలో కొన్ని కష్టాలు బాధలు అనుభవించినప్పటికీని ప్రభువు యొక్క దినమున మనకు రక్షణ లభిస్తుంది. ప్రభు యొక్క దినము ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతినిత్యం సిద్ధంగా ఉండాలి.

దేవునికి విశ్వాస పాత్రులుగా జీవించే సమయంలో మనకు సహనం ఉండాలి, వినయం ఉండాలి, ప్రేమ ఉండాలి. గత వారం చదివిన మొదటి పఠనం  2 మక్క 7:1-2,9-14 ఒక తల్లి, ఏడుగురు సోదరులు, విశ్వాస పాత్రులుగా జీవించారు. దేవుని యెడల సహనం కలిగి జీవించారు మనం కూడా ఈ భూలోకంలో ఉన్నంతకాలం వరకు మంచినీ చేస్తూ, పాటిస్తూ జీవించాలి. అవినీతి లేకుండా నీతితో జీవించాలి. దేవుని యొక్క ఆజ్ఞలకు బద్ధులై జీవించాలి.

గర్వంతోను పాపంలోనూ నైతిక విలువలు లేకుండా జీవించే వారికి దేవుని శిక్ష వస్తుందని మలాకీ ప్రవక్త పలికారు. ఆ శిక్ష ఎంత కఠినంగా క్రూరంగా ఉంటుంది అని ప్రభువు తెలుపుచున్నారు ప్రవక్త ద్వారా. సమస్తమును దేవుడు చూస్తారు కాబట్టి ఆయన వచ్చు రోజున దృష్టులకు  దేవుని నుండి శిక్ష, మంచి వారికి దేవుని నుండి రక్షణ వస్తుంది.

మంచిని, చెడును, పాపమును, పుణ్యమును, విశ్వాసమును, అవిశ్వాసమును అనుసరించుట అన్ని మన మీదనే ఆధారపడి ఉన్నాయి, కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు మనందరం ఒక మంచి జీవితం జీవించాలి.

ఈనాటి రెండవ పఠనములో  పౌలు గారు అందరిని పరిచేసే వారిగా ఉండమని తెలుపుచున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ జీవించాలి అని పౌలు గారు పలికారు. దేవుని యొక్క రెండవ రాకడ జరుగును కాబట్టి అందరూ ప్రభువునికోసం  పనిచేస్తూ ఆయన యొక్క రాకడకు సంసిద్ధత కలిగి జీవించాలి. కొందరు ప్రభువు యొక్క రాకడ త్వరలో వస్తుందని ఏ పని చేయకుండా ఉన్న సందర్భంలో పౌలు గారు తెస్సలోనియ  ప్రజలను కష్టపడి పని చేయమని పలుకుచున్నారు.

పనిచేయని వాడు భోజనమునకు అనర్హుడు అని పౌలు గారు తెలుపుచున్నారు. సృష్టి ప్రారంభంలోనే దేవుడు ఆదామును పనిచేయుటకు ఏదోను తోటలో ఉంచారు - ఆది 2-15.

అదేవిధంగా ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న వారిని తన తోటలో పనిచేయుటకు యేసు ప్రభువు కొందరిని పంపిస్తున్నారు - మత్తయి 20:1-16.

ఎవరైతే పనిచేయకుండా సోమరులుగా ఉంటున్నారో  దేవుడు వారిని శిక్షిస్తున్నారు - మత్తయి 25:26.

ప్రభువు మనందరినీ కూడా సృష్టించినది ఎందుకంటే ఆయన యొక్క రాజ్యం కొరకు పని చేయుటకు. కాబట్టి సోమరులుగా జీవించకుండా కష్టపడి పని చేస్తూ జీవిస్తూ ప్రభువు యొక్క రాకడ కోసం ఎదురు చూద్దాం.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు కూడా అంత్య  దినముల గురించి బోధిస్తున్నారు. సువిశేష మొదటి భాగంలో యేసు ప్రభువు యేరుషలేము దేవాలయం యొక్క పతనం గురించి బోధిస్తున్నారు. యూదులకు యేరుషలేము దేవాలయం చాలా ప్రత్యేకమైనది. యేరుషలేము  దేవాలయమును సొలోమోను రాజు క్రీస్తుపూర్వం 960 సంవత్సరంలో నిర్మించారు, దానిని బాబిలోనియులు 586 బిసి లో ధ్వంసం చేశారు, తరువాత జెరుబాబేలు మరియు ప్రవాసం  నుండి తిరిగి వచ్చిన యూదులు మరలా నిర్మించారు (536-516 BC).

మరలా యేరుషలేమును సుందరంగా హేరోదు మహారాజు నిర్మించారు (20 BC - AD 64) అంత సుందరంగా అలంకరించబడిన యేరుషలేము దేవాలయంను రోమియు 70 (AD) సంవత్సరంలో ధ్వంసం చేశారు.

ఎంతో గొప్ప దైవ యేరుషలేము సైతం ధ్వంసం చేయబడినది అదే విధంగా మన యొక్క జీవితం కు ఒక అంతము అనేది ఉంటుంది, కాబట్టి మన జీవితాలను దేవుని రాకడ కొరకు సంసిద్ధత కలిగి ఉండాలి. మన యొక్క జీవిత అంతం పరలోక జీవితం కు ప్రారంభం కావాలి.

ప్రతి ముగింపు కు ఒక నూతన ప్రారంభం అనేది ఉంటుంది, మనకు భూలోక జీవితం ముగిస్తేనే పరలోక జీవితం ప్రారంభం అవుతుంది. మనలో పాపము ముగిస్తేనే, పుణ్య జీవితం ప్రారంభం అవుతుంది. మనలో ద్వేషం అంతరిస్తేనే, ప్రేమ ప్రారంభమగుచున్నది. మనం ఈ లోకంలో మరణిస్తేనే పరలోకంలో జన్మిస్తం. అదే విధంగా మన చదువులు ముగిస్తే మనం ఉద్యోగం ప్రారంభిస్తాం. ఒక తల్లి యొక్క పురిటి నొప్పులు ముగిస్తేనే బిడ్డకు జన్మనిచ్చుట ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కటి చివరికి చేరుతుంది ముగించబడుతుంది కాబట్టి మనం ప్రతిదానికి సంసిద్ధత కలిగి ఉండాలి.

ఎప్పుడు ఏమి సంభవించును ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతి రోజు మనం సిద్ధంగా ఉండాలి. కాలం కాదు ముఖ్యం సూచనలు స్నేహాలు  కాదు ముఖ్యం మనం ప్రతిక్షణం ప్రభు యొక్క రాకడ కోసం సంసిద్ధత కలిగి ఉండాలి.

ప్రభువు చివరి ఘడియలు అని తెలుపుచున్నారు ఈ చివరి ఘడియలు బహుశా సైతాను  యొక్క చివరి ఘడియలు పాపం యొక్క చివరి గడియలు ఈ చివరి ఘడియలు ముగిస్తే దేవుని క్రొత్త గడియలు ప్రారంభమవుతాయి.

ఈ సువిశేష రెండో భాగంలో ప్రభువు సువార్త సేవ గురించి బోధిస్తున్నారు. సువార్త పరిచర్య చేసే సందర్భంలో అనేక రకాలైన కష్టాలు ఎదురవుతాయి యుద్దాలు సంభవిస్తాయి, అనేక రకాలైన హింసలు ప్రారంభమవుతాయి వీటన్నిటిని చూసి భయపడవలదు అని ప్రభువు తెలుపుచున్నారు. ప్రభు యొక్క పునరుద్దానం తరువాత అనేకమంది ప్రజలు సువార్త సేవకులు హింసించబడ్డారు. శ్రీ సభ ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రభువు యొక్క అనుచరులు సేవకులు అనేక రకమైన కష్టాలు శారీరక అంశలు అనుభవిస్తున్నారు అయినా కానీ వారు దేవుని కొరకు మరణించారు.

యేసుప్రభు అందరినీ కూడా సాక్షులుగా ఉండమని తెలుపుచున్నారు. ఎలాగా మనం దేవునికి సాక్షులుగా జీవించగలుగుతున్నాం.

1. మన యొక్క మంచి జీవితం ద్వారా ఆ ప్రభువునకు సాక్షులుగా జీవిస్తాం.

2. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుట ద్వారా.

3. దేవుని కొరకు ప్రాణత్యాగం చేయుట ద్వారా.

4. దేవుని యొక్క సువార్త పరిచర్య చేయుట ద్వారా.

5. దేవుని యొక్క ప్రేమను పంచుట ద్వారా

6. ఇతరులకు సహాయం చేయుట ద్వారా మనం ప్రభువుకు సాక్షులుగా జీవిస్తాం.

మన యొక్క కుటుంబ సభ్యులు కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు ఎందుకంటే ఒకరు యేసు ప్రభువు కొరకు జీవిస్తూ ఇంకొకరు అన్య దైవాల కొరకు జీవిస్తే అక్కడ విభేదాలు వస్తాయి.

అదేవిధంగా ఒకే కుటుంబంలో ఉన్నవారు సత్యం కొరకు జీవించినప్పుడు ఇంకొకరు అసత్యం కొరకు జీవించినప్పుడు కుటుంబాలలో విభేదాలు తలెత్తుతాయి.

ఏమి జరిగినా కానీ ప్రభువుకు సాక్షులుగా ఉండాలి మనందరం కూడా విశ్వాసంలో కృంగిపోకూడదు. కష్టాలు బాధలు వస్తాయి అయినప్పటికీని ప్రభువు మనతోనే ఉంటారు.

మన దేవుడు మనతో ఉండే దేవుడు అన్ని సమయాలలో మనతోనే ఉంటారు కాబట్టి విశ్వాసం కోల్పోకుండా దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి దేవునికి సాక్షులుగా ఉండాలి.

మన యొక్క విశ్వాస జీవితంలో సహనం కోల్పోకూడదు ఎందుకంటే సహనం సమస్తమును జయించును.

ప్రభువు రోజు కొరకు మనందరం సిద్ధంగా ఉండాలి దేవునికి సాక్షులుగా ఉండాలి.

FR. BALAYESU OCD

33వ సామాన్య ఆదివారం

 

33 సామాన్య ఆదివారం

మలాకీ 4: 1-2

 2 తెస్స 3: 7-12

 లూకా 21: 5-19


నీతిగల జీవితం మరియు దేవుని రాజ్యానికై కృషి

 

మొదటి పఠనం:

పండితుల అంచనాల ప్రకారం మలాకీ గ్రంథం క్రీ. పూ. 460 సంవత్సరంలో యిస్రాయేలు ప్రజలు బాబులోనియా ప్రజలు యెరూషలేము దగ్గరలో, చేరువలో ఉన్నప్పుడు లేదా బాబులోనియా ప్రవాసం నుంచి తిరిగి వస్తున్న సమయంలో వ్రాసారు అని చెప్పవచ్చు. యూదా ప్రజలు క్రీ. పూ. 460 - 450 సంవత్సరంలో బాబులోనియా ప్రవాసం నుండి యెరూషలేము తిరిగివచ్చి, నేలమట్టం చేసిన వారి దేవాలయాన్ని హగ్గయి ప్రవక్త మరియు జెకర్యా ప్రవక్తల సహాయంతో పునఃనిర్మిస్తారు. యూదా ప్రజలు తిరిగి వచ్చిన సమయానికి వారికి రాజులు, మరియు నాయకులు లేరు, కానీ ప్రధాన అర్చకులు లేదా యాజకుల పాలన ఉండేది. యూదా ప్రజలు యెరూషలేము తిరిగి వచ్చిన సమయానికి, వారికి ఆస్తిపాస్తులు లేవు, సంపదలు లేవు, తినడానికి తిండి కూడా లేదు. ఎందుకంటే బాబులోనియా రాజు అంతా నాశనం చేశాడు. యూదా ప్రజలు దేవాలయాన్ని నిర్మించినా కూడా పూర్వ వైభవాన్ని వారు పొందుకోలేదు. దేవుడు వారికి ఎలాంటి మేలులు చేయలేదు. ఎందుకంటే వారు బాబులోనియా ప్రవాసంలో ఉన్నప్పుడు వారందరు కూడా మలినమయ్యారు, అపవిత్రమయ్యారు, దైవత్వాన్ని కోల్పోయారు.

ఏవిధంగా అంటే అన్యులతో వివాహమాడి అపవిత్రులయ్యారు. ఎదోమీయులను, అరబ్బీయులను వివాహమాడి పవిత్రతను కోల్పోయారు. అందువలన, దేవుడు వారికి మేలులు చేయడం లేదు. కారణము చేత విశ్వాసము కోల్పోయిన యాజకులు మరియు ప్రజలు ఇక మేమెందుకు దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుడిని ఎందుకు ఆరాధించాలి, మా బాగోగులు మేము చూసుకుంటాము అని వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మలాకీ ప్రవక్త దేవుని వార్తగా వారితో విధంగా పలుకుతున్నారు.

గర్వాత్ములు, దుష్టులు గడ్డివలె కాలిపోవుదురు. కానీ దేవుని యెడల భయభక్తులు చూపువారిపై దేవుని రక్షణము ఉదయించే సూర్యునివలే ఉండును, ఆరోగ్యము కలుగును, మరియు పంటలు కూడా బాగా పండును. అని నాటి మొదటి పఠనంలో చూస్తున్నాం. అదేవిదంగ దేవుని ఆజ్ఞలను పాటిస్తే మనము జీవము బడయుదుమని , పాటించకపోతే నాశనం అవుతామని వచనాలలో చూస్తాం. (ద్వితీ 4: 1, 5: 32-33, సిరా 35: 16-18, 21-22).

అదేవిదంగ దేవుని ఆజ్ఞలను పాటించడమే నరుని ప్రధాన ధర్మం (ఉప 12: 13-14). మొదటి పఠనం ద్వారా మనం గ్రహించవలసినది,

Ø నీతిగల జీవితం లేదా ప్రభువుకు ప్రియమైన జీవితాన్ని జీవిస్తే ఆశీర్వదించబడతాము.

Ø అపవిత్ర జీవితాన్ని, అబద్ధపు జీవితాన్ని జీవిస్తే నాశనానికి గురి అవుతామని అర్ధమవుతుంది.

 

సువిశేష పఠనం:

కొందరు ప్రజలు మాత్రం దేవాలయపు రాళ్ళ అందాన్ని చూచి, దేవునికి అర్పించబడిన వస్తువుల అందాన్ని చూసి మిగుల సంతసించుచున్నారు. దేవాలయపు అందానికి ప్రాముఖ్యతనిస్తున్నారే కానీ అందులో ఉన్న దేవుడిని మాత్రం నిరాకరిస్తున్నారు. వారి హృదయాలు మాత్రం కపటముతో, క్రోధముతో నిండియున్నవి. మనం కూడా మనకు ఉన్న సంపదలను చూసి మురిసి పోతుంటాం. అందమైన కార్లు, ఫోన్, పెద్ద పెద్ద భవనాలే మనకు సర్వస్వము అనుకుంటుంటాం. నిజమైన విలువైన సంపద, శాశ్వత సంపద క్రీస్తు ప్రభువే అని మర్చిపోతుంటాం

ఈనాడు మనమందరం విలువైన సంపదను గుర్తించాలి, సంపద ద్వారా కలుగు ఫలములను ఆస్వాదించాలి. లోకంలో మంచి వారును, చెడువారును ఇద్దరూ ఉంటారు. ఉదా: పొలములో గోధుమలు చల్లినప్పుడు గోధుమలతో పాటు, పిచ్చి మొక్కలు కూడా వస్తాయి. కానీ రెండు పెరిగిన తరువాత కోతకాలపు రోజున గోధుమలను గిడ్డంగులలో వేసి, పిచ్చి మొక్కలను కాల్చివేసిన విధంగా ప్రభువు రాకడ కూడా అదేవిధంగా ఉండును. తీర్పు దినమున విధంగానే పుణ్యాత్ములను, పాపాత్ములను వేరు చేస్తారు. సువిశేష పఠనంలో చూస్తున్నాం అసహజమైనటువంటి విషయాలు. గొడవలు, హింసలు మరియు క్రూరమైన జీవితం కుటుంబంలో సంఘంలో ప్రతిచోటా, విధమైన జీవితం సువిశేష పఠనం తెలియజేస్తున్నది. కుటుంబాన్ని, సంఘాన్ని విభజించువారు మన మధ్యలోనే ఉంటారు, వస్తుంటారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అని పలుకుతున్నారు.

ఒకవేళ అలాంటి వారి మాటలు విని, మీరు మీ సమయాన్ని విశ్వాసాన్ని కోల్పోతే దేవుని రక్షణ మీరు పొందుకోలేరు, అంతే కాకుండా దేవుని పట్ల సహనాన్ని కోల్పోతే ప్రాణాలు కోల్పోతారు అని సువిశేషం మనకు తెలియజేస్తుంది.

సువిశేషం ద్వారా మనం గ్రహించవలసిన విషయాలు:

Ø లోకపు బాహ్యపరమైన అందాలకు, విషయాలకు మనం ప్రాధాన్యత ఇవ్వకుండా హృదయమనే ఆలయంలో నివసించే దేవుడికి, దేవుని కుమారునికి మనమందరం ప్రాధాన్యత ఇవ్వాలి.

Ø మరియు కుటుంబము, సంఘమును విభజించే వారు మనతోనే ఉంటారు, కాబట్టి వివేకముతో, సహనము కలిగి జీవించమని సువిశేషం కోరుతున్నది.

రెండవ పఠనము :

పునీత పౌలు గారు తెస్సలొనిక ప్రజలకు సోమరి పోతులుగా జీవించకుండా, ప్రభువు రాజ్యం కొరకు కృషిచేయమని, కష్టపడమని తెలియజేస్తున్నారు. ఏవిధంగా అంటే పౌలు గారి జీవితమునే ఉదాహరణగా చూపిస్తున్నారు. పౌలు గారు చేసిన కృషి, త్యాగముల వలనే క్రైస్తవ జీవితం లేదా క్రీస్తు ప్రభుని చాలా వరకు చాటి చెప్పారు.

అలా దేవుడి రాజ్యాన్ని వ్యాపింపచేసిన వారికి, ఆరాజ్యం కోసం కృషి చేసే వారికి మాత్రమే దేవుని రాజ్యంలో చోటు దక్కుతుందని తెలుపుచున్నారు.

పని చేయని వాడు భోజనానికి అనర్హుడు” అంటే పరలోక భోజనం అని అర్ధం.

కాబట్టి రెండవ పఠనం ద్వారా మనం గ్రహించ వలసిన విషయం ఏమిటంటే సోమరి పోతులుగా ఉండకుండా దేవుని రాజ్యానికి కృషి చేయమని తెలుపుచున్నది.

మనలో కూడా మంచిగా, నీతిగా జీవించే వారు ఉంటారు. అలాంటివారు విశ్వాసాన్ని సహనాన్ని కోల్పోవద్దు. మనలోకూడా సోమరిపోతులవలె, నిర్లక్ష్యపు జీవితాన్ని జీవించేవారు ఉంటారు. అలాంటివారు మారుమనస్సు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని యొక్క శిక్షకు గురికాకూడదు.

చివరిగా మూడు పఠనాల ద్వారా తల్లి తిరుసభ మనందరినికూడా నీతిగల జీవితాన్ని జీవించమని మరియు దేవుని పట్ల సహనంతో, భయభక్తులు చూపుతూ జీవించమని, దేవుని రాజ్యానికై కృషి చేయమని కోరుకుంటుంది.

 

బ్రదర్ . సుభాష్ OCD

 

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...